LATEST NEWS
పార్లమెంటులోనైనా, అసెంబ్లీలోనైనా ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నేత హోదా అనేది అడుక్కుంటేనో, దబాయిస్తేనొ రాదు. ఆ హోదా కావాలంటే సభలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం స్థానాలు ఉండాలి. అంటే జనం మీకు ఆ అర్హత ఉందని ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో పార్టీని గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.   నింబంధనల ప్రకారం విపక్ష నేతగా తనకు లేని, రాని హోదాను కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అది పక్కన పెడితే.. విపక్ష హోదా ఇచ్చే వరకూ తాను కానీ, తన పార్టీ సభ్యులు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టబోమంటూ శపథం చేశారు. ఇది చెరువుమీద కోపం వచ్చి ఏదో చేసినట్లుగా ఉందంటూ నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది వేరే సంగతి. రాని హోదా కోసం అసెంబ్లీకి గైర్హాజరైతే నష్టం వైసీపీకే . సభకు గైర్హాజర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్న అవకాశాన్ని ఆ పార్టీ కోల్పోతోంది.   ఇక పోతే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి ఇంకో అడుగు ముందుకు వేసి దమ్ముంటే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.  ఈ సవాల్ విసిరి ఆయన మరో సారి రాజకీయ జోకర్ గా నవ్వుల పాలయ్యారు. ముందే చెప్పినట్లు ప్రతిపక్ష నేత హోదా అయినా, ప్రతిపక్ష పార్టీ హోదా అయినా అడుక్కుంటేనో, దబాయిస్తేనే రాదు. ఆ హోదా ప్రజలు ఇవ్వాలి. కానీ వైసీపీని ప్రజలు గత ఎన్నికలలో పూర్తిగా తిరస్కరించారు. విపక్ష స్థాయి కూడా లేదని పక్కన కూర్చోపెట్టారు. అలా కాకుండా సవాళ్లు విసిరో, బతిమలాడుకునో ప్రతిపక్ష హోదాయో మరోటో దక్కించుకునే అవకాశమే ఉంటే.. రాహుల్ గాంధీ దమ్ముంటే నాకు ప్రధాని హోదా ఇవ్వండి అంటూ మోడీకి సవాల్ విసిరి ఆ పదవిని దక్కించేసుకోవచ్చు కదా? అంబటికి అర్ధంకానిదీ, అర్ధం చేసుకోవలసిందీ ఏమిటంటే..  ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా అన్నది నిర్ణయించేది ప్రజలు, వారి తీర్పును కాదని ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగని ప్రతిపక్షంలోనూ కూర్చోలేదు. ప్రజలు ఏం నిర్ణయించాలో అది శిరసావహించడమే రాజకీయపార్టీలైనా, నాయకులైనా చేయాలి. పదవులు, హోదాలూ సవాళ్లతోనో, దేబిరింపులతోనో రావు. సవాళ్లు చేసినంత మాత్రాన, బతిమలాడుకున్నంత మాత్రానా రాజ్యాంగ నిబంధనలు మారవు.  ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా ఇవ్వాలనేది ఎదుటి ప్రత్యర్థి ప్రభుత్వం నిర్ణయించదు.. ఓట్లేసే ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా తీర్పు ఆధారంగానే చట్టసభల్లో స్థానాలు, పదవులు నిర్ణయమవుతాయి తప్ప, వీధి పోరాటాల సవాళ్లతో రాజ్యాంగ నిబంధనలు మారవు. Ambati Rambabu,  Opposition Leader Status, hallange, YS Jagan,  YCP, Andhra Pradesh Assembly, TeluguOne 
  ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..! తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన వెల్లడించారు. ఎంతటి ముఖ్యాధికారి లేదా ప్రజాప్రతినిధి అయినా సరే, పార్టీ గీసిన లక్ష్మణరేఖను దాటి మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలు  అధిష్టాన నిర్ణయాలే సర్వోపరి అని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని, ఆయన మనస్తాపం  ఆవేదన వెనుక ఉన్న కారణాలను తాము అర్థం చేసుకోగలమని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.  అయితే, వ్యక్తిగత అసంతృప్తులు ఏవైనా ఉంటే పార్టీ వేదికలపైనే చర్చించాలి తప్ప బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ ఒక్కరి స్వయంప్రతిపత్తికైనా క్రమశిక్షణే ప్రాతిపదిక అని పీసీసీ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే నాయకులపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాలు తీసుకుంటామని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మంత్రివర్గ విస్తరణ  పదవుల కేటాయింపులపై పలువురు సీనియర్ నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కాకరేపాయి.  ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ, అధికారంలో ఉన్న సమయంలో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడటం ప్రభుత్వ ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే పీసీసీ అధ్యక్షుడు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.  మరోవైపు  కాంగ్రెస్‌లో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి క్లారీటీ ఇచ్చారు. నిన్న చేసిన కామెంట్స్‌పై మరోసారి వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌లోనే ఉంటానని  రాజ్‌గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. Mahesh Kumar Goud, Komatireddy Rajgopal Reddy, Telangana Congress News, TPCC Chief Warning, CM Revanth reddy, Congress party
