LATEST NEWS
  రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయం అందించారు. సచివాలయంలో  మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.  నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.  
  వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు.. ఇన్ఛార్జ్ అప్పిరెడ్డికి నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు.  పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి  జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ ను ఏ2గా పేర్కొన్న పోలీసులు... తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.  అంతేకాదు, సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చ్యూనర్ (AP 40 DH 2349) వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 
  ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట లభించింది. ఆమెను ఏపీ కేడర్ నుంచి తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో ఆమె త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి దాదాపు నాలుగు నెలల క్రితం ఏపీ కేడర్‌కు వెళ్లారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ, తనను తెలంగాణకు కేటాయించాలని కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన క్యాట్, ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం, ఆమ్రపాలి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
ALSO ON TELUGUONE N E W S
Dynamic Star Vishnu Manchu’s dream project Kannappa, directed by Mukesh Kumar Singh and produced by M Mohan Babu under AVA Entertainment and 24 Frames Factory is set for release on the 27th of this month. Meanwhile, Director Mukesh Kumar Singh interacted with the media to share some interesting aspects. Q: It is said that Mohan Babu binge-watched your Mahabharat series and recommended you to Vishnu Manchu for Kannappa. How did it all begin?  Yes, that’s true. It all started when director Eshwar Reddy called me and mentioned the Mahabharat series. I clarified that it wasn’t a solo effort—two other directors worked alongside me, and I didn't want to take full credit. I even gave him their contact details. Later, Anup Singh Thakur, who played Dhritarashtra in Mahabharat and also acted with Vishnu in Achari America Yatra, reached out and informed me that Vishnu Manchu wanted to speak to me. Vishnu called me soon after and invited me to Hyderabad. We met and spent 3–4 hours discussing the subject in depth. At that time, Mohan Babu garu wasn’t in town. Around 25–30 days later, I was told he had returned and wanted to meet me. I was taken to his house, and we spent an hour talking about Mahabharat. After our conversation, he immediately called Vishnu and said, “This is the man who will direct Kannappa.” Q: Since you worked on Mahabharat, how familiar were you with the story of Kannappa? Honestly, I wasn’t familiar with Kannappa initially. Vishnu narrated the story to me and expressed his desire to make it as grand as Mahabharat. Once I joined, I did extensive research on my own—I never rely solely on writers. I read articles, watched videos, and even visited temples in Tirupati and Sri Kalahasti—about 10+ times. I spent time with the priests there to truly understand the spiritual and cultural depth of the story. After this process, I shared my understanding with Vishnu. I was curious to see how he would embody the role and bring the soul of Kannappa to life. Q: What differences did you experience moving from TV to Cinema?  While I’m known for my TV work, I have also produced three English-language films. So, the cinema wasn’t new to me. In fact, many of the TV projects I directed were grander than some films. The main difference is in the preparation. TV productions are fast-paced and lack preparation time, whereas cinema allows ample time for planning. I officially joined Kannappa in January, and we started filming on October 4th—my birthday. Q: The film features multiple Pan-India stars. How did you manage that ensemble?  That was one of the most exciting aspects of the project. Surprisingly, I found managing television actors more challenging than film stars. The film stars—Mohan Babu, Vishnu, Prabhas, and others—are not just stars; they are disciplined and passionate professionals. Initially, there were challenges. I have a habit of exchanging detailed scene notes with actors, and once we established that rhythm, things fell into place. Mohan Babu garu, in particular, is a different kind of actor. He is extremely focused, sincere, and brings unmatched energy and aura to the screen. Q: Was the film shot only in Telugu?  The Kailasam portion was shot in Telugu. The scenes featuring Lord Shiva and Parvati were filmed in both Telugu and Hindi, and we dubbed the film into other languages for wider reach. Q: Did you watch earlier films based on Kannappa?  Yes, I watched all of them. They were all inspirational. At times, I was anxious about whether I could do justice to such a revered story. Vishnu also had doubts about matching the legacy of those iconic portrayals. But when you watch the final hour of our film, I believe you’ll be amazed by his performance. Q: Can you tell us about the work of the art department?  Our art director Chinna did thorough research. We also brought in technicians from Mumbai and Los Angeles. My assistant directors visited museums to study ancient weapons. Though we initially planned to shoot in New Zealand for just 20 days, the locations were so perfect that we ended up shooting most of the film there. 80% of the film was shot on real locations, while Akshay Kumar and Prabhas' scenes were filmed in India. Budget was never a constraint—Vishnu ensured we had everything needed. Q: What is the scope of Prabhas’s role in the film?  Every character in Kannappa has depth and impact. There are no filler roles. Be it Mohan Babu, Mohanlal, Akshay Kumar, Kajal Aggarwal, or Prabhas—each character adds momentum and meaning to the story. Prabhas fans will not be disappointed. His screen time is significant and well-utilized. After watching the film, Mohan Babu garu hugged me. That was the biggest compliment. Even a few outsiders who previewed the film gave extremely positive feedback. Q: The censor board suggested 13 cuts. What’s your take on it?  