LATEST NEWS
 రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. నందినగర్ లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్.. ఈ రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాలను చూసిన ప్రజలు ఆ పార్టీకి మరో రెండు దశాబ్దాల పాటు ఓటు వేయరన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో   బీఆర్ఎస్ బ‌లోపేతం,  స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ .  స్థానిక సంస్థల ఎన్నికల్లో  మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను  ఈ సందర్భంగా అభినందించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న కేటీఆర్.. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై ఒకే సారి దాదాపు వెయ్యి రూపాలయలు పెంచడం అందులో ఒకటన్నారు. గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  
బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.   కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,  పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.   ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.   ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.   సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు.  నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.   
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నుంచి బయటకు వచ్చి సొంత రాజకీయ వేదికను టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న   కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్నిప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె..  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే   ప్రధాన ధ్యేయమన్నారు.  ఈ పోరాటంలో జెన్-జీగా పిలువబడే నేటి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత  ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పంథాను మార్చుకోబోతున్నట్లు వెల్లడించారు. కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతరం ఆలోచనలు, వారి అవసరాలు గతానికి భిన్నంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. స్క్రీన్లపై సమయం గడుపుతున్నారని యువతను విమర్శించే బదులు.. అదే డిజిటల్ వేదికలను వారి గొంతుకగా మార్చుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని..  అందుకే ఆ పార్టీని ఓడించేందుకు యువశక్తిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో యువత  కేవలం ఓటర్లుగానే కాకుండా, నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత చెప్పారు. తన పార్టీలో జెన్-జీ ప్రతినిధులకు పెద్దపీట వేస్తానని..  సమాజంలో వెనుకబడిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, విద్యా సంబంధిత సమస్యలపై పోరాటమే తన అజెండా  అన్న కవిత.. రాష్ట్రంలో  రేవంత్ సర్కార్   వైఫల్యాలను ఎండగట్టడంలో యువతే ముందువరుసలో ఉంటారని  విశ్వాసం వ్యక్తం చేశారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  జారీ చేసిన నోటిఫికేషన్లలో వయోపరిమితి సడలింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జీవో 30ని యథాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ, తెలంగాణ సెంటిమెంట్‌ను, యువత ఆకాంక్షలను కలగలిపి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
తెలంగాణ రాజకీయాల్లో   భారత రాష్ట్ర సమితి  అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏప్రిల్ గత నెల 25న టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆమె తన కొత్త పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాలలోనే కాదు, ఏపీ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించారు. కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా కల్వకుంట్ల కవిత.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేతపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన తండ్రిని మరమనిషి అన్నారు, గుంటనక్కల చేతిలో బందీ అని విమర్శించారు. ఈ పరిణామం సహజంగానే తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ లో పెను ప్రకంపనలకు కారణమైంది.  అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది.   టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ   ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ మధ్య ఒక అవగాహన ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వారిరువురూ ఒకరికొకరు అందించుకున్న సహకారం సంగతి తెలిసిందే.  