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. డిస్ క్వాలిఫై చేయాలి. జీత భత్యాలు నిలిపివేయాలి  అంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను పక్కన పెట్టినా.. జగన్ శైలి, తీరు పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో హా పెద్ద ఎత్తున జరుగుతోంది.  అసెంబ్లీ వేదికగా  ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వైసీపీ..   ప్రతిపక్ష హోదా అంటూ సభా సమావేశాలను బాయ్ కాట్ చేయడం.. యుద్ధ రంగంలోకి దిగకుండా నాలుగు గోడల మధ్యా కూర్చుని తొడగొడుతున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. యుద్ధ భూమిలో వెన్ను చూపడం ఎలాంటిదో.. రాజకీయ సమరంలో ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీకి గైర్హాజరు కావడం కూడా అలాంటిదేనని పరిశీలకులు అంటున్నారు.    ప్రజలు ఇవ్వని11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష హోదా అన్నది నిబంధనల ప్రకారం అవకాశం లేదు. ఆ సంగతి తెలిసికూడా ప్రతిపక్ష హోదా  కోసం మంకుపట్టు పడుతూ సభా సమావేశాలకు దూరంగా ఉండటం ఆయన పరిణితి లేమికి, పలాయనవాదానికీ నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇదే ఆయనలోని నాయకత్వసమర్థతపై కూడా సందేహాలకు తావిస్తోందంటున్నారు.   చట్టసభ వేదికగా ప్రజల సమస్యలను వినిపించడం, ప్రభుత్వ పథకాలు, విధానాలలో ఉన్న లోపాలను ఎండగట్టాల్సిన ఆయన.. ప్రతిపక్ష హోదా కోసం సభా బహిష్కరణకు నిర్ణయించుకోవడం సమజసం కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.  నియమ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం సభ్యుల బలం ఉన్న పార్టీకే అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. 2024   అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో.. ఏ రకంగా చూసినా, ఆయన ఎంతగా పట్టుబట్టినా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పని చేసిన జగన్ కు ఆ విషయం తెలియని భావించలేం. ఒక వేళ విపక్ష హోదా లేకపోయినా.. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సభకు హాజరై నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలి. తనను నమ్మి గెలిపించిన పులివెందుల ప్రజల పట్ల ఆ మాత్రమైనా బాధ్యత వహించాలి.   పులివెందుల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, వైసీపీ  అధినేతగా జగన్ సభకు హాజరై  ప్రభుత్వాన్ని నిలదీయడం మాని తనకు వీలున్నప్పుడు, వీలైనప్పుడు మాత్రమే బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి మీడియాకు ముఖం చూపించి తన పని ఇంతే అన్నట్లు వ్యవహరించడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.   అసెంబ్లీకి దూరంగా ఉంటూ  తాడేపల్లి ప్యాలెస్ లో  మీడియా సమావేశాలకు పరిమితమై,  ఆ ప్రెస్ మీట్ లలో కూడా రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి అంతేనని చుతులు దులుపుకుపోతున్న జనగ్ తీరు పట్ట వైసీపీ క్యాడర్ లో సైతం అసంతృప్తి వ్యక్తమౌతోంది.   ప్రభుత్వ నిర్ణయాలను సభలో నిలదీస్తే వచ్చె ఎఫెక్ట్ ప్రోస్ మీట్ లో ప్రసంగాల వల్ల రాదని పరిశీలకులు అంటున్నారు.    శాసనమండలిలో వైసీపీకి  సంఖ్యాబలం ఉన్నందున, అక్కడ గట్టిగా పోరాటం చేయాలని జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సరే.. కానీ  , అసెంబ్లీలో స్వయంగా పార్టీ అధినేత జగన్ పోరాడకుండా ప్యాలెస్ కే పరిమితం అవ్వడం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలే ఇస్తున్నాయి.   ఇక పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలుపుకోవాలనుకునే నాయుడు ప్రజా పోరాటాల్లో వారిని ముందుండి నడిపించాలే కానీ, పిలుపు ఇచ్చాను చాలదా అన్న తీరున వ్యవహరిస్తే... పార్టీ శ్రేణులు డీలా పడతాయనీ, కంచె చేను సామెత చెప్పినట్లు తాడేపల్లి ప్యాలస్ నుంచే  పార్టీని నడిపిస్తానంటే.. ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా కడపదాటకుండానే  మమ అనిపించేస్తారని అంటున్నారు.   AP Assembly Sessions, YS Jagan Mohan Reddy Assembly Boycott, Chandrababu Naidu Leadership, AP Political News Telugu, Opposition Status Issue AP
 ఏపీ రాజధాని అమరావతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజధాని రాకపోకలకు, రవాణా వ్యవస్థకు వెన్నుముక అయిన ఈ  సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో  ఒకచోట ఉన్న ఎస్ ఆకారంలోని కర్వ్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వివరణ ఇచ్చింది. అత్యంత కీలకమైన #యాక్సెస్ రోడ్డులో ఎస్ కర్వ్ ఏంటంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున విమర్శల దాడికి దిగింది.   ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ,  ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.   ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిజానిజాలతో వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.  రాజధాని మాస్టర్ ప్లాన్, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకునే ఈ డిజైన్ రూపొందించినట్లు స్పష్టం చేసింది. సీడ్ యాక్సెస్ రోడ్డు మూడో విడత విస్తరణలో భాగంగా #మణిపాల్ హాస్పిటల్ సమీపంలో విజయవాడ, చెన్నై జాతీయ రహదారికి ఈ రోడ్డును అనుసంధానించేందుకు ఒక  కారిడార్‌ ఏర్పాటు కానుందనీ,  భవిష్యత్తులో రాబోయే ఈ కారిడార్ అవసరాలు, భూభౌగోళిక పరిస్థితులు, వాహనాల రద్దీ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.  అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాథమిక లక్ష్యం రాజధాని నగరానికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో సులువైన అనుసంధానాన్ని కల్పించడమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం..  కరకట్ట రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న  వాహనాల రద్దీని తగ్గించడం కూడా ఈ ప్రాజెక్టు   ఉద్దేశమని వెల్లడించింది. రాబోయే దశాబ్దాల రవాణా అవసరాలను తీర్చడానికి తగిన భద్రతా ప్రమాణాలు పాటించి  డిజైన్  చేశామనీ,  అందువల్ల సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉన్న #ఎస్ కర్వ్  మలుపులను   రాజకీయ కోణంలో కాకుండా..  భవిష్యత్ ట్రాఫిక్ కనెక్టివిటీ, మాస్టర్ ప్లాన్ విస్తరణలో భాగంగానే  చూడాలని ఆ ప్రకటనలో పేర్కొంది.  Amaravati Seed Access Road, S Curve, Chandrababu Naidu, CMCBN,  Government, Clarification, Capital Connectivity 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో  కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించారు. ఈ సందర్భంగా  అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల తాళం చెవులను సీఆర్డీఏ  అధికారులు సీఎంకు అధికారికంగా అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు అమరావతి పునర్నిర్మాణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కీలక  ఈవెంట్‌లోనూ ముందు వరుసలో ఉండే  ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.   భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాల్సి వస్తే ఆప్షన్లు తెరిచి ఉంచుకోవడానికే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అమరావతి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేయడం ప్రారంభించింది.   ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ను రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా మంగళగిరిలోని  ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ ఆహ్వానించారు.   అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం రోజునే.. పవన్ కల్యాణ్ కు అంతకు ముందే నిర్ణయమైన పర్యటన ఖారరై ఉండటంతో రావడం లేదని పొంగూరు నారాయణకు పవన్ కల్యాణ్ చెప్పారు.   ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే వేడుకలలో పాల్గొనేందుకు ముందుగానే షెడ్యూల్ ఖరారైంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కాకర్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ నుంచి వస్తుండటంతో..పవన్ తన పర్యటన రద్దు చేసుకోలేకపోయారు.   కేంద్ర మంత్రిని తాను స్వయంగా ఆహ్వానించాననీ, అందుకే తప్పని సరిగా హాజరుకావాలని పవన్ ఈ సందర్భంగా మంత్రి నారాయణకు వింరించారు. అంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటం వల్లనే పవన్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.  సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా ప్రశంసించి అమరావతి నిర్మాణంలో ఆయన పాత్రను ప్రశంసించారు. దీనిని బట్టి  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రభుత్వ నిర్వహణ  సమన్వయంతో సాగుతోందని తేటతెల్లమైంది. తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు ఏర్పడి ఇరు పార్టీలూ విడిపోతే తప్ప రాజకీయంగా తమ మనుగడ కష్టమన్న భావనతోనే వైసీపీ ఇలా లేని విషయాలను కూడా వివాదాస్పదం చేస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   Pawan Kalyan Amaravati event, Seed Access Road Amaravati, Chandrababu Naidu, Narayana Minister, World Elephant Day Visakhapatnam, TDP Janasena Alliance
ALSO ON TELUGUONE N E W S
‘VISA - వింటారా సరదాగా’ చిత్రానికి సంబంధించిన రెండో టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఉద్భవ్ రఘు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రెండో టీజర్‌ను పూర్తిగా హీరో కోణంలో రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేమ, అమ్మాయిల వల్ల అబ్బాయిల జీవితంలో ఎదురయ్యే ‘ట్రబుల్’ గురించి అశోక్ గల్లా పాత్ర తనదైన శైలిలో చెప్పే మాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సహజమైన సంభాషణలు, ఆకట్టుకునే కామెడీ, మనసును హత్తుకునే  ఎమోషన్స్‌తో సాగిన ఈ మోనోలాగ్ టీజర్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఈ టీజర్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ఆసక్తికరమైన అంశం ‘ఖలేజా’ చిత్రంలోని ఐకానిక్ డైలాగ్‌కు సంబంధించిన రిఫరెన్స్. ఊహించని విధంగా వచ్చిన ఈ రిఫరెన్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం టీజర్‌లోని ఎనర్జీకి మరింత బలాన్ని చేకూర్చింది. వినోదం, ప్రేమ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన ‘VISA - వింటారా సరదాగా’ రెండో టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ‘VISA - వింటారా సరదాగా’ చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.       VISA Vintara Saradaga Teaser 2, Ashok Galla, Sri Gouri Priya, Naga Vamsi  
