LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  చాలా కాలం విరామం తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. ఇంత కాలం బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై అడపాదడపా చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లతో సరిపెట్టేశారు. మధ్యలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో పరామర్శల పేరుతో బయటకు వచ్చినా గత రెండేళ్లుగా పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ లేదనే చెప్పాలి. ఇప్పుడు ఇక ఆయన   నెమ్మదిగా   బయటకు వస్తున్నారు. తాజాగా బుధవారం (ఆగస్టు 4) పొగాకు రైతులకు మద్దతుగా ఆయన  దేవరపల్లి  వచ్చారు. వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది. ఒక విధంగా చెప్పాలంటే.. తెలుగుదేశం కూటమిపై విమర్శలు,  వెన్నుపోటు, అక్రమ అరెస్టుల వ్యాఖ్యలతో ఆవు కథే మళ్లీ మళ్లీ  చెప్పారనిపించేలా ఆయన ప్రసంగం ఉంది.   చంద్రబాబును,  తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీగా అభివర్ణించారు. చాలా చాలా ఏళ్లుగా జగన్ విమర్శలు ఇవే. ఇక అక్రమ అరెస్టుల గురించి ఆయన చేసిన విమర్శలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారులను, నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నదనీ, అక్రమకేసులు బనాయిస్తోందని జగన్ విమర్శించారు. అయితే జగన్ విమర్శలలో పస లేదని పరిశీలకులు అంటున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టు, తమ్మినేని సీతారాంపై కేసులను ప్రస్తావిస్తూ పరిశీలకులు వాటిలో రాజకీయం ఎక్కడుందనీ, నేరాలకు పాల్పడినా వైసీపీయులు అని చట్టం వదిలేయాలా అని ప్రశ్నిస్తున్నారు.  అదలా ఉంచితే గత రెండేళ్లుగా జగన్  వారానికో రెండు వారాలకో ఓసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవే మాటలు చెబుతున్న సంగతిని ప్రస్తావిస్తూ.. దేవరపల్లిలో జగన్ ప్రసంగం రొటీన్ గా ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రసంగాలు, విమర్శల పట్ల జగన్ మద్దతు దారులు కూడా పెదవి విరుస్తున్నారు.   YS Jagan Devarapalli Tour, TDP Governmen, t Tobacco Farmers Issue,   Jagan Political Comments, APnews, TeluguOne 
 వైసీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందా? ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  వైసీపీలో  కీలక నేతగా గుర్తింపు పొందిన తమ్మినేని  ఇటీవలి కాలంలో వరుస వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో సతమతమౌతున్నారు. అలాగే వైసీపీలో కూడా ఆయనకు పెద్దగా ప్రాముఖ్యత లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.   ఇటీవల వెలుగుచూసిన   ఆస్తి వివాదం,  నకిలీ  డెత్ సర్టిఫికెట్ తో  భూ కబ్జా కుట్ర ఆరోపణలు తమ్మినేని ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో తమ్మినేనితో పాటు ఆయన సతీమణి వాణిశ్రీ, కుమారుడు వెంకట శ్రీరామ్ లు నిందితులుగా ఉన్నారు. అరెస్టును తప్పించుకోవడానికి తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు కూడా.  పరారీలో ఉండగానే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందిన తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిలు లభించని ఆయన కుమారుడు  శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయి బెయిలు పొందారు.   హైకోర్టు ధర్మాసనం కూడా తమ్మినేని సీతారాం,  ఆయన భార్యపై తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది.  ఇదంతా ఒకెత్తయితే.. ఈ కేసు విషయంలో తమ్మినేనికి వైసీపీ నుంచి ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.   2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు.   వైసీపీ అధినేత జగన్ కూడా  తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అన్నిటినీ ఓర్చుకుంటూ పార్టీలో కొనసాగుతున్న తనకు క్లిష్ట సమయంలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించకపోవడంతో తమ్మినేని మనసు విరిగి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి నిర్ణయించుకున్నారంటున్నారు.  ఏ క్షణంలోనైనా తమ్మినేని సీతారాం వైసీపీకి రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. Thammineni Seetharam,   Resignation, AP Former Speaker,  Srikakulam Property Dispute  
వైసీపీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులు మరోసారి బహిర్గతమయ్యాయి. గతంలో  వైసీపీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ  కోసం ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్..  తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తన భార్యతో కలిసి రోడ్డుపై బైఠాయించి  నిరసన వ్యక్తంచేశారు. వైసీపీ అగ్రనాయకత్వం తనను వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ ధర్నా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో   నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై బోరుగడ్డ అనిల్  తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. జగన్ టైమిస్తే.. గంట, అరగంటలో  చంద్రబాబు, లోకేష్ లను లేపేస్తానంటూ బోరుగడ్డ  నోటికొచ్చినట్లుగా దూషణలు చేశారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే..  ఇప్పుడు   వైసీపీ నాయకత్వం తనను పూర్తిగా పక్కన పెట్టిందని బోరుగడ్డ అనిల్ ఆరోపిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసుకు వెళ్తే కనీసం లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని..  ముఖ్యంగా వైసీపీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని  ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద గంటల తరబడి వేచి చూసేలా చేసి,  నువ్వు ఎవరు?  అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీ తరఫున తాను కేసులు ఎదుర్కొని జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఇప్పుడు తనను రౌడీషీటర్‌గా ముద్రవేసి దూరం పెట్టడం దారుణమంటూ బేల మాటలు మాట్లాడారు.   వైఎస్ జగన్ ఇంటి ముందే ప్రాణాలు వదులుతానని, తనకు న్యాయం జరగకపోతే వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కారుమూరి వెంకట్ రెడ్డి వంటి నేతలు సైతం తనను కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆడియో సాక్ష్యాలను బయటపెట్టారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగువన్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్  వైసీపీలో ఇది సహజ పరిణామమేనని విశ్లేషించారు.  శ్రీరెడ్డి, వర్రా రవీంద్రరెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటి వారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, ఆ తర్వాత చేతులెత్తేయడం వైసీపీ అగ్రనాయకత్వానికి అలవాటేనని   శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గతంలో విజయసాయి రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి సీనియర్లు సైతం పార్టీలోని కోటరీ వల్ల తీవ్ర అవమానాలకు గురయ్యారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెంచి పోషించిన నాయకులే ఇప్పుడు వారిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుండటం కర్మ ఫలమని విశ్లేషించారు.   పార్టీ కోసం సర్వస్వం కోల్పోయిన కార్యకర్తలకు, మద్దతుదారులకు ఈ పరిణామాలు ఒక హెచ్చరిక లాంటివని పేర్కొంటున్నారు. అయితే బోరుగడ్డ ఇలా రోడ్డున పడటానికి కారణం స్వయంగా జగనేనని డీవీ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఉదంతాన్ని గుర్తు చేశారు.   తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ దంపతుల ధర్నా వైసీపీ కోటరీ రాజకీయాలను మరోసారి ఎండగట్టిందన్న ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి అసంతృప్తులు మరిన్ని బయటపడే అవకాశం ఉందని చెప్పారు.    Borragadda Anil Dharna, Tadepalli YCP Office Protest, Borragadda Anil Vs Sajjala, YS Jagan Mohan Reddy,AP Political Updates, Telugu One
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది.  డీఎంకే నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి  ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నై పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.   తంజావూరులో ఇటీవల జరిగిన ఒక బహిరంగ సభలో  ఉదయ నిథి స్టాలిన్.. టీవీకే అధినేత, సీఎం  విజయ్, సినీ నటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి  స్టాలిన్  సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు  తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.  ఈ వ్యవహారంపై తెలుగు వన్ చానల్  డిబేట్ లో సీనియర్ జర్నలిస్టులు వీవీరావు, గోపీ..    ఉదయనిధి అరెస్ట్ వ్యవహారంలో విజయ్ ప్రభుత్వం   తొందరపాటుగా వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు.  సభల్లో మాట్లాడే వ్యాఖ్యలను ఎదుర్కోవడానికి ప్రజాక్షేత్రం ఉండగా, అధికారాన్ని ఉపయోగించి తక్షణ  అరెస్టులకు పాల్పడటం విజయ్ రాజకీయ అనుభవ రాహిత్యానికి, అపరిపక్వతకు అద్దం పడుతోందని విశ్లేషించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తే, అది చివరికి బాధితుడికి రాజకీయంగా  సానుభూతి తెచ్చిపెడుతుందనడానికి చరిత్రలో అనేక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో తమిళనాడులో కరుణానిధి అరెస్ట్ ఘటన, తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అరెస్టు పరిణామాలు వారికి ప్రజాదరణను పెంచాయన్నారు.  ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ విషయంలో కూడా విజయ్ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లి అంతిమంగా డీఎంకేకు ప్రయోజనం చేకూరుస్తుందని వీవీరావు చెప్పారు.  మరోవైపు నటి త్రిష పేరును ఈ వివాదంలోకి లాగడం, టీవీకే కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తంచేయడం వివాదాన్ని మరింత రాజేసింది. కేవలం క్షమాపణలు డిమాండ్ చేయడమో లేదా రాజకీయంగా తిప్పికొట్టడమో చేయకుండా, ఇలా పోలీసు బలగాలను ఉపయోగించడం వల్ల ఉదయనిధి ప్రతిష్ట దెబ్బతినడం కంటే ఆయనకు మైలేజ్ పెరిగే అవకాశమే ఉందన్నారు.   Udhayanidhi Stalin Arrest, Vijay Immature Politics, TVK vs DMK, Tamil Nadu Politics, Tone News News Analysis
