Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీకి తమ్మినేని గుడ్ బై?
posted on: Aug 5, 2026 4:53PM

వైసీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందా? ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. వైసీపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన తమ్మినేని ఇటీవలి కాలంలో వరుస వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో సతమతమౌతున్నారు. అలాగే వైసీపీలో కూడా ఆయనకు పెద్దగా ప్రాముఖ్యత లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
ఇటీవల వెలుగుచూసిన ఆస్తి వివాదం, నకిలీ డెత్ సర్టిఫికెట్ తో భూ కబ్జా కుట్ర ఆరోపణలు తమ్మినేని ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో తమ్మినేనితో పాటు ఆయన సతీమణి వాణిశ్రీ, కుమారుడు వెంకట శ్రీరామ్ లు నిందితులుగా ఉన్నారు. అరెస్టును తప్పించుకోవడానికి తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు కూడా. పరారీలో ఉండగానే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందిన తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.
ముందస్తు బెయిలు లభించని ఆయన కుమారుడు శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయి బెయిలు పొందారు. హైకోర్టు ధర్మాసనం కూడా తమ్మినేని సీతారాం, ఆయన భార్యపై తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది.
ఇదంతా ఒకెత్తయితే.. ఈ కేసు విషయంలో తమ్మినేనికి వైసీపీ నుంచి ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు.
ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అన్నిటినీ ఓర్చుకుంటూ పార్టీలో కొనసాగుతున్న తనకు క్లిష్ట సమయంలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించకపోవడంతో తమ్మినేని మనసు విరిగి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి నిర్ణయించుకున్నారంటున్నారు. ఏ క్షణంలోనైనా తమ్మినేని సీతారాం వైసీపీకి రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.
Thammineni Seetharam, Resignation, AP Former Speaker, Srikakulam Property Dispute