అన్ష్ త్రోరాట్, వాసవి గణేషన్ జంటగా బిక్షు యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా 'హుషార్ పిట్టలు'. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ ఫిల్మ్స్ లాంటి ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తుండటం, ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో.. ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆగష్టు 15 విడుదల తేదీ కాగా, అవుట్ పుట్ మీద నమ్మకంతో ఇప్పటికే ప్రీమియర్స్ వేశారు. ప్రమోషనల్ కంటెంట్ చూసి ఇదొక అడల్ట్ కామెడీ ఫిల్మ్ అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. మరి ఇది నిజంగానే అడల్ట్ కంటెంట్ తో వచ్చిందా? లేక అందరినీ ఆలోచనలో పడేసే కంటెంట్ తో వచ్చిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: తెలంగాణలోని ఒక పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్టోరీ సాగుతుంది. టెన్త్ క్లాస్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చిన రవి (అన్ష్) ఎంతో తెలివైన కుర్రాడు. అదే ఊరిలో ఉండే చిట్టి (వాసవి గణేషన్) అనే అమ్మాయి పెద్దమనిషి అయ్యాక.. రవిని చూసి ఇష్టపడుతుంది.  అయితే, బాధ్యతగా చదువుకునే రవికి, ఊరిలోని ఫ్రెండ్స్ ఫోన్లలో అడల్ట్ వీడియోలు చూపిస్తూ అమ్మాయిల ప్రేమలో పడాలంటూ చెడు మార్గాలు నూరిపోస్తారు. దాంతో రవి కూడా చిట్టి వైపు ఆకర్షితుడవుతాడు. తెలిసి తెలియని వయసులో, హార్మోన్ల ప్రభావంతో వీరు హద్దులు దాటి ఇంట్లో వాళ్లకు తెలియకుండా శృంగారంలో మునిగిపోతారు. అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. అయితే, పిల్లలను ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? ఈ అనాలోచిత చర్యలు ఆ రెండు కుటుంబాల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనేదే చిత్ర అసలు సారాంశం. విశ్లేషణ: ఆకర్షణలో పడి పరిపక్వత లేని వయసులో వేసే ఒక చిన్న తప్పుడడుగు.. రెండు కుటుంబాల జీవితాలను, వారి పరువును ఏ విధంగా రోడ్డున పడేస్తుంది అనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ అంతా పక్కా విలేజ్ అట్మాస్ఫియర్, యూత్‌ఫుల్ కామెడీతో చాలా సరదాగా సాగిపోతుంది. ప్రధాన పాత్రల పరిచయం, రవి-చిట్టి నడుమ ప్రేమ, ఫోన్లలో ఊసులాడుకోవడం వంటి సన్నివేశాలతో నడుస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కలిసి చేసే హంగామా, అల్లరి సన్నివేశాలు యూత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ కాస్త అడల్ట్ కంటెంట్ వైపు వెళ్లినట్లు అనిపించినా.. కథలోని అసలు ఎమోషన్ సెకండ్ హాఫ్‌లోనే దాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ను బాగా డిజైన్ చేసి, సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచారు.  సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. సినిమా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. పిల్లల ప్రవర్తన బయటపడటం, కుటుంబాల్లో మొదలయ్యే సంఘర్షణ వంటి అంశాలు ఉంటాయి. ఆకర్షణలో పడి తప్పుడు దారిలో వెళ్తే ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి, పరువు కోసం తండ్రి పడే వేదన ఏంటి అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు. డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేకపోతే టీనేజర్స్ జీవితాలు ఎలా నాశనం అవుతాయో దర్శకుడు బిక్షు యాదవ్ చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. 'హుషార్ పిట్టలు' ప్రారంభంలో అడల్ట్ కామెడీతో నవ్వించినా, ముగింపులో కంటితడి పెట్టించే ఎమోషన్స్, గొప్ప సామాజిక సందేశాన్ని అందిస్తుంది. చిన్నపిల్లల ముందర పెద్దలు మాట్లాడే మాటలు, చేసే పనులు వారి మనస్సులపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతాయి, స్మార్ట్‌ఫోన్ల మితిమీరిన వాడకం, చెడు స్నేహాలు ఎంతో మంది జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయనే విషయాలను ఇందులో చూపించారు. నటీనటుల పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అన్ష్ త్రోరాట్, వాసవి గణేషన్ ఇద్దరికీ ఇది మొదటి సినిమాయే అయినా చాలా సహజంగా నటించారు. ఎమోషనల్ అండ్ సీరియస్ సీన్స్‌లో వీరి యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఇక సపోర్టింగ్ రోల్స్ చేసిన నటీనటులు పల్లెటూరి వాతావరణానికి, ఆ యాసకి పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే.. చరణ్ అర్జున్ అందించిన మ్యూజిక్ గ్రామీణ నేపథ్యానికి సరిగ్గా సరిపోయింది. సినిమాటోగ్రఫీ ఊరి వాతావరణాన్ని చాలా నాచురల్ గా ప్రెజెంట్ చేసింది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఓవరాల్‌గా చెప్పాలంటే..  'హుషార్ పిట్టలు' బోల్డ్ గా ఉండే యూత్‌ఫుల్ సినిమా మాత్రమే కాదు.. టీనేజర్స్ కి, తల్లిదండ్రులకు మంచి మెసేజ్ ఇచ్చే ఎమోషనల్ డ్రామా కూడా. రేటింగ్: 2.75/5   Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.       Hushar Pittalu Review, Ansh Thorat, Vasavi Ganeshan, Bikshu Yadav  
