LATEST NEWS
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ   ఖండించారు. ఏపీ రాజధాని అమరావతి మహిళల పై  వైసీపీ అధినేత జగన్ సొంత మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై రాయపాటి  శైలజ  తీవ్రస్థాయిలో స్పందించారు.  సోమవారం(జూన్ 9)   విజయవాడలో మీడియాతో  మాట్లాడిన ఆమె  రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా ఆ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై   పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు.  జర్నలిస్టు, ఎనలిస్టు ముసుగులో నీచంగా మాట్లాడతారా?  అని ధ్వజమొత్తారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో  నోటికొచ్చినట్ల మాట్లాడితే కుదరదన్నారు. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని నిలదీశారు. ఆ చానెల్ లో ప్రసారం చేసిన డిబేట్ కు సంబంధించి మహిళా కమిషన్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్న రాయపాటి శైలజ.. రాజకీయ కారణాలతో ఒక ప్రాంతంపై నీచమైన ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. అమరావతి ప్రాంత మహిళలు త్యాగం చేసి... గత ఐదేళ్లుగా అనేక కష్టాలు, నష్టాలు పడ్డారన్నారు.  ప్రభుత్వం మారిన తరువాత అమ రావతి అభివృద్ధి చెందుతోందనీ,  ఇది చూసి ఓర్వలేక అమరావతి మహిళలపై నీచ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.  అటువంటి వ్యాఖ్యలు చేసిన వారు, చేయించిన వారు అందరూ శిక్షార్హులేనన్నారు.  రాజకీయ ముసుగులో నడిపే అటువంటి చానల్స్ ను రద్దు చేయాలన్నారు.  జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్‌కు లేఖ రాసి ఆ ఛానల్ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మహిళా కమిషన్‌కు ఉన్న అధికార పరిధిలో తమ‌వంతు చర్యలు ఉంటాయని రాయపాటి శైలజ స్పష్టం చేశారు  
  అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు. మహిళల ఆత్మాభిమానాల‌పై దాడి చేయడం గత వైసీపీ ఐదేళ్లుగా సాధారణం అయ్యిందని, మహిళలను రాజకీయ ముసుగులో కొన్ని‌ మీడియా ఛానళ్లు తిట్టిస్తున్నాయని, ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు. జర్నలిస్టు అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా ఆమె ప్రశ్నించారు.  జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయ కోణంలో, అనుకూల ఛానెల్ ఉందని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. గుంటూరులో 150 యూనివర్సిటీల్లో సెక్స్ వర్కర్స్ ఉన్నారని వాస్తవాలు తెలియకుండా ఎలా మాట్లాడుతారని ఛైర్ పర్సన్ ప్రశ్నించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తలో ఎక్కడా కూడా ప్రాంతం పేరు లేదు, అలాంటిది జర్నలిస్టు అయ్యుండి ఒక ప్రాంత మహిళలను కించపరిచే విధంగా మాట్లాడం సరికాదని ఆమె హెచ్చరించారు. చదువుకున్న జర్నలిస్టుగా మహిళలను అవమానించడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళ్ళారు.ఇంతవరకు ముఖ్యమంత్రి  ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా.. ఎప్పుడు అధిష్టానం పెద్దలను కలిసినా మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించినట్లు చెప్పుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పడు ఎట్ట కేలకు  ఆ క్రతువు  సగం పూర్తయింది.  మిగిలిన సగం ఎప్పుడన్నది పక్కన పెడితే..  ఇప్పడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది  మాత్రం అందుకోసం కాదు.  మంత్రి పదవులు ఇచ్చిన ముగ్గురు కొత్త మంత్రుల శాఖల కేటాయింపు గురించి  అధిష్టానం పెద్దలతో చర్చించేందుకు అందుకు అదనంగా.. మంత్రివర విస్తరణ బృహత్ ప్రణాళికకు సమాంతరంగా సాగు తూ వస్తున్న  హాఫ్ ఫినిష్ డ్ పీసీసీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు చెపుతున్నారు. అలాగే.. పనిలో పనిగా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై ఏర్పాటు చేయ తలపెట్టిన బహిరంగ సభల విషయం ఆదిస్థానంతో చర్చించి, సభలు ఎప్పుడు, ఎక్కడ పెట్టాలో నిర్ణయించేందు కోసమూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినట్లు చెపుతున్నారు.   ఎందుకోసం అయినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ శ్రీకారం చేసిన రోజు నుంచి ఈరోజు వరకు 46 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చారు. మరో నాలుగు రౌండ్లు కొట్టి వస్తే, హాఫ్ సెంచరీకి చేరు కుంటారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి రావడం పెద్ద విషయం విశేషం కాదు. అలాగే..  కొన్ని కీలక విషయాల్లో అధిష్టానంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొత్త విషయం కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కోట్ల, వైఎస్సార్ వంటి ఉద్దండ కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి రావడం, ఢిల్లీ కనుసన్నల్లో పని చేయడం, తరచూ ఢిల్లీ చక్కర్లు కొట్టడం ఉన్నదే. అయితే ఇప్పడు ఆ ఫ్రీక్వెన్సీ పెరిగింది. గతంలో ముఖ్యమంత్రులు రెండు మూడు నెలలకు ఒప్కసారి ఢిల్లీ వెళ్లి వస్తే..  ఇప్పడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెలలోనే రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్లి వస్తున్నారు. అదలా ఉంటే..  ముందు ముందు ఈ  జోరు ఇంకా పెరుగుతుందని అంటున్నారు. తెలంగాణను రోల్ మోడల్ గా చూపించి, దేశం మొత్తంలో పూర్వ వైభవ స్థితిని పొందే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ముందు ముందు  రాష్ట్ర పార్టీ వ్యవహరాల్లోనే కాకుండా  పాలనా వ్యవహారాల్లోనూ మరింత క్రియాశీల పాత్రను పోషించ వచ్చని అంటున్నారు. ఇప్పటికే  రాహుల్ గాంధీ పలు సందర్భాలలో, పలు వేదికల నుంచి, కులగణన ఎస్సీ వర్గీకరణ విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా పేర్కొంటున్నారు.చివరకు.. ఈ మధ్యనే మొదలు పెట్టిన  బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ  కులగణనకు తెలంగాణ  మోడల్ ను ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. అందుకే.. మంత్రి వర్గ విస్తరణలో, రాష్ట్రంలో పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న  రెడ్డి సామాజిక వర్గాన్ని  పూర్తిగా పక్కన పెట్టి, బీసీ, ఎస్సీ లకు మాత్రమే అవకాశం కల్పించారని అంటున్నారు.ఈ పరిణామాలను గమనిస్తే, ప్రభుత్వం రోజు వారీ వ్యవహారాల్లోనూ  ఢిల్లీ పెత్తనం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.   నిజానికి  ఇప్పటికే  ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల  ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పరిపాలన వ్యవరాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం విషయంలో ఆమె నేరుగా సెక్రటేరియట్ కు వెళ్లి, మంత్రులతో సమావేశాలు నిర్వహించడం వివాదాస్పమైంది. అలాగే.. యూనివర్సిటీ ఉపాధ్యయ, విద్యార్ధి సంఘాలతో చర్చలు జరపడాన్ని కూడా  విపక్షాలు తప్పు పట్టాయి. మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాయి. విపక్షాలు విమర్శించడమే కాదు..  స్వపక్షంలోనూ లుకలుకలు వినిపించాయి. మీనాక్షి గీత దాతుతున్నారని అధికార పార్టీ నేతలు గుసగుసలు పోయారు.   అలాగే..  తాజా మంత్రివర్గ విస్తరణలోనూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు,ఇతర నేతలను పలుమార్లు ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపింది. చివరకు.. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలను పక్కన పెట్టి మీనాక్షి స్వయంగా  నిర్వహించిన సమీక్షల అదారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగిందని అంటున్నారు. అలాగే..  ముఖ్య మంత్రి సహా రాష్ట్ర నాయకులు చేసిన  సి ..ఫార్సులను బుట్ట దాఖలు చేసి,   రాహుల్ గాంధీ కోటాలో ఒకరికి, ఖర్గే ఖాతాలో ఇద్దరికీ మంత్రి పదవులు ఇచ్చినట్లు చెపుతున్నారు. తద్వారా ఇక అంతా ఢిల్లీ నుంచే అన్న సంకేతాలు  అధిష్టానం  ఇచ్చిందంటున్నారు. అలాగే.. మంత్రివర్గ విస్తరణలో బెర్త దక్కని,ఆశావహులను బుజ్జగించి, దారిలోకి తెచ్చే విషయంలోనూ మీనాక్షి నటరాజన్ క్రియాశీల పాత్రను పోషించారు. ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రుల ప్రమేయం లేకుండా వ్యవహరాన్ని చక్క బెట్టారు. తద్వారా  అధిష్టానం దూతగా అధిష్టానం ఆశీస్సులతో ఆమె రాష్ట్ర పార్టీలోనే కాదు..  ప్రభుత్వంలోనూ, మరో పవర్ సెంటర్, (అధికార కేంద్రం) గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే  గతంలో విపక్షాలు చేసిన రబ్బర్ స్టాంప్  ఆరోపణకు బలం చేకురుతోందని అంటున్నారు.
  అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సాక్షి వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు.  గేటుకు తాళం వేయడంతో, గేటు ఎక్కి మహిళలు  నిరసన తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో  దినపత్రిక కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేశారు. డిబేట్‌లో రాజధాని మహిళలను ఉద్దేశించి వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.   తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ డిబేట్‌లో అసభ్య పదాలు వాడినప్పటికీ  క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చ గొట్టే విధంగా డిబేట్‌ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం, అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఉద్యమాలు మొదలయ్యాయి. ఆపై మహిళలు కోడిగుడ్లను విసిరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పటమట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.
మోహ‌న్ బాబు బేసిగ్గా చిత్తూరు వాసి. ఆయ‌న శ్రీ విద్యానికేత‌న్ సైతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల‌తో పాటు వాటి ఉప ఆల‌యాలు వెర‌సీ.. ఈ ప్రాంతంలో బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం కానీ ఈ సామాజిక వ‌ర్గం ప‌ట్ల గౌర‌వాభిమానాలు గానీ ఇత‌ర ప్రాంతాల‌తో పోలిస్తే ఒకింత‌ ఎక్కువ‌గానే ఉంటాయ్. తిరుమ‌లలాంటి ప‌విత్ర పుణ్య‌క్షేత్రం ఇంత‌టి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైందంటే అందుకు కార‌ణం ఈ బ్రాహ్మ‌ణుల నిష్టాగ‌రిష్ట‌త‌లే కార‌ణం అన్న భావనతో ఒకింత గౌరవం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.  కానీ..  ఈ ప్రాంతంలో తాను పుట్ట‌డం మాత్ర‌మే కాకుండా, ఇక్క‌డే త‌న విద్యా వ్య‌వ‌స్థ‌ను సైతం స్థాపించి, ఇంకా ఈ ప్రాంతంతో త‌న అనుబంధం పెంచుకుంటూ వ‌స్తున్నారు మోహ‌న్ బాబు. అంటే ఈ ప్రాంత న‌మ్మ‌కాలపై ఆయ‌న‌కుగానీ ఆయ‌న కుటుంబానికి గానీ ఈ సామాజిక వ‌ర్గంపై ఒక మ‌ర్యాద ఉండే ఉంటుంది. కానీ ఇందుకు రివ‌ర్స్ లో వెళ్తోంది మోహ‌న్ బాబు ఫ్యామిలీ. దేనికైనా రెడీ విష‌యంలోనూ స‌రిగ్గా ఇలాంటి వ్య‌వ‌హార‌మే న‌డిచింది. అప్ప‌ట్లో అదో పెద్ద గొడ‌వ‌.  ఫిలింన‌గ‌ర్ లో ఆయ‌న నివాసం ముందు ఆందోళనలూ నడిచాయి.   తాజాగా క‌న్న‌ప్ప లో పిల‌క‌- గిల‌క వ్య‌వ‌హారం మరో సారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాలో పిల‌క- గిల‌క అంటూ ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేసింది టీమ్ క‌న్న‌ప్ప‌. మొన్న‌టికి మొన్న శివ‌రాత్రి స‌మ‌యంలో సాక్షాత్ ఆ శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రుడి ముందు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టీజ‌ర్ రిలీజ్ చేశారన్న‌ది ఒక వివాదం కాగా.. హార్డ్ డిస్కులు పోయాన్న‌ది మ‌రో వివాదం. తాజాగా ఈ పిల‌క- గిల‌క పోస్ట‌ర్ క‌ల‌క‌లం.  ఈ పిల‌క- గిల‌క పాత్ర‌ల‌ ద్వారా  బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవహేళన చేశారంటూ ఆ సమాజికవర్గాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   క‌న్న‌ప్ప సినిమాలో ఉద్దేశ పూర్వ‌కంగానే ఈ పాత్ర‌ల‌ను పెట్టార‌ని బ్రాహ్మణ సంఘాలు  విరుచుకుప‌డుతున్నాయి. ఇది బ్రాహ్మ‌ణుల మ‌నోభావాల‌ను దెబ్బ తీయ‌డంతో స‌మాన‌మన్న‌ది అంటున్నాయి. దీంతో క‌న్న‌ప్ప ప్రీ- రిలీజ్ ఈవెంట్ ని అడ్డుకుంటామ‌ని హెచ్చరిస్తున్నాయి.  నిజానికి క‌న్న‌ప్ప అనే పాత  సినిమాని బ‌ట్టి చూస్తే కాళ‌హ‌స్తీశ్వ‌ర ఆల‌య పూజారి (రావుగోపాల‌రావు పోషించిన పాత్ర‌)   క‌న్న‌ప్ప‌ను నిజంగానే ఇబ్బందుల పాలు చేసిన‌ట్టు క‌నిపిస్తుంది.  మ‌రి అప్పుడిదే బ్రాహ్మ‌ణ  సంఘాలు ఎందుకింత‌గా వ్య‌తిరేకించ‌లేద‌న్న‌ది ఒక వాద‌న కాగా.. రెండోది ఏంటంటే మోహ‌న్ బాబు కుటుంబానికి బ్రాహ్మ‌ణుల‌తో పెట్టుకుంటే బాగా క‌లిసి వ‌స్తుంద‌న్న‌ది మ‌రో కామెంట్ గా తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌న్న‌ప్ప బ‌డ్జెట్ 100 కోట్ల రూపాయ‌లుగా చెబుతున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్ స్టార్స్ ఇందులో ఉన్నా.. అంతా టాక్ ని బ‌ట్టే రిక‌వ‌రీ అవుతుంది. అందుకంటూ ఒక బూస్టింగ్ అవ‌స‌రం. అలా జ‌ర‌గాలంటే సినిమా ఏదో ఒక ర‌కంగా   వార్త‌ల్లో ఉండాలి. ఇప్ప‌టికే చాలా చాలా ట్రై చేసిన మంచు వారి బృందం..  తాజాగా బ్రాహ్మ‌ణుల‌కు సంబంధించిన వివాదాల తుట్టె కూడా క‌దిపిన‌ట్లు కనిపిస్తోంది. దీంతో త‌మ సినిమా డెఫినెట్ గా వార్త‌ల్లో ఉండ‌ట‌మే కాక‌.. ప్రేక్ష‌క జ‌నం దృష్టిని సైతం ఆక‌ర్షించ‌డం ఖాయ‌ మ‌న్న‌ట్టుగా.. భావిస్తున్నారు. మ‌రి చూడాలి ఏమౌతుందో?
