LATEST NEWS
మనం చిన్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ‘ఆశ కురుపులు’ వస్తాయని అనుకునేవాళ్ళం. అంటే, ఎవరికైనా ఏదైనా ఇస్తామని చెబితే కచ్చితంగా ఇచ్చేయాలి. లేకపోతే కంటి మీద  ఒక స్పెషల్ కురుపులు వస్తాయి. వాటిని ‘ఆశ కురుపులు’ అంటారు.  ఇప్పుడు ఇలాంటి ‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల బ్లాక్ మనీ బోలెడంత వుందని, దాన్ని ఇండియాకి పట్టుకొస్తానని, అలా తెచ్చి, ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానని చెప్పారు. ఆ తర్వాత వెంటనే పేదలందరి పేరు మీద ‘జనధన్’ పేరుతో బ్యాంకు ఖాతాలు కూడా తెరిచారు. దాంతో పేదలందరూ మోడీకి ఓటేశారు. మోడీ తమ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తారని ఆశగా ఎదురుచూశారు. పాపం మన దేశంలో జనం అంతేకదా.. ఎవరు ఏది ఇస్తామన్నా వద్దనరు.. ఆశలు పెంచుకుంటారు. ఎవరు ఏమిస్తారా.. తీసుకుందామా అని వెయ్యి కళ్ళతో, చాచిన చేతులతో ఎదురు చూస్తారు. అలా పదిహేను లక్షల కోసం ఆశలు పెట్టుకున్న జనం నిరాశకు గురయ్యారు. మోడీ స్విట్జర్లాండ్ నుంచి డబ్బు తెచ్చిందీ లేదు.. పేదల బ్యాంక్ అకౌంట్లలో వేసిందీ లేదు. అలాగే 2019 ఎన్నికలప్పుడు రైతు ఆదాయం రెట్టింపు చేస్తాననే హామీ ద్వారా రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి, ఆ తర్వాత రైతులను భూమ్మీదే వుంచారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలు వచ్చాయి. మోడీ గారు మరోసారి పేద జనాలకు సరికొత్త ఆశ పెడుతున్నారు. అవినీతి కేసుల విచారణ సందర్భంగా ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తాన్నీ పేదలకు పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు మోడీ చెబుతున్నారు. ‘‘కొందరు వ్యక్తులు అధికార బలంతో, తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా పేదలకు చెందాలని కోరుకుంటున్నాను. ఈ డబ్బంతా పేదలకు పంచడం కోసం ఏంచేయాలనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయబృందాన్ని ఇప్పటికే కోరాను. దీనికోసం చట్టాలను  మార్చడానికి కూడా వెనుకాడను’’ అని మోడీ అంటున్నారు. ఇలా పేదలకు ఆశల మీద ఆశలు పెడుతున్న మోడీ వాటిని ఈసారైనా నెరవేరుస్తారా? లేకపోతే ఆయనకు ‘ఆశ కురుపులు’ రావడం ఖాయం!
 ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా  గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు. మూడు నాలుగు బ్యాంక్ ల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టీ లోన్ తీసుకుంది గీత లక్ష్మీ. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీత లక్ష్మి కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పిందట ఆ కిలాడి గీత లక్ష్మీ. చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ప్లాట్ ఒనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. అయితే  డిఆర్టి  లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది.   ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి ఓటు వేశాడనే కోపంతో ఆ పార్టీ కార్యకర్త చెవిని వైసీపీ నేత కోసేశాడు. బాధితులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు... పందువ గ్రామానికి చెందిన తిమోతి ఇటీవలే వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాడు. ఎన్నికల సమయంలో బంధువులు, చుట్టుపక్కల వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విషయాలను వివరించాడు. ఈ నేపథ్యంలో తిమోతిపై స్థానిక వైసీపీ నేత గురవయ్య అక్కసు పెంచుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న తిమోతిపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో తిమోతి చెవి తెగిపోయింది. గాయపడిన తిమోతిని కనిగిరి ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ రాజశేఖర్, శైలేష్‌ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అలాగే తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్‌, తిలక్‌ సింగ్‌ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ ప‌ట్టుబ‌డింది. దాంతో ఆ ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్ డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారింది. మూడు నెలల క్రితం గసగసాల గడ్డితో తయా చేసిన గడ్డిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గడ్డి సేవిస్తే మంచి కిక్ వస్తుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతూనే ఉంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం చర్చనీయాంశమైంది.  