The cuts were suggested so the film could receive a U or U/A certification. It has some intense action sequences. We wanted an U13 or U rating, so we made the necessary changes. Q: How much of the story is fictionalized?  The original story of Kannappa, as found in Periya Puranam, Bhagavata Purana, and Sri Kalahasti Shapatham, is just about one and a half pages long. We used that as a foundation and expanded on it creatively. To make a 2+ hour film, we had to take cinematic liberties. However, we remained true to the soul and essence of the story. The structure from the first scene to the last has a consistent emotional and narrative flow.   Q: Who supported you in writing the dialogues?  I worked with Telugu-speaking assistant directors and translated everything myself. Vishnu, Mohan Babu, and a few writers also contributed to fine-tuning the dialogues. Q: What was the response from Sri Kalahasti priests after watching the film?  We screened the film for them, as they are the most authentic voices to evaluate it. Their reaction was heartening. The first thing they asked was, "When are you making Part 2?" They told us that not a single word needed to be changed. That validation was priceless. Q: How did you ensure the story resonated with modern audiences?  First, I must clarify: this is not a mythological film. It is historical. Me and Vishnu discussed this in detail. Some believe Kannappa was a tribal. Others think he was the reincarnation of Arjuna. That’s why there are 20 versions of his story. At its core, he was the man who donated his eyes—an act of ultimate devotion. That truth needed to reach today’s generation.   Q: Are you working on a Mahabharata film next?  Yes, I'm planning a cinematic adaptation of Mahabharata. It’s an open subject, and anyone can tell it their way. I have immense respect for S.S. Rajamouli, who is also working on a version. After Satyajit Ray, it is Rajamouli who has truly elevated Indian cinema on the global stage. I’ve already told the story on television, but the film offers a much wider canvas. Q: What’s your opinion on using graphics in movies today?  Graphics are evolving fast, but they must be used wisely. Today, people often over-rely on VFX. The key is to mix reality with graphics—to enhance, not replace, the real experience. Q: A final word on Mohan Babu’s role in the film?  Mohan Babu garu plays a role that’s unlike anything seen before in other versions of Kannappa. He’s a phenomenal actor. He’s also playing the antagonist in Nani’s upcoming film. His range and intensity will be a treat for audiences.
  త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి సినిమాల్లో నటించాడు వెంకీ మామ. ఈ సినిమాలు ఆల్ టైం ఎంటర్టైనర్స్ గా పేరు పొందాయి. ఇప్పటికీ ఈ చిత్రాలను ఆడియన్స్ రిపీటెడ్ గా చూస్తుంటారు. అందుకే వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే చూడాలని ఎందరో ఆశ పడుతున్నారు. అభిమానుల కోరిక త్వరలోనే తీరబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మామ ఓ మూవీ చేయబోతున్నాడు.   ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకొని వెంకటేష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. దీంతో దాని తర్వాత వెంకీ మామ చేయబోయే సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలాంటి టైంలో అనూహ్యంగా త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు సినిమాలు వెంకటేష్, ఎన్టీఆర్ తో ఉంటాయని ఇప్పటికే నిర్మాత నాగవంశీ కూడా తెలిపాడు. అందుకు తగ్గట్టుగానే ముందుగా వెంకీ మామ మూవీ పట్టాలెక్కుతోంది. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. వెంకటేష్ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు త్రివిక్రమ్. ఇది భారీ బడ్జెట్ మైథలాజికల్ ఫిల్మ్. గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో ఇది తెరకెక్కనుంది.    ఎన్టీఆర్ ఈ ఆగస్టులో వార్-2 తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే జూన్ 25న విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి. మరోవైపు దేవర-2, డైరెక్టర్ నెల్సన్ ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ చేతిలో ఉన్నాయి.  
సెన్సిబుల్‌ కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చిన శేఖర్‌ కమ్ముల.. తాజాగా ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చాడు. కింగ్‌ నాగార్జున, ధనుష్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో ‘కుబేర’ చిత్రాన్ని రూపొందించారు. ఇద్దరు స్టార్‌ హీరోలతో శేఖర్‌ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఎక్స్‌పెక్టేషన్స్‌ భారీగానే పెరిగాయి. పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ అయిన ‘కుబేర’ మొదటిరోజే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. వీకెండ్‌ అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. దీంతో మేకర్స్‌ ఎంతో హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ అన్నీ ఫుల్స్‌తో రన్‌ అయ్యాయి. వీకెండ్‌లో అన్ని ఏరియాలు కలిపి 80 కోట్ల వరకు కలెక్ట్‌ చేసింది. సినిమాకి మంచి టాక్‌ రావడం, కలెక్షన్లు కూడా బాగానే ఉండడంతో ‘కుబేర’ యూనిట్‌ ఆ హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్‌ చేసుకుంది.  ఇదిలా ఉంటే.. తెలుగులో మంచి టాక్‌తోపాటు మంచి రివ్యూలు కూడా సొంతం చేసుకున్న కుబేర తమిళ్‌లో మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేదు.  ఇది నిర్మాతల పాలిట పెద్ద షాక్‌గా మారింది. తమిళ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉన్న ధనుష్‌ సినిమాకి కలెక్షన్స్‌ లేకపోవడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నుంచి అక్కడి కలెక్షన్స్‌ బాగా డ్రాప్‌ అయ్యాయి. తెలుగులో మాత్రం మంచి కలెక్షన్స్‌తో రన్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సినిమాను నిలబెట్టేందుకు దర్శకనిర్మాతలు ఏం చెయ్యబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా బాగుందనే టాక్‌ వచ్చింది కాబట్టి దాన్ని మరింత ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత చిత్ర యూనిట్‌పై ఉంది. ఇప్పుడు ఇతర భాషల్లో సినిమాకి వస్తున్న టాక్‌ చూస్తుంటే ప్రమోషన్ల విషయంలో అక్కడ ఏదైనా లోపం జరిగిందా అనే కోణంలో కూడా చిత్ర యూనిట్‌ ఆలోచిస్తోందని సమాచారం. తమ ప్రమోషన్స్‌తో తమిళ్‌ ప్రేక్షకుల్ని తట్టి లేపాల్సిన అవసరం ఉంది. మరి ‘కుబేర’ను అన్ని భాషల్లో నిలబెట్టడానికి దర్శకనిర్మాతలు ఎలాంటి ప్లాన్‌ వేయబోతున్నారో చూడాలి. 
  మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యం పాలైనట్లు ఈరోజు ఉదయం వార్తలొచ్చాయి. ఆమె అస్వస్థకు గురయ్యారన్న సమాచారంతో.. ఏపీ క్యాబినెట్ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయారని కూడా న్యూస్ వినిపించింది. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.   అయితే తన తల్లి అంజనాదేవి అనారోగ్యం పాలైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తాజాగా నాగబాబు అన్నారు. "అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోంది. ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు." అని నాగబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంజనాదేవి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నాగబాబు ట్వీట్ చేయడంతో.. మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.    కొద్దిరోజుల క్రితం కూడా అంజనాదేవి అనారోగ్యం పాలైనట్లు వార్తలొచ్చాయి. కానీ, ఆ వార్తలను మెగా కుటుంబం ఖండించింది. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలిపింది. ఇప్పుడు మరోసారి అంజనాదేవి ఆరోగ్యం గురించి వార్తలు రాగా, మళ్ళీ మెగా ఫ్యామిలీ ఖండించింది. మరోవైపు అంజనాదేవి ఆరోగ్యం గురించి తరచూ ఇలా ఫేక్ వార్తలు వస్తుండటం పట్ల మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    
Cast: Jitendra Kumar, Raghubir Yadav, Neena Gupta, Faisal Malik, Chandan Roy, Sanvikaa, Durgesh Kumar, Pankaj Jha, Sunita Rajwar Crew:  Created by Deepak Kumar Mishra, Chandan Kumar, Arunabh Kumar Written by Chandan Kumar Music by Anurag Saikia Cinematography by Amitabha Singh Editing by Amit Kulkarni Directed by Deepak Kumar Mishra, Akshat Vijaywargiya Produced by Arunabh Kumar Available on Amazon Prime Video No: of Episodes: 08 Season(s): 04 Release Date: 24th June 2025 Genre: Comedy, Rural Drama, Political Drama   Panchayat is one of the most popular Indian Web Series and it became such a huge blockbuster that many started asking for extra seasons immediately after the first one. The series showcased the innocence of rural India while also showcasing their backwardness, loveable nature and simplicity. The humor also authentically imbibes into the premise and now, the series entered Season 4. Let's discuss about it in detail.    Plot:  Sachiv Abhishek (Jitendra Kumar) and Pradhan ji (Raghubir Yadav) get into a legal battle with MLA CK Singh (Pankaj Jha). Both file cases of attempted murder on the other. Abhishek is afraid if the case will become a huge obstacle for his MBA dreams. He continues to prepare for his CAT exam and his relationship with Rinki (Sanvikaa) grows further.  Meanwhile, Pradhan's wife Manju Devi (Neena Gupta) and Bhushan Kumar (Durgesh Kumar)'s wife Kranti Devi (Sunita Rajwar) fail nominations for Panchayat elections from Phulera. Their campaign grows intense with one party trying to dominate another. With the help of MLA, Bhushan keeps troubling them and the elections become a war. What happens next, watch the series to know more.    Analysis:  The series has become popular with such humor that instantly become meme material and popular. The innocence of the characters has been contagious and it became hard to not watch it for as many seasons as they bring with these characters. But the season 4 is a big dip in writing with each and every episode revolving around politics. While the village politics are interesting, the comic sequences are almost absent.  While on paper, the moments look strong, the kind of moving and gripping narrative that hit them hard in seasons 1 and 2 is absent. Few moments try to replicate such heart touching scenes from earlier seasons but they lack gravity and depth of those. There is a new character introduced but it doesn't really pay off to such a level like in the previous ones too. It feels like the entire season 4 is a set up and build up for the next season 5th. The production values and narrative tries to retain the likeability and it is appreciable. But the writing undermines all the efforts. Cinematography is nice and editing is good too. Songs doesn't really have the same weight like they did in previous seasons.  Performances by Jitendra Kumar, Chandan Roy, Raghubir Yadav, Faisal Malik did a great job once again. They gave relatable performances and Sanvikaa is great in the final episode too. But the romance portions between Jitendra and Sanvikaa needed better writing and execution. Overall, this is an underwhelming season with respect to previous seasons.  Bottomline:  Underwhelming season to Panchayat levels and let's hope makers improve for the next one.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. 
  మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు వార్తలొచ్చాయి. తన తల్లి అనారోగ్యానికి గురైందని తెలిసి.. ఏపీ క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కి పయనమైనట్లు వార్తలు వినిపించాయి. అయితే కొద్దిరోజుల క్రితం కూడా ఇలాగే అంజనాదేవి ఆరోగ్యం గురించి న్యూస్ వచ్చాయి. కానీ, అందులో వాస్తవం లేదని మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. అందుకే తాజా వార్తలు కూడా ఫేక్ అయ్యుంటాయని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఓ వీడియోతో షాకిచ్చారు మెగా కోడలు ఉపాసన.   అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ చేస్తోంది మెగా ఫ్యామిలీ. అందులో తెలుగింటి ఆవకాయను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుపుతూ తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు ఉపాసన. అందులో అంజనాదేవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కనిపించారు. ముఖ్యంగా అంజనాదేవి తన కోడలు సురేఖ పక్కన కూర్చొని ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    ఓ వైపు అంజనాదేవి ఆసుపత్రి పాలైనట్లు వార్తలు వస్తుండగా.. ఆమె ఆనందంగా ఉన్న వీడియోని ఉపాసన షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. బహుశా అంజనాదేవి ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేయడం కోసమే ఈ టైంలో ఉపాసన ఈ వీడియో షేర్ చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.    
93 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అపురూపమైన సినిమాలు, ఎన్నో కళాఖండాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ 9 దశాబ్దాల్లో ఎన్నోసార్లు తెలుగు సినిమా తన రూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. గతంలో ఎలా ఉన్నా గత పదేళ్ళుగా తెలుగు సినిమా స్థాయి ఎంతగా విస్తరించిందో అందరికీ తెలిసిందే. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ తెలుగు సినిమా తన ఉనికిని చాటుకుంటోంది. అందులో భాగంగానే తెలుగు సినిమా మార్కెట్‌ పరంగా బాగా విస్తరించింది. ప్రతి హీరో, ప్రతి దర్శకనిర్మాత తమ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నారు. స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు ఈ ధోరణి కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే కొన్ని సినిమాలు కలెక్షన్లపరంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏదో ఒక సందర్భంలో ప్రతి హీరో మంచి విజయాలు అందుకుంటూ కలెక్షన్లపరంగా తాము ఎవరికీ తక్కువ కాదు అని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ కలెక్షన్ల రేస్‌లో కనుచూపు మేరలో మంచు ఫ్యామిలీ హీరోలు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి టాప్‌ హీరోలు సూపర్‌హిట్‌ సినిమాలతో దూసుకెళ్తున్న రోజుల్లో తన విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసి సక్సెస్‌ అయిన హీరో మోహన్‌బాబు. ఆరోజుల్లో కలెక్షన్‌ కింగ్‌ అనే పేరు తెచ్చుకున్నారంటే ఆయన చేసిన సినిమాలు ఏ రేంజ్‌లో కలెక్ట్‌ చేసేవో అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్‌కింగ్‌ వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్‌.. ఆ స్థాయి కలెక్షన్లు సాధించిన సినిమా ఒక్కటి కూడా చేయలేదు. మంచు విష్ణు చేసిన కొన్ని సినిమాలు సూపర్‌హిట్‌ అయినా రికార్డు స్థాయి కలెక్షన్లు మాత్రం ఏ సినిమాకీ రాలేదు. అలాగే మంచు మనోజ్‌ చేసిన సినిమాలు కూడా కలెక్షన్లను ప్రభావితం చేయలేకపోయాయి. మోహన్‌బాబు నట వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన విష్ణు, మనోజ్‌.. ఆయన కలెక్షన్ల ప్రభంజనాన్ని మాత్రం వారసత్వంగా తీసుకోలేకపోయారు.  ఇటీవలికాలంలో చాలా మంది యంగ్‌ హీరోలు అనూహ్యంగా తమ సినిమాల ద్వారా భారీ కలెక్షన్లు సాధించారు. నాని, విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా వంటి హీరోలు తమ సినిమాల ద్వారా 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. వీరంతా ఎటువంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా తమని తాము ప్రూవ్‌ చేసుకున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కానీ, నటుడుగా 50 ఏళ్ళ చరిత్ర కలిగిన మోహన్‌బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన విష్ణు, మనోజ్‌ మాత్రం ఆ స్థాయి విజయాలు అందుకోలేకపోతున్నారు.  మంచు విష్ణు మొదటి సినిమా ‘విష్ణు’ 2003లో విడుదలైంది. ఈ 22 సంవత్సరాల్లో విష్ణు చేసిన సినిమాలేవీ కలెక్షన్ల పరంగా ఒక మార్క్‌ని చేరుకోలేకపోయాయి. అలాగే మంచు మనోజ్‌.. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ 21 సంవత్సరాల్లో మనోజ్‌ కూడా ఎలాంటి సంచలనాలు సృష్టించలేకపోయాడు.  