ALSO ON TELUGUONE N E W S
  మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా 'చండీ దుర్గమా'. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్  లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ  ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు.    ఈ సందర్భంగా ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ.. "చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలి. ప్రొడ్యూసర్ జయశ్రీ గారికి, డైరెక్టర్ మైను ఖాన్ తో సహా టీమ్ అందరికీ మంచిపేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.   డైరెక్టర్ మైను ఖాన్. ఎండీ. మాట్లాడుతూ.. "ఈ రోజు మా చండీ దుర్గమా చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన అలీ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. రఘు కారుమంచి, చిట్టి కూడా మాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. ఇటీవల అమ్మవారి నేపథ్యంగా సినిమాలు రూపొందడం లేదు. సౌందర్య గారి అమ్మోరు, విజయశాంతి గారి చండీ సినిమా తర్వాత అమ్మవారి కథతో సినిమా రాలేదు. ఇప్పటి ట్రెండ్ కు అనుగుణంగా, ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా డార్క్ థీమ్ లో సరికొత్త స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రస్తుతం థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ కు ఆడియెన్స్ ను రప్పించేలా చండీ దుర్గమా సినిమా మేకింగ్ ను డిజైన్ చేస్తున్నాం. కో ప్రొడ్యూసర్ ఒలీ గారు చెప్పిన ఒక పాయింట్ ఆధారంగా ఈ చిత్ర కథను నేను రాశాను. ఇటీవల కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. చండీ దుర్గమా సినిమా ఒక మాస్టర్ పీస్ అవ్వాలని కోరుకుంటున్నా." అన్నారు.   నిర్మాత జయశ్రీ వెల్ది మాట్లాడుతూ.. "అమ్మవారి నేపథ్యంతో ఒక మంచి కథతో చండీ దుర్గమా సినిమాను నిర్మించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మన తెలుగు ఆడియెన్స్ అమ్మవారి నేపథ్యంగా వచ్చిన చిత్రాలను ఎంతో ఆదరించారు. మా సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. హై క్వాలిటీ మేకింగ్ తో మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు, ప్రతిభ గల కొత్త నటీనటులతో చండీ దుర్గమా సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం." అన్నారు.     సినిమాటోగ్రాఫర్ వైఎస్ కృష్ణ మాట్లాడుతూ.. "చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా మూవీని విజువల్స్ పరంగా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాం." అన్నారు. నటుడు చిట్టి మాట్లాడుతూ.. "చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి క్లాప్ ఇచ్చిన మా స్నేహితుడు అలీ గారికి థ్యాంక్స్. మైను ఖాన్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనతో నేను గతంలో ఓ చిత్రానికి పనిచేశాను. ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందించబోతున్నాడు. నిర్మాత జయశ్రీ గారికి, కో ప్రొడ్యూసర్ ఒలి గారికి మిగతా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా." అన్నారు.   నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ.. "చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఈ సినిమాతో డైరెక్టర్ మైను ఖాన్, నిర్మాత జయశ్రీ గారు మంచి విజయాన్ని దక్కించుకోవాలని కోరుతున్నా. టీమ్ లోని అందరికి నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. చండీ దుర్గమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండే మూవీ కావాలని కోరుకుంటున్నా." అన్నారు.    కో ప్రొడ్యూసర్ ఒలి మాట్లాడుతూ.. "థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో చండీ దుర్గమా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సరికొత్త స్క్రీన్ ప్లేను ఈ చిత్రంలో చూస్తారు. మా డైరెక్టర్ మైను ఖాన్ సినిమాను బాగా రూపొందిస్తాడనే నమ్మకం ఉంది. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాం." అన్నారు.  
సౌత్‌ ఇండియన్‌ హీరోలైన రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ కెరీర్‌ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. ఇద్దరూ కె.బాలచందర్‌ సినిమాల ద్వారానే బాగా పాపులర్‌ అయ్యారు. ఎన్నో సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు కూడా. తమ పెర్‌ఫార్మెన్స్‌తో తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకొని అభిమానుల్ని సంపాదించుకున్నారు. రజినీకాంత్‌ పక్కా కమర్షియల్‌ సినిమాల వైపు వెళితే, కమల్‌హాసన్‌ ఎక్స్‌పెరిమెంట్‌ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కమల్‌హాసన్‌కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన సినిమా మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ‘నాయకుడు’. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మమ్ముట్టి కాంబినేషన్‌లో చేసిన ‘దళపతి’ రజినీకాంత్‌కి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్‌, కమల్‌హాసన్‌లతో మళ్ళీ సినిమా చెయ్యలేదు మణిరత్నం.  ‘జెంటిల్‌మెన్‌’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన శంకర్‌.. ఆ తర్వాత ‘ప్రేమికుడు’ చిత్రంతో టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కమల్‌హాసన్‌తో 1996లో చేసిన ‘భారతీయుడు’ చిత్రంతో ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్‌ అనే పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌, అర్జున్‌, విక్రమ్‌ వంటి హీరోలతో సూపర్‌హిట్‌ సినిమాలు రూపొందించారు శంకర్‌. 2007లో రజినీకాంత్‌తో ‘శివాజీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించారు. ఆ తర్వాత వెంటనే కమల్‌హాసన్‌తో ‘రోబో’ చిత్రాన్ని చెయ్యాలనుకున్నారు. ఆ సమయంలో కమల్‌ బిజీగా ఉండడంతో మళ్ళీ రజినీతోనే ఆ సినిమా చేసి మరో బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత శంకర్‌ కెరీర్‌ గ్రాఫ్‌ తగ్గుతూ వచ్చింది. వరసగా అతను చేసిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. ఆ సమయంలో కమల్‌తో ‘భారతీయుడు2’ ప్లాన్‌ చేశారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అందులో భాగంగానే త్వరలో ‘భారతీయుడు3’ కూడా రాబోతోంది. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. మరోపక్క తనకు ‘నాయకుడు’ చిత్రంతో సూపర్‌ స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన మణిరత్నంతో దాదాపు 38 సంవత్సరాల తర్వాత ‘థగ్‌లైఫ్‌’ చిత్రం చేశారు కమల్‌. ఈ సినిమా కూడా మొదటి రోజు నుంచే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకొని తీవ్ర విమర్శలకు లోనైంది. ఇప్పటివరకు మణిరత్నం చేసిన సినిమాలు హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా డైరెక్టర్‌గా ఎప్పుడూ ఫెయిల్‌ అవ్వలేదు. తన మార్క్‌ టేకింగ్‌తో, విజువల్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నారు. ‘థగ్‌లైఫ్‌’ చిత్రంలో మాత్రం అలాంటి మెరుపులు ఏమీ లేకుండా పోయాయి. దీంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని నిర్మొహమాటంగా తిప్పికొట్టారు. అలా ఇండియాలోనే టాప్‌ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం, శంకర్‌లను కమల్‌హాసన్‌ నిండా ముంచినట్టయింది. మరోపక్క శంకర్‌, మణిరత్నం వంటి వెటరన్‌ డైరెక్టర్ల జోలికి వెళ్ళకుండా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూ సూపర్‌హిట్స్‌ అందుకుంటున్నారు రజినీకాంత్‌. చాలాకాలం తర్వాత తనకు ‘జైలర్‌’తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌తో ‘జైలర్‌2’ చేస్తున్నారు. అలాగే వరస విజయాలతో దూసుకెళ్తున్న లోకేష్‌ కనకరాజ్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు రజినీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. 
  'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan).. ఆ తర్వాత 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న 'పెద్ది'తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పెద్ది' తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా కమిటై ఉన్నాడు చరణ్. ఇది తన కెరీర్ లో 17వ సినిమా. అయితే ఇప్పుడు సుకుమార్ ప్లేస్ ని త్రివిక్రమ్ కబ్జా చేసినట్లు తెలుస్తోంది.   ఈ జనరేషన్ టాలీవుడ్ టాప్-6 స్టార్స్ లో రామ్ చరణ్, ప్రభాస్ తప్ప మిగతా వారితో త్రివిక్రమ్ సినిమాలు చేశాడు. రామ్ చరణ్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. నిజానికి ఇది సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత ఉంటుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా సుకుమార్ సినిమా వెనక్కి వెళ్ళి.. త్రివిక్రమ్ మూవీ ముందుకు వచ్చిందని వినికిడి. RC17 కి త్రివిక్రమ్, RC18 కి సుకుమార్ దర్శకత్వం వహిస్తారట.   వాస్తవానికి త్రివిక్రమ్.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, ముందుగా ప్రకటించిన త్రివిక్రమ్ సినిమాని కాకుండా.. అట్లీ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాడు బన్నీ. దాంతో త్రివిక్రమ్.. చరణ్ సినిమాని లైన్ లో పెట్టాడు.   చరణ్-త్రివిక్రమ్ కాంబో సెట్ కావడంతో.. అనూహ్యంగా సుకుమార్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. అయితే సుకుమార్.. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నారని వార్తలొస్తున్నాయి. RC17 తర్వాత ఇది ఉంటుందనే అభిప్రాయాలు మొదట వ్యక్తమయ్యాయి. కానీ, ఇప్పుడు త్రివిక్రమ్ సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో.. షారుఖ్ సినిమాని పూర్తి చేసి, ఆ తర్వాత చరణ్ ప్రాజెక్ట్ పైకి సుకుమార్ షిఫ్ట్ అవుతారేమో అనిపిస్తోంది.  
  టాలీవుడ్ స్టార్స్ లో అందగాడు అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు మహేష్ బాబు (Mahesh Babu). ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోనూ మహేష్ తన లుక్స్ తో ఆకట్టుకుంటారు. తాజాగా జరిగిన అఖిల్ అక్కినేని రిసెప్షన్ వేడుకలో మహేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   అఖిల్, జునైబ్ ల వివాహం జూన్ 6న జరగగా.. రిసెప్షన్ జూన్ 8న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. (Akhil Zainab reception)   ఇలాంటి వేడుకలకు హరైనప్పుడు తాము ధరించే దుస్తులతో ప్రత్యేకంగా కనిపించాలని అందరూ భావిస్తారు. కానీ, మహేష్ బాబు మాత్రం సింపుల్ గా టీ-షర్ట్ తో వచ్చి.. అందరికంటే ప్రత్యేకంగా నిలిచారు.     టీ-షర్ట్ లో మహేష్ లుక్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. అభిమానులైతే అలాంటి టీ-షర్ట్ కోసం ఆన్ లైన్ లో వేట కూడా మొదలుపెట్టారు. తీరా దాని ధర రూ.1.5 లక్షలు అని తెలిసి షాక్ అవుతున్నారు.    మొత్తానికి అఖిల్ రిసెప్షన్ కి సింపుల్ గా టీ-షర్ట్ లో వచ్చి మొదట సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్.. ఆ తర్వాత దాని ధరతో మైండ్ బ్లాక్ చేశాడని చెప్పవచ్చు. ప్రస్తుతం మహేష్ టీ-షర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.   సినిమాల విషయానికొస్తే, మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు.  
  బాలీవుడ్ స్టార్స్ చూపు తెలుగు మార్కెట్ పై పడింది. ఇక్కడ మార్కెట్ పెంచుకోవడం కోసం.. తెలుగు దర్శకులు, నిర్మాతలతో సినిమాలు చేయడానికి వారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది.   'పఠాన్', 'జవాన్' సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి.. బాలీవుడ్ స్టార్స్ లో ఎవరికీ సాధ్యంకాని ఫీట్ సాధించిన షారుఖ్.. ఈసారి అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో షారుఖ్ ఓ భారీ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇది రూపొందనుందట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లని వినికిడి.   'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు సుకుమార్. ఆయన గత మూడు చిత్రాలు 'రంగస్థలం', 'పుష్ప-1', 'పుష్ప-2' మైత్రి బ్యానర్ లోనే రూపొందాయి. ఆ ఉత్సాహంతోనే సుకుమార్-షారుఖ్ ప్రాజెక్ట్ కి అత్యంత భారీ బడ్జెట్ పెట్టడానికి మైత్రి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   ఓ వైపు టాలీవుడ్ స్టార్స్ తో బడా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర భాషల స్టార్స్ తో సినిమాలను చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ముఖ్యంగా హిందీ హీరోలతో వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే సన్నీ డియోల్ తో 'జాట్' చేసింది. ఆమిర్ ఖాన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు షారుఖ్-సుకుమార్ కాంబో తెరపైకి వచ్చింది. మున్ముందు ఈ లిస్టులో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కూడా చేరే అవకాశముంది.   ఏది ఏమైనా ఇప్పుడు షారుఖ్-సుకుమార్ కాంబినేషన్ మాత్రం సంచలనంగా మారింది. కేవలం అనౌన్స్ మెంట్ తోనే.. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లో ఒకటిగా ఇది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.   ప్రస్తుతం షారుఖ్ 'కింగ్' మూవీ చేస్తున్నాడు. సుకుమార్ కూడా రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.  