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో. మరొకటి  ఏపీలో పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అయిన మంజులారెడ్డి అనే  మహిళపై వైసీపీ మూకలు గొడ్డలితో దాడి చేసి నరికితే నుదుటిపై రక్తం గాయంతో కూడ నిర్భయంగా నిలబడిన ఫొటో. ఆమె అంతటి గాయంతోనూ ఆసుపత్రికి కాదు.. పోలింగ్ ఏజెంట్ ను పోలంగ్ బూత్ లోకే వెడతానని చెప్పింది. ఇప్పుడు ఈ రెండు ఫొటోలనూ, రెండు సంఘటనలనూ పోలుస్తూ  జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అంటూ నెటిజనులు ఏకి పారేస్తున్నారు. గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఊరూ వాడా ఏకం చేసేయడమే కాకుండా  ఆసుపత్రికి వెళ్లి ఆ గాయానికి ఓ అరడజనుకు పైగా వైద్యుల బృందంతో చికిత్స చేయించుకుని, నుదుటిపై బ్యాండేజీ వేయించుకున్న జగన్ ఎక్కడ.. నుదుటిపై అంగుళం లోతు గాయంతో.. ముఖమంతా ధారగా కారిన రక్తంతో కూడా ధైర్యంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం ఏజెంట్ గా కూర్చున్న మంజులారెడ్డి ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. జగన్ నుదుటిపై గాయమైతే ఒక్కటంటే ఒక్క రక్తం చుక్క కారిన దాఖలాలు లేవు. ఏక్కడో దూరం నుంచి గులకరాయితో దాడి చేస్తేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేసిన జగన్, తనకు తగిలిన గాయానికి రోజుకో సైజులో ప్లాస్టర్ తో దర్శనమిస్తే.. మంజులారెడ్డి నుదుటిపై   అంగుళం మేర లోతు గాయంతో ధారగా కారుతున్న రక్తంతో , దెబ్బలతో వాచిపోయిన ముఖంతో చలించకుండా  ఆసుపత్రికి పరుగులు తీయకుండా  పోలింగ్ బూత్‌లోనే కూర్చుంది.  ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మంజులారెడ్డి ధైర్యాన్ని ప్రస్తుతిస్తూ జగన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. 
ALSO ON TELUGUONE N E W S
మే 20 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి. ఈ మాట ఎవరినైనా అడిగితే కొంచం ఆలోచిస్తారేమో గాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఆలోచించరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల సెమి గాడ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.  రెండున్నర దశాబ్దాల నుంచి తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో అభిమానుల గుండెల్లో గాడ్ గా కొలువుతీరాడు. ఈ పుట్టిన రోజు తన అభిమానుల్లో మరుపురాని గుర్తుగా ఉండబోతుంది ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రెండు చిత్రాల షూటింగ్  శరవేగంగా జరుగుతుంది. ఈ రెండిటి తర్వాత ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్నాడు. ఆ కాంబో మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ మూవీకి  డ్రాగన్ అనే పవర్ ఫుల్ టైటిల్ ని  ఫిక్స్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20 న టైటిల్ ని  అధికారకంగా ప్రకటించబోతున్నారని కూడా  అంటున్నారు. ఇప్పుడు  డ్రాగన్  వార్త సోషల్ మీడియాలో వస్తుండటంతో ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా టైటిల్ ఉందని  అభిమానుల అంటున్నారు. సోషల్ మీడియాలో  డ్రాగన్ ఇండియన్ రికార్డు లు బద్దలు  కొట్టడం ఖాయమంటూ పోస్ట్ లు పెడుతున్నారు  పైగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఏంటంటే  పుట్టినరోజుకి వన్ డే బి ఫోరే  దేవర నుంచి  ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ ప్రొడ్యూసర్ నాగ వంశీ  మాట్లాడుతు దేవర సాంగ్ రిలీజ్ అయ్యాక రజనీకాంత్ రీసెంట్ బ్లాక్ బస్టర్   జైలర్‌లోని  టైగర్ కా హుకుం పాటని అందరు మర్చిపోతారంటు చెప్పాడు.దీంతో ఫ్యాన్స్ రెండు రోజుల పాటు ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్ని జరిపించాలనే మూడ్ తో ఉన్నారు  
