LATEST NEWS
  ప్రజాస్వామ్యంలో అధికారులు వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కానీ, స్వలాభం కోసమో, రాజకీయ విధేయత కోసమో ఆ వ్యవస్థకే తూట్లు పొడిస్తే? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల  రహస్య బేటీలు  సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తుంటే, మరోవైపు తెరచాటున ఏం జరుగుతోంది? వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై  ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.   లక్షలాది మంది పోటీ పడే యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గి, అత్యున్నత శిక్షణ పొందిన ఐఏఎస్ అధికారులను మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ  అని పిలుచుకుంటాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, రూపొందించే ప్రతి రూల్ వీరి కనుసన్నల్లోనే జరుగుతుంది. అయితే.. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులు, హైదరాబాద్‌ వేదికగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని, కాంట్రాక్టర్ల వివరాలను, పెట్టుబడుల సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం క్రమశిక్షణారాహిత్యం మాత్రమే కాదు, ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఆ ప్రజలకే చేసే విశ్వాసద్రోహం. ఈ విషయంలో ప్రభుత్వాధినేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని అప్పసాని రాజేష్ హెచ్చరించారు. తెలుగువన్ యూట్యూబ్ చానల్ అప్పసాని ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ కింది లింక్ క్లిక్ చేసి వీక్షించండి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం  కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు పోరు కాదు ప్రపంచ దేశాల సమస్య. అన్ని దేశాల్లోని ప్రజల ఇంటి సమస్య. యుద్ధం అనగానే మనకు చాలా దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో జరిగే తుపాకుల మోత మాత్రమే అని అనిపిస్తుంది. కానీ ఇప్పటి గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ గా పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా  భారతదేశ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపు. పెద్ద కుదుపు. ఇండియాకు  అవసరమైన ఇంధన అవసరాలలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది.   ఈ  కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఆ ప్రభావంతో  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేనా యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలునెలకొన్న గల్ఫ్ దేశాలలో దాదాపు కొటి మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. ఈ యుద్ధం   వారి ఉద్యోగాలు, భవిష్యత్, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.   ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి లేదా  పరిష్కరించడానికి  భారతదేశం వంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ తన పలుకుబడిని ఉపయోగించి ఆపడానికి కృషి చేయాలి.   బ్రిక్స్ ద్వారా చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకం చేసి శాంతి కోసం ఒత్తిడి తేవాలి.   తెలుగువన్ యూట్యూబ్ చానెల్ వాస్తవ వేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ మధ్య  ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపే ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి పాఠం ఈ దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి.  
చంద్ర‌బాబు ప‌నై పోయింద‌ని.. ఆయ‌న‌కివే చివ‌రి ఎన్నిక‌లు అవుతాయ‌ని..  ఈ వ‌య‌సులో కృష్ణా రాా అనుకోకుండా  ఆయ‌న‌కెందుకీ రాజ‌కీయాలు. అలాగైనా ఆయ‌న‌కు పుణ్యం వ‌స్తుంది  క‌దా? అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన జగన్ కు  వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స  ప‌ట్ల లోకేష్ చూపిన   వాత్స‌ల్యం చెంపపెట్టులాంటిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్, లోకేష్ ఇద్దరూ పొలిటీషియన్సే.. కానీ మెచ్యూరిటీ, పరిపక్వల విషయంలో ఇద్దరికీ ఉన్న తేడా ఇది అంటూ.. మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనై, కోలుకుని మండలికి వచ్చిన సందర్భంగా లోకేష్ ఆయనను ఆప్యాయంగా పలకరించి,  మా మాస్టారు బొత్స తిరిగి  స‌భ‌కు వ‌చ్చారు, సభలో ఆయనన చూడటం ఎంతో సంతోషంగా  ఉంద‌న్నారు లోకేష్.  ఇటీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి  తీవ్రంగా  ఇబ్బంది  ప‌డ్డారు.  కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్  సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ష‌ర్మిళ.. జ‌గ‌న్ మానసిక పరిస్థితి ప‌ట్ల తనకు సందేహాలున్నాయని షర్మిల అంటారు.   ఏదో సినిమా డైలాగులో ఆయ‌న్ను ఎవ‌రికైనా చూపించండ్రా, అలా వదిలేయకండ్రా అని వైసీపీ శ్రేణులకు సూచించారు.   జ‌గ‌న్ ఎందుక‌ని ఇంత ప‌ర్వ‌ర్టెడ్ గా ఉన్నారు? మంచి చెడులు మ‌ర‌చి వ్యవహరిస్తారు?   చంద్ర‌బాబు వ‌య‌సుతో ఆయ‌న‌కేం ప‌ని? అంటూ పలు సందర్భాలలో ఆయనపై పలువురు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రాష్ట్రానికి   అనుభ‌వంతో కూడిన నాయ‌క‌త్వం  అవసరం అని ప్రజలు భావించారు. కనుకనే చంద్రబాబుకు అఘండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు.  ఆ విషయాన్ని పట్టించుకోకుండా జగన్ చంద్రబాబు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరుకు.. లోకేష్ తన పరిణితితో సమాధానమిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కాలం ఎంత విచిత్ర‌మైన‌దంటే.. ఒక‌ప్పుడు మీకు క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేయ‌గ‌ల‌ను అంటూ  అహంకార పూరితంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన జగన్  ఇప్పుడు ఆయనే అదే అసెంబ్లీలో   ప్రతిపక్ష  నేత హోదా లేకుండా నిలిచారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష  హోదా  దక్కలేదు. స‌రిగ్గా  అదే స‌మ‌యంలో ఒక‌ప్పుడు ఈ శాస‌న  మండ‌లి అన్న‌దే వృథా ఖ‌ర్చు,  కాల‌యాప‌న అన్న జ‌గ‌న్ నేడు అదే శాస‌న మండ‌లిని ఆధారం చేసుకుని తన రాజకీయ ఉనికిని చాటుకుంటున్నారు.  బొత్స‌ను ఎమ్మెల్సీని చేసి,  త‌ద్వారా ఆయనకు మండ‌లి  ప్ర‌తిప‌క్ష  నేత హోదా  క‌ల్పించి, ఇక్క‌డ త‌మ ఉనికి కాపాడుకునే య‌త్నం చేస్తున్నారు జ‌గ‌న్. నాడు  చంద్రబాబుకు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా  చేస్తాన‌ని బీరాలు పలికిన జ‌గ‌న్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధార‌ణ ఎమ్మెల్యేగా స‌భ‌కు వెళ్ల‌లేక గైర్హాజ‌ర‌వుతున్నారు. ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు.  ఒక్కోసారి  అవ‌స‌రం  తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి  ప‌డ‌వ బోల్తా  ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే  ఉదాహ‌ర‌ణంటున్నారు. 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీకి 2024లో జరిగిన ఎన్నికలలో వైపీపీకి కేవలం 11 స్థానాలే వచ్చిన సంగతి తెలిసిందే.  దీంతో ప్ర‌తిప‌క్ష హోదాకు ఉండాల్సిన 18 సీట్ల సంఖ్యా బ‌లం లేక పోవ‌డ‌తో  ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక జగన్ అసెంబ్లీకి కేవలం పులివెందుల ఎమ్మెల్యే హోదాలో మాత్రమే హాజరు కావాల్సిన పరిస్థితి.  అందుకే గైర్హాజరౌతున్నారు అది వేరే సంగతి. అదే శాస‌న మండ‌లిలో మొత్తం 58 సీట్లుండ‌గా.. ప్ర‌స్తుతం 30 సీట్ల‌తో వైసీపీ  బ‌లంగా  ఉంది. దీంతో మండలిలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంది. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే బిల్లుల‌ను అడ్డుకోవ‌డం, లేదా  చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డే అవ‌కాశం వారికి మండలిలో ల‌భిస్తోంది.    గ‌తంలో ఇదే జ‌గ‌న్ మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని తీర్మానం చేశారు జ‌గ‌న్. ఎందుకంటే అప్పట్లో  అసెంబ్లీలో వైసీకీ భారీ మెజారిటీ ఉన్నా.. మండ‌లిలో మాత్రం లేదు.   అప్ప‌ట్లో టీడీపికి శాస‌న  మండలిలో  మెజారీ ఉండేది. దీంతో  మూడు రాజ‌ధానుల బిల్లు వంటి  కీల‌క నిర్ణ‌యాల‌ను మండ‌లిలో టీడీపీ  అడ్డుకునేది. దీంతో మండ‌లి  వ‌ల్ల ప్ర‌జా ధ‌నం వృధా, కాల‌యాప‌న  అంటూ ఈసడించిన జగన్  ఇప్పుడుఅదే మండలి నుంచి తమ పార్టీ వాయిస్ వినిపించాల్సిన పరిస్థితి వచ్చింది.  ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మేంటంటే..  ఆ తర్వాత మండలిలో వైసీపీకి మెజారిటీ రావడంతో 2021 నాటి రద్దు తీర్మానాన్ని నాటి  జ‌గ‌న్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  అహంకారం ప‌నికిరాదనీ, వ్య‌వ‌స్థ‌ల‌ను అవ‌గాహ‌నారాహిత్యంతో త‌ప్పు ప‌ట్ట‌రాద‌ని.. ఈ   ఉదంతంతో తెలుస్తోంద‌ంటున్నారు పరిశీలకులు.  వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల కనీస గౌర‌వం లేక పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన ఇబ్బందిగా దీన్ని అభివర్ణిస్తూ..  ఇప్పటికైనా తెలిసివచ్చిందా జగన్? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 