ఇప్పుడు మంచు ఫ్యామిలీకి ఆ అవకాశం వచ్చినట్టుగానే కనిపిస్తోంది. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘కన్నప్ప’ ద్వారా మంచు విష్ణు 100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం కనిపిస్తోంది. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేస్తున్నారు. మంచు విష్ణు కెరీర్‌లో ఇదే తొలి పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలు కీలకమైన పాత్రలు పోషించడం ఈ సినిమాకి పెద్ద అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. వీరి ప్రజెన్స్‌ కలెక్షన్లను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సినిమాకి మొదటి నుంచీ కాస్త నెగెటివ్‌ ప్రచారం జరిగినప్పటికీ ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో పాజిటివ్‌ వైబ్స్‌ వచ్చాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాతో మంచు విష్ణు కలెక్షన్ల పరంగా వివిధ క్లబ్‌లలో చేరే అవకాశం కనిపిస్తోంది. ‘కన్నప్ప’ చిత్రంతో తాను కలెక్షన్‌కింగ్‌ వారసుడ్ని అని మంచు విష్ణు నిరూపించుకునే అవకాశం లేకపోలేదు.
  చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల తల్లి అంజనా దేవి (Anjana Devi) స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండగా.. తల్లికి అనారోగ్యంగా ఉందన్న సమాచారం అందటంతో.. పవన్ కళ్యాణ్ వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తోంది.   ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే సమావేశం మొదలైన కాసేపటికి.. తల్లి అంజనా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం రావడంతో.. సీఎంకి, సహచర మంత్రులకు విషయం చెప్పి.. పవన్ హైదరాబాద్ కి బయలుదేరినట్లు న్యూస్ వినిపిస్తోంది.   ఇటీవల కూడా అంజనా దేవి తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వార్తలొచ్చాయి. కానీ, ఆ వార్తలను మెగా కుటుంబం ఖండించింది. రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలిపింది. ఇప్పుడు మరోసారి అంజనా దేవి ఆరోగ్యం గురించి వార్తలొస్తున్నాయి. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  భారతీయులు ఎక్కువగా ఉపయోగించే దుంప కూరగాయలలో బంగాళదుంపలు ముఖ్యమైనవి. వీటితో స్నాక్స్,  చిప్స్ తో పాటు,  బోలెడు రకాల వంటలు కూడా చేసుకుంటారు. అయితే బంగాళదుంపలను ఉడికించేటప్పుడు చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పుల వల్ల బంగాళదుంపలు సరిగా ఉడకకపోవడం, పైన పొట్టు వచ్చినా లోపల పచ్చిగా ఉండటం జరుగుతుంది. అయితే 5 విషయాలను గుర్తుంచుకుంటే బంగాళదుంపలు చక్కగా దుంప మొత్తం సమంగా ఉడుకుతాయి. అంతేకాదు.. బంగాళదుంపల గురించి చాలా ముఖ్యమైన చిట్కాలు కూడా ఇదిగో ఇక్కడ తెలుసుకోండి.. ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు.. బంగాళదుంపలను ఎక్కువగా ఉడకబెట్టినప్పుడు పెద్ద సమస్య వచ్చి పడుతుంది.  దుంపలు ఎక్కువగా ఉడకడం వల్ల మెత్తగా చేతిలో పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు  వాటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల చాలా ప్రయోజనంగా ఉంటుంది.  కూల్ అయ్యాక బంగాళదుంపలు మెత్తదనం పోయి కాస్త గట్టిగా అవుతాయి.  అప్పుడు వీటిని కూరలలో తగినట్టుగా ఉపయోగించుకోవచ్చు. వేడినీరు.. చాలామంది బంగాళదుంపలను తొందరగా ఉడికిద్దాం అనే ఆలోచనతో ముందే వేడి చేసిన నీటిలో బంగాళదుంపలు వేసి తరువాత వాటిని ఉడికిస్తారు. దీని వల్ల పైన తొక్క తొందరగా వచ్చేస్తుంది.  కానీ లోపల సరిగా ఉడకదు.  పచ్చిగా ఉంటుంది.  అందుకే నేరుగా చల్లని నీటిలో బంగాళదుంపలు వేసి  ఉడికించాలి. ఉప్పు.. బంగాళదుంపలను కుక్కర్ లో ఉడికించేటప్పుడు కాసింత ఉప్పు జోడించాలి.  ఇలా చేయడం వల్ల బంగాళదుంప తొక్క చాలా మెత్తగా అయిపోయి దుంప జారిపోయేలా కాకుండా దుంప మొత్తం సమంగా ఉడకడానికి సహాయపడుతుంది. ఎక్కువ నీరు.. బంగాళదుంపలను ఉడికించడానికి ఎక్కువ నీరు ఉపయోగించడం వల్ల కూడా బంగాళదుంపలు చాలా మెత్తగా, నీటిలోనే కలిసిపోయేలా అయ్యే అవకాశం ఉంటుంది.  4 విజిల్స్‌లో పూర్తయ్యేంత నీటిని మాత్రమే జోడించాలి. అలాగే  మీడియం మంట మీద మాత్రమే ఉడకబెట్టాలి.  దీనివల్ల బంగాళాదుంపలు ఎప్పుడూ పగిలిపోకుండా ఉంటాయి. చిన్న పరిమాణంలో ఉన్న  బంగాళాదుంపలకు ఒక విజిల్ సరిపోతుంది. గిన్నె పద్దతి.. బంగాళాదుంపలు తక్కువగా ఉంటే ముందుగా కుక్కర్‌లో చల్లటి నీరు పోసి స్టీల్ గిన్నె ఉంచాలి. బంగాళాదుంపలను గిన్నెలో వేసి మరిగించాలి.  దీనివల్ల బంగాళాదుంపలు నీటిని పీల్చుకోకుండా ఉంటాయి.  అవి విరగకుండా సులభంగా మృదువుగా మారుతాయి. వంటను సులభతరం చేయడంలో గిన్నె పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.                                    *రూపశ్రీ.
  ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ముఖ్యమైన మొదటి దశ ఉందంటే అది కెరీర్ కు సంబంధించిన విషయమే అయ్యుంటుంది.కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే  ఉద్యోగం,  ఆనందం,  ఆర్థిక స్థితి, వ్యక్తిగత అభివృద్ది వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. చాలా మంది అవగాహన లేకుండా సమాజంలో దేనికి ఆదరణ ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని దాన్నే తమ కెరీర్ గా ఎంచుకుంటారు. ఇది ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ.. అన్ని వేళలా ఇది పనిచేయదు.  సరైన కెరీర్ ను ఎంచుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ఆసక్తులు, అభిరుచులు.. మీరు ఏ విషయాలలో ఆసక్తి చూపిస్తారు? (ఉదా: సైన్స్, ఆర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ, క్రియేటివ్ ఫీల్డ్స్, సర్వీస్?) చిన్నప్పటి నుండి మీరు ఎక్కువగా ఆసక్తి చూపిన విషయాలు ఏవి? ఏ పని చేసేటప్పుడు మీరు టైమ్ గమనించకుండా మునిగిపోతారు? ఉదాహరణ: మీకు problems solve చేయడం ఇష్టం అయితే — సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్, లా వంటివి మంచి ఎంపికలు.  మీ సామర్థ్యాలు, బలాలు.. మీరు ఏ విషయాన్ని బాగా  చేయగలరు? (ఉదా: గణితం, భాషలు, కమ్యూనికేషన్, ఆర్ట్, లీడర్‌షిప్, డిజైన్) ఇతరులు మీలో ఏ బలాలను గుర్తిస్తారు? దీన్ని అర్థం చేసుకోవడానికి Aptitude Tests లేదా Career Assessment Tests (ఉదా: MBTI, Holland Code) చేయవచ్చు.  మార్కెట్ లో అవకాశాలు.. ఎంచుకోవాలి అనుకున్న రంగంలో ఫ్యూచర్ డిమాండ్ ఉందా? ఆ ఫీల్డ్ లో గ్రోత్, జాబ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? కొత్తగా పెరుగుతున్న రంగాలు ఏమిటి? (ఉదా: AI, డేటా సైన్స్, సస్టైనబిలిటీ, డిజిటల్ మార్కెటింగ్) జీతం,  జీవన ప్రమాణాలు.. మీరు ఎంచుకునే కెరీర్ మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చగలదా? మీరు కోరుకునే జీవన విధానానికి అనువుగా ఉందా? ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.  మెంటార్లు,  ప్రొఫెషనల్స్.. మీరు ఇష్టపడే రంగంలో ఇప్పటికే ఉన్నవారి అనుభవాలను తెలుసుకోవాలి.   వారు ఎదుర్కొనే సవాళ్లు, సంతృప్తి, అవకాశాలు తెలుసుకోవాలి.  సవాళ్లను అధిగమించడానికి కావలసిన నైపుణ్యాలు, సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరిన్స్.. ఇంటర్న్షిప్‌లు, వర్క్‌షాప్‌లు, ప్రాజెక్ట్‌లు, వాలంటీర్ వర్క్ ద్వారా ఫీల్డ్ ను దగ్గరగా చూడడం వల్ల చాలా మంచి అనుభవం లభిస్తుంది. భవిష్యత్తు.. ఈ కెరీర్ లో మీరు 10-20 ఏళ్ళ తరువాత మీరు ఎక్కడ  ఉంటారు, ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించాలి.  అది మీ వ్యక్తిత్వం, విలువలకు సరిపోతుందా? చివరగా.. కెరీర్ ఎంపికలో ఎప్పుడూ ఒకే సరైన దారి ఉండదు. మీ అభిరుచి, సామర్థ్యం, మార్కెట్ డిమాండ్, జీవిత లక్ష్యాల కలయికతో సరైన దారి ఏర్పడుతుంది. ముఖ్యంగా.. శాంతిగా ఆలోచించాలి.  రీసెర్చ్ చేయాలి. అవసరమైతే కెరీర్ కౌన్సెలింగ్  సహాయం తీసుకోవాలి. ఇది చాలా మంచి పునాదికి దారి తీస్తుంది.                                       *రూపశ్రీ.
  ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది.  ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది.  అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే  సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే..  యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి,  ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం  భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం),  ఆయుర్వేదం.  ఆయన చరిత్ర వృత్తాంతం..  ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా  విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి  సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ  లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న  సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు.  అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి  శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు.  ఇది పతంజలి మహర్షి  భగవత్‌ ప్రేమకు సంకేతం.  త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి  అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి  సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.  జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.  ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥ మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.                                     *రూపశ్రీ
  జిమ్,  యోగా  రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వ్యాయామ పద్ధతులే. అయితే ఆరోగ్య లక్ష్యాలు , జీవనశైలి , శారీరక పరిస్థితి,  మానసిక స్థితిని బట్టి ఏది బెస్ట్ అనే విషయంలో మార్పు ఉంటుంది.   అంతేకాదు ఈ రెండింటి మధ్య తేడాలు ఉండటం వల్ల వీటి వల్ల లభించే ఫలితాల్లో కూడా తేడాలు ఉంటాయి.  ఈ రెండు మధ్య తేడాలు,  ఉపయోగాలు తెలుసుకుంటే.. జిమ్ (Gym) — లాభాలు:  బలవర్ధక వ్యాయామం (Strength training): జిమ్‌లో వెయిట్లు, మిషన్లు వాడడం వల్ల కండరాలు (muscles) బలంగా తయారవుతాయి. శరీరాన్ని షేప్‌లోకి తేగలగడం (Body toning): శరీరంలో ఏదైనా ప్రాంతంలో కొవ్వు పేరుకుని ఉంటే.. ఆ ప్రాంతానికి సంబంధించి జిమ్ లో వ్యాయామాలు చేయడం ద్వారా  కొవ్వు కరిగించి ఫిట్ బాడీని పొందవచ్చు. వెయిట్ లాస్ / వెయిట్ గెయిన్ (Weight control): బరువు ఎక్కువ ఉన్నవారు మాత్రమే జిమ్ కు వెళతారు అంటే అది పొరపాటు. జిమ్ చేయడం వల్ల బరువు పెరగవచ్చు కూడా.  దీనికి తగిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఫిట్‌నెస్ నిపుణులు కూడా సజెస్ట్ చేస్తారు. దీని వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గడం,  లేదా పెరగడం చేయవచ్చు. ఎనర్జీ స్థాయి పెరుగుతుంది: జిమ్ కు వెళ్లడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది.  దీనివల్ల  రోజువారీ జీవితం energetic గా ఉంటుంది.  కార్డియో ఎక్సర్సైజులు (Cardio workouts): కార్డియో ఎక్సర్సైజులు గుండెకు చాలా మంచివి.  జిమ్ లో చాలామంది చేసే  ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  గుండెను దృఢంగా మారుస్తాయి. యోగా (Yoga) — లాభాలు: మానసిక ప్రశాంతత (Mental peace): యోగా అంటే కేవలం శరీరానికి సంబంధించినది కాదు.. ఇది మనసుకు కూడా సంబంధించినది.  కాబట్టి యోగా వల్ల  మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.  శ్వాస,  చైతన్యం పెరుగుతుంది (Improved breathing & awareness): యోగాలో ధ్యానం, ప్రాణాయామం ముఖ్యమైనవి. ప్రాణాయామంలో కూడా చాలా రకాలు ఉన్నాయి.  ఇవి  lungs పనితీరును మెరుగుపరుస్తాయి. శరీర సౌలభ్యం (Flexibility): యోగాలో వివిధ ఆసనాలు, భంగిమలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో అన్ని ప్రాంతాలలోసాధారణంగా అందరూ చేసే వ్యాయామాలకంటే ఎక్కువగా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది.  హార్మోనల్ బ్యాలెన్స్: యోగా వల్ల శరీరంలో గ్రంథుల పనితీరు మెరుగవుతుంది.  దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి హార్మోన్లు సక్రమంగా విడుదల అవుతాయి. ఇది  శరీర వ్యవస్థలను సవ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ మొదలైన వాటికి మేలు చేస్తుంది. ఎవరికి ఏది బెటర్? వ్యక్తి లక్ష్యాన్ని బట్టి సరైన ఎంపిక.. దానికి గల కారణం.. బరువు తగ్గాలనుకునే వారు జిమ్ లేదా యోగా + డైట్ చేయడం మంచిది.  