ఆ సహకారం, స్నేహం ఇప్పుడు.. అంటే రెండు పార్టీలూ కూడా వాటి వాటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతోందని పరిశీలకులు సోదాహరణంగా ఉదహరి స్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు కవిత సొంతంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే కాకుండా... ఆ సందర్భంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఊరుకోకుండా.. బీఆర్ఎస్ ను ఆత్మ లేని పార్టీగా అభివర్ణించారు.  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి. కవితను విమర్శించ లేక, ఆమె విమర్శలను తిప్పి కొట్టలేక నాయకత్వం మౌనాన్ని ఆశ్రయిస్తే.. బీఆర్ఎస్ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ పరిస్థితి వైసీపీ అధినేత జగన్ కు ఒక బలమైన మిత్రుడి అండ లేకుండా చేసిందంటున్నారు పరిశీలకులు.   అదే సమయంలో..   టీడీపీ, జనసేన పార్టీలు.. కల్వకుంట్ల కుటుంబంలో తలెత్తిన విభేదాలను ఉదహరిస్తూ..  కుటుంబ రాజకీయాల వల్ల పార్టీలు ఎలా దెబ్బతింటాయో చెప్పడానికి కవిత ఉదంతాన్ని టీడీపీ-జనసేన శ్రేణులు ఉదహరిస్తున్నాయి. అదే తెలంగాణలో కవిత తిరుగుబాటును చూపిస్తూ, ఏపీలో కూడా వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇదొక సంకేతమని   ప్రచారం చేస్తున్నారు. రాజకీయ అధికారం ఒకే కుటుంబం చుట్టూ తిరిగితే జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించడానికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఈ పరిణామాలను తమ ప్రసంగాల్లో వాడుకుంటున్నారు. జగన్ కూడాతన సొంత తల్లి, చెల్లిని దూరం పెట్టి అధికారం కోసం పాకులాడిన తీరును ఎత్తి చూపుతూ.. కవిత తన తండ్రికి అధికారంపై అపేక్ష మమకారాన్ని దూరం చేసిందని విమర్శించడాన్ని ప్రస్తావిస్తున్నారు.  ఇక పోతే.. తెలంగాణ సెంటిమెంట్‌ను కాపాడటమే తన లక్ష్యమని కవిత చెబుతున్నప్పటికీ..  ఆమె అడుగులు బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే, గతంలో బీఆర్ఎస్ నుంచి వైసీపీకి  అందిన, ప్రస్తుతం అందుతున్న, నైతిక సహకారం ఇకపై అందే అవకాశం వైసీపీకి ఉండదు.  ఇది ఏపీలో కూటమి ప్రభుత్వం తన పట్టును మరింత బిగించుకోవడానికి సహాయపడుతుంది.    భవిష్యత్తులో కవిత పార్టీ వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏపీలో మాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి సానుకూల పవనాలను ఇస్తోంది. పొరుగురాష్ట్రంలో మిత్రుడి  బలం తగ్గడం, అంతర్గత కలహాలతో బలహీనపడటం వంటివి వైసీపీకి రాబోయే కాలంలో  సవాళ్లను విసిరేలా ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి మొదలైన ఈ రాజకీయ తుపాను  ఏపీలో వైసీపీని బలహీనపరిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో సినిమా వస్తోంది అనగానే ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మాస్ యాక్షన్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కలగలిపిన కథలను అందించడంలో కొరటాల దిట్ట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారు కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే అంశంపై మళ్లింది. ముఖ్యంగా బాలయ్య లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్‌లో లేరా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. థమన్ - బాలయ్య హిట్ కాంబోకు బ్రేక్? గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాలకు థమన్ వెన్నెముకగా నిలుస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా థమన్ ఇచ్చే మాస్ మ్యూజిక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. అయితే, కొరటాల శివ సినిమాలో థమన్ పేరు వినిపించకపోవడం నందమూరి అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లైన్లోకి అనిరుధ్ రవిచందర్? ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'దేవర' చిత్రానికి అనిరుధ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఆ బాండింగ్‌తోనే బాలయ్య సినిమాకు కూడా అనిరుధ్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ కనుక ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, బాలయ్య సినిమాకు సరికొత్త సౌండింగ్ లభించడం ఖాయం.  
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన  'జెట్లీ' సినిమా ప్రదర్శనను కొన్ని స్క్రీన్స్ లో నిలిపివేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.  తాజాగా జరిగిన 'జెట్లీ' (JETLEE) మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత చెర్రీ పాల్గొని, ఈ ఇష్యూపై స్పందించారు. 