  చాలా మంది సినీ ప్రేమికులు చాలా సంవత్సరాల నుంచి సరైన సినిమాలు రావడం లేదని, ఫెయిల్యూర్స్ ఎక్కువ అయ్యాయని భాధపడుతుంటారు. అదే  అగ్ర హీరో సినిమా ఫెయిల్ అయితే అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం కన్నీటి పర్యంతం అవుతారు. పాపం నిర్మాత అని జాలి కూడా చూపిస్తారు.ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే సినిమాకి ఉన్న ట్రాక్ రికార్డు చెక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్లందరికీ తెలియాల్సిన విషయం ఒకటుంది.  తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకముందే భారీ విజయాన్ని సాధిస్తున్నాయనేది సినీ వ్యాపారంలో ఒక ఆసక్తికరమైన నిజం. బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా సాధించే టాక్ లేదా ఫలితంతో సంబంధం లేకుండా, నిర్మాతలు ముందే తమ మొత్తం పెట్టుబడిలో దాదాపు 60% నుండి 80% వరకు డిజిటల్ (OTT), శాటిలైట్,మ్యూజిక్, నాన్  దియేట్రికల్ హక్కుల ద్వారా వెనక్కి రాబట్టుకుంటున్నారు. గతంలో కేవలం థియేటర్ టికెట్ల వసూళ్లపైనే ఆధారపడిన టాలీవుడ్ పరిశ్రమ, నేడు 100 కోట్ల నుండి  300 కోట్ల దాకా జరిగే డిజిటల్ మరియు బిజినెస్ డీల్స్ పైనే ప్రధానంగా రన్ అవుతోంది.  డిజిటల్ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఒక్కో బిగ్ స్టార్ సినిమా డిజిటల్ హక్కుల కోసం  50 కోట్ల నుండి  150 కోట్ల భారీ మొత్తం చెల్లిస్తుండటంతో, నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్‌కి ముందే సేఫ్ జోన్‌లోకి అడుగుపెడుతున్నారు.  అంతేకాదు, సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే ఫ్యాన్స్ హంగామా, స్టార్ హీరోల ఊరమాస్ క్రేజ్ వల్ల దాదాపు 50% నుండి 70% వరకు థియేట్రికల్ రికవరీ జరిగిపోతుంది. ఒకవేళ సాధారణ ప్రేక్షకులకి, మూవీ లవర్స్ కి  సినిమా నచ్చకపోయినా, రివ్యూలు ప్రతికూలంగా వచ్చినా, తొలి 3 రోజుల ఓపెనింగ్స్ మరియు ప్రి రిలీజ్ డిజిటల్ డీల్స్ కాంబినేషన్ వల్ల నిర్మాతలు నష్టాల బారిన పడకుండా బయటపడుతున్నారు. ఇది కేవలం పాన్-ఇండియా స్టార్లకే కాదు, 10 కోట్ల నుండి రూ. 15 కోట్ల బడ్జెట్ ఉన్న మీడియం సినిమాలకు కూడా రూ. 8 కోట్ల వరకు నాన్-థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోతూ నిర్మాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈ వ్యాపార సూత్రం వల్ల టాలీవుడ్ లో సినిమా నిర్మాణంలో ఉండే ఆర్థిక రిస్క్ శాతం గణనీయంగా తగ్గింది.  అయితే, ఈ ఓటీటీ వ్యవస్థలో కొన్ని సరికొత్త సవాళ్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల డిజిటల్ సంస్థలు తమ కండిషన్లను కఠినతరం చేస్తూ, సాధారణ సినిమాల OTT ధరల్లో 20% నుండి 30% వరకు కోతలు విధిస్తున్నాయి. థియేటర్లలో సినిమా సాధించే వసూళ్లను బట్టి చివరి ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించే కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి గ్లోబల్ రీచ్ ఉన్న టాప్ స్టార్స్ విషయంలో మాత్రం డిజిటల్ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు.  also read: అగధ హైలెట్స్ ఇవే   ప్రతి ఏటా దాదాపు 180కి పైగా చిత్రాలు టాలీవుడ్‌లో సెట్స్ పైకి వెళ్తుండగా, బిగ్ బడ్జెట్ చిత్రాలకు ఈ డిజిటల్ ఓటీటీ మార్కెట్ ఒక బలమైన రక్షణ కవచంలా మారింది.  అభిమానుల మొదటి రోజు థియేటర్ హడావుడి, ఓటీటీల ప్రీ-రిలీజ్ బిజినెస్ తోడవ్వడం వల్ల తెలుగు నిర్మాతలు నయా బిజినెస్ మోడల్‌తో దూసుకుపోతున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచినా, అసలు ఆడకపోయినా నిర్మాతలకి వచ్చే నష్టం లేదు. అందుకే సినిమా ప్లాప్ అయినా నిర్మాత' హాయిగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా, తీయ తీయగా అని పాడుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మూవీ లవర్స్ కి చెప్పేది ఏంటంటే సినిమా పోయిందని  బాధ పడకుండా సోషల్ మీడియాలో సినిమా అసలు బాగోలేదు, రాడ్ అని చెప్పే వాళ్ళని చూసి నవ్వుకోండి. ఎందుకంటే అక్కడ ఉంది సినిమా. Producer, Ott, TeluguCinema
Cast: Kamakshi Bhaskarla, Bhanuchander, Sijju, Shravan Reddy, Ulka Gupta, Jovika Vijaykumar, Vanitha Vijaykumar, Shreya Rani Reddy, Roshan Basheer Crew: Written and Directed by M.S. Raju Cinematography by Nani Chamidisetty Music by Rakesh Venkatapuram Edited by Junaid Siddiqui Produced by Kasi Visalakshi Balusu M.S. Raju, the hitmaker who delivered massive blockbusters like Okkadu and Varsham, is back to direct the horror-mystery thriller Agadha. With good buzz from the promotional material and housefull premieres, let's discuss about the movie released today. Plot: At five years old, Mahadevi (Kamakshi Bhaskarla) receives a divine vision and becomes a lifelong devotee of the Goddess. Blessed with the ability to see spirits, she protects people from evil. She soon faces Agadha, a formless and powerful occult force building a dark empire with evil spirits in the Dandakaranya forest near the Andhra-Orissa border. The film focuses on the clash between the