  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'ది రాజా సాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా రూపొందుతోన్న 'రాజా సాబ్'ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ జూన్ 16న విడుదల కానుంది. (The Raja Saab)   ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. పైగా ఇందులో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని.. కామెడీ, సాంగ్స్ అదిరిపోతాయని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ 'రాజా సాబ్' కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మారుతి ఒకే ఒక్క మాటతో ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళాడు.   రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ మారుతి, 'రాజా సాబ్' మూవీ గురించి మాట్లాడుతూ.. "అభిమానులు ఏం ఆశిస్తున్నారో దానికంటే ఒక శాతం ఎక్కువే రాజా సాబ్ ఉంటుంది. ప్రభాస్ పై నా ప్రేమ ఏంటో ఈ సినిమాలో చూస్తారు." అని అన్నాడు.   మారుతి మాటలను బట్టి చూస్తే.. 'రాజా సాబ్' సినిమా పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థమవుతోంది. జూన్ 16న విడుదల కానున్న టీజర్ తో అసలు 'రాజా సాబ్' చిత్రం ఏ విధంగా ఉండబోతుందో కాస్త క్లారిటీ వచ్చే అవకాశముంది.  
  కొందరు నటులు వయసుతో సంబంధం లేకుండా సినిమా కోసం సాహసాలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అలాంటి సాహసమే చేశారు. 70 ఏళ్ళ వయసున్న ఆయన.. ఓ షూటింగ్ లొకేషన్ లోకి వెళ్ళడం కోసం గోడ దూకారు.    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రస్తుతం షూట్ జరుగుతోంది. ఈ లొకేషన్ లోకి ఎంటరవ్వడం కోసమే అనుపమ్ ఖేర్ ఓ విన్యాసం చేశారు.   ఫౌజిలో అనుపమ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ షూట్ కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. అయితే లొకేషన్ కి కారులో వెళ్ళిన ఆయనకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సరైన దారిలో వెళ్ళకపోవడంతో.. చివరికి గోడ దూకాల్సి వచ్చింది.      దీనికి సంబంధించిన వీడియోను అనుపమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "నా 40 ఏళ్ల సినిమా ప్రయాణంలో నేను నా షూటింగ్ లొకేషన్లలోకి వివిధ మార్గాల ద్వారా ప్రవేశించాను. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది. ప్రభాస్ సినిమా కోసం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు నా డ్రైవర్ సాహసోపేతంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మేము ఒక అడవి లాంటి ప్రదేశంలోకి ప్రవేశించి, ఆపై ఒక డెడ్ ఎండ్‌ కు చేరుకున్నాము. కారును రివర్స్ చేయలేకపోయాము. తరువాత ఏమి జరిగిందో చూడండి." అని రాసుకొచ్చిన అనుపమ్.. నిచ్చెన సాయంతో గోడ ఎక్కి దూకిన వీడియోను పంచుకున్నారు.    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అదే సమయంలో 70 ఏళ్ళ వయసులో అనుపమ్ డెడికేషన్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.  
  God of masses Nandamuri Balakrishna is riding high with consecutive blockbusters. Ahead of his birthday (June 10), Balakrishna’s 111th film was announced officially. The movie NBK111 will be helmed by blockbuster maker Gopichand Malineni, and this marks their second collaboration, after the smashing hit Veera Simha Reddy. Venkata Satish Kilaru who is presently making a Pan India film like Peddi will be bankrolling the new project on a massive scale with a high budget on Vriddhi Cinemas Banner.   The announcement poster features the fierce image of a raging lion. Half of its face armored with a metallic shield, while the other half remains open and wild. The striking image is symbolic of the intense duality and raw power of the character that Balakrishna is set to portray in this film.     Director Gopichand Malineni, known for his expertise in mass and commercial entertainers, will be delving into historical territory for the very first time. He is crafting a never-seen-before avatar for Balakrishna, with an epic story that promises to blend grandeur, history, and high-octane action. The script, described as both powerful and unique, is currently in the final stages of pre-production.   While the lead star and director have been officially confirmed, the rest of the cast and technical crew will be announced later.  
  God of the Masses Nandamuri Balakrishna, and blockbuster Maker Boyapati Sreenu’s fourth film together is titled Akhanda 2: Thandavam. This high-octane sequel promises to surpass its predecessor, Akhanda, in every aspect, such as story, scale, production, and technical brilliance. The highly-anticipated film is being mounted on a grand scale under the prestigious 14 Reels Plus banner, with producers Raam Achanta and Gopichand Achanta at the helm. It is proudly presented by M. Tejaswini Nandamuri.   Meanwhile, the makers came up with double updates. Akhanda 2’s first look and teaser will be unveiled on June 9th, a day before Balakrishna’s birthday. A trident with a Nandi and a damarukam can be seen in the poster, with cosmic compass in the background. So, it will be a double treat for NBK’s birthday. Before that, this poster stirs up curiosity.     The shoot of the movie is progressing as per the schedule. Tollywood’s lucky charm Samyuktha plays the female lead in the movie. Sharing the screen is the dynamic Aadhi Pinisetty, who takes on a compelling and intense role that is expected to leave a strong impact.   Backed by an elite technical team, the film boasts a powerful lineup with S Thaman scoring the music, while celebrated cinematographer C Ramprasad captures the visuals. Editor Tammiraju ensures a gripping narrative flow, and renowned art director AS Prakash is crafting the film’s rich visual world.   Akhanda 2 is gearing up for a massive Pan India release on September 25 for Dussehra.  
  టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన అందరితో సరదాగా ఉంటారు. రిలేషన్ షిప్, ఫ్రెండ్ షిప్ కి వాల్యూ ఇస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.   "నాకు నందమూరి కుటుంబంతో మంచి అనుబంధముంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేయనప్పటికీ.. తను నాకు బాగా పరిచయం. ఎందుకంటే ఎన్టీఆర్ వాళ్ళ బాబాయ్(పిన్ని భర్త) ఆర్టిస్ట్ రాజా, నేను బాగా క్లోజ్. రాజా వైఫ్, ఎన్టీఆర్ మదర్ సిస్టర్స్ అవుతారు. రాజా బాగా క్లోజ్ కావడంతో.. అలా ఎన్టీఆర్ కూడా నాకు చిన్నప్పటి నుండి తెలుసు.  రాజా చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు. ఆయన ఇద్దరి కూతుళ్ళకు తారక్ పెళ్లి చేశాడు." అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.    