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'SSMB 29'. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా ఇది. పైగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లకుండానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా చాలని ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ గురించి కొన్ని గాసిప్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న 'SSMB 29' చిత్రానికి కాస్టింగ్ డైరెక్టర్ గా విరేన్ స్వామి వర్క్ చేస్తున్నట్లు ఇటీవల నేషనల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. 'SSMB 29'లో మహేష్ బాబు పాత్రకి సమానంగా ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రతో పాటు కొన్ని ఇతర కీలక పాత్రల కోసం నటీనటులను ఎంపిక చేసే బాధ్యతను విరేన్ స్వామికి అప్పగించినట్లు కొందరు రాసుకొచ్చారు. అయితే ఈ వార్తలకు మేకర్స్ చెక్ పెట్టారు. 'SSMB 29' సినిమాకి విరేన్ స్వామి పని చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తమ నుంచి వచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే పట్టించుకోవాలని మేకర్స్ పేర్కొన్నారు.
  ముంబై లో అంతే.. ముంబై లో అంతే..  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)తాతయ్య లెజండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ ని అటు ఇటుగా మార్చి సినిమా ఫీల్డ్ లో అంతే..సినిమా ఫీల్డ్ లో అంతే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ సినిమాలో నుంచి ఒక బడా టెక్నీషియన్ తప్పుకున్నాడు.దీంతో ఈ న్యూస్ ఎవరి సపోర్ట్  లేకుండా స్వయంకృషి తో హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ నయా మూవీ పుష్ప 2(pushpa 2) ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షక లోకం మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. మరి ఇలాంటి సినిమాకి మెయిన్ టెక్నీషియన్ గా పని చేయడం అంటే గర్వంగానే భావించాలి. కానీ ఎడిటర్ గా పని చేస్తున్న ఆంటోనీ రూబెన్ మూవీ నుంచి తప్పుకున్నాడు. వేరే చిత్రాల కమిట్ మెంట్స్ ఉండటంతోనే తప్పుకుంటున్నానని  ఈ విషయంలో ఎలాంటి రూమర్స్ కి తావు లేదని ఆయన తెలిపాడు.  ఆంటోనీ రూబెన్ (Antony Ruben)సాదా సీదా వ్యక్తి కాదు. ఇండియా లో ఉన్న టాప్ మోస్ట్ ఎడిటర్స్ లో  ఒకడు. ఆయన ఎడిట్ చేసాడంటే ఇక ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అనే నానుడి సినీ వర్గాల్లో ఉంది. 2011 లో  వచ్చిన  కందెన్ అనే తమిళ సినిమా ఆయన ఫస్ట్ మూవీ. 2013 లో వచ్చిన ఆర్య, నయనతార ల రాజా రాణి తో దేశ వ్యాప్తంగా ఆయన  పేరు మారుమోగిపోయింది. అజిత్  వేదాళం, వివేగం, విశ్వాసం, విజయ్  తేరి, మెర్సిల్, బిగిల్,  షారుక్  జవాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన లిస్ట్ లో ఉన్నాయి. పుష్ప పార్ట్ వన్ కి కూడా ఎడిటర్ గా వ్యవహరించాడు. ఇక ఆయన స్థానంలో  నవీన్ నూలి  ఎడిటర్ గా ఎంట్రీ ఇచ్చాడు  లేటెస్ట్ గా  గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ వంటి హిట్ మూవీస్ ఆయన నుండి  వచ్చాయి. బన్నీ అల వైకుంఠ పురం కూడా ఆయన ఖాతాలో ఉంది   