divine Mahadevi and the evil Agadha, which is tied to a rare occult eclipse occurring after 144 years. Analysis: The core concept of a divine force fighting an indestructible evil is engaging and fits well in the current times. However, while the basic story is strong, the execution falls flat in several scenes. The fully serious narrative could have benefited from a more gripping screenplay and better casting choices for the supporting roles to elevate the atmosphere. Despite this, M.S. Raju shows his directorial mark in key moments. The first half builds good curiosity, and the pre-interval episode is excellent. The second half is fast-paced and never boring, with the track involving Harini and Salim standing out.  Kamakshi Bhaskarla gives a calm and measured performance that perfectly suits Mahadevi. Shravan Reddy also impresses with distinct variations in his roles. However, the film lacks the intense, chaotic energy that a subject like this demands, and the production values feel a bit inadequate. Positives: Strong core story Kamakshi Bhaskarla's performance Pre-interval episode Fast-paced second half Negatives: Weak execution in a few scenes Wrong casting choices Lacks expected intense thrills Bottomline: An interesting horror concept held back by ordinary execution and casting. Rating: 2.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Sharwanand and Srinu Vaitla are teaming up for the first time for a new family entertainer produced by Anil Sunkara. Titled George Krish, the film was launched today with a traditional pooja ceremony, with the makers also confirming January 14, 2027 as its worldwide theatrical release. The title was unveiled through a colourful poster featuring a festive yellow-orange backdrop and an hourglass design. A tiny silhouette of Sharwanand lifting the female lead hints at the romantic and fun-filled tone of the film. The project brings together Sharwanand and Srinu Vaitla for the first time, with Anil Sunkara backing the combination. The producer also announced the film’s worldwide theatrical distributors on the launch day itself, an unusual move that signals his confidence in the project. George Krish has cinematography by KV Guhan and music by Anup Rubens. Nandu Savarigana and Gopi Mohan are credited as writers. The film is expected to begin shooting soon. Sharwanand has previously enjoyed Sankranthi success with films such as Shatamanam Bhavati and Express Raja, and the makers are now looking to bring another family entertainer from the actor to the festival audience in 2027.   Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ హోదాలో ఎన్నో సూపర్ హిట్స్ ని నిర్మించి అగ్ర ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎంఎస్ రాజు. తెలుగు ప్రేక్షకులకి టెక్నాలజీ అంటే తెలియని రోజుల్లోనే  వరల్డ్ లోనే నెంబర్ వన్ గ్రాఫిక్స్ కంపెనీని తీసుకొచ్చి 'దేవి' చిత్రాన్నినిర్మించి ఎంఎస్ రాజు అంటే బ్రాండ్ అనిపించుకున్నారు. ఈ రోజు దర్శకుడిగా 'అగధ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో అగధ హైలెట్స్ ఇవే అని చెప్తున్నారు. అవేంటో చూద్దాం. 1 .కలియుగంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక పాపాలకి లింక్ అయ్యే కథ 2 . కామాక్షి భాస్కర్ల క్యారక్టరయిజేషన్  3 .రుద్రాక్ష ద్వారా గతంలోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే ఎపిసోడ్  4 . ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్  5 . విజువల్స్  6 . డైరెక్షన్  7 . సాంకేతిక నిపుణల పని తీరు 8 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోని భావోద్వేగాలు Also read: Makutam Movie Review In Telugu: మకుటం మూవీ రివ్యూ  ఇక మూవీకి నిన్న ప్రీమియర్స్ నుంచే పర్వాలేదనే టాక్ నడుస్తుంది. కామాక్షి భాస్కర్ల తో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, భానుచందర్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా నిడివి. పక్కా మిస్టిక్ డివైన్ థ్రిల్లర్. Agadha, Kamakshi Bhaskarla, Ms Raju   
