LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది.  అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.   అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత విడతలో జరిగిన పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో మే 2వ తేదీన (శనివారం) రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై ఈ ప్రభావం పడింది. మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లోనూ తిరిగి ఓటింగ్ జరగనుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లేఖ రాసింది. గత నెల 29న జరిగిన రెండో దశ ఎన్నికల సమయంలో పలు చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఓటర్లను అడ్డుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా డైమండ్ హార్బర్ పరిధిలోని కొన్ని బూత్‌లలో బీజేపీ గుర్తుపై టేపులు అంటించి, ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. దీనిని 'డైమండ్ హార్బర్ మోడల్' అక్రమంగా ఆయన అభివర్ణించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీ-పోలింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు వేదికవుతుంటాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం రీ-పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజలకు చాటింపు ద్వారా ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలని కూడా ఈసీ సూచించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ అక్రమాల ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడటమే తమ బాధ్యతని ఎన్నికల యంత్రాంగం పేర్కొంటోంది. మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ లోపు ఈ 15 కేంద్రాల్లో జరిగే రీ-పోలింగ్ ఫలితాల సరళిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తుది ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. మరి ఈ రీ-పోలింగ్ ప్రక్రియ ఎంతవరకు ప్రశాంతంగా ముగుస్తుందో వేచి చూడాలి.
ఇకపై  ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా..  ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారు పద్దతి మార్చుకోవాలి... లేకపోతే వారికి ఇంకో ఛాన్స్ ఉండదు. ఇదీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్త్రాంగ్ వార్నింగ్.  పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకుచంద్రబాబు శుక్రవారం (మే 1)  కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించారు.  వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.   మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  శుక్రవారం (మే1) నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంతర్గత సర్వేల ద్వారా టీడీపీ అధినేత నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు సరిగా లేని వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలను కూడా నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు.  ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజలను అడుగుతా. ప్రజలు అనుకూలంగా చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను కానీ.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న తరుణంలో కోల్‌కతాలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం (ఏప్రిల్ 30) రాత్రి కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న ఆమె..  అక్కడ సుమారు మూడు గంటల పాటు ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ..  అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ..  ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.  ఇది తమకు చావో రేవో తేల్చుకునే పోరాటంటూ ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారు.  అంతకుముందు, తృణమూల్ కాంగ్రెస్ ( నాయకులు కునాల్ ఘోష్, శశి పంజా ఖుదీరామ్ అనుశీలన్  స్ట్రాంగ్ రూం వెలుపల   వెలుపల ధర్నాకు దిగారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే బాలెట్ బాక్సులను తెరుస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పార్టీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు..  కేంద్ర దళాలు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి లేదా ఏజెంట్ స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లే అధికారం ఉంటుందన్నారు. తమ పార్టీ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని   విమర్శించారు. ఫలితాలు వెలువడే మే 4వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా ఈ  ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం..  మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయంది. . సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్నది కేవలం పోస్టల్ బ్యాలెట్ల విభజన ప్రక్రియే తప్ప..  ఈవీఎంలను తాకడం లేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి బెంగాల్‌లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో..  ప్రతి ఓటును కాపాడుకోవాలన్న  పట్టుదలతో టీఎంసీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని మమతా బెనర్జీ తమ పార్టీ  అభ్యర్థులను ఆదేశించారు.  