అయితే జిమ్ వేగంగా ఫలితం ఇస్తుంది. యోగా మెల్లగా ఫలితాన్ని ఇస్తుంది.  కానీ దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకునేవారు యోగా మెడిటేషన్, ప్రాణాయామం చేయాలి. ఇవి మానసిక  శాంతిని ఇస్తాయి. కండరాలు పెంచుకోవాలి అనుకునేవారికి జిమ్ బెటర్. ఎందుకంటే జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి  అవసరం. ఫ్లెక్సిబిలిటీ, అంతర్గత ఆరోగ్యం కోసం యోగా చేయాలి. నాడీవ్యూహం, శ్వాస వ్యవస్థ పైన యోగా ప్రభావితంగా ఉంటుంది. అందుకే యోగాఎంపిక మేలు. టైమ్ తక్కువగా ఉంటే జిమ్ కు వెళ్లడం కుదరదు. కాబట్టి అలాంటి వారికి యోగా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యోగాను ఇంట్లో కూడా 20-30 నిమిషాలు చేయవచ్చు. మోటివేషన్ తగ్గిపోతుంటే ఇంట్లో జిమ్ అయినా,  యోగా అయినా చేయలేం. అందుకే జిమ్ లో ట్రైనర్, యోగా క్లాసులలో యోగా టీచర్ ఇంకా ఇతర అభ్యాసకులు ఉంటారు.  కాబట్టి ఉత్సాహంగా ముందుకు వెళ్లవచ్చు.   మిక్స్ చేయడం బెస్ట్.. అవకాశం ఉంటే వారంలో 3 రోజులు జిమ్ + 2 రోజులు యోగా చేయడం ఉత్తమ మార్గం. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ బ్యాలన్సు అన్నీ కలుగుతాయి.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  చపాతీలు  ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా గోధుమ పిండితో తయారు చేసే చపాతీలు చాలామంది డైట్ లో ఉంటాయి.  అధిక శాతం  మంది రాత్రి ఆహారంలో అన్నానికి బదులు చపాతీలు తింటారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద స్పృహతో నూనె వేయకుండా చపాతీలు చేసే చపాతీలకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. ఇలా నూనె వేయకుండా చేసే చపాతీలను కొన్ని సెకెండ్లు పెనం మీద వేయించి ఆ తరువాత నేరుగా గ్యాస్ స్టవ్ మంట పైన పెడుతుంటారు. ఈ మంటకు చపాతీలు పొంగుతాయి.  ఇవి బాగా మెత్తగా, నూనె లేకుండా ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యం అనుకుంటారు. అయితే ఇలా చేసే చపాతీలు ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..   అధిక ఉష్ణోగ్రతల వద్ద చపాతీని వండటం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే HCA (హెటెరోసైక్లిక్ అమైన్స్),  PAH (పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్) వంటి కొన్ని హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. సహజ వాయువు పొయ్యిలు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్,  WHO ప్రమాణాలను మించిన సూక్ష్మ కణాలు వంటి ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు,  క్యాన్సర్ వంటి సమస్యలతో ముడిపడి ఉండవచ్చని వైద్యులు, పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్ ప్రమాదం.. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడం వల్ల క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి చపాతీలను నేరుగా గ్యాస్ మంట మీద వండటం కూడా ప్రమాదకరం అనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణుల మాట.. నేరుగా మంట మీద వంట చేయడం వల్ల క్యాన్సర్‌కు నేరుగా సంబంధం ఉండదని కొందరు అంటున్నారు. అయితే ఇలా వంట చేయడం, నేరుగా చపాతీలు గ్యాస్ స్టవ్ పైన కాల్చడం వల్ల ఖచ్చితంగా కొన్ని రసాయనాలు  దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరంలో DNA దెబ్బ తింటుంది. కానీ శరీరం తనను తాను నయం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఎవరైనా అలాంటి ఆహారాన్ని అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కానీ.. ఎక్కువగా అదే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మంచి మార్గం ఏదంటే.. పోషకాహార నిపుణురాలు, డైటీషియన్ల ప్రకారం.. 'HCA, PAH,  అక్రిలామైడ్ వంటి రసాయనాలు ముఖ్యంగా స్టార్చ్,  మాంసం వండినప్పుడు ఏర్పడతాయి. అవి క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి ఉండవు. కానీ ముందుజాగ్రత్తగా  బొగ్గు లేదా ఓపెన్ స్టవ్‌పై వండకుండా ఉండటం మంచిదట. గతంలో చపాతీని  ఒక గుడ్డ సహాయంతో పాన్‌పై నొక్కుతూ  తక్కువ మంటపై నూనె వేయకుండా వండేవారు, తద్వారా అది అన్ని వైపుల నుండి సరిగ్గా ఉడికిపోతుంది.  గ్యాస్ మంట మీద నేరుగా కాలదు కూడా. కానీ ఇప్పుడు చపాతీలను  నేరుగా మంటపై కాల్చే అలవాటు చాలా చోట్ల పెరిగింది.  దీని వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు కానీ ఇది ఆరోగ్యానికి హానికరం.  అందుకే చపాతీలను ఎల్లప్పుడూ పాన్ మీద కాల్చడమే మంచిదట.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...