ఇటీవ‌ల   కిర‌ణ్ రాయ‌ల్ వంటి కొంద‌రు ప‌వ‌న్ లేకుంటే తెలుగుదేశం గెలిచే ఛాన్సే లేద‌ని కామెంట్ చేయ‌డం కూట‌మి వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త‌ వచ్చింది. తెలుగుదేశం, జనసేన పార్టీల   సోష‌ల్ మీడియాలో ఒక రకంగా డైలాగ్ వార్.. మాటల యుద్ధం జరిగింది. అంతే కాకుండా కిరణ్ రాయల్ వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఈ నేపథ్యంలో కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కూటమి ఐక్యత వల్ల  ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్  విడ‌మ‌ర‌చి చెప్పారు.  వైసీపీ వారు కేవ‌లం 11 మందే ఉన్నా.. వారు 1100 మంది ఉన్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తార‌నీ,  క‌ల్తీ వాళ్లే చేస్తారు, బూతులు వాళ్లే మాట్లాడ‌తారు,  మ‌న‌మేదైనా  ఆన్స‌ర్ ఇస్తే దాన్ని కూడా  బ‌ద‌నాం చేస్తారు.. అదే మ‌నం మ‌నం చేసిన  ప‌ని చెప్పుకోలేక పోవ‌డం చేటు తెస్తోంద‌ని అసెంబ్లీ  వేదిక‌గా  ఆవేద‌న వ్య‌క్తం  చేశారు ఉప ముఖ్య‌మంత్రి  ప‌వ‌న్ క‌ళ్యాణ్. అదే స‌మ‌యంలో గ‌త  విధ్వంస  పాల‌న‌కు ప్ర‌స్తుత పాల‌న‌కూ ఎంతో తేడా ఉంద‌నీ,  ఆర్ధిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ర‌వీంద్రుడి వ‌చ‌నాల‌ను జోడించి ఎంతో గొప్ప‌గా  వినిపించార‌నీ, ఆయ‌న కూట‌మి  పాల‌న‌లో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ధిని కూడా ఎంతో చ‌క్కగా పాంప్లెంట్లు వేసి మ‌రీ వివ‌రించి చెబుతున్నార‌నీ ప‌య్యావుల పనితీరును ప్ర‌సంగించారు. వాళ్లు కోట్ల రూపాయ‌ల అప్పులు మిగిల్చి పోయినా, ఇక్క‌డ మ‌నం ఇంత చేస్తున్నామ‌న్న పవన్ కల్యాణ్  ఈ స‌మ‌యంలో మ‌న ముఖ్య‌మంత్రికి మ‌న‌మంతా అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు.   దీంతో బ‌య‌ట కిర‌ణ్ రాయ‌ల్ వంటి బాధ్య‌త‌లేని కార్య‌క‌ర్త‌ల  ద్వారా ఏర్ప‌డ్డ అగాథాల‌ను పవన్ కల్యాణ్  ఈ ఒక్క మాట‌తో పూడ్చే య‌త్నం చేశారు. ఎవ‌రెన్ని  య‌త్నాలు చేసినా, ఇక్క‌డ కూట‌మి ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌నీ.. పైపెచ్చు బ‌య‌ట ఎంత‌గా వైసీపీ విజృంభిస్తోంటే.. మ‌న ఐక్య‌త అంత‌గా బ‌ల‌ప‌డాల‌ని త‌న శ్రేణుల‌తో పాటు కూట‌మి  శ్రేణుల‌కు కూడా అసెంబ్లీ  నుంచి ఒక సందేశం ఇచ్చారు పవన్ కల్యాణ్
ALSO ON TELUGUONE N E W S
- డాక్యుమెంటరీ తీర్చిదిద్దిన విధానంపై ప్రశంసలు కురిపించిన జ్యూరీ సభ్యులు - యూనిటీ డాక్యుమెంటరీని నిర్మించిన దర్శక నిర్మాతలకు అభినందనల వెల్లువ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపితగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీపై యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ రూపొందించిన యూనిటీ. ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉప శీర్షిక.  చిరందాస్ శ్రీకాంత్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో సముచితమైన స్థానం దక్కింది. 2025 సంవత్సరానికి గాను వెల్లడించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లోని డాక్యుమెంటరీ విభాగంలో తొలి ఉత్తమ డాక్యుమెంటరీగా గద్దర్ అవార్డును సొంతం చేసుకుంది. డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ కు జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న ప్రముఖ దర్శకులు విజయ్ కనకమేడల ఎఫ్ డీసీ కార్యాలయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ.... తెలంగాణ సమాజానికి మరో గాంధీ ఎలా అయ్యాడనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా పెద్దల నుంచి పాఠశాల విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యేలా యూనిటీ డాక్యుమెంటరీని విజయ్ కుమార్ చిత్రీకరించారు. మైమ్ మధు, బాలనటుడు భాను ప్రధాన పాత్రలు పోషిస్తూ బాపూజీ కథను వివరించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ లో ఇలా వినూత్నమైన పద్దతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ బాల్యం నుంచి మరణం వరకు, ఆ తర్వాత తెలంగాణ సాధన వరకు ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా చిత్రీకరించడం పట్ల జ్యూరీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నాణ్యమైన విజువల్స్, స్పష్టమైన వాయిస్ ఓవర్, చక్కని ఎడిటింగ్ తో ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సుమారు అరగంటపాటు యూనిటీ డాక్యుమెంటరీని తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే యూనిటీ డాక్యుమెంటరీ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా శభాష్ అనిపించుకొని అవార్డులు అందుకుంది. 2025లో దిల్లీలో జరిగిన 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోగా.... ముంబయిలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023లో యూనిటీ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంట్ ఫిల్మ్, ఐకానిక్ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును యూనిటీ (UNITY) సొంతం చేసుకుంది. ఇలా... ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న UNITY డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల దర్శకుడు విజయ్ కుమార్, నిర్మాత శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహోన్నత శిఖరం లాంటి వ్యక్తి చరిత్రను గుర్తించి ప్రోత్సహించడం కొండా లక్ష్మణ్ బాపూజీ పట్ల ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను చాటుకుందని తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ ఛైర్మన్ విజయ్ కనకమేడల, జ్యూరీ సభ్యులకు దర్శకుడు విజయ్, నిర్మాత శ్రీకాంత్ తోపాటు అందులో నటించిన మైమ్ మధు, బాలనటుడు  మాస్టర్ భాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. అందులో భాగంగా పవన్‌కళ్యాణ్ తన వెర్షన్ డబ్బింగ్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించి అధికారికంగా పెట్టిన పోస్ట్ ఇప్ప్పుడు వైరల్‌గా మారుతోంది. డబ్బింగ్ చెప్తున్న పవన్‌కళ్యాణ్ పక్కన దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు థమన్ ఉన్నారు.  శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని హరీష్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క థమన్ మరోసారి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ పవర్‌ఫుల్ స్కోర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను ఈరోజు రివీల్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏది ఏమైనా ఎంతోకాలంగా పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉగాదికి థియేటర్లలో కలెక్షన్ల సునామీ సష్టించేందుకు సిద్ధమవుతోంది.  ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎలాంటి సంచలనాలు సష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ఆ చిత్రాన్ని మించే స్థాయిలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉందనే ప్రచారం జరుగుతోంది. 