'పెద్ది' (Peddi) వంటి భారీ చిత్రం త్వరలో విడుదల కానున్న  నేపథ్యంతో ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదానికి అసలు కారణం ఏమిటి? సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సెంటేజ్ బేసిస్‌లో సినిమాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే టికెట్ ఆదాయంలో తమకు నిర్ణీత వాటా ఉండాలని వారి వాదన. అయితే, మే 1 నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తేనే థియేటర్లు ఇస్తామని ఎగ్జిబిటర్లు భీష్మించుకోవడంతో సమస్య మొదలైంది. దీనివల్ల 'జెట్లీ' సినిమా విడుదల రోజు ఇబ్బందులు ఎదుర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ సిస్టమ్ కి ఒప్పుకోకపోతే.. మల్టీప్లెక్స్ లోనూ ప్రదర్శించబోమని కొందరు షాకిచ్చారు. నిర్మాత చెర్రీ వివరణ: హైదరాబాద్‌లో జరిగిన 'జెట్లీ' సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చెర్రీ, ఈ సమస్యపై స్పష్టత ఇచ్చారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు ఏప్రిల్ 30 రాత్రి వరకు జరిగినా ఒక కొలిక్కి రాలేదని ఆయన తెలిపారు. "సింగిల్ స్క్రీన్లలో ఏవైనా సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరించుకోవాలి కానీ, మల్టీప్లెక్స్ స్క్రీన్లను అడ్డుపెట్టుకుని ఒత్తిడి తీసుకురావడం సరికాదు" అని డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆయన ప్రస్తావించారు. థియేటర్ల సమస్యను పరిష్కరించేందుకు మే 8న ఒక ముఖ్యమైన మీటింగ్ జరగబోతోందని ఆయన వెల్లడించారు. ఈ మీటింగ్‌లో ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చుని చర్చించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పెద్ది' విడుదలపై ప్రభావం ఉంటుందా? రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా ఈ వివాద ప్రభావం ఉంటుందా? అన్న ప్రశ్నకు చెర్రీ సమాధానమిస్తూ.. మే 8న ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక కీలక సమావేశం జరగనుందని, అప్పుడు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 'జెట్లీ' ప్రదర్శనలకు ఎగ్జిబిటర్లు అంగీకరించారని.. నిర్మాతలైనా, ఎగ్జిబిటర్లైనా ఒకే కుటుంబం వంటి వారని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నిలబడాలంటే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు సమన్వయంతో ముందుకు సాగాలి. 'జెట్లీ' వంటి చిన్న సినిమాల నుంచి 'పెద్ది' వంటి భారీ చిత్రాల వరకు అందరికీ థియేటర్ల మద్దతు అవసరం. మే 8న జరగబోయే చర్చలతో ఈ వివాదం ముగిసి, టాలీవుడ్ సాధారణ స్థితికి చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు.  
  విక్టరీ వెంకటేష్(Venkatesh),త్రివిక్రమ్(Trivikram)కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ఉరఫ్ ఏకే 47(Ak 47)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమ్మని ఆవకాయని ఎలా అయితే మర్చిపోమో, ఏకే 47   ని కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోకుండా చేయాలనే పట్టుదలతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆ పట్టుదలని నిజం చేసే బాధ్యతని థమన్(Thaman)కూడా తీసుకున్నాడు.  కొన్ని రోజుల నుంచి  ఏకే 47 కి థమన్ మ్యూజిక్ ని అందించబోతున్నాడనే న్యూస్ సినీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు ఆ న్యూస్ కి తధాస్తు దేవతలు తధాస్తు అనేసారు.త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఒక  పిక్ ని థమన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చానని  తెలిపాడు. ఏకే 47 లో మొదటి సంగీత దర్శకుడు  యానిమల్ ఫేమ్  హర్షవర్ధన్ రామేశ్వర్. also read: Bellamkonda sai sreenivas: నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్   మరి ఏకే 47 కి థమన్ అల వైకుంఠ పురం రేంజ్ లో ట్యూన్స్ ఇచ్చి త్రివిక్రమ్ ని ఖుషి చేస్తాడేమో చూడాలి. వెంకటేష్  తో మాత్రం మూడో మూవీ. షాడో, వెంకీ మామకి థమనే.    
The Tollywood circles are buzzing with a sudden and unexpected change in the music department of director Trivikram Srinivas's highly anticipated family entertainer with Venkatesh Daggubati, tentatively titled Adarsha Kutumbam House No: 47 (AK47). In a surprising twist, music composer Thaman S has officially stepped in to take over the project, replacing Harshavardhan Rameshwar.   What makes this development pure gossip gold is the abrupt nature of the switch. Just days ago, Harshavardhan, who recently caught everyone's attention with his sensational score for Animal, confidently denied any rumors of his exit from the film. However, insiders whisper that the young composer was completely kept in the dark about the change. Word on the street is that without any formal intimation or discussion with Harshavardhan, Trivikram went ahead and roped in his trusted collaborator, Thaman.   