తమ అభిమాన హీరోని కలవడం కోసం అభిమానులు పాదయాత్ర చేయడం చూస్తుంటాం. అలా పాదయాత్ర చేసి హీరోని కలిసిన వారుంటారు. పాదయాత్ర చేసి కూడా హీరోని కలవలేకపోయిన వారుంటారు. అయితే తాజాగా ఓ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్యాన్.. పాదయాత్ర చేసి, తన ఫేవరెట్ హీరోని కలుసుకున్నాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఎన్టీఆర్ ను కలవడం కోసం ఖమ్మం జిల్లా నుంచి హైదరాబాద్ కు చెప్పుల్లేకుండా పాదయాత్ర చేశాడు. 300 కిలోమీటర్ల ఈ పాదయాత్ర తొమ్మిది రోజుల పాటు సాగింది. అసలే వేసవి కాలం కావడం, పైగా చెప్పుల్లేకుండా పాదయాత్ర చేయడంతో.. నాగేంద్రబాబు కాళ్లకు బొబ్బలు కూడా వచ్చాయి. అయినప్పటికీ అతను వెనకడుగు వేయలేదు. ఎండని లెక్క చేయకుండా పాదయాత్ర చేసి, ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నాడు.  అయితే తారక్ ప్రస్తుతం 'దేవర' (Devara), 'వార్ 2' (War 2) సినిమాలతో బిజీగా ఉన్నాడు. సరిగ్గా 'వార్ 2' షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సమయంలోనే.. నాగేంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఆయన నివాసానికి చేరుకున్నాడు. హీరో ఇంట్లో లేడని తెలిసినా ఆ అభిమాని ఏమాత్రం నిరాశ చెందలేదు. హీరో రాక కోసం రెండు వారాల పాటు ఆయన ఇంటి ముందే ఎదురుచూశాడు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. ముంబై నుంచి రాగానే తన అభిమాని నాగేంద్రబాబుని కలిసి ఆప్యాయంగా పలకరించాడు. అతనితో కలిసి ఫొటోలు దిగాడు. మొత్తానికి, తన అభిమాన హీరోని కలిసి ఫొటో దిగాలన్న కోరిక నెరవేరడంతో నాగేంద్రబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అలీతో సరదాగా ఈవారం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లయ వచ్చింది. ఆలీ, లయ కలిసి స్వయంవరం మూవీలోని సాంగ్ కి స్టెప్స్ కూడా వేశారు. ఈ సాంగ్ తర్వాత ‘‘ఇప్పుడు వచ్చిన ఈ పాటలు మీ అమ్మవి. లయగారు వచ్చారా ?’’ అని లయనే అడుగుతూ కాసేపు ఫన్ చేసాడు ఆలీ. దానికి నవ్వుతూ ‘‘నేనే లయ’’ అని సమాధానమిచ్చింది. అది విన్న ఆలీ షాకయ్యాడు. ‘‘నేను శ్లోక అనుకున్నారా’’ అని నవ్వేసింది లయ. ‘స్వయంవరం’ మూవీ వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లయకు కంగ్రాట్స్ చెప్పాడు ఆలీ. లయ కూడా తిరిగి ఆలీకి కంగ్రాట్స్ చెప్పారు. లయ పర్సనల్ లైఫ్ గురించి అడిగారు. ‘‘లయ చాలా ఇబ్బందుల్లో ఉంది. అమెరికాలో రోడ్లపై ఉంటోంది అనే కామెంట్స్ విన్నప్పుడు ఎలా అనిపించింది’’ అని ఆడిగాడు ఆలీ.  ‘‘ఎందుకు ఇదంతా. ఇలాంటివి వినేటప్పుడు చాలా బాధేస్తుంది. అడుక్కు తింటున్నాను అనే కాదు ఇంకా చాలా చేస్తున్నానని కూడా అన్నారు. అవన్నీ తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది’’ అని పాపం ఫీలయ్యింది లయ. తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ "2005లో మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఆంటీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని నన్ను అడిగారు. ఇప్పుడు కాదు అని చెప్పడంతో మా ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదనుకున్నారు’’ అంటూ తమ పెళ్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇండియాకు రావడానికి కారణమేంటి అని అడిగాడు ఆలీ ‘‘నేను నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు మూవీతో  రీఎంట్రీ ఇస్తున్నాను’’ అని అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత తను, ఆలీ కలిసి నటించిన సినిమాలను గుర్తుచేసుకున్నారు. ఇలా లయ ఎన్నో విషయాలు చెప్పారు.  