అతనో సాధారణ మధ్యతరగతి మనిషి. కానీ జీవితంలో ఎలాగైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కసి ఉన్నవాడు. అందుకనే నిరంతరం ఒళ్లు వంచి పనిచేసేవాడు. యజమాని ఏ పని చెప్పినా కిమ్మనకుండా పూర్తిచేసి, తనేమిటో నిరూపించుకునేవాడు. కానీ ఆ పని ఒత్తిడిలో పడి తన కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయేవాడు. ఒక్క ఆదివారం మాత్రమే ఇంటిల్లపాదీ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అవకాశం దక్కేది. తన కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోతున్నానన్న బాధ అతని మనసులో మెదులుతూనే ఉండేది. భార్యాపిల్లలు కూడా అతను తమకోసం మరింత సమయం గడిపితే బాగుండు అని తెగ ఆశపడేవారు. ఇదిలా ఉండగా, ఆ మధ్యతరగతి మనిషి తన ఉద్యోగంలో ఎలాగైనా పదోన్నతి సాధించాలనుకున్నాడు. అందుకోసం మరిన్ని చదువులు చదివితే బాగుండు అనిపించింది. దాంతో ఓ ఏడాదిపాటు అతని ఆదివారాలన్నీ చదువుకే అంకితమైపోయాయి. రోజూ రాత్రివేళ మాత్రమే అతను తన కుటుంబంతో కాసేపు గడపగలిగేవాడు. అతను ఇంట్లో ఎక్కువసేపు గడపడం లేదంటూ భార్యపిల్లలు బాధపడితే... ‘మీకోసమే కదా కష్టపడుతోంది’ అంటూ వారి నోరు మూయించేవాడు. ఆ మాటలో నిజం ఉందని తోచడంతో భార్యాపిల్లలు ఇక మారు మాట్లాడేవారు కాదు. ఓ ఏడాది గడిచిపోయింది. మధ్యతరగతి మనిషి చదువు పూర్తయిపోయింది. ఊహించినట్లుగానే పదోన్నతి కూడా లభించింది. ఆయన చదువు పూర్తయి కోరుకున్న పదోన్నది లభించింది కాబట్టి, ఇకనుంచి తమతో మరింతసేపు గడుపుతాడని ఆశించారు భార్యాపిల్లలు. కానీ పదోన్నది లభిస్తే సరిపోతుందా! దాని సరిపడా పని కూడా ఉంటుంది కదా. పైగా ఆ మనిషి తన పనిలో వెనక్కి తగ్గే రకం కాదయ్యే! దాంతో అహర్నిశలూ కార్యాలయంలోనే గడిపేవాడు. ఏ అర్ధరాత్రికో పిల్లలు పడుకున్నాక కానీ ఇల్లు చేరుకునేవాడు కాదు. ఉదయం అతను లేచేసరికి పిల్లలంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. దాంతో అతను పిల్లలతో మాట్లాడే సందర్భాలే తగ్గిపోయాయి. తను కుటుంబానికి ఏమాత్రం సమయం వెచ్చించలేకపోతున్నానని అతనికి తెలుసు. కానీ ఇదంతా వారి భవిష్యత్తు కోసమే చేస్తున్నానని తల్చుకుని ఓర్చుకునేవాడు. ఉద్యోగంలో మరో మెట్టు పైకి ఎక్కితే ఇంత ఒత్తిడి ఉండదు కదా అని ఎదురుచూసేవాడు. అనుకున్నట్లుగానే ఇంకో ఏడాది గడిచేసరికి అతను డిపార్టుమెంట్ అధిపతిగా మారిపోయాడు. ఇది వరకు అతను పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు అలాకాదయ్యే! బాధ్యత కూడా తోడయ్యింది. ప్రతి ఫలితానికీ జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితి. తనేమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దాంతో అతను ఆ సవాలుని స్వీకరించాడు. ఒకోరోజు ఆఫీసులోనే నిద్రపోయేవాడు. ఇప్పుడు భార్యని చూడటం కూడా తగ్గిపోయింది. దాంతో ఓ రోజు భార్యాపిల్లలు కలిసి అతని ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘సంపాదించిన స్థాయి చాలు. ఇక కుటుంబం గురించి కూడా ఆలోచించమని’ వేడుకున్నారు. ‘మరొక్క ఏడాది ఓపిక పట్టండి. ఇంకో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చాక ఇంక కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తాను,’ అంటూ మాట ఇచ్చాడు. మాట ఇచ్చినమేరకు ఏడాది గడిచిపోయింది. ఊహించినట్లుగానే మరో ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడతను మధ్యతరగతి మనిషి కానేకాదు. తన పనిచేస్తున్న కంపెనీకే వైస్ ప్రెసిడెంట్. ‘రేపటి నుంచి మీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను. మీ బాగోగులను గమనించుకుంటాను,’ అంటూ ఆ రాత్రి భార్యాపిల్లలకి సంతోషంగా చెప్పాడు. కానీ మర్నాడు ఉదయం లేవనేలేదు!!! తను చిన్నవయసులోనే చాలా సాధించాడంటూ ఓదార్చడానికి వచ్చినవారంతా తెగ పొగిడారు. కానీ అతను ఏం కోల్పోయాడో అతని భార్యాపిల్లలకే తెలుసు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.    
జీవితంలో మనకు కావలసిన వాటికోసం, అవసరమైన వాటి కోసం , ప్రయత్నాలు చేయడం సహజం. అయితే వాటిని సాధించుకునే తీరులో తేడాలు ఉంటాయి. మనిషిలో రెండు వ్యతిరేక స్వభావం కలిగిన అంశాలు ఉంటాయి. అవే ఆశయం, అత్యాశ. చాలామంది ఆశయానికి అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోలేరు. ఫలితంగా అత్యాశ ద్వారా ఏదైనా సాధించుకుంటే దాన్ని ఆశయంతో సాధించుకున్నట్టు ఫీలైపోతారు.  "ఆశయం అంటే కష్టపడి సాధించుకోవడం అత్యాశ అంటే ఒకరి నుండి లాగేసుకోవడం" ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఎదుగుతున్న వారికి ఈ ఆశయం, అత్యాశ మధ్య ఉన్న తేడా ఏంటి?? దాన్ని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవాలి. ఆశయం!! ఆశయం మనిషిని మానసికంగా, సామాజికంగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లే అంశం. ఆశయంలో లక్ష్యాలు ఉంటాయి. ఏదైనా సాధించడానికి అవసరమైన ప్రణాళిక ఉంటుంది, సాధించాలి అనుకున్న విషయం మంచా, చెడా అనే విచక్షణ కలిగి ఉంటుంది. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అనుభవాలు, గెలుపు, ఓటమి మొదలైనవాటిని తీసుకునే తీరు ఇవన్నీ ఆశయంలో అంతర్భాగంగా ఉంటాయి.  ఒక ఆశయంలో ప్రయోజనం అనేది ఉంటుంది. అది కేవలం ఒక వ్యక్తికా లేక కుటుంబంకా, సమాజనికా అనేది ఆశయంలో ఉన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి ఆశయం అనేది ఒకరికి లేక కొందరికి ప్రయోజనం చేకూర్చే అంశం. దానివల్ల మనిషిలో ఉన్నత విలువలు పెంపొందుతాయి.  ప్రతి మనిషికి ఒక ఆశయం అనేది ఉండాలి. అదే ఆ మనిషిని జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. అతని ఎదుగుదలే ఓ కుటుంబాన్ని అన్ని కోణాల్లోనూ ఓ మెట్టు పైకి చేర్చుతుంది.  ఆశయాలు చిన్నవైనా, పెద్దవైనా, జీవితకాల నిర్ణయాలు అయినా వాటితో మనిషి భవిష్యత్తు మెరుగుపడుతుంది.  ఇదీ ఆశయంలో ఉన్న సారం. అత్యాశ!! కావలసింది, అవసరమైనది సాధించుకోవడం ఆశయమైతే, ఆశయంలో ఓటమిని ఎదుర్కోలేక తనకే కావాలనే మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం అత్యాశ అవుతుంది. అత్యాశ అనేది మనిషికి ఉండకూడని లక్షణాలతో ఒకటి.  కావలసిన దాన్ని నిజాయితీగా, కష్టపడి సాధించుకుంటే దానిలో అర్థముంటుంది. అదే వక్రమార్గంలో దాన్ని సాధించుకుంటే?? అటువైపు దానికోసం కష్టపడుతున్న వారిని మోసం చేసినట్టు, వారి నుండి దాన్ని లాక్కున్నట్టు, వారికి దక్కాల్సినది దక్కకుండా చేసినట్టు అవుతుంది.  ద్వేషం, అసూయ, మూర్ఖత్వం, మొండితనం, ఓర్పు లేకపోవడం ఇవన్నీ అత్యాశలో నిండిపోయి ఉంటాయి. వీటి వల్ల జరిగేది ఏంటి?? ఇతరులు సంతోషపడితే చూడలేకపోవడం, దానికోసం వారికి దక్కాల్సినవి దక్కకుండా చేయడం, వారు బాధపడుతుంటే చూడటం కోసం వారు నష్టపోయేలా చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా తనకు అవసరం లేకపోయినా తనకే దక్కాలి అనే అహంకారం అత్యాశతో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవిధమైన లక్షణం మనిషిని క్రమంగా మృగత్వం వైపుకు లాక్కెళ్తుంది. అత్యాశ నిత్యనాశనం అంటారు. అదెప్పుడూ మనిషిలో మానసిక ప్రశాంతతను లాగేస్తుంది. కాబట్టి అత్యాశ అనేది కేవలం ఇతరులను ఇబ్బందిపెట్టే గుణమే కాదు. అది ఉన్న మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయదు. ఆశయానికి, అత్యాశకు మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటే అప్పుడు మనిషి తన జీవితంలో సాధించుకోవలసింది ఏంటి?? వదిలేసుకోవలసింది ఏంటి?? అనే విషయాన్ని నిర్ణయించుకోగలుగుతాడు.  లక్ష్యాలు ఏర్పరుచుకుని, శక్తి సామర్త్యాలు ఉపయోగించి పట్టుదల, ఆత్మవిశ్వాసంతో సాధించేది ఆశయం.  ఇతరుల సంతోషం నీరుగార్చడం కోసం తనకు అవసరం లేకపోయినా దాన్ని దక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం అత్యాశ.  ఈ రెండింటిని తెలుసుకుని ముందుకు సాగితే జీవితానికి ఓ మంచి అర్థముంటుంది.                                      ◆నిశ్శబ్ద.