దేశ రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని గుర్తింపు పొంది.. ఇప్పుడు తన స్వరాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఇటీవల రాష్ట్రంలోని బంకిపునా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాలలో తొలి అడుగు వేశారు.    బంకీపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం తొలి సారిగా మీడియా సమావేవంలో మాట్లాడిన ఆయన బీహార్ తక్షణావసరాలు పొత్తులు కాదనీ, పరిశ్రమలూ ఉద్యోగా లన్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం పొత్తులు, రాజకీయ సమీకరణాలపైనే దృష్టి పెడుతోందని విమర్శించారు.  అయితే రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. తమ పార్టీకి ఇతర పార్టీలతో ఎటువంటి పొత్తూ ఉండదని కుండబద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్..  జనసురాజ్  అలయెన్స్ బీహార్ ప్రజలతో మాత్రమేనన్నారు.  స్వార్థ రాజకీయాల కోసం సిద్ధాంతాలను పక్కనబెట్టి  కొలువుదీరే సంకీర్ణ ప్రభుత్వాల వల్లు రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం లేదన్నారు.  జన సురాజ్ పార్టీ   లక్ష్యం అధికారం కాదనీ, సుపరిపాలన, పారదర్శకత,  సమగ్ర అభివృద్ధి మాత్రమేనని క్లియర్ కట్ గా చెప్పారు. అధకారం కంటే ప్రజాసంక్షేమం, అభివృద్ధే జనసురాజ్ పార్టీకి ముఖ్యమన్నారు.  Prashant Kishor,  Jan Suraaj Party, Bihar Jobs and Industrialization, Bihar Politics, Bankipur Bypoll Results
ALSO ON TELUGUONE N E W S
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ హీరోయిన్ గా చిత్రసీమలోకి అడుగుపెడుతున్న తొలి చిత్రం 'తుడక్కమ్' (Thudakkam). ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆశీష్ జో ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి '2018' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు జ్యూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ నెట్టింట విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతూ విశేష ఆదరణ పొందుతోంది. 'తుడక్కమ్' ట్రైలర్ విషయానికి వస్తే, కేవలం 1 నిమిషం 35 సెకన్ల వ్యవధిలోనే తీవ్రమైన ఉత్కంఠను పెంచేలా కట్ చేశారు. విస్మయ మోహన్‌లాల్ తొలి చిత్రంలోనే ఒక డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఒక సాధారణ కుటుంబ నేపథ్యం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు, చదువు, ఉద్యోగం, అద్దె ఇల్లు చుట్టూ తిరిగే సన్నివేశాలతో మొదలయ్యే ట్రైలర్, క్రమంగా తీవ్రమైన సస్పెన్స్, డ్రామా వైపు మళ్లుతుంది. ట్రైలర్‌లో విస్మయ నటన, ఆమె బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. "ఒకప్పుడు జరిగిన ఆ ఘటనను నాన్న ఇక గుర్తుచేసుకోవద్దు, అప్పుడు ఒక తప్పు జరిగింది.. ఇకపై అది జరగదు" అని విస్మయ చెప్పే ఇంటెన్స్ సంభాషణలు కథలో ఉన్న సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెలియజేస్తున్నాయి. అలాగే "నా చేతులతోనే చంపేయాలి" అనే డైలాగ్స్, ఇల్లు ఖాళీ చేయడం, బెదిరింపులు, ప్రమాదకరమైన మలుపుల చుట్టూ సాగే దృశ్యాలు ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాగా రూపొందిందని సంకేతాలు ఇస్తున్నాయి. స్టార్ కిడ్ అయినప్పటికీ విస్మయ ఎంచుకున్న కథ, ఆమె పండించిన సహజమైన హావభావాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. జ్యూడ్ ఆంథనీ జోసెఫ్ తన మార్కు టేకింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్ మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మోహన్‌లాల్ అభిమానులతో పాటు మలయాళ సినీ ప్రియులు విస్మయ ఎంట్రీపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. ప్రతి ఏటా సరికొత్త హంగులు, ఆసక్తికరమైన కంటెస్టెంట్లతో అలరించే ఈ షో ఇప్పుడు పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ కొత్త సీజన్‌పై హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ సీజన్ 10 ఊహించని ట్విస్టులతో, వినోదంతో కూడి ఉండబోతోందని నాగార్జున స్పష్టం చేశారు. అయితే ఈసారి హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లకు ఆయన ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. షోలో నిబంధనలు ఉల్లంఘించినా, గత సీజన్లలోలాగా ప్రేక్షకులు అసహ్యించుకునే ప్రవర్తన కనబరిచినా సహించేది లేదని తేల్చి చెప్పారు. విజేతగా నిలవడానికి కేవలం గేమ్‌ ఆడడమే కాకుండా, పద్ధతిగా నడుచుకోవడం చాలా ముఖ్యమని నాగ్ పేర్కొన్నారు. "ఈసారి హౌస్‌లో అనుచిత ప్రవర్తనకు చోటు లేదు. హద్దులు దాటితే కఠిన చర్యలు ఉంటాయి" అని ఆయన స్పష్టం చేయడంతో కంటెస్టెంట్లలో ఇప్పటినుండే టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. అక్కినేని నాగార్జున గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్‌ను ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు. తనదైన స్టైల్, టైమింగ్, వీకెండ్ ఎపిసోడ్లలో కంటెస్టెంట్లను సరైన రీతిలో గైడ్ చేసే తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ కోసం ఆయన ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌పై బిగ్ బాస్ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈసారి సీజన్ చాలా సీరియస్‌గా, కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ ఉండబోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ గ్రాండ్ రియాలిటీ షో లాంచ్ డేట్ మరియు కంటెస్టెంట్ల వివర అధికారికంగా వెల్లడి కానున్నాయి. కొత్త సీజన్ సరికొత్త థీమ్‌తో ఎలా ముందుకు రాబోతుందో చూడాలని బుల్లితెర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాల్లో కనిపించే పాత్రలలో నటులు ఎంతగా ఒదిగిపోతారో, కొన్నిసార్లు ప్రేక్షకులు కూడా అంతే తీవ్రంగా భావోద్వేగాలకు లోనవుతుంటారు. ప్రతినాయకుడిగా నటిస్తే బయట కూడా నిజమైన శత్రువులా భావించే విచిత్ర పరిస్థితులు సినీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. తాజాగా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నట్లు నటుడు తారక్ పొన్నప్ప వెల్లడించారు. తాను నటించిన 'అనకాపల్లి' చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ పొన్నప్ప, ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల నుంచి ఎదురవుతున్న ట్రోలింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'లో తాను ఓ ముఖ్యమైన సీన్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో "మా రామ్ చరణ్ కాలు ఎందుకు విరగ్గొట్టారు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తారక్ స్పందించారు. సినిమాలో దర్శకుడు చెప్పిన కథనం ప్రకారం మాత్రమే తాను ఆ సన్నివేశంలో నటించానని, అది కేవలం నటన మాత్రమేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బయట కనిపిస్తే దాడి చేస్తామని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని అనుచిత కామెంట్లను డిలీట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేవలం ఒక నటుడిగా తన బాధ్యతను మాత్రమే నెరవేర్చానని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ అభిమానులు పాత్రలను, నటుల వ్యక్తిగత జీవితాలను వేర్వేరుగా చూడాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కథకు అనుగుణంగా నటించే నటులపై ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్.బి చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే విశాల్ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచేలా కనిపిస్తున్నారు.     Vishal, Makutam Movie, Anjali, Dushara Vijayan  
మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే పూర్తిస్థాయి వినోదం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ 'హ్యాపీ జర్నీ'. ఏడుగురు మహిళల విదేశీ ప్రయాణం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా 'సీతాకోకలా...' అంటూ సాగే మధురమైన గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సరికొత్త లవ్లీ మెలోడీకి సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అద్భుతమైన స్వరాలను సమకూర్చగా, ప్రముఖ గేయ రచయిత సురేష్ బానిసెట్టి ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తన అమృతతుల్యమైన గాత్రంతో ఈ పాటను పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఆడవారి స్వేచ్ఛకు, వారి కలలకు ఎలాంటి హద్దులూ లేవనే సందేశాన్ని ఇస్తూ ఈ సాంగ్ సాగుతుంది. ఈ సినిమాలో పారిస్, మాంట్‌పెలియర్ వంటి యూరప్‌లోని అత్యంత సౌందర్యాత్మక ప్రాంతాలలో చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణం నేపధ్యంలో సాగే కథ అయినప్పటికీ, ఇందులో చూపించే మనుషుల అనుబంధాలు, స్నేహం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీలతో పాటు పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ మరియు సునైనా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో అలరించనున్నారు. అంతేకాకుండా పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిశ్రమకు పరిచయం అవుతుండగా, బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన రెస్పాన్స్ లభించగా, ఇప్పుడు విడుదలైన 'సీతాకోకలా' సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సంగీతప్రియులు ఈ పాటలోని లిరిక్స్ మరియు యూరప్ విజువల్స్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
Makutam is the 99th film produced under the Super Good Films banner. The movie stars Vishal as the lead actor and also marks his debut as a director. It is produced under the banner founded by the late RB Choudary. Anjali and Dushara Vijayan play the female leads. The teaser and songs released so far have received a good response and increased excitement for the film. As the music promotions continue, the makers have shared a big update. They announced that Makutam will release in theatres on August 14, and the official trailer will be launched on August 7. The film has already created high expectations since Vishal appears in different looks, it is his first film as a director, and GV Prakash Kumar's music has impressed audiences. With the release date now confirmed, the promotions are expected to become even bigger. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