  తెలుగువన్ ‘వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ  భవిష్యత్తు వారసుడిగా నారా లోకేష్ ఎదుగుదల, పార్టీలో ఆయన పోషిస్తున్న పాత్రపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగింది. సీనియర్ జర్నలిస్టులు మరియు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గతంతో పోలిస్తే లోకేష్ రాజకీయ శైలిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. రాజకీయ పరిస్థితి - ఒక అవలోకనం రాష్ట్రంలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటువంటి క్లిష్ట సమయంలో లోకేష్ పార్టీ పగ్గాలను సమర్థవంతంగా చేపడుతున్నారా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. గత ఎన్నికల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న లోకేష్, 'యువగళం' పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇది కేవలం ఒక యాత్రగానే కాకుండా, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే వేదికగా మారింది. క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రజలతో నేరుగా మమేకమవ్వడం ద్వారా తనపై ఉన్న విమర్శలకు ఆయన చేతలతో సమాధానం చెబుతున్నారు. వ్యూహాలు మరియు అంతరార్థాలు లోకేష్ అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహం ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది: ఒకటి సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడం, రెండు యువతను ఆకర్షించడం. సామాజిక మాధ్యమాల వినియోగం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందుంటున్నారు. అయితే, రాజకీయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో, సమయం కూడా అంతే ముఖ్యం. పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా లోకేష్ తన ప్రచార పంథాను మార్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా, అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఒక పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ ప్రభావం రాబోయే ఎన్నికలు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్ష వంటివి. పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో నడిపించగలిగితే, ఆయన నాయకత్వంపై ఉన్న సందిగ్ధతలు పూర్తిగా తొలగిపోతాయి. రాబోయే కాలంలో లోకేష్ పోషించబోయే పాత్ర కేవలం తెలుగుదేశం పార్టీకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ గమనాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ సానుకూల ఫలితాలను సాధిస్తే, లోకేష్ కేవలం ఒక వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న శక్తివంతమైన నాయకుడిగా స్థిరపడతారా... ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి  
ALSO ON TELUGUONE N E W S
తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, భూమన అభినయ్ రెడ్డి (Bhumana Abhinay Reddy) చేపట్టిన ఒక నిరసన ర్యాలీ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పెట్రోల్, డీజిల్ కొరతకు వ్యతిరేకంగా ఆయన వినూత్న రీతిలో నిరసన తెలపాలని భావించారు. అయితే, ఈ క్రమంలో ఆయన చేసిన పని జంతు ప్రేమికులను, ముఖ్యంగా ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్‌(Rashmi Gautam)ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తిరుపతిలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి ఒక ఎడ్లబండిపై ఆటోను ఉంచి, ఆ ఎడ్లబండిని ఎద్దులతో లాగించారు. భారీ బరువున్న ఆటోను మోయలేక ఎద్దులు పడుతున్న ఇబ్బందిని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నోరు లేని మూగ జీవాలను ఇలా హింసించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. యాంకర్ రష్మీ ఘాటు స్పందన జంతువుల హక్కుల కోసం ఎప్పుడూ గొంతు విప్పే యాంకర్ రష్మీ గౌతమ్, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు వెయ్యి రెట్లు అధికంగా బాధపడాలి" అంటూ ఆమె భూమన అభినయ్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నిరసనల పేరుతో జంతువులను వాడుకోవడం క్రూరత్వమని ఆమె అభివర్ణించారు. అంతేకాకుండా, ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ 'PETA India' సంస్థను కూడా ఆమె ట్యాగ్ చేశారు. యాంకర్ రష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.  పెరిగిన వ్యతిరేకత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జంతు ప్రేమికుల నుంచి భూమన అభినయ్ రెడ్డికి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కానీ ఇలా మూగ జీవాలను చిత్రహింసలకు గురిచేయడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా పలువురు నాయకులు ఇలాంటి విన్యాసాలు చేసి విమర్శల పాలైన సందర్భాలు ఉన్నాయి.   https://x.com/rashmigautam27/status/2049770747179221454
  కొంత మంది దర్శకుల సినీ జర్నీగురించి చెప్పుకోవడం స్టార్ చేస్తే చాలు నా ప్రతి అక్షరం పంచ్ లతో ఉండేలా చూడవా అని అక్షరమే అడిగే పరిస్థితి. అలాంటి  దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar). ఊహించని డైలాగ్స్, పంచ్ లకి బ్రాండ్ అంబాసిడర్. అందుకే భారీ అభిమాన ఘనాన్ని సంపాదించుకున్నాడు. మార్చి లో తన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి  ఉస్తాద్ భగత్ సింగ్ గా వచ్చాడు. ప్రారంభంలో హిట్ సువాసనలతో కనపడిన ఉస్తాద్ తొలి రోజు ముగిసేసరికి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్ అప్ కమింగ్ సినిమాల గురించి చర్చ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం  ప్రెజెంట్ హరీష్ శంకర్ నుంచి ఎలాంటి కొత్త చిత్రం ప్రకటన రాలేదు. కనీసం గాసిప్ గానైనా   ఏ హీరో పేరు వినపడటం లేదు. బాలకృష్ణతో మూవీ ఉండబోతోందనే న్యూస్ కొన్ని రోజుల క్రితం వచ్చింది. కానీ కొరటాల శివ(Koratal siva)కి బాలకృష్ణ(Balakrishna)కమిట్ అయ్యాడు. ఇతర బడా హీరోలెవరు ఖాళీగా లేరు. పైగా ఒక సినిమా స్టార్ట్ చేస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూస్తూనే ఉన్నాం. తన మరో బాస్ రవితేజ కూడా ఫుల్ బిజీ. మరి ఈ  టైంలో హరీష్ శంకర్ ముందున్న మార్గం మెగా కాంపౌండ్. ఆ కాంపౌండ్ లో ఉన్న వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో అవకాశం వస్తుందేమో. ఈ ముగ్గరు బిజీగా ఉన్నా హరీష్ శంకర్ కథ చెప్పి ఒప్పిస్తే చేసే అవకాశం ఉండవచ్చని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  Also read: 2026 లో ఇప్పటి వరకు తొలి రోజు హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాలివే   ఏది ఏమైనా మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ పరాజయాలతో ప్రస్తుతం హరీష్ శంకర్ పెన్ను హిట్ కోసం పొద్దుటూరు ఖద్దర్ లాగా కుత కుత లాడుతూ ఉండటం ఖాయం. ఈ నేపథ్యంలో ఏ హీరోతో వస్తాడో చూడాలి.  