Thaman even took to social media to share a picture with the director, confirming the start of their new musical journey together. The exact reasons for this unceremonious exit remain a closely guarded secret, though industry murmurs hint at sudden creative differences. Whatever the actual truth may be, this quiet but drastic replacement has definitely set tongues wagging across the Telugu film industry.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డు ఇచ్చేసి కావ్యరెడ్డితో ఇక నేను నీ మొగుడ్ని అని చెప్పిన విషయం తెలిసిందే. బెల్లంకొండ కూడా కళ్ళు తెరిచే మూసే లోపే  తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి పాదాల దగ్గర పెళ్లి, హైదరాబాద్ లో రిసిప్షన్ చక చక జరిగిపోయాయి. సోషల్ మీడియా కూడా ఆ వేడుక చకచకా అయిపోయిందని డల్ గా ఉన్న సమయంలో బెల్లంకొండ చేసిన నా పెళ్ళాం నిప్పురా పోస్ట్ సోషల్ మీడియాని కళకళ లాడేలా చేస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.  బెల్లంకొండ రీసెంట్ గా ట్విట్టర్ లో కావ్యరెడ్డిని పరిచయం చేస్తూ ‘నా పెళ్ళాం నిప్పురా' అనే పోస్ట్ చేసి పెళ్లి ఫోటోలు షేర్ చేసాడు. దీంతో  ఎందుకు అలా పోస్ట్ చేసాడో అనేది కొంత మందికి అర్ధం కాలేదు. తాను నటించిన జయ జానకి నాయక మూవీలో నటుడు జయప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ ,శ్రీనివాస్ పై ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. జయప్రకాశ్ కూతురుగా రకుల్ కనిపించింది. సదరు సీన్ యొక్క ఉదేశ్యం ప్రకారం  రకుల్ ప్రీత్ సింగ్ ని ఉద్దేశిస్తూ  నీ కూతురు నిప్పురా అనే  డైలాగ్ ని బెల్లకొండ చెప్తాడు. ఆ డైలాగ్ నే పోస్ట్ చేసి    మంచి ఫన్ ని క్రియేట్ చేసాడు.   Also read: Kiara Advani: యష్ తో చేసిన ఆ బోల్డ్ సీన్స్ తొలగించండి.. కియారా రిక్వెస్ట్!          
విజయ్ ఆంటోని (Vijay Antony), శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ పాట అంటే అందరూ ఆ పాటనే ఎంచుకుంటారు. మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని, శశి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వీరి కాంబోలో ‘బిచ్చగాడు’ తరువాత ‘వంద దేవుళ్ళు’ (Vanda Devullu) అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా ‘వంద దేవుళ్ళు’ నుంచి ‘అమ్మ అమ్మేగా’ అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను విడుదల చేశారు. వంద దేవుళ్లే దిగివచ్చినా అని భాష్యశ్రీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో.. మళ్లీ ఇప్పుడు ‘అమ్మ అమ్మేగా’ అని అందరినీ మెప్పించేందుకు వచ్చారు. ‘అమ్మ అమ్మేగా’ అనే ఈ పాటకి భాష్యశ్రీ సాహిత్యం, బాలాజీ శ్రీరామ్ బాణీ, శ్రీకాంత్ హరిహరణ్ గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ పాటను వింటే అమ్మ విలువ ఏంటో మరోసారి అర్థం అయ్యేలా ఉంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.  
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో భారీ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా ఇది. 'NBK112' వర్కింగ్ టైటిల్ రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కొరటాల మార్క్ పొలిటికల్ డ్రామా దర్శకుడు కొరటాల శివ తన సినిమాల్లో సామాజిక బాధ్యతతో కూడిన అంశాలను చర్చిస్తూనే, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా జోడిస్తారు. గతంలో 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూపించి మెప్పించిన కొరటాల, ఇప్పుడు బాలయ్య కోసం అంతకు మించిన పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  "పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఏ మూవ్‌మెంట్" (Power Meets Purpose.. Mass Becomes A Movement) అనే క్యాప్షన్‌తో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా మూడ్‌ను క్లియర్ గా ఎలివేట్ చేస్తోంది. ఈ కథలో బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ మేకింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా నటసింహాం గర్జన బాలకృష్ణకు రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో 'అధినాయకుడు' వంటి చిత్రాల్లో రాజకీయ నాయకుడిగా కనిపించినా.. ఇప్పుడు కొరటాల శివ డిజైన్ చేసిన సీఎం పాత్ర చాలా హుందాగా, అదే సమయంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఉంటుందని టాక్. సమాజంలోని అవినీతిని అంతం చేసే ఒక నిజాయితీ గల నాయకుడిగా బాలయ్య నటన ఈ సినిమాకు హైలైట్ కానుంది అంటున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ క్లాస్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్రలో బాలయ్యను ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.  