ప్రతి మనిషి తన జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు. అయితే కోరుకున్నంత సులభంగా అలాంటి జీవితం లభించదు. నిజానికి ప్రశాంతమైన జీవితం వేరు, సుఖాల మయమైన జీవితం వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ముందు. ప్రశాంతమయమైన జీవితం కావాలి అంటే…  ప్రతి నిముషంలోని ఆనందాన్నీ, సంతృప్తినీ వెలికి తీయగల గని కార్మికుడి లాగా పని చేయాలి. మనం ఎంత సాధించినా, ఎంత డబ్బునూ, ఆస్తుల్నీ సంపాదించినా చివరికి మన వెనకున్న ఎవరికో ఒకరికి సర్వం సమర్పించి అంతా వదలి వెళ్ళాలన్న సాధారణ సత్యాన్ని ఆకళింపు చేసుకోవాలి. అదే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు నిజంగా మనం సంతృప్తికరంగా జీవించగలమా అంటే అవును  జీవించగలం.  కొంతమంది ఏమి చేస్తారంటే… ఎదుటి వాళ్ళు కార్లు, బంగాళాలు కొంటూ విలాసవంతంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు అని అంటారు. కానీ ఎలాంటి గొడవలు, చింతలు లేకుండా హాయిగా ఉన్నవారే నిజమైన గొప్ప జీవితం కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గ్రహించాలి.  మరికొందరు గొప్పగా బ్రతకడం అంటే అది అదృష్టం వలన లభించేది అని అనుకుంటారు. కానీ అది అదృష్టం వల్ల దొరికేది కాదు. అది మనకు మనంగా ఎంచుకొనే తెలివైన ఎంపిక.  ఇలాంటి ఎంపిక ఎలా సాధ్యం అని ప్రశ్నించుకుంటే.. మనం ఆలోచించడం మొదలు పెట్టాలి ముందు.  ఈ రోజున మనకు తెల్సిన పరిస్థితుల మధ్య, మనం అనుభవిస్తున్న పరిస్థితుల మధ్య, మనం సిద్ధంగా ఉన్న అవకాశం లభించినప్పుడు ఆనందంగా గడపగలమో..... లేక మనకు తెలియని రేపటి పరిస్థితుల మధ్య, మనం చూడలేని పరిస్థితులలో ఆనందంగా గడపగలమో నిర్ణయించుకోవాలి.   భవిష్యత్తు అనేది కేవలం మనం మన ఊహల్లో నిర్మించుకొనే ఒక సామ్రాజ్యం. ఈ వాస్తవమైన ఈ రోజుని ఆనందంగా జీవించలేనపుడు.. రేపటి రోజున ఎలా ఆనందంగా జీవించగలం? కాలం మన మృత్యువునీ ఎన్నటికీ వాయిదా వెయ్యదు, అది దానికి సమయం వచ్చినప్పుడు అట్లా మనల్ని తీసుకుని వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మన ఆనందపు సమయాన్ని మాత్రం మనం ఎందుకు వాయిదా వెయ్యడం. మనకు దొరికిన గొప్పవరం ఏదైనా ఉందంటే అది ఈరోజే.., ఇది మళ్ళీరాని అవకాశం, ఈ రోజున మనం అనుభవించిన సంతోషాలూ, గడిపిన క్షణాలు మళ్ళీ అదే విధంగా మరో రోజు ఉండకపోవచ్చు.   ఒక వేళ మన ఆయుష్షు లక్ష రోజులైతే... అది ఖచ్చితంగా ప్రతి రోజూ ఓ విలక్షణమైన పుస్తకం లాంటింది.  ఏ పుస్తకమూ మరో పుస్తకంలా ఉండదు. అలాగే  మన అద్భుతమైన రోజు భవిష్యత్తులో మరో రోజు పునరావృతం కాదు. ప్రతి రోజు ఓ సరిక్రొత్త అనుభవం. అందుకే ఏ సరిక్రొత్త అనుభవాన్ని వదులుకోకూడదు. బోటన వ్రేలి గుర్తులు ప్రపంచంలో ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవో అలాగే మన జీవితకాలంలోని ఏ రెండు రోజులూ ఒకేలా వుండవు. సరిక్రొత్త విశేష విజయాలను, అవకాశాలను ఈ రోజే సృష్టించుకోవాలి.  మరో రోజును వేరొక అవకాశాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మనం గతంలో జరిగిన సంఘటనలనీ, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే ఆలోచనలతో, నిన్నటినీ, రేపటినీ కలిపి ఈ రోజు జీవించడానికి ప్రయత్నిస్తుంటాం. నిన్నటి పాత జీవితాన్ని మళ్ళీ నేడు బ్రతకడం ఎందుకు, వస్తుందో రాదో తెలియని రేపటిని ఈ రోజే జీవించాలన్న తపన ఎందుకు కేవలం నేటిని ప్రశాంతంగా జీవిస్తేచాలాదా!                                     ◆నిశ్శబ్ద.