Ameer Log is produced by Madhavi Reddy Soma under the Awwal Number Productions banner and directed by Ramana Reddy Soma. Manohar Reddy Manchuri is the co-producer. The film features MC Hari, Manoj and Sasidhar in the lead roles, while Vedha Jalandhar, Ravan Nitturu, Vishwender Reddy and Saiyogi play key characters. Rana Daggubati’s Spirit Media is releasing the film in Telugu on August 21. As part of the promotional campaign, the trailer was unveiled on Thursday.  Speaking at the trailer launch event, Little Hearts’ director Sai Marthand said : “Ameer Log has good songs. I liked the teaser and trailer. I am a big admirer of Sai Smaran’s music. Hari is a good friend of mine. Ramana Reddy is a great architect, and he has made this film wonderfully. It feels very realistic and raw. I feel it has the potential to achieve success on the lines of Falaknuma Das. I request everyone to watch and support this film when it arrives on August 21.”  Little Hearts music director Sinjith said : “All the artistes in ‘Ameer Log’ feel very natural. Sai Smaran is my mentor, and I am a huge fan of his music. Hari is a good artiste and singer. The trailer is good. It gives off the aroma of a delicious biryani. Please watch and encourage the film on August 21.”  B Ramana Reddy said: “‘Ameer Log’ represents the people of Hyderabad. The film has all kinds of emotions. We will make audiences laugh and cry. We are all extremely confident and happy because of our belief in the content. It has been a long time since a film with a strong Hyderabadi vibe came along. I believe our ‘Ameer Log’ will be on the lines of ‘Dollar Dreams’, ‘Pelli Choopulu’ and ‘Balagam’.”  Producer Madhavi Reddy Soma said: “Thanks to Spirit Media for releasing ‘Ameer Log’. I hope the audience will watch our film on August 21 and support us.”  Line Producer Shashi said : “At one point, we thought we shouldn’t hold events for ‘Ameer Log’. But now every event feels like a festival for us. Ramana has created an excellent story for this film and has presented ‘Ameer Log’ wonderfully. I request everyone to watch and support the movie arriving on August 21.”  Actor MC Hari said : “I hope everyone will like the ‘Ameer Log’ trailer. Hyderabad is very special, and this film is equally special to me. Two artistes from our family are being introduced through this movie. My father has also acted in the film. Thanks to Ramana Anna for giving us this opportunity. I was born and brought up in a basti, and now I am coming with a film set in a basti. I request everyone to watch and make our movie a success on August 21.”  Actor Manoj said : “‘Ameer Log’ was shot in a basti, and everyone there supported us tremendously. Thanks to Sinjith and Sai Marthand for coming here to support us. We will make everyone laugh and cry with this film. Please watch and support our movie on August 21.”  Actor Sashidhar said : “Just as the teaser, trailer and songs of ‘Ameer Log’ are good, the movie will be even better. Our film is arriving on August 21, and I hope everyone will support us.”  Vedha Jalandhar said : “The character Geetha, which I play in ‘Ameer Log’, will be inspiring to everyone. I am happy to portray a strong woman. Don’t come to the theatre with expectations; come to experience our film.”  Actor Vishwender Reddy said: “‘Ameer Log’ showcases the soul of Hyderabad. Ramana Anna appears to be very soft on the outside, but there is a volcano burning within him. Every frame in this film will be wonderful.”  Music director Sai Smaran said : “Thanks to everyone who supported me on ‘Ameer Log’. Thanks to Sinjith and Sai Marthand for coming here to support us. I request everyone to watch and support our movie when it arrives on August 21.” The film’s cinematography by SVK, editing by Rohit Penumatsa and music by Smaran Sai are expected to be among its major highlights. ‘Ameer Log’ is set for a grand theatrical release on August 21. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Cast: Vishal, Anjali, Dushara Vijayan, John Vijay, Jayaprakash, Ajay Crew: Written and Directed by Vishal Cinematography by Richard M Nathan Music by G.V. Prakash Kumar, Abhinandan Ramanujam Edited by N. B. Srikanth Produced by Jithan Ramesh, Jiiva Vishal's latest film, Makutam, released in theaters today. Produced under the Super Good Films banner and presented by the late legendary producer R.B. Choudary, this action drama features Vishal handling both the lead role and direction. Let's discuss how the movie turned out. Plot: Krupakar (Vishal) is a peaceful, middle-class medical representative in Chennai who lives happily with his wife Jamuna (Dushara Vijayan) and two children. Their lives turn upside down when they buy a second-hand car for a family vacation. Based purely on the car's number plate, a ruthless smuggler named Naga (Ajay) attacks the family, resulting in the tragic deaths of Krupakar's wife and daughter. The rest of the film explores Krupakar's hidden past and his connection to Naga's criminal empire. Analysis: Vishal as an actor is very good in several films but forgettable in few others. In this one, he is unbearable more than forgettable. He tends to over emote and overact. Being a director, he seems to have just went for it with what all he can execute rather than really doing the necessary.  Makutam also struggles with a highly predictable script that heavily borrows from familiar action films like Leo, Varasudu and Nayakan. The first half is very slow, taking nearly half an hour just to set up the core plot. The family scenes fail to create an emotional bond with the audience, making the central tragedy hard to digest. The second half flashback introduces Anjali, and her love track with Vishal brings some relief. The story does touch on a very relevant social issue regarding the fatal dangers of duplicate automobile spare parts smuggled from China.  However, Vishal falls short as a director due to an outdated storytelling format. A weak villain, the lack of powerful heroic moments, and a stretched climax bring the movie down. On the bright side, Anjali gives a 100% committed performance, even shining in the action blocks, and the cinematography looks rich. Positives: Excellent cinematography Anjali's brilliant performance Negatives: Outdated and predictable story Weak screenplay Absence of a strong villain Dragged climax Bottomline: A routine and outdated revenge drama that fails to engage. Rating: 2/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Victory Venkatesh’s first look from his upcoming film with Anil Ravipudi has been unveiled on the occasion of his 40th anniversary in cinema. The actor plays Lieutenant Colonel Venkat Reddy, an Army officer specialising in counter-terrorism and hostage negotiation. Venkatesh is seen in Army fatigues, sunglasses and a scarf, standing beside an SUV in a rugged landscape. The military backdrop suggests that the film will have a strong action component, while Anil Ravipudi’s involvement points towards a mix of action, comedy and family drama. The film marks the first on-screen combination of Venkatesh and Nandamuri Kalyan Ram, with the latter playing another lead. Keerthy Suresh is paired with Venkatesh, while Krithi Shetty is the female lead opposite Kalyan Ram. The combination of the two senior actors is expected to be one of the film’s key attractions. GV Prakash Kumar is composing the music, while Sahu Garapati is producing the film. Zee Studios, Smt. Archana and Suresh Productions are presenting the project. The yet-to-be-titled film is being planned as a Sankranthi 2027 release and is expected to be one of the major Telugu releases during the festive season. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ( #VenkyAnil5, #NKRAR2 ) భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి  పవర్ ఫుల్ గా కనిపించారు. కారు పక్కన నిల్చున్న ఆయన లుక్‌లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈ లుక్‌తో వెంకటేష్ ఓ రగ్గడ్  మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది. పోస్టర్‌లో వెంకటేష్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించనున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఆర్మీ ఇన్‌సిగ్నియా, క్రాస్‌డ్ స్వోర్డ్స్ ఎంబ్లమ్ సినిమా మిలటరీ నేపథ్యాన్ని మరింత ఎఫెక్టివ్ గా చూపిస్తున్నాయి.  వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీ.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. హ్యూమర్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు పండగ వాతావరణానికి తగ్గ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. https://x.com/Shine_Screens/status/2088213748683272666       Victory Venkatesh, First Look, Lt. Colonel Venkat Reddy, Anil Ravipudi, Nandamuri Kalyan Ram  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)