  -రిలీజ్ కి ముందే పలు సంచలనాలకి కేంద్ర బిందువుగా  టాక్సిక్  -కియారా, యష్ మధ్య బోల్డ్ సీన్స్ -దయచేసి కట్ చెయ్యడంటున్న కియారా -మేకర్స్ ఏం చేయబోతున్నారు టాప్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani)అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్(Toxic). పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. రిలీజ్ డేట్ విషయంలో తడబాటుకి గురువవుతున్న టాక్సిక్ కి ఇప్పుడు కియారా అద్వానీ షాక్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.  రీసెంట్ గా కియారా టాక్సిక్ ఫైనల్ కట్ చూసిందట. దీంతో తనపై యష్(Yash)పై చిత్రీకరించిన బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ని తిలగించమని దర్శకురాలు గీతూమోహన్ దాస్ ని రిక్వెస్ట్ చేస్తుందనే  మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సదరు సీన్స్ శృతి మించి ఉండటమే కియారా రిక్వెస్ట్ కి  కారణమని తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టాక్సిక్ టాపిక్ మరో సారి వైరల్ గా మారింది. Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు అదిరిపోయే న్యూస్    ఈ విషయంపై  సినీ ప్రియులు స్పందిస్తు కియారా అద్వానీ గ్లామర్ గా చెయ్యడానికి ఏ మాత్రం వెనుకాడదు. కానీ అలాంటి కియారానే సీన్స్ తొలగించమని కోరుతు ఉందంటే ఏ స్థాయిలో బోల్డ్ సీన్స్ తెరకెక్కి ఉంటాయో అనే కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ రిలీజైనప్పుడు కూడా అసభ్యత శృతిమించి ఉందనే విమర్శలు విషయం తెలిసిందే. ఏది ఏమైనా రిలీజ్ కి ముందే టాక్సిక్ పలు సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతుంది. డ్రగ్ మాఫియా  క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో  టాక్సిక్ రూపొందింది.     
  సమ్మర్ తన ప్రతాపాన్ని ఎంతగా  చూపిస్తున్నా సరికొత్త తాజా సినీ న్యూస్ సమ్మర్ సెగని సినీ ప్రియులకి కలగకుండా చేస్తున్నాయి.  మరి ఈ రోజు ఉన్న సినీ న్యూస్ ఏంటో చూద్దాం  1 . బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు..వైరల్ గా మారిన పిక్స్  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ గా కూడా మారాయి. దీంతో అక్కడ్నుంచి రాగానే వారణాసి షూట్ ని స్టార్ట్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ మహేష్ వెళ్ళింది జర్మనీలో ఎంజాయ్ చేయడానికి కాదు. అక్కడున్న అడవుల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి. ఈ విషయం మహేష్ రీసెంట్ గా చేసిన పోస్ట్ లతో అర్ధమవుతుంది.ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటు వారణాసి కోసం సిద్దమవుతున్నట్టుగా క్యాప్షన్ ఉంచాడు. ట్రెక్కింగ్ పిక్స్ వైరల్ గా మారాయి. 2 . రవిబాబు వర్సస్ 'పెద్ది'   'పెద్ది'  రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.  కానీ పలు డేట్స్ నుంచి వాయిదా పడటం తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు రవిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్ద సినిమాలు రాకపోయినా, రావని చెప్పకుండా మిగతా సినిమాలని  భయపెడుతూ థియేటర్లని ఖాళీగా ఉంచుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పెద్ది వర్సస్ రవిబాబుగా మారిపోయింది. జూన్ 4 న పెద్ది బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. 3 .సోషల్ మీడియాలో అఖిల్ అభిమానుల సందడి  లెనిన్ జూన్ 26 న థియేటర్స్ లోకి అడుగుపెడుతుంది. పెద్ది జూన్ 25 న వస్తుందని అనుకున్నా జూన్ 4 కి వెళ్లిపోయింది. దీంతో అఖిల్ ఎలాంటి పోటీ లేకుండా సోలో గా ఉంటాడని,  పాజిటివ్ టాక్ వస్తే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయమని ఫ్యాన్స్  హంగామా చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హయ్యెస్ట్ మూవీ కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్  4 .అంతకు వెయ్యి రెట్లు బాధ అనుభవించాలి.. నా మద్దతు ఆ పార్టీకే అంటున్న రష్మీ    తిరుపతిలో వైసీపి నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఒక ఎడ్లబండిపై ఆటోను ఉంచి ఎద్దులతో లాగించడంపై యాంకర్ నటి  రష్మీ స్పందిస్తు ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు వెయ్యి రెట్లు అధికంగా బాధపడాలనే వ్యాఖ్యలు చేసింది. దీంతో కొంత మంది వైసీపి నాయకులు రష్మీని వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వీటిపై కూడా రష్మీ స్పందిస్తు అవమానాలు నాకేం కొత్త కాదు. జంతువులపై జరిగే హింస విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం పాటుపడుతుందో ఆ పార్టీకి బహిరంగ మద్దతు ఇస్తానని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. 