సినీ తారల ఇళ్లల్లో పెళ్లిళ్ల హడావిడి  పెళ్లి పీటలు ఎక్కబోతున్న సాయి శ్రీనివాస్  ఆదివారం ఎంగేజ్మెంట్! నిర్మాత కొడుకు హీరోగా సక్సెస్ కావడమనే విషయంలో తెలుగు సినిమాకి జరిగిన అన్యాయం పాళ్ళు ఎక్కువే. కానీ ఆ అపవాదుని చెరిపేసిన ఇద్దరు, ముగ్గురు హీరోల్లో 'బెల్లంకొండ సాయి శ్రీనివాస్'(Bellamkonda sai Sreenivas)ఒకడు. హిట్టు ప్లాప్ లు సమానంగా పలరిస్తున్నా తను మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. రీసెంట్ గా సాయిశ్రీనివాస్ పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాని ఊపిరి సలపనంత బిజీగా చేస్తున్నాయి. మరి మనం కూడా కాసేపు పూర్తి న్యూస్ తో బిజీ అవుదాం. సాయిశ్రీనివాస్ ఫియాన్సీ పేరు కావ్య రెడ్డి.. హైదరాబాద్ కి చెందిన అమ్మాయి. తండ్రి లాయర్ కాగా తాత జడ్జి. రేపు( మార్చి 7 ) సాయి శ్రీనివాస్, కావ్య ల  ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు. అయితే నిశ్చితార్థం విషయంపై అధికార ప్రకటన మాత్రం రాలేదు. ఏది ఏమైనా మొత్తానికి తెలుగు సినిమా తన వారసుల్నిఒక ఇంటివాళ్ళని చేస్తూ పెళ్లిళ్ల సీజన్ మాలో కూడా ఉంటుందని చెప్తుంది.  also read: Pawan Kalyan: వాళ్ళని కాపాడుతున్నాడా!.. ప్రముఖ నిర్మాత మాటలు వైరల్  సాయి శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే హైందవ, టైసన్ నాయుడు అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లకొండ సురేష్(Bellamkonda Suresh)గత మూడు దశాబ్దాలపై నుంచి చిత్ర సీమలో ఉంటు అగ్ర నిర్మాత హోదాలో ఎన్నో సూపర్ హిట్స్ నిర్మించాడు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. కానీ రెస్ట్ కి గుడ్ బై చెప్పి నిర్మాతగా మళ్ళీ బిజీ అవుతానని ఇటీవల చెప్పాడు.   
టాలీవుడ్‌కి ఎంత మంది హీరోలు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి స్థానం మాత్రం ఎంతో ప్రత్యేకం. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో చిరంజీవి సాధించిన విజయాలు ఎన్నో. ప్రేక్షకుల అభిమానం అంతకు మించి ఉంటుంది. తన కెరీర్‌లో అన్నిరకాల పాత్రలు పోషించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు.  తాజాగా ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు మెగాస్టార్ ఖాతాలోకి వచ్చి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స2025లో భాగంగా మెగాస్టార్‌కు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మెగాస్టార్ ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిగా నిలిచి కొత్త హీరోలు ఇండస్ట్రీకి రావడానికి కారణమయ్యారు. 1978లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మెగాస్టార్ నటుడిగానే కాదు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.  తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును కూడా ప్రకటిస్తూ చిరంజీవిని ఆ అవార్డుకు ఎంపిక చేయడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయం. చిరంజీవికి ఈ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవికి ఎన్నో అవార్డులు లభించాయి. ఇప్ప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ఆయన ఖాతాలో చేరింది. 
    -ప్రస్తుత తెలుగు సినిమా పరిస్థితి ఏంటి  -ఎందుకు వెలవెలబోతున్నాయి  -పరిష్కారం ఏంటి! ఎగ్జామ్స్ సీజన్ వచ్చేసింది. స్టూడెంట్స్ అందరు ఎంతో టెన్షన్ తో ఎగ్జామ్స్ మూడ్ లో ఉన్నారు. కానీ  ఈ నెల 19 న విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ పార్ట్ 2 పై కూడా ఒక లుక్ వేశారు. ఎలా ఉండబోతున్నాయన్న టెన్షన్ కూడా వాళ్లల్లో ఉంది. అదేంటి పరీక్షలపై ఫోకస్ చేయండని ఎవరైనా చెప్పినా, అక్కడ ఉంది ఎలాంటి సినిమాలు దేని తోవ దానిదే అంటున్నారు. దీన్ని బట్టి ఉస్తాద్, ధురంధర్ 2 పై ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ చిత్రాలపై కొన్ని బాధ్యతలు కూడా నెలకొని కొన్నాయని ప్రముఖ  నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ (Nattikumar)మా తెలుగు వన్ సినిమా(Telugu One Cinema)ఛానల్ కి  చెప్తున్నాడు. ఆ మాటలు చూద్దాం. ఆయన మాట్లాడుతు ప్రస్తుతం చిత్ర పరిశ్రమ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత థియేటర్లలో సందడి చేసే సరైన సినిమా రాలేదు. దాదాపు 50 రోజులుగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల షోలు పడక సెంటర్లు మూసివేసే పరిస్థితి వచ్చింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తాము తెచ్చిన అప్పులకి  వడ్డీలు కట్టలేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. కేవలం ఒక్క హిట్ తో మొత్తం ఇండస్ట్రీని నడపడం సాధ్యం కాదు. అలాంటి హిట్ లతో  కనీసం నాలుగైదు సినిమాలు నిరంతరం రన్నింగ్‌లో ఉండాలి.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం యొక్కఉద్రిక్తతలు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా 'టాక్సిక్' (Toxic) 'దురందర్ 2' (Dhurandhar 2) వంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఓవర్సీస్ మార్కెట్. హిందీ సినిమాలకు మరియు పాన్-ఇండియా చిత్రాలకు అమెరికా, గల్ఫ్ దేశాలు, జర్మనీ మరియు బ్రిటన్ వంటి దేశాల నుండి వచ్చే వసూళ్లు చాలా ముఖ్యం. అక్కడ పరిస్థితులు సజావుగా లేకపోవడంతో, భారీ బడ్జెట్ చిత్రాలు వెనక్కి తగ్గుతున్నాయి. . దీంతో అందరి దృష్టి 'ఉస్తాద్ భగత్ సింగ్'(ustaad Bhagatsingh)పైనే ఉంది. పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారి సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ వల్ల వచ్చే నష్టం తక్కువగానే ఉండవచ్చు, ఎందుకంటే ఆయన సినిమాలకి మన లోకల్ మార్కెట్ చాలా బలంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాను త్వరగా లేదా అనుకున్న సమయానికి తీసుకురావాలని ఎగ్జిబిటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఉగాది వంటి పెద్ద పండుగ సమయంలో సినిమా వస్తే థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. also read: mrithyunjay vs  sampradayini suppini suddapoosani: తొలి రోజు కలెక్షన్స్ ఇవే  కానీ ఒకేసారి  5000 థియేటర్లలో వేస్తే, ప్రేక్షకులందరూ మొదటి రోజే చూసేస్తారు. దీనివల్ల రెండో రోజు నుండి కలెక్షన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది, అందుకే ప్లానింగ్ ప్రకారం థియేటర్లని కేటాయించడం ముఖ్యమని నట్టి కుమార్ చెప్తున్నారు. ఆయన చెప్పినట్టుగానే తెలుగు ప్రేక్షకులకి సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కానీ గత కొన్నాళ్లుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి. సరైన సినిమాలు లేక, ప్రేక్షకులు రాక ఎగ్జిబిటర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ తరుణంలో సినిమా కష్టాలు: 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లకి పూర్వవైభవం తీసుకురావాలని ఆశిద్దాం.  ఇక నట్టి కుమార్ ఏ ముహూర్తాన కోరుకున్నాడో కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ నెల 26 నుంచి ఈ నెల 19 కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లు ఉగాది శోభతో  కళకళలాడనున్నాయి. ఆయన భయపడినట్టుగా యుద్ధ వాతావరణం నేపథ్యంలో టాక్సిక్ వాయిదా పడింది. ధురంధర్ 2 మాత్రం యధావిధిగా వస్తుంది. మరిన్ని ఆసక్తికర  అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(Telugu One cinema) యూట్యూబ్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