'బేబి' జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. '90s' వెబ్ సిరీస్‌తో అందరి మనసులను గెలుచుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుండగా, తాజాగా మేకర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. 2026 సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. పోస్టర్‌లో బీచ్ ఒడ్డున ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఒకేలాంటి డెనిమ్ డ్రెస్‌లు ధరించి, తమ పెంపుడు కుక్కతో సముద్రపు అలల మధ్య నడుస్తూ ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'బేబి' సినిమాలో ఆనంద్, వైష్ణవి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'ఎపిక్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. సెప్టెంబర్ 11న విడుదలవుతున్న ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.   Epic First Semester, Release Date, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Aditya Hasan  
The blockbuster Baby pair - Anand Deverakonda and Vaishnavi Chaitanya - is set to reunite with EPIC – First Semester. The makers have officially announced that the romantic drama will hit theatres worldwide on September 11. The release date poster features the lead pair enjoying a peaceful walk on a beach with a pet dog, reflecting the film's youthful and feel-good vibe. The visuals continue the pleasant tone established by the teaser and songs. Written and directed by Aditya Haasan, EPIC is a unique extension of the blockbuster ETV Win series 90's – A Middle Class Biopic. Instead of revisiting the original family, the film follows the next chapter of fan-favourite character Rohan. Anand Deverakonda plays the grown-up Rohan, now pursuing his Master's degree in the US, while Vaishnavi Chaitanya stars opposite him in a fresh love story. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film features music by Hesham Abdul Wahab. With a successful lead pair, an interesting continuation of a beloved character, and a September 11 release date locked, EPIC – First Semester has positioned itself as one of the notable youthful entertainers to watch out for this year. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Keerthy Suresh appears to be entering a crucial phase in her career. After enjoying immense success with films like Mahanati, the National Award-winning actress has struggled to maintain consistent box office momentum over the past few years. While her performances have continued to earn appreciation, several of her recent releases failed to make the desired impact, including her much-hyped Bollywood debut opposite Varun Dhawan, Baby John, which ended up as a major disappointment. Now, the actress seems to be putting together an interesting slate of projects that could redefine her career. Keerthy has already signed Anil Ravipudi's upcoming entertainer starring Venkatesh and Kalyan Ram, a commercial project that is expected to offer her a wider reach among Telugu audiences. Adding to the buzz, industry circles suggest she may be making a special appearance in a song from Nani and Srikanth Odela's The Paradise. While there's no official confirmation yet, the speculation has excited fans, especially since Keerthy previously shared screen space with Nani in Dasara, directed by Srikanth Odela. If the rumours turn out to be true, it would mark a reunion of the successful Dasara team. Meanwhile, filmmaker Karthik Subbaraj surprised everyone by announcing Keerthy as the leading lady of his upcoming film Dorothy, which is scheduled for release on 25th September. The project has generated curiosity as Karthik is collaborating with legendary composer Ilaiyaraaja, a combination that has already created excitement among cinephiles. The movie has been already selected officially for TIFF film festival, too.  