5 . తొలి రోజు షాకింగ్ కలెక్షన్స్ రాబట్టిన జెట్లీ, గాయపడిన సింహం  నిన్న వరల్డ్ వైడ్ గా జెట్లీ, గాయపడ్డ సింహం చిత్రాలు రిలీజయ్యాయి. జెట్లీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా  1 .5 కోట్ల  గ్రాస్ ని సాధించగా ,గాయపడ్డ సింహం  కోటి రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తుంది. మంచి అంచనాలతో వచ్చిన ఈ రెండు చిత్రాలు తొలి రోజు తక్కువ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టడం పలువుర్ని ఆశ్చర్యపరుస్తుంది. మేకర్స్ మాత్రం కలెక్షన్స్ వివరాలని అధికారకంగా వెల్లడి చెయ్యలేదు. 6 .దయచేసి టాక్సిక్ లో నా రొమాన్స్ సీన్స్ కట్ చేయండంటున్న కియారా అద్వానీ  స్టార్ హీరోయిన్ కియారా టాక్సిక్ లో యష్ తో జత కట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా కియారా టాక్సిక్ ఫైనల్ కట్ చూసిందట. దీంతో తనపై యష్ పై చిత్రీకరించిన బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ని తిలగించమని దర్శకురాలు గీతూమోహన్ దాస్ ని రీక్వెస్ట్ చేసిందనే మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సదరు సీన్స్ శృతి మించి ఉండటమే అందుకు కారణమని తెలుస్తుంది. 7. ఆస్కార్స్ కొత్త రూల్స్: ఏఐ కంటెంట్‌పై బ్యాన్ సినిమాల్లో పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్కార్స్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏఐ కంటెంట్‌పై బ్యాన్ విధించడంతో పాటు, ఒకే దేశం నుంచి పలు సినిమాలు పోటీలో ఉండే అవకాశం కల్పించారు. అలాగే ఒకే నటుడు ఒకేసారి అనేక సినిమాలకు నామినేట్ కావచ్చని తెలిపారు. ఈ మార్పులు 2027లో జరిగే 99వ అకాడమీ అవార్డ్స్ నుంచి అమల్లోకి రానున్నాయి. 8 . విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్‌లోకి కృతి సనన్  విజయ్ దేవరకొండ ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న రణబలి, రౌడీ జనార్ధన తర్వాత హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలో విజయ్ సరసన  కృతి సనన్ చేయబోతోందనే న్యూస్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే క్రేజీ కాంబో అని చెప్పవచ్చు. మరి ఈ విషయంపై  అధికారిక ప్రకటన వస్తుందేమో   చూడాలి. 9 .నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ శ్రీనివాస్  కొత్త పెళ్లి కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ మంచి ఫన్ గా మారింది. తన శ్రీమతి కావ్యరెడ్డిని పరిచయం చేస్తూ ‘నా పెళ్ళాం నిప్పురా’ అంటూ మంచి ఫన్ ని జెనరేట్ చేసాడు. అయితే ఈ పర్టిక్యులర్ లైన్ ఎందుకు పెట్టాడో అనేది చాలామందికి ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది. తాను నటించిన జయ జానకి నాయక మూవీలో నటుడు జయప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ ,శ్రీనివాస్ పై ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. సదరు సీన్ లోని  నీ కూతురు నిప్పురా అనే డైలాగ్ ఉన్న విషయం తెలిసిందే. 10 . త్రివిక్రమ్, వెంకీ తో చేతులు కలిపిన థమన్  విక్టరీ వెంకటేష్,త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం యొక్క సంగీత బాధ్యతల  నుంచి యానిమల్ ఫేమ్  హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో థమన్ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఒక  పిక్ ని థమన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపాడు.        
వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), నవీన్ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రల్లో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ హారర్–యాక్షన్ థ్రిల్లర్ మే 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించిన  కృష్ణసాయి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న అభిమాన న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. "వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, నవీన్ చంద్ర చంద్ర గారి క్రేజీ కాంబినేష‌న్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.  'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ సినిమా కథ, పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రిని ఖ‌చ్చితంగా అల‌రిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. మే 22న విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాం." అన్నారు. విభిన్నమైన కథా నేపథ్యం, బలమైన నటీనటుల సమాహారం, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!