    నిన్న థియేటర్స్ లో మరో మారు సినీ సందడి  నాలుగు చిత్రాలకి టాక్ పర్లేదు మరి కలెక్షన్స్ ఎంత! సిటీకి ఎంతో మంది పోలీస్ కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ చంటి గాడు లోకల్ అనే సినీ డైలాగ్ ఎంత ఫేమస్సో తెలిసిందే. అదే రీతిలో ప్రతి సంవత్సరం ఎన్నో పండగలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ సినీ పండగ మాత్రం ప్రతి శుక్రవారం ఉంటుందన్నట్టుగా నిన్న మృత్యుంజయ్(Mrithyunjay),ఎస్. సరస్వతి(S Saraswathi),మెన్షన్ హౌస్ మల్లేష్(Mension House mallesh),సాంప్రదాయినీ, సుప్పిని, సుద్దపూసిని(sampradayini suppini suddaposani)చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ చిత్రాలు తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ సాధించాయో చూద్దాం.   మృత్యుంజయ్ చూసుకుంటే కోటి రూపాయల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. శ్రీ విష్ణు(Sreevishnu)నుంచి గత వారమే వచ్చిన మరో మూవీ విష్ణు విన్యాసం తొలి రోజు రెండు కోట్ల నెట్ ని సాధించింది. శివాజీ, లయల సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసిని తొలి రోజు 0 .20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా టాక్. మెన్షన్ హౌస్ మల్లేష్ 0 .65 కోట్ల గ్రాస్ అని చెప్తున్నారు. సరస్వతి కలెక్షన్స్ వివరాలు రాలేదు. ద్వీబాషా చిత్రం కావడమే ఇందుకు కారణం.  also read: s.saraswathi: వైరల్ గా నిలిచిన సరస్వతి.. ఆ లెజండ్రీ కథతో తెరకెక్కిందా! ఇక ఈ నాలుగు చిత్రాలు దేనికవే డిఫరెంట్ సబ్జెట్స్ తో తెరకెక్కడం జరిగింది. టాక్ కూడా అన్నిటికి  పర్వాలేదనే స్థాయిలో వస్తుండంతో పాటు మీ అభిమాన నటులు తమ పెర్ ఫార్మెన్స్ తో  కనువిందు చేస్తున్నారు. థియేటర్ కి వెళ్లి చూసి ఆనందించండి. ఈ నాలుగు చిత్రాల రివ్యూస్ మా తెలుగు వన్ సినిమా సైట్ లో ఉంచడం జరిగింది.    
తెలుగు వెండితెరపై అత్తాకోడళ్ల మధ్య సాగే పోరాటాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ‘అబ్బాయిగారు’ సినిమాలో అత్తాకోడళ్ల మధ్య జరిగే డ్రామా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వెంకటేష్, మీనా జంటగా నటించిన ఈ చిత్రానికి ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు. జయచిత్ర, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నూతన్‌ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఆ సినిమాలోని ఒక పవర్‌ఫుల్ ఎపిసోడ్‌లోని విశేషాల గురించి తెలుసుకుందాం. కుటుంబ బంధాలలో ప్రేమ ఎంత ఉంటుందో, కొన్నిసార్లు ఆస్తి కోసం లేదా అహంతో చేసే కుట్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఈ కథలో అత్తగారు తన కోడలిని కొడుకు నుంచి విడదీయడానికి ఆడిన ఒక తెలివైన నాటకం మరెవరినైనా భయపెట్టేలా ఉంటుంది. తన కొడుకు జాతకంలో పెద్ద దోషం ఉందని, 28 ఏళ్లు వచ్చే వరకు భార్యతో కాపురం చేస్తే ప్రాణగండం పొంచి ఉందని అత్తగారు కోడలికి చెబుతుంది. అలాంటి సందర్భం వస్తే తన తాళిబొట్టు కాపాడుకోవడం కోసం ఏ భార్య అయినా భర్తకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడ కోడలు కూడా అలాగే భావించి తన భర్తను దూరం పెడుతుంది. అయితే ఈ నాటకం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరు. కొడుకును, కోడలిని విడదీసి, ఆస్తిని కాజేయాల నేది ఆ అత్తగారి పన్నాగం. అత్తగారు ఆడుతున్నది నాటకమని, ఆమె నాగదేవత కాదు నాగుపాము అని మామ‌గారి ద్వారా కోడలు తెలుసుకుంటుంది. తన అత్తగారి అసలు రంగు బయటపడటంతో, ఆమెపై తిరిగి అదే రీతిలో యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకుంటుంది. అత్తగారు ఆడిన ఆటతోనే ఆమెను ఓడించడానికి కోడలు సిద్ధమవుతుంది. కోడలు కేవలం బాధపడటంతో ఆగిపోలేదు. ‘టిట్ ఫర్ టాట్‌’ అన్నట్లుగా అత్తగారి ఎత్తుగడలను చిత్తు చేస్తుంది. అత్తగారు తన కొడుకును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికి సిద్ధమైనట్లు నటించగా, కోడలు కూడా తనదైన శైలిలో అత్తగారి ప్రాణాలకు గండం ఉందని చెప్పి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో జరిగే సంభాషణలు ప్రేక్షకులలో నవ్వును, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. జయచిత్ర, మీనా అత్తా కోడళ్లుగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీకు అందిస్తున్నాం. చూసి ఆనందించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
2025 సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఎంపికైంది. తండేల్ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటించిన రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.  ఉత్తమ నటుడు  - నాగ చైతన్య (తండేల్‌) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌) ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్‌ షో  నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా - తండేల్‌ ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు  ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌ ఉత్తమ బాలల చిత్రం  - అనగనగనా ఉత్తమ దర్శకుడు  - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు - శివాజీ  ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక ఉత్తమ సంగీత దర్శకుడు  - మార్క్ కె రాబిన్‌ (దండోరా) ఉత్తమ నేపథ్య గాయకుడు  - అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయని  - సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ హాస్యనటుడు  - కృష్ణ తేజ  (జిగ్రీస్‌) ఉత్తమ బాలనటుడు -  రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో) ఉత్తమ కథా రచయిత  - గుణశేఖర్‌ (యుఫోరియా) ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి  ఉత్తమ గేయ రచయిత  - నందకిశోర్‌ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌)  ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర  ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి ఛాంపియన్‌ ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ అఖండ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - చాంపియన్‌ - చంద్రకాంత్‌ ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ - 23 ఉత్తమ మేల్‌ యాక్టర్‌ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు) స్పెషల్‌ జ్యూరీ హీరో - రోషన్‌ (చాంపియన్‌)
  నిన్న థియేటర్స్ లో వచ్చిన సరస్వతి సినిమా ఎలా ఉంది! కథ ఏంటి ఈ విషయంలో  వైరల్ గా నిలవడానికి కారణం  సిల్వర్ స్క్రీన్ పై నిన్న 'సర్వస్వతి'(S. saraswathi)మూవీతో ఎంట్రీ ఇచ్చింది 'వరలక్ష్మి శరత్ కుమార్'.(Varalaxmi sarathkumar)స్వీయ దర్శకత్వంలో తెరకెక్కగా,  డైరెక్షన్ సూపర్ గా ఉందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తుంది. నటిగా కూడా ఇంకో మెట్టు పైకి ఎదిగిందని, ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక, రంగం ఫేమ్ జీవా. ఓజి కిషోర్ కూడా తమ నటనతో మెస్మరైజ్ చేసారనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి మూవీపై ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా నిలిచాయి. అవేంటో చూద్దాం. సరస్వతి మూవీకి బుర్రా సాయి మాధవ్(Saimadhav Burra)'కథ' ని అందించడం జరిగింది. ఈ మేరకు టైటిల్ కార్డులో మేకర్స్ ప్రస్తావించారు. రీసెంట్ గా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తు 'సరస్వతి' నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టుగా మార్చేసుకున్నారు. ఒక రంగంగా  కథని మానభంగం చేసారు. నాది రివెంజ్ డ్రామా కాదు. నా సోల్, నా కథ వేరని తెలిపాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ తో పాటు మూవీ లవర్స్ లో వైరల్ గా నిలిచాయి. సాయి మాధవ్ ఎన్నో అగ్ర చిత్రాలకి మాటలని అందించాడు. బాలకృష్ణ(Balakrishna),వరలక్ష్మి శరత్ కుమార్ అన్నా చెల్లెళ్లు గా కనపడిన వీర సింహారెడ్డికి సాయిమాధవ్ నే డైలాగ్ రైటర్.   Also read: mension house mallesh movie review: మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ రివ్యూ   సరస్వతి కథ విషయానికి వస్తే సరస్వతిని పదకొండేళ్ల వయసులో ఫిఫ్టీ ఎబోవ్ ఏజ్ ఉన్న ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేస్తారు. సరస్వతి తల్లితండ్రులని కూడా చంపేస్తారు. యుక్త వయసులో పెళ్లి చేసుకున్నాక తన భర్తతో శారీరకంగా కలవడానికి భయపడుతుంది. దీంతో భర్తకి నిజం చెప్పడంతో అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులని చంపమని సరస్వతికి అండగా ఉంటాడు.ఆ ముగ్గుర్ని సరస్వతి చంపేస్తుంది.ఈ కేసులో చట్టం నుంచి తప్పించుకోవడానికి తనకి 'ఫాంటసీ ఫాండ్ డిస్ ఆర్డర్' అనే అరుదైన వ్యాధి ఉందని సరస్వతి నమ్మిస్తుంది. సిన్సియర్ లాయర్ రామానుజాన్ని(ప్రకాష్ రాజ్) కూడా నమ్మించి మర్డర్స్ కేసు లేకుండా చేసుకుంటుంది. ఇక మూవీ టైటిల్ కార్డ్స్ లో కథ విస్తరణ అని వరలక్ష్మి శరత్ కుమార్ పేరు కనిపించడం కొసమెరుపు. చివరి నిమిషంలో ఎస్ సరస్వతి గా పేరు మార్చడం జరిగింది.    