Interestingly, most of these promising opportunities have come after Keerthy's marriage, giving rise to discussions that she could be on the verge of a fresh innings. With a commercial entertainer, a possible high-profile cameo and an author-backed role in Dorothy, the actress has assembled a line-up that looks far more promising than what she had in recent years. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రాబోతుండటంతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. గుంటూరు కారం చిత్రం తర్వాత ప్రిన్స్ వెండితెరపై కనిపించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండటంతో, తదుపరి భారీ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ఆనందించేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అంతర్జాతీయ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి'పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమా నుంచి టీజర్ లేదా గ్లింప్స్ వీడియో విడుదలవుతుందని ఆశించిన అభిమానులకు కాస్త నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ విషయంలో పర్‌ఫెక్షన్ కోరుకునే జక్కన్న, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడరు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ అత్యంత బిజీగా ఉంది. ప్రత్యేకంగా ఒక వీడియో టీజర్‌ను కట్ చేయడానికి సమయం లేకపోవడంతో, చిత్రబృందం వీడియో కంటెంట్‌కు బదులుగా రెండు సరికొత్త పోస్టర్లతోనే బర్త్‌డే విషెస్ చెప్పాలని భావిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. గతంలో రాజమౌళి 'ఆర్‌ఆర్ఆర్' సినిమా సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ బర్త్‌డేలకు ప్రత్యేక టీజర్లు వదిలిన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్న 'వారణాసి' కోసం హడావిడిగా వీడియోలు విడుదల చేయడం రాజమౌళికి ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు థియేటర్లలో మహేష్ బర్త్‌డే సంబరాలు జరిపేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. గతంలో రీ-రిలీజ్ అయిన చిత్రాలతో పాటు ఈసారి సూపర్ హిట్ మూవీ 'దూకుడు' స్పెషల్ షోలతో సందడి చేయడానికి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ పాన్ వరల్డ్ విజువల్ వండర్ కోసం అభిమానులు ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు. వీడియో టీజర్ లేకపోయినా, రాజమౌళి అందించే ఆ రెండు స్పెషల్ పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
మన శరీరం అనేది ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన జీవ వ్యవస్థ. మనకు కనిపించని స్థాయిలో శరీరంలో సుమారు 36 లక్షల కోట్ల కణాలు (36 Trillion Cells) ప్రతి క్షణం పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ కణాలన్నీ సమన్వయంతో పనిచేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఒక్క కణం పనితీరులో లోపం వచ్చినా, అది క్రమంగా ఇతర కణాలపై ప్రభావం చూపి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిజంగానే "ఉన్నది ఒకటే జబ్బు... అది సెల్ అనారోగ్యం" అనే భావన వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి? ప్రతి వ్యాధి కణాల స్థాయిలోనే మొదలవుతుందా? కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు లభిస్తాయి. ఈ వీడియోలో Cell Health Clinics Founder డా. రవి కుమార్ చింత సెల్ హెల్త్ (Cell Health) యొక్క ప్రాముఖ్యతను సులభమైన ఉదాహరణలతో వివరిస్తున్నారు. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసిక ఒత్తిడి, కాలుష్యం, జీవనశైలి వంటి అంశాలు కణాల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. అంతేకాదు, చాలా మంది ఎదుర్కొనే మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యల వెనుక కణాల ఆరోగ్యం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కూడా ఈ చర్చలో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడటం సరిపోదని, కణాల స్థాయిలో శరీరాన్ని బలపరిచే జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని డా. రవి కుమార్ చింత సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మీ శరీరాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచే సెల్ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి. రోజూ అలసట, ఒత్తిడి, ఆందోళన, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి భస్త్రిక ప్రాణాయామం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లోతుగా, వేగంగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సహజంగా బయటకు పంపే శరీర ప్రక్రియలకు కూడా ఇది తోడ్పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్ స్రవంతి రఘు భస్త్రిక ప్రాణాయామాన్ని సరైన విధంగా ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశాలను సులభంగా వివరించారు. మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి, నిపుణుల సూచనల ప్రకారం భస్త్రిక ప్రాణాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కొత్త యోగా సాధన ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)