నేటి డిజిటల్ యుగంలో స్క్రీన్‌లు మన జీవితంలో అంతర్భాగంగా మారాయి. వర్క్ చేయడం నుండి సరదాగా సమయం గడపడం వరకు మొబైల్, సిస్టమ్, టీవీ, సినిమా హాల్ ఇలా ఎక్కడ చూసినా స్కీన్ కాస్తా ఫ్రంట్ ఆఫ్ ద హుమన్ గా మారింది.  దీన్ని దాటి, దీన్ని కాదని ఏ పని చేయలేని పరిస్థితి నెలకొంది. మంచి అయినా, చెడు అయినా ఇప్పుడు మొత్తం ఈ స్క్రీన్ నుండే అందుతోంది. అందుకే  గత ఇరవై, ముఫ్పై ఏళ్ళ కిందట లేని కంటి సమస్యలు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. సుమారు 10మందిలో 9మందికి అంతో ఇంతో దృష్టిలోపం సమస్య ఉంటోంది. నేటికాలంలో కలుషితమవుతున్న, రసాయనాల నిలయమైన ఆహారం, నీరు, గాలి, పరిసరాలు కూడా ఇందుకు కారణం. దీనికి తోడు జీవనశైలి మరీ దారుణంగా ఉంటుంది కొందరికి. రాత్రెప్పుడో మూడు, నాలుగు గంటలవరకు మొబైల్, సిస్టమ్ లో గడిపి, ఆ తరువాత నిద్రపోతారు. ఉదయం ఎప్పుడో 9 గంటలకు లేస్తారు. ఆ సమయంలో అదరాబదరా తయారయ్యి ఆఫీసులకు,కాలేజీలకు పరిగెడతారు. ఉదయం అల్పాహారం ఈ కారణంగానే చాలామందికి స్కిప్ అవుతుంది. ఆకలేస్తే పాస్ట్ ఫుడ్ సెంటర్ల మీద పడి అడ్డమైన గడ్డి తింటారు. ఈ అన్ని కారణాల వల్లా కొన్ని కామన్ సమస్యలు ఏర్పడుతున్నాయి చాలామందిలో. వీటిలో పైన ప్రస్తావించిన దృష్టిలోపం సమస్య ప్రధానమైనది.  మన కళ్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉంది. నిజానికి, పిల్లలు  పెద్దలు ఇద్దరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో ఎక్కువ సమయం గడుపడం వల్లే దృష్టిలోపం సమస్య ఏర్పడుతోందనేది వాస్తవం. ఇది చిన్న వయస్సులోనే కంటి సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ ఎడెమా, కంటిశుక్లం  గ్లాకోమా వంటి దృష్టి సమస్యలకు ఈ అలవాటు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితులలో  కంటి చూపును పెంచే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి దృష్టిలోపాన్ని సరిదిద్దుకోవడం మంచిది. దృష్టి సామర్థ్యం పెరగడానికి సింపుల్ గా అందరూ చేయగలిగే మూడు టిప్స్ ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా చేస్తే కేవలం నెలరోజుల్లోపు దృష్టిసామర్థ్యం ఎంతో పెరుగుతుంది.  ఆ టిప్స్ ఏంటో  తెలుసుకుంటే..   అరచేతులతో అద్బుతం.. ఉదయం లేవగానే అరచేతులు రుద్దుకుని కళ్ళకు అద్దుకోవడం చాలామంది చేస్తారు. నిజానికి ఇది దృష్టి సామర్యాన్ని పెంచుతుంది. అరచేతులలో నరాలు, కళ్ల చుట్టూ ఉన్న నరాలకు మధ్య జరిగే సున్నితమైన స్పర్శ  కంటి నరాలను ఉత్తేజం చేస్తుంది.  అరచేతులు వెచ్చగా మారే వరకు  గట్టిగా రుద్దాలి.తరువాత వీటిని  మూసిన కనురెప్పలపై సున్నితంగా  ఉంచాలి. ఈ సందర్భంలో ఎలాంటి ఒత్తిడి ఉపయోగించకూడదు.  చేతుల వెచ్చదనం  కళ్లలోకి ప్రసారమవుతుంది. ఇది కండరాలకు విశ్రాంతినిస్తుంది. నరాలనుకు శక్తిని ఇస్తుంది. రెప్పలు చేసేమాయ.. కనురెప్పలు వాల్చకుండా తదేకంగా సిస్టమ్ లేదా మొబైల్ వైపు చూడటం వల్ల కళ్లు చాలా తొందరగా అలసిపోతాయి. కనురెప్పలు ఆర్పడమనే వ్యాయామం ఇందుకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యాయామం సులభంగానూ, ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని ఆచరించాలంటే హాయిగా కళ్లు తెరిచి కూర్చోవాలి. దాదాపు 10 సార్లు వేగంగా రెప్పవేసి, ఆపై 20 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటూ మీ శ్వాసపై దృష్టి సారిస్తూ కళ్లు మూసుకోవాలి. దీన్ని సుమారు 5 సార్లు రిపీట్ చేయండి. ఆరుతూ, వెలుగుతూ ఉండే విద్యుత్ దీపాలు చూడటం, వెలుగుతున్న దీపాన్ని తదేకంగా చూడటం వంటి వ్యాయామాలు  కళ్లను లూబ్రికేట్ చేయడంలో సహాయపడతాయి.  ఎక్కువ సేపు స్క్రీన్‌లను చూస్తూ ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తాయి. కంటి భ్రమణం..  తలను కదల్చకుండా కళ్ళను సవ్యదిశలో కదిలించి, ఆపై ప్రతి దిశలో 5-10 నిమిషాలు అపసవ్య దిశలో ఉంచాలి. సింపుల్ గా చెప్పాలంటే కళ్ళను క్లాక్ వైజ్ లో తిప్పాలి, ఆ తరువాత అపసవ్య దిశలో ఇదే విధంగా చేయాలి. ఇలా  కళ్లను తిప్పడం వల్ల కళ్ల కండరాల దృఢంగా మారతాయి.  రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.                                                                     *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా  ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. చాలామంది ఆరోగ్య స్పృహతో తినే ధాన్యాలలో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పు ఆహారంగానే కాకుండా ఆయుర్వేదంలోనూ, వైద్యంలోనూ మంచి ఔషదంగా కూడా పరిగణిస్తారు. అయితే  చాలామంది ధాన్యాలను మొలకెత్తించి తినడం చూస్తుంటాం. శనగలు, పెసలు, బొబ్బర్లు వంటి ధాన్యాలు తరచుగా తింటూ ఉంటారు. అయితే మొలకెత్తిన పెసలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు.  ఈ లాభాలేంటో తెలుసుకుంటే.. మొలకెత్తిన పెసలు  బరువు తగ్గించడంలో  సహాయపడుతాయి.  రోజూ ఉదయాన్నే మొలకెత్తిన పెసలు తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తొందరగా ఆకలి వేయకుండా కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఇది మాత్రమే కాదు.. మొలకెత్తిన పెసలలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు పెరగనీయవు. ఇక మొలకెత్తిన పెసలు  కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఎందుకంటే ఇందులో విటమిన్ 'A' ఉంటుంది. ఇది కాకుండా  ఉబ్బరం,  కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలలో  కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో  మొలకెత్తిన పెసలు  సహాయపడుతాయి.  అధిక గ్యాస్, అజీర్ణం,  ఉబ్బరంతో బాధపడేవారు మొలకెత్తిన  పెసలను  తినవచ్చు. ఇది  బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.  మొలకెత్తిన పెసలను  తీసుకోవడం వల్ల రోజంతా  శక్తివంతంగా ఉండచ్చు.  దీన్ని తినడం వల్ల సోమరితనం లేదా బద్దకం దరిచేరదు. మరీ ముఖ్యంగా మొలకెత్తిన పెసలు  శరీరానికి చలువ చేస్తాయి. దీని కారణంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తాయి. వేసవి తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి.                                                  *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.                                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...