సినిమా పేరు: మెన్షన్ హౌస్ మల్లేష్ న‌టీన‌టులు: శ్రీనాధ్ మాగంటి, గాయత్రి రమణ, కామాక్షి భాస్కర్ల, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్, సాయి ప్రసన్న  తదితరులు సినిమాటోగ్ర‌ఫీ: అమ్మముత్తు. కే  ఎడిటింగ్: గారీ బి హెచ్  మ్యూజిక్: సురేష్ బొబ్బిలి  నిర్మాత‌:రాజేష్ కుమార్   రిలీజ్ :మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్: కనకమేడల ప్రొడక్షన్స్  రచన,దర్శకత్వం: బాల సతీష్  రిలీజ్ డేట్ : మార్చి 6 , 2026  సెల్యులాయిడ్ పై ఈ రోజు విభిన్నమైన టైటిల్ తో తెరకెక్కిన 'మెన్షన్ హౌస్ మల్లేష్' ప్రత్యక్షమయ్యింది. ప్రచార చిత్రాలతో క్రేజ్ ఏర్పడటం, అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ రిలీజ్ చేయడంతో మూవీ లవర్స్, ప్రేక్షకుల కళ్ళు మెన్షన్ హౌస్ పై పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ తెలంగాణలోని యాదగిరి గుట్ట పరిసర ప్రాంతానికి చెందిన మల్లేష్( శ్రీనాధ్) చిన్నప్పట్నుంచి ఆల్కహాల్ తాగుతూ పెరిగి పెద్దవుతాడు. ఉదయాన్నే పరగడుపున మందు తాగందే బ్రెష్ కూడా చేయని స్వభావం. అలా అని చెడ్డవాడేం కాదు. మంచోడే. కానీ ఆవేశపరుడు. తన ఊరి పటేల్(రాజేష్ ) కి మల్లేష్ కి గొడవ. ఒకరంటే ఒకరికి అసలు పడదు. మల్లేష్ కి జ్యోతి (గాయత్రి రమణ) తో పెళ్లి జరుగుతుంది. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ ఆ ఇద్దరి మధ్య 'కార్యం' మాత్రం జరగదు. ఆ ఇద్దరి మధ్య 'కార్యం' జరగకపోవడానికి కారణం ఏంటి? చివరకి జరిగిందా లేదా! మల్లేష్,పటేల్ కి మధ్య గొడవ ఎందుకు? పటేల్ భార్య పద్మ ( కామాక్షి భాస్కర్ల) పోషించిన క్యారక్టర్ ఏంటి? వంటి పలు ప్రశ్నల సమూహారమే మెన్షన్ హౌస్ మల్లేష్ ఎనాలసిస్  ఎలాంటి హడావిడి, గందరగోళం లేకుండా సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తెలంగాణ పల్లె వాతావరణం, మాండలికం మెరిసింది. సింపుల్ కథ అయినా పకడ్బందీ స్క్రీన్ ప్లే తో  బాగానే నడిపించారు. నడిపించారు అని ఎందుకు అంటున్నామంటే, కథనం విషయంలో ముందు కెళ్ళి, మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కానీ చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ మెంట్ పక్కా. . ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మొదటి పావుగంట రొటీన్ గానే ఉంటుంది. సీన్స్ కూడా చాలా సినిమాల్లో వచ్చినవే. కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్ తో కథలో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది. మల్లేష్, జ్యోతి పెళ్లి చూపుల సీన్ తో పాటు జ్యోతి క్యారక్టర్ తో వచ్చిన సీన్స్ అన్ని బాగున్నాయి. పటేల్, మల్లేష్ గొడవల సీన్ రొటీన్. మల్లేష్ అతని తల్లి మధ్య వచ్చిన సీన్స్ మెప్పిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో మల్లేష్, జ్యోతి  కలవడానికి స్నేహితులు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. కానీ ఈ విషయంలో మరింత డీప్ గా వెళ్ళాలి. కానీ వెళ్ళలేదు. మల్లేష్ తల్లిని చంపడం కథని సాగ తియ్యడానికే చేసినట్టుగా ఉంది. మల్లేష్ తండ్రి రెండు ఫ్లాష్ బ్యాక్ లు నవ్వులు పూయిస్తాయి. మల్లేష్, జ్యోతి బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు పక్కింట్లోని ఓల్డ్ మాన్ ఓల్డ్ సాంగ్స్ ని వింటుండే ఎపిసోడ్ బాగా పేలింది. పోలీస్ స్టేషన్ లోని  పద్మ సీన్ కూడా అంతే.  ఒక లెవల్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి సినిమా చివర దాకా ఆమె క్యారక్టర్ ని అదే టెంపోతో హైలెట్ గా చేసి, మల్లేష్, జ్యోతి కార్యానికి కావాల్సిన చిట్కాలని, తాను చేయడంతో పాటు తన భర్త పటేల్ తో చేసి ఉంటే సినిమా హిట్ స్థాయి పెరిగేది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నా మల్లేష్, జ్యోతి మధ్య ఇన్నాళ్లు కార్యం కాకపోవడానికి చివరలో కార్యం అవ్వడానికి గల బలమైన కారణాన్ని చెప్పాల్సింది. నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు  మల్లేష్ గా శ్రీనాధ్ పెర్ఫార్మ్ పెద్ద హీరో స్థాయిలో చాలా మెచ్యూర్డ్ గా ఉంది. మంచి అవకాశాలు వస్తే  తెలుగు చిత్రసీమలో తనదైన హవాని కొనసాగించడం పక్కా. హీరోయిన్ గా చేసిన గాయత్రి రమణ కూడా మనకి తెలిసిన పక్కింటి అమ్మాయిలా తన క్యారక్టర్ పరిధి మేరకు చాలా ఈజీగా చేసింది. కామాక్షి భాస్కర్ల కి ఎక్కువ స్కోప్ లేకపోయినా, కనపడినంత సేపు అద్భుతమైన పెర్ ఫార్మ్ ప్రదర్శించి సినిమాకి నిండుతనాన్ని తెచ్చింది. మురళిధర్ గౌడ్ మరోసారి తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. రాజ్ కుమార్  కసిరెడ్డి పెర్ఫార్మ్ బాగున్నా రొటీన్ యాక్షన్ లాగా ఉంది. పటేల్ గా చేసిన రాజేష్ ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలతో బిజీ అవ్వడం ఖాయం. అంతలా సెటిల్డ్ పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన వారు కూడా పర్లేదు. బాల సతీష్ దర్శకుడిగా సక్సెస్ అయినా, రచయితగా మాత్రం తడడ్డాడు. కథ టెంపోకి తగట్టుగా సీన్స్ రాలేదు. సురేష్ బొబ్బిలి తన బ్యాక్ గ్రౌడ్ స్కోర్, సాంగ్స్ తో సరికొత్త జీవాన్ని పోసాడు. ఫొటోగ్రఫీ  సూపర్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం వల్ల  నిర్మాణ విలువల్లో భారీ తనం లేకపోయినా బాగున్నాయని అనిపిస్తాయి. టోటల్ గా  మెన్షన్ హౌస్ మల్లేష్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నటీనటుల పెర్ ఫార్మెన్స్, డైరెక్షన్ బాగుంది.  కథ, కథనం సో సో..  బలాలు  1 .మల్లేష్, జ్యోతి క్యారెక్టర్స్ డిజైన్  2 . పటేల్, మల్లేష్ మధ్య వచ్చిన సీన్స్  3 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్   4 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్  బలహీనతలు  1 .కథనంలో పట్టు లేకపోవడం  2 .ఫస్ట్ హాఫ్   3 . ఎంటర్ టైన్మెంట్  4 .సాగతీత సీన్స్  రేటింగ్ 2 .5 /5                                                                                                            అరుణాచలం 
ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి.  వీటిని రిలేషన్ లో రెడ్ ప్లాగ్స్ అని చెప్పవచ్చు. వీటిని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.  ఇలాంటివి ఉన్నప్పుడు వాటి గురించి నిర్లక్ష్యం చేయడం లేదా, పట్టించుకోకుండా ఉండటం వంటివి జరిగితే.. చాలా నష్టపోతారు.  అందుకే ఈ పరిస్థితులు ఉన్నవారు రిలేషన్లో ఉన్నవారితో ఓపెన్ గా మాట్లాడాలి.  సమస్యను పరిష్కరించుకోవాలి.  అయితే రిలేషన్ ను దెబ్బతీసే ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో తెలుసుకుంటే.. అధిక నియంత్రణ.. రిలేషన్ లో భాగస్వామి మీ ప్రతి కదలికను పర్యవేక్షిస్తే, స్నేహితులను కలవకుండా నిరోధిస్తే లేదా ప్రతి నిర్ణయంలో జోక్యం చేసుకుంటే, అది ఆరోగ్యకరమైన సంబంధం కాదు. పదే పదే అబద్ధం చెప్పడం.. చిన్న చిన్న అబద్ధాలు కూడా సంబంధానికి పునాదిని బలహీనపరుస్తాయి. పదే పదే అబద్దాలు చెప్పడం,  అది బయటకు స్పష్టంగా కనిపిస్తున్నా తనకేమీ సంబందం లేదన్నట్టు ఉండటం రిలేషన్ ను దెబ్బతీస్తుంది. కోపంతో అవమానించడం.. వాదన సమయంలో వ్యక్తిగత దాడులు, ఆధిపత్యం చూపించడం లేదా అవమానం చేయడం వంటివి చేస్తే అది భాగస్వామి వ్యక్తిత్వం సరిగా లేదని చెబుతుంది. గ్యాస్‌లైటింగ్ మీ భాగస్వామి మీ భావాలను తప్పుగా నిరూపించడానికి ప్రయత్నించి మిమ్మల్ని నిందించినప్పుడు. ఎలాంటి సమస్య, లేదా తప్పు లేకపోయినా తప్పును క్రియేట్ చేసి నిందించాలని,  తప్పుగా నిరూపించాలని చూస్తే ఆ భాగస్వామి సరైన వారు కాదని అర్థం. నమ్మకం లేకపోవడం సంబంధంలో నమ్మకం చాలా అవసరం. ఎప్పుడూ  సందేహంగా, అనుమానంగా  ఉండటం వల్ల సంబంధం నెమ్మదిగా నాశనం అవుతుంది. భావోద్వేగ మద్దతు లేకపోవడం.. కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతు ఇవ్వకపోతే, ఆ సంబంధం అసంపూర్ణంగా ఉంటుంది. భావోద్వేగ మద్దతు లోపించినప్పుడు ఆ బంధాన్ని అర్థమే ఉండదు. భవిష్యత్తు  గురించి ఆలోచన లేకపోవడం.. భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా వివాహం తర్వాత ఈ ఆలోచన మరింత ఎక్కువగా ఉంటుంది.  కానీ చాలామందికి భవిష్యత్తు గురించి కానీ,  వర్తమానం గురించి కానీ ఎలాంటి ఆలోచన,  ఎలాంటి చింత ఉండదు.  పూర్తీగా నిర్గక్ష్యంగా ఉంటారు.  ఇలాంటి వారితో జీవితం ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు.                                       *రూపశ్రీ.
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ, మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి: పరీక్షలు మీ మేధస్సును పరీక్షించేవి మాత్రమే, మీ జీవితాన్ని శాసించేవి కావు. ఈ ఒత్తిడిని జయించి, పరీక్షల్లో అద్భుతంగా రాణించడానికి నిపుణులు చెబుతున్న సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు ఒత్తిడిని తగ్గించుకోవాలి? (Why should we?) ఒత్తిడి అనేది కేవలం మానసికమైనదే కాదు, అది మన శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి: మన మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడే సమాచారాన్ని చక్కగా "రీకలెక్షన్" (Recollection) చేయగలదు. ఆందోళనలో ఉంటే తెలిసిన విషయాలు కూడా గుర్తుకురావు. ఆరోగ్యం కోసం: విపరీతమైన స్ట్రెస్ వల్ల కొంతమంది విద్యార్థులకు జ్వరం రావడం, వాంతులు అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెరుగైన ఫలితాల కోసం: మనసు ప్రశాంతంగా ఉంచుకుని పరీక్ష రాస్తే, మీ సాధారణ పర్ఫార్మెన్స్ కంటే 10% నుండి 30% వరకు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఏమి చేయకూడదు? (What NOT to do!) చాలా మంది విద్యార్థులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. అవి ఏంటంటే: అతిగా ఆశించడం: "నాకు ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ రావాలి" లేదా "470 కి 470 రావాలి" అని పరీక్షకు వెళ్లే ముందు టార్గెట్లు పెట్టుకోకండి. ఈ ఆలోచనలే మిమ్మల్ని టెన్షన్ పెడతాయి. పోలికలు వద్దు: మీ అన్నయ్యకో, పక్కింటి అబ్బాయికో వచ్చిన మార్కులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఇలాంటి ప్రెజర్ పెట్టకూడదు. మార్కులు లెక్కపెట్టడం: క్వశ్చన్ పేపర్ చూడగానే "నాకు ఇన్ని మార్కులు వస్తాయి, ఇన్ని రావు" అని లెక్కలు వేయకండి. దీనివల్ల కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. పక్కవారిని చూడటం: ఎగ్జామ్ హాల్‌ లో పక్కవాడు ఎన్ని అదనపు పేపర్లు (Additionals) తీసుకున్నాడు అనేది మీకు అనవసరం. అది చూస్తే మీ బ్రెయిన్ డైవర్ట్ అయి ఒత్తిడి పెరుగుతుంది. ఎలా సిద్ధమవ్వాలి? విజేతల సూత్రాలు (How to Prepare?) రాతపూర్వక ప్రాక్టీస్: కేవలం నోటితో చదవడం కంటే, రాస్తూ చదవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. "ఒకసారి రాయడం.. పదిసార్లు చదవడంతో సమానం". సమయ పాలన (Time Planning): ఏ సెక్షన్ కి ఎంత సమయం కేటాయించాలి? (2 మార్కుల ప్రశ్నలకు ఎంత? 10 మార్కుల ప్రశ్నలకు ఎంత?) అనేది ముందే ప్లాన్ చేసుకోండి. దీనివల్ల చివరి నిమిషంలో హడావిడి ఉండదు. పాజిటివ్ థింకింగ్: "నేను చదివింది బాగా రాస్తాను, తెలియని ప్రశ్నలు వస్తే ఊహించి రాస్తాను" అనే క్లియర్ పిక్చర్ తో పరీక్ష హాల్ లోకి అడుగు పెట్టండి. ఏకాగ్రత: పరీక్ష రాస్తున్న ఆ రెండున్నర గంటలు ప్రపంచాన్ని మర్చిపోయి, కేవలం మీ పేపర్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: నేను బాగా చదివాను, కానీ పరీక్ష హాల్ లోకి వెళ్ళగానే అంతా మర్చిపోతున్నాను. ఎందుకు?  జవాబు: దీనికి ప్రధాన కారణం "ఆలోచనల ఒత్తిడి". పరీక్ష ఫలితం ఎలా ఉంటుందో, మార్కులు ఎన్ని వస్తాయో అని అతిగా ఆలోచించడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది. ఫలితం గురించి కాకుండా, కేవలం ఆన్సర్ రాయడం మీద దృష్టి పెడితే మర్చిపోయే సమస్య ఉండదు. ప్రశ్న: పరీక్షల సమయంలో పేరెంట్స్ పాత్ర ఏమిటి?  జవాబు: పేరెంట్స్ పిల్లలకు హోమ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారిని భయపెట్టకుండా, వారిలో ధైర్యాన్ని నింపాలి. కార్పొరేట్ సంస్థలు పెట్టే ప్రెజర్ నుంచి పిల్లలను కాపాడాలి. గుర్తుంచుకోండి, పరీక్షలు మీ జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రశాంతమైన మనసుతో, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే విజయం మీదే. ఆల్ ది బెస్ట్! మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య మరియు విద్యా విషయాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ ని సందర్శించండి! మీరు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలి? జ్ఞాపకశక్తిని ఎలా పెంచుకోవాలి? వంటి మరిన్ని చిట్కాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి. మీ విజయ ప్రయాణంలో మేము తోడుంటాం! (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సంబంధాలు చూసేటప్పుడు, వారి మనసులోని మాటను గమనించకుండా తొందరపడుతుంటారు. దీనివల్ల పెళ్లి కుదరకపోవడమే కాకుండా, పిల్లల మనసుపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు, చేయకూడని పొరపాట్ల గురించి  కాకతీయ మ్యారేజ్ డైరెక్టర్ నవీనా యలమంచి గారు చెప్పిన విషయాలను ఈ Video Link లింక్ క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (Why Should We?) పెళ్లి సంబంధం చూసే ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, అది కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఎదుటి కుటుంబం యొక్క శ్రమను, ఆశలను కూడా నీరుగారుస్తుంది. పిల్లలు సిద్ధంగా లేనప్పుడు వారిపై ఒత్తిడి తెస్తే, వారు ఎదుటి వారితో "నాకు ఇష్టం లేదు" అని చెప్పడం వల్ల రెండు కుటుంబాల మధ్య అనవసరమైన మనస్పర్థలు ఏర్పడతాయి. సరైన అవగాహన లేకుండా సంబంధాలు చూస్తే, భవిష్యత్తులో పిల్లలు మరే సంబంధాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు: బలవంతం చేయడం: పిల్లలు పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వారిని బలవంతంగా సంబంధాలు చూడమని ఫోర్స్ చేయకూడదు. ముందస్తు చర్చ లేకపోవడం: ఇంట్లో పిల్లలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా బయట సంబంధాలు వెతకడం వల్ల ఫలితం ఉండదు. భయాలను విస్మరించడం: "నా ఫ్రెండ్స్ ఎవరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరు" లేదా "అపరిచిత వ్యక్తితో జీవితం ఎలా ఉంటుంది?" అనే పిల్లల భయాలను కొట్టిపారేయకండి. వారి భయాలు చాలా జెన్యూన్ అయి ఉండవచ్చు. పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు పిల్లలను పెళ్లికి సిద్ధం చేయడానికి ఈ పద్ధతులు పాటించండి: కౌన్సెలింగ్ మరియు మాటామంతి: పిల్లలు మీతో ఓపెన్ అవ్వనప్పుడు, వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఓపికగా ప్రయత్నించండి లేదా నిపుణుల సహాయం తీసుకోండి. అవకాశం ఇవ్వండి: పిల్లలు ఎదుటి వారితో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, కనీసం ఒకరిద్దరిని కలిసేలా ప్రోత్సహించండి. సరైన వ్యక్తి (Right Person) తారసపడినప్పుడు వారిలోని భయాలు సహజంగానే తొలగిపోతాయి. ఇంటి గుట్టు ముఖ్యం: ముందుగా మీ ఇంట్లో చర్చలు జరిపి, పిల్లలను ఒప్పించిన తర్వాతే పబ్లిక్‌గా సంబంధాలు చూస్తున్నామని చెప్పడం గౌరవప్రదంగా ఉంటుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: పిల్లలు సంబంధం చూడటానికి వచ్చినప్పుడు 'ఐ యామ్ నాట్ రెడీ' అని ఎందుకు అంటారు?  జవాబు: దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వారు కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకోవచ్చు లేదా అపరిచిత వ్యక్తులతో ప్రేమను ఎలా పంచుకోవాలో తెలియక భయపడవచ్చు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కూడా వారు ఇలాంటి సమాధానాలు ఇస్తుంటారు. ప్రశ్న: పిల్లల భయాలు ఎప్పుడు తొలగిపోతాయి?  జవాబు: అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, మరేదైనా సరే.. ఒక సరైన వ్యక్తిని కలిసినప్పుడు, వారితో మాటలు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి సందేహాలు, భయాలు క్లియర్ అవుతాయి. అంతవరకు మనం ఎన్ని చెప్పినా వారి భయం తగ్గదు. ప్రశ్న: ఒక సంబంధం తప్పిపోతే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?  జవాబు: ఒకసారి చేదు అనుభవం ఎదురైతే, తర్వాత వచ్చే మంచి సంబంధాలను కూడా పిల్లలు వద్దని తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో పరిస్థితిని సెట్ చేసుకున్నాకే బయట సంబంధాలు చూడాలి. పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారి భయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే అరేంజ్డ్ మ్యారేజ్ విజయవంతం అవుతుంది. వారిని బలవంతం చేయడం కంటే, వారికి నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు రిలేషన్‌షిప్ సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సందర్శించండి! 👉మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [www.youtube.com/@Naveenacolumn ] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది.   సైన్స్ కూడా మహిళలు  పురుషుల కంటే ఎక్కువ  అలసిపోతారని,  వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది.  ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే..   మల్టీ టాస్కింగ్..  మెదడు సంక్లిష్టత.. నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి,  తిరిగి శక్తిని  నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు.  ఇల్లు, పిల్లలు, ఉద్యోగం,  భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును  తీవ్రంగా,  ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది. హార్మోన్ల మార్పులు.. జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్  వంటి సమయాలలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గర్భం.. గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం,  శారీరక మార్పులు అలసటను పెంచుతాయి. మెనోపాజ్.  మెనోపాజ్  దశలో వేడి ఆవిర్లు,  చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.  దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత.. పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి,  రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల  ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా,  ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం,  ఒత్తిడి.. సామాజిక,  కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి,  ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు..  గుండె జబ్బులు, ఆందోళన,  నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్,  ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
                           ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక పండ్లలో కొన్ని మనకు తెలియని రహస్యాలను దాచుకుంటాయి. అలాంటి ఒక అరుదైన మరియు శక్తివంతమైన పండే 'బిహి' (Behi). దీనిని ఇంగ్లీష్‌ లో 'క్విన్స్' (Quince) అని, సంస్కృతంలో 'అమృతఫల' అని, తెలుగులో 'సీమ దానిమ్మ' అని పిలుస్తారు. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండు, పర్షియా (నేటి ఇరాన్) నుండి గ్రీస్, రోమ్ మరియు మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపించింది. ప్రాచీన గ్రీకులు దీనిని 'ప్రేమ మరియు సంతాన సాఫల్యతకు' (Love and Fertility) చిహ్నంగా భావించేవారు. ఈ రోజు మనం ఈ 'బంగారు ఆపిల్' వంటి బిహి పండు విశిష్టతలను గురించి Dr SGV Satya (Unani Specialist) ఈ Video లింక్ క్లిక్ చేసి వివరంగా తెలుసుకుందాం. మనం ఈ పండును ఎందుకు తీసుకోవాలి? (Why should we?)  బిహి పండు కేవలం రుచికరమైనదే కాదు, ఇది ఒక పోషకాల గని. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి గల ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి: సంతాన సాఫల్యత మరియు పురుషుల ఆరోగ్యం: మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను (Sperm Count) అమాంతం పెంచే అద్భుత గుణం దీనికి ఉంది. అందుకే పురాతన కాలంలో పెళ్లికూతుళ్లకు పెళ్లికి ముందు దీనిని ఇచ్చే ఆనవాయితీ ఉండేది. బరువు తగ్గడానికి మరియు మధుమేహానికి: ఇది తక్కువ క్యాలరీలు ఉండి, పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ పేషెంట్లు, థైరాయిడ్ మరియు క్యాన్సర్ రోగులు కూడా దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుదల: ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం (Constipation) మరియు అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం: పొటాషియం, కాపర్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును (BP) అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి (Immunity): కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన 'జోషాంద' (Joshanda) కాడాలో బిహి గింజలను (Behi Dana) ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్‌గా వాడారు. ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడి బాడీని స్ట్రెంథన్ చేస్తుంది. ఎలా ఉపయోగించాలి? (How to use?) బిహి పండు నేరుగా తినడానికి చాలా పుల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు: మురబ్బా (Murabba): ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. బిహి మురబ్బా ఏ యునానీ మందుల షాపులోనైనా దొరుకుతుంది. తేనెతో కలిపి: డయాబెటిక్ పేషెంట్లు పంచదార పాకంలో చేసిన మురబ్బా కాకుండా, తేనెతో చేసిన దానిని ఎంచుకోవాలి. జెల్లీలు మరియు షర్బత్‌లు: దీనితో జెల్లీలు, జామ్‌లు లేదా 'షర్బతే బిహి' వంటి పానీయాలు తయారు చేసుకోవచ్చు. వంటల్లో: గ్రీస్ వంటి దేశాల్లో దీనిని నిమ్మరసంతో కలిపి ఉడికించి వంటల్లో వాడుతుంటారు. ఏమి చేయకూడదు? (What NOT to do?) ఈ పండు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి: నేరుగా ఎక్కువగా తినకండి: ఇది చాలా పుల్లగా ఉండటం వల్ల నేరుగా పండును ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహ రోగులు జాగ్రత్త: బయట దొరికే మురబ్బాలలో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేదా తాటి బెల్లంతో ఇంట్లోనే తయారు చేసుకున్న మురబ్బాను వాడటం శ్రేయస్కరం. అపరిమితంగా వద్దు: ఇది మన దేశీయ పండు కాదు కాబట్టి, రోజుకు ఒక చిన్న టీస్పూన్ మురబ్బా తీసుకుంటే సరిపోతుంది. అతిగా తీసుకోకూడదు. ప్రశ్నోత్తరాలు (Q&A): ప్రశ్న: బిహి పండు కేవలం మగవారికి మాత్రమే ఉపయోగపడుతుందా? సమాధానం: లేదు, ఇది అందరికీ ఆరోగ్యకరమైనది. అయితే పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది విశేషంగా పనిచేస్తుంది. ప్రశ్న: ఇది మార్కెట్‌లో దొరుకుతుందా? సమాధానం: పండు దొరకడం కష్టమైనా, 'బిహి మురబ్బా' రూపంలో యునానీ స్టోర్లలో సులభంగా లభిస్తుంది. ప్రశ్న: పిల్లలకు ఇది ఇవ్వవచ్చా? సమాధానం: అవును, రోగనిరోధక శక్తి పెంచడానికి తక్కువ మోతాదులో మురబ్బాను ఇవ్వవచ్చు. పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఈ బిహి పండు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్న సంతాన సమస్యలకు మరియు ఇమ్యూనిటీ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఈ 'అమృతఫలాన్ని' సరైన పద్ధతిలో తీసుకుని ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన పండ్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలలో చెవి అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది. మనం ప్రపంచంతో మమేకమవ్వడానికి, ఇతరుల మాటలు వినడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినికిడి శక్తి ఎంతో అవసరం. కానీ నేటి కాలంలో మనం మన చెవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ నిర్లక్ష్యం చివరకు మనల్ని శాశ్వత చెవుడు వైపు ఎలా నెడుతుందో, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి గారు పంచుకున్న కొన్ని కీలక విషయాలను ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం చెవుల ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? (Why Should We?) మన చెవి లోపల వినికిడికి సహాయపడే 'హెయిర్ సెల్స్' (Hair Cells) అనేవి ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే: శాశ్వత నష్టం: ఒకసారి ఈ హెయిర్ సెల్స్ దెబ్బతింటే, అవి మళ్ళీ తిరిగి రావు. మన శరీరంలోని ఇతర కణాలలాగా ఇవి మళ్ళీ పుట్టవు (Regeneration ఉండదు). వృత్తిపరమైన జీవితం: వినికిడి లోపం ఉంటే మీటింగ్‌లలో ఇతరులు చెప్పేది అర్థం కాదు, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగి మీ కెరీర్ దెబ్బతినవచ్చు. భారీ ఖర్చు: ఒకవేళ వినికిడి పూర్తిగా పోయి ఆపరేషన్ (Cochlear Implant) చేయించుకోవాల్సి వస్తే, ఒక్క చెవికి 7 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏం చేయకూడదు? (What Not To Do) నిరంతర శబ్దాలు: 24 గంటలూ బ్లూటూత్ హెడ్‌సెట్లు లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినకండి. దీనివల్ల హెయిర్ సెల్స్ అలసిపోయి (Fatigue) శాశ్వతంగా దెబ్బతింటాయి. నిర్లక్ష్యం: చిన్నపాటి వినికిడి లోపం ఉన్నా "ఏం కాదులే" అని వదిలేయకండి. స్క్రీనింగ్ చేయించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. సామాజిక భయం: కళ్ళద్దాలు పెట్టుకున్నట్లే, అవసరమైతే హియరింగ్ ఎయిడ్ (Hearing Aid) పెట్టుకోవడానికి వెనుకాడకండి. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో సమస్యను పెంచుకోవద్దు. దురలవాట్లు: ధూమపానం (Smoking) మరియు మద్యం అలవాటు వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి లోపలి కణాలు దెబ్బతింటాయి. చెవులను ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Ear Health) ఆరోగ్యకరమైన జీవనశైలి: డయాబెటిస్ (షుగర్), బీపీ మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవి పెరిగితే వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయి. వ్యాయామం: యోగా, ప్రాణాయామం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలయ్యి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు పరీక్షలు: చెవిలో బ్లాకేజ్ అనిపించినా, వినికిడి తగ్గినట్లు అనిపించినా వెంటనే 'ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ' లేదా 'ఎండోస్కోపీ' వంటి పరీక్షలు చేయించుకోవాలి. నీటి జాగ్రత్తలు: స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీరు వెళ్తే చెవిలోని గుబిలి (Wax) ఉబ్బిపోయి నొప్పి మరియు బ్లాకేజ్‌కి దారితీస్తుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: వయసు పెరగడం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మందులతో తగ్గించవచ్చా?  జవాబు: దీనిని 'ప్రెస్ బ్రాయకోసిస్' అంటారు. దీనికి మందులు లేదా ఆపరేషన్లు ఉండవు. ప్రివెన్షన్ (ముందస్తు జాగ్రత్త) మాత్రమే మార్గం. సమస్య ఎక్కువైతే హియరింగ్ ఎయిడ్ వాడాలి. ప్రశ్న: పిల్లల్లో చెవి నొప్పి, బ్లాకేజ్ ఎందుకు వస్తుంది?  జవాబు: పిల్లల్లో జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చెవిలోకి చేరి బ్లాకేజ్ ఏర్పడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే 'గ్లూ ఇయర్' (Glue Ear) గా మారి వినికిడి లోపం రావచ్చు. వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రశ్న: చెవిలో గుబిలి (Wax) ఉండటం తప్పా?  జవాబు: గుబిలి అనేది ఒక రక్షణ కవచం లాంటిది. కానీ అది ఎక్కువై ఇయర్ కెనాల్‌ను బ్లాక్ చేసినప్పుడు మాత్రమే సమస్య అవుతుంది. అప్పుడు డాక్టర్ ద్వారా క్లీన్ చేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా 👉 (TeluguOne Health YouTube Channel) ని సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!