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని 'బాహుబలి-2' కోసం అప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూశారో.. ప్రభాస్ (Prabhas) పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా? అని అందరూ అంతలా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఆరోజు రాబోతుంది. స్వయంగా ప్రభాసే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పటికే నలభైల్లోకి అడుగుపెట్టాడు. బాహుబలి రాకముందు నుంచే పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి (Prabhas Marriage) గురించి చర్చ నడుస్తోంది. ఒకసారి ప్రముఖ హీరోయిన్ తో పెళ్లి అని, మరోసారి బంధువుల అమ్మాయితో అంటూ.. ఇలా ఎన్నోసార్లు ప్రభాస్ పెళ్లి వార్తలు వచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. ఇటీవల కనీసం అలాంటి వార్తలు కూడా రావడం లేదు. దీంతో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లా ప్రభాస్ కూడా సింగిల్ గా మిగిలిపోతాడా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో ఊహించని ప్రకటనతో సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ ఓ స్టోరీ పెట్టాడు. అందులో "డార్లింగ్స్.. మొత్తానికి ఒక స్పెషల్ పర్సన్ జీవితంలోకి రాబోతున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ రాసుకొచ్చాడు. దీంతో ఆ స్పెషల్ పర్సనా ఎవరా? అని అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొందరు అభిమానులైతే అనుష్క శెట్టి (Anushka Shetty) అయ్యుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ప్రభాస్ జీవితంలోకి రాబోతున్న ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? అనేది త్వరలోనే రివీల్ అయ్యే అవకాశముంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ ఇద్దరు కలిసినా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు కొణిదెల నాగబాబు. నటుడు, నిర్మాత కంటే మెగా బ్రదర్ గానే ఎక్కువ గుర్తింపుని పొందాడు. ఎలాంటి ఇష్యు మీద అయినా ఎంతటి  పర్సన్ మీద అయినా  డేర్ అండ్ డాషింగ్ గా  మాట్లాడటం ఆయన స్టైల్.  అంతటి వ్యక్తి  తాజాగా  తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీకి, నాగబాబు కి ఉన్న రిలేషన్ గురించి అందరకి తెలిసిందే.  బన్నీ ఇటీవల  తన స్నేహితుడు ఎంఎల్ఏ గా పోటీ చేస్తుంటే అతని గెలుపు కోసం ప్రచారానికి వెళ్ళాడు. ఆ తర్వాత నాగ బాబు తన ట్విట్టర్ లో  మాతో  ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మా వాడే  అంటూ  ట్వీట్ చేసాడు.  ఇది  అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందనే విషయం అందరకి అర్ధమయ్యింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబు కి రివర్స్ కౌంటర్లు వేస్తు ట్వీట్ ల మీద ట్వీట్లు చేస్తు వస్తున్నారు.  ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉన్న బన్నీ అభిమానులు ట్వీట్ లు చేస్తున్నారు. దీంతో  నాగబాబు ట్విటర్ నుంచి వైదొలిగాడు. నాగ బాబు సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం  సినీ పరిశ్రమలలోను పబ్లిక్ లోను వైరల్ గా మారింది నాగబాబు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గా పని చేస్తున్నాడు. ఆ హోదాలోనే బన్నీ మీద ట్వీట్ చేసాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మెగా ఫ్యాన్స్ చాలా మంది బన్నీ జనసేన తరుపున కాకుండా వేరే పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడం మీద కోపంగానే  ఉన్నారు. వాళ్ళ కోపం పుష్ప 2 కి ఎంత వరకు పని చేస్తుందో  చూడాలి. లేక సినిమా వేరు రాజకీయం వేరు అనే కాన్సెప్ట్ కి దాసోహం అవుతారో  