  ఒక సంవత్సరంలో సీజన్స్ మార్పు అనేది కామన్.. కానీ సినీ సీజన్ లో ఎలాంటి  మార్పు ఉండదు. ప్రతి వారం సినీ సీజన్ వస్తూనే ఉంటుంది. సందడి వాతావరణాన్ని తెస్తూనే ఉంటుంది. సినీ న్యూస్ కూడా అంతే.. సీజన్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ న్యూస్ తో సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే 2026 లో ఇప్పటి వరకు రిలీజైన సినిమాలు వరల్డ్ వైడ్ గా తొలి రోజు  ఎంత గ్రాస్ వసూలు చేశాయనే  క్రేజీ న్యూస్ సినీ ప్రియుల్లో ఆహ్లాదకర వాతావరణాన్నితీసుకొచ్చింది. మరి ఆ లిస్ట్ చూసేద్దాం. 1 . ది రాజా సాబ్ : 95 కోట్ల గ్రాస్  2 .మన శంకర వరప్రసాద్: 75 కోట్ల గ్రాస్  3 .ఉస్తాద్ భగత్ సింగ్:  52.8 కోట్ల గ్రాస్  4 . అనగనగ  ఒక రాజు: 14.8 కోట్ల గ్రాస్  5 . డెకాయిట్ : 13.75 కోట్ల గ్రాస్  6 . భర్త మహాశయులకు విజ్ఞప్తి : 5 కోట్ల గ్రాస్  7 . నారి నారి నడుమ మురారి: 5 కోట్ల గ్రాస్  8 .ఫంకీ : 4.5 కోట్ల గ్రాస్  9 .రాకాస : 4 కోట్ల గ్రాస్  10 . విష్ణు విన్యాసం :3.3 Crore గ్రాస్  Also read: Jetlee vs Gayapadda Simham: జెట్లీ, గాయపడ్డ సింహం ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!..మరి విన్నర్ ఎవరు  ఇలా పైన చెప్పుకున్న మొదటి పది చిత్రాలు గ్రాస్ పరంగా మిగతా చిత్రాలతో పోల్చుకుంటే బెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. మరి జూన్ 4 న రాబోతున్న పెద్ది, ఆ తర్వాత రాబోయే టాక్సిక్,  లెనిన్,ఏ పొజిషన్ లో ఉంటాయో చూడాలి.  