స్థలాల విషయంలో సామాన్యులు మోసపోవడం తరచూ చూస్తుంటాం. అయితే ఒక్కోసారి ఎంతో పలుకుబడి ఉన్నవారు, సెలబ్రిటీలు కూడా మోసపోతుంటారు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి అలాంటి అనుభవమే ఎదురైంది. 2003లో సుంకు గీత అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ లో 681 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశాడు ఎన్టీఆర్. ఆ స్థలంలోనే తన డ్రీం హౌస్ ని కట్టుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ స్థలం, అందులో నిర్మించిన ఇంటి ఖరీదు కొన్ని కోట్లల్లో ఉంటుంది. అలాంటిది ఆ ఇంటి స్థలం ఓ వివాదంలో చిక్కుకుంది. ఆ స్థలాన్ని అమ్మిన సుంకు గీత.. 1996లోనే బ్యాంకులకు తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. ఆమె ఆ విషయాన్ని దాచి, ఎన్టీఆర్ కి స్థలం అంటగట్టి దారుణంగా మోసం చేశారు. పైగా గీత రుణాలు ఎగ్గొట్టడంతో.. ఆమెకి రుణాలు ఇచ్చిన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లు.. 'డెట్ రికవరీ ట్రిబ్యునల్'ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన ట్రిబ్యునల్.. ఆ స్థలంపై బ్యాంకులకే హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్.. స్థలాన్ని, అందులో నిర్మించుకున్న ఇంటిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ న్యాయ పోరాటానికి దిగాడు. తనని మోసం చేశారంటూ ఆయన ఫిర్యాదు చేయడంతో.. గీతపై కేసు నమోదైంది. అలాగే ట్రిబ్యునల్ తీర్పుపై కూడా ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించాడు. జూన్ 6న దీనిపై విచారం జరగనుంది. కాగా, ఓ స్టార్ హీరో.. దానికితోడు రాజకీయంగానూ ఎంతో పలుకుబడి ఉన్న ఎన్టీఆర్ కి ఇలా జరగడం సంచలనంగా మారింది.
తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ (Allu Arjun) మద్దతు తెలపడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి నుంచి సోషల్ మీడియా.. 'మెగా వర్సెస్ అల్లు' అన్నట్టుగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒకే వేదికపై చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4వ తేదీని 'డైరెక్టర్స్ డే'గా జరుపుకుంటారు. ఈ ఏడాది డైరెక్టర్స్ డే ని భారీగా నిర్వహించాలని దర్శకుల సంఘం భావించగా.. ఎన్నికల కోడ్ కారణంగా మే 4న పర్మిషన్ రాలేదు. ఇప్పుడు ఈ ఈవెంట్ ను మే 19న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో పాటు.. దర్శకులంతా హాజరు కానున్నారు. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచే అవకాశముంది. 'మెగా వర్సెస్ అల్లు' అంటూ అభిమానుల మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో.. ఒక వేదికపై చిరంజీవి, బన్నీ కలవనుండటం ఆసక్తి కలిగిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంతవరకు ఒక్క సాంగ్ కూడా విడుదల చేయకపోవడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న 'కల్కి 2898 AD' ఆడియో రైట్స్ ని సరిగమ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్.. 15 సెకన్ల మ్యూజిక్ బిట్ ని విడుదల చేశారు. ఆ షార్ట్ మ్యూజిక్ బిట్ అలా విడుదలైందో లేదో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చింది. అంతేకాదు ఈ వారంలోనే ఈ మూవీ మొదటి సాంగ్ విడుదల కానుందని సమాచారం.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.   రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను..   జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌.. తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.                                                                   *రూపశ్రీ.  
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది.  క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి.  ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది.  చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది.                                   ◆నిశ్శబ్ద.
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.