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. 'ఉప్పెన' సినిమాతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన ఈ యంగ్ హీరో, ఆ తర్వాత తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు మహేష్ సూరపనేనితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ గతంలో కథలో రాజకుమారి, హంట్ వంటి సినిమాలు చేశారు. వైష్ణవ్ తేజ్ కోసం ఆయన ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా వైష్ణవ్ తేజ్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని టాక్. ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి'తో హిట్ కొట్టి జోష్ లో ఉన్నారు అనిల్ సుంకర. అదే ఉత్సాహంతో మెగా హీరోతో హిట్ కొట్టాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. వైష్ణవ్ తేజ్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఈ కొత్త ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. మహేష్ మార్క్ టేకింగ్, అనిల్ సుంకర నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
  నిన్న వరల్డ్ వైడ్ గా జెట్లీ(Jetlee),గాయపడ్డ సింహం(Gayapadda Simham)చిత్రాలు ప్రేక్షకులు కూడా కార్మికులే కాబట్టి కార్మిక దినోత్సవం సందర్భంగా థియేటర్స్ లో తిష్ట వేద్దామని ల్యాండ్ అయ్యాయి. కానీ అనూహ్యంగా రెండు చిత్రాలకి నెగిటివ్ టాక్ చాలా బలంగానే స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజ్ అయినప్పుడు ఒక చిత్రం బాగోకపోతే మరో చిత్రం పర్వాలేదనే స్థాయిలో ఉన్నా  విజయం అంచున నిలబడుతుంది. కానీ ఆ సూత్రం మాకు వర్తించదులే, ఒకే రోజు వచ్చాం కాబట్టి రిజల్ట్ విషయంలో సమన్యాయం పాటిస్తామని ప్లాప్ ని గట్టిగానే పట్టుకున్నాయి.  మరి ఈ రెండు చిత్రాలు తొలి రోజు ఎంత కలెక్షన్స్ ని వసూలు చేశాయని రిపోర్ట్స్ వస్తున్నాయో చూద్దాం.  జెట్లీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా  1 .5 కోట్ల  గ్రాస్ ని సాధించట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమాకి వచ్చిన క్రేజ్ బట్టి ఇది చాలా తక్కువ అని చెప్పవచ్చు. మరి ఎండింగ్ కలెక్షన్స్ ఎంతో చూడాలి. పదికోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు టాక్.  గాయపడ్డ సింహం తొలి రోజు వరల్డ్ వైడ్ గా కోటి రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తుంది. పన్నెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందనేది టాక్ కాగా మరి ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉంటుంది, ఎంత రాబడుతుందో అనేది ఆసక్తిగా మారింది. రెండు చిత్రాల మేకర్స్ మాత్రం కలెక్షన్స్ వివరాలని అధికారకంగా  వెల్లడి చెయ్యలేదు.  
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి 'శరణమన్న శరణం' సాంగ్ రిలీజ్ చేశారు. శ్రామిక శక్తికి నమస్కరిస్తూ 'శరణమన్న శరణం' పాటను రూపొందించారు. ఈ పాటకు  హాయ్ కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు. ఈ పాట గురించి "భగవంతుడు" మేకర్స్ స్పందిస్తూ - మన మట్టిలో ప్రతి పని ఒక అమ్మ దేవత సాక్షిగానే మొదలవుతుంది. పొలం గట్టున నాగలి సాగేముందు 'పోలేరమ్మ'ను, చెరువు కట్టపై అలుగులు పోసేటప్పుడు 'గంగమ్మ'ను, కష్ట, సుఖాల్లో  'ఎల్లమ్మ'ను స్మరించుకోవడం మన శ్రామిక సంస్కృతిలో భాగం. ఈ అమ్మ దేవతలు శ్రామికుల చెమట చుక్కల్లో తోడుండే ధైర్య రూపాలు. మన సంస్కృతిలో అమ్మ దేవతల శరణుజొచ్చంది ఏ పనీ మొదలు కాదు. పూర్తి కాదు. అమ్మలకు, సబ్బండ వర్గాలకు ఘనమైన ట్రిబ్యూటే మా ఈ "శరణమన్న శరణం". ఇది నాగలి పట్టిన రైతు, సుత్తి పట్టిన కమ్మరి, చక్రం తిప్పిన కుమ్మరి... ఇలా సకల సబ్బండ కులాల శ్రమజీవుల గుండె చప్పుడు. రక్తాన్ని చెమటగా మార్చి, ఉత్పత్తి చేసే మట్టి చేతులకు, మట్టి చేతులు మోసే పనిముట్లకు నివాళి ఈ గీతం. ఇది ఈ దేశపు సబ్బండ కులాల పతాక గీతం. శ్రమను, తల్లిని ప్రేమించే, పూజించే వారి బతుకు గీతం. మట్టి మనుషులకి వారిని కంటికి రెప్పలా కాపాడే అమ్మ దేవతలకీ మే డే సందర్భంగా మా వందనం. అంటూ కార్మిక లోకానికి సెల్యూట్ చేశారు.
బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్న నటుడు గెటప్ శ్రీను (Getup Srinu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గెటప్ శ్రీను ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ఒక సరికొత్త వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు 'మేము కాపులం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, యాంకర్ ఈ టైటిల్ గురించి ప్రస్తావిస్తూ.. "సినిమా కోసం కులాన్ని వాడుకోవడం నాకు నచ్చలేదు. ఇలాంటి టైటిల్స్ విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కదా?" అని ప్రశ్నించారు.  ఈ వ్యాఖ్యలతో గెటప్ శ్రీను అసహనానికి లోనయ్యారు. "ఆ టైటిల్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. కథకు తగ్గట్టుగానే ఆ పేరు పెట్టాం తప్ప, కేవలం వివాదం కోసం కులాన్ని వాడుకోలేదు" అని వివరించారు. అయినప్పటికీ యాంకర్  తన వాదనను కొనసాగిస్తూ, గతంలో రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు కూడా ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. దీనికి శ్రీను సీరియస్ అవుతూ.. "తొక్కలో ఇంటర్వ్యూ" అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  
'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేయగా, ఇప్పుడు సెకండ్ సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రేమ పాటకు ముహూర్తం: ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన "ఆయా షేర్.." అనే పాట మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు క్లాస్, యూత్‌ను ఆకట్టుకునేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. మే రెండో వారంలో ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక మెలోడియస్ లవ్ ట్రాక్ అని సమాచారం. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు కట్టిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 'దసరా' మ్యాజిక్‌ను మించి ఈ ప్యారడైజ్ ఉంటుందని, నాని నటనలో మరో కోణాన్ని ఈ చిత్రం చూపిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.   
  మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers).. అగ్ర నిర్మాణ సంస్థగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బ్రాండ్ ని సంపాదించుకుంది. నిర్మాణ రంగంలోనే కాకుండాపంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన  వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వివాదం ఈ రోజు మైత్రి సమర్పణలో తెరకెక్కిన  'జెట్లీ' పంపిణీ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. దిల్ రాజు, ఏషియన్, సురేష్, గీతా డిస్ట్రిబ్యూటర్స్ ఆధీనంలోని సింగిల్ థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్‌లలో (AMB, AAA)లో జెట్లీ  ప్రదర్శించబడలేదు. ఈ విషయంపై మైత్రి భాగస్వామి కేతిరెడ్డి శశిధర్ స్పందిస్తు సింగిల్ స్క్రీన్ కి మాకు మధ్య సమస్యలు ఉన్న మాట నిజమే. కానీ మల్టిప్లెక్స్ రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి గొడవలు లేవు. కానీ కొన్నిమల్టిప్లెక్స్ లలో జెట్లీ  రిలీజ్ చెయ్యలేదని ఒక నోట్ రిలీజ్ చేసాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిలిం చాంబర్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలైనప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఒప్పందాలు జరుగుతుంటాయి. కానీ 'జెట్లీ'కి సంబంధించి మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థకు, కొంతమంది థియేటర్ల యజమానులకి మధ్య విబేధాలు వచ్చాయి. ఎగ్జిబిటర్ల వాదన ప్రకారం, సినిమా ప్రదర్శన సమయంలో తాము చెల్లించిన అడ్వాన్సులు లేదా సెటిల్‌మెంట్ నిధుల విషయంలో మైత్రీ సంస్థ నుంచి సరైన స్పందన రావడం లేదు. దీనివల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పంపిణీ సంస్థ నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని మైత్రీ వర్గాలు అంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది. Also read: Peddi: పెద్ది రిలీజ్ డేట్ వచ్చేసింది..  జూన్ 24 కంటే ఇంకా ముందే   తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేస్తుండగా  గిల్డ్ నిర్మాతలు రెంటల్ సిస్టమ్‌లోనే రిలీజ్ కావాలని పట్టుబడుతున్నారు. ఏదైనా వివాదం తలెత్తినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సినిమా పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది. 'జెట్ లీ' సినిమా విషయంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్లు ఒకే తాటిపైకి వచ్చి, ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా ముగించుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     
తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Kompany - LIK) ఇప్పుడు తన డిజిటల్ ప్రయాణానికి సిద్ధమైంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై అధికారిక స్పష్టత వచ్చేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. సుమారు 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి, ప్రదీప్ రంగనాథన్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ, అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు మూడు వారాల థియేట్రికల్ రన్ తర్వాత, ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు: ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 6, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కి రానుంది. టెక్నాలజీతో ముడిపడిన ప్రేమకథ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.   https://x.com/PrimeVideoIN/status/2050134607681703960
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!