తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పొత్తులో భాగంగా విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో ఈ ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  టీవీకేతో పొత్తుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విజయ్ పార్టీకి 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విజయ్ సీఎం పదవిపై దృష్టి పెట్టారని, చర్చల్లో ఆ విషయం కీలకంగా మారిందని చెప్తున్నారు. బీజేపీ, డీఎంకేలతో తమకు పొత్తులు ఉండవన విజయ్ గతంలోనే తేల్చి చెప్పారు. అయినా పొత్తులపై ప్రచారం జరుగుతూనే ఉండటం విశేషం.
  దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది . అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వెల్లడించింది.  ఎన్నికల ప్రకటనతో పాటు వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఈ నెల 30న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఏప్రిల్ 6 నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు. ఏప్రిల్ 7 నామిషేన్ల పరిశీలన ఉంటుంది.  నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 9. ఇక ఏప్రిల్ 23న పోలింగ్,మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏప్రిల్ 6 నాటికి తమిళనాట ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఈసీ వెల్లడించింది.  
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. సీఈసీపై అభిశంసన విషయంలో జగన్ తీసుకునే స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత ఏన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణం అంటూ సమయం వచ్చినా, రాకున్నా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.  2024 ఎన్నికల్లో  కూటమి విజయం వెనుక ఈసీ హస్తం ఉందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు  సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలబడుతుందా? అలా నిలబడే ధైర్యం చేస్తుందా? జగన్ కు ఆ దమ్ముందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  2024  ఎన్నికల ఫలితాల తర్వాత  వైసీపీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయనీ, అరకోటికి పైన ఓట్లపై స్పష్టత లేదనీ పలు విమర్శలు చేసింది.  రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు దీనిపై ప్రశ్నలు కూడా సంధించారు. ఇప్పుడు  అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్మానానికి  వైసీపీ   మద్దతు ఇస్తుందా లేదా అన్న చర్చ జోరందుకుంది.   ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే..   ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ  వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం  కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసిన పార్టీగా ప్రజల ముందు తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా పార్లమెంటులో వైసీపీ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒరిగేదేం లేదు. కానీ   తమ ఓటమికి ఈసీనే కారణమని  వైసీపీకి నిజంగా నమ్ముతుంటే.. తీర్మానాన్ని బలపరచాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తే.. ఆ పార్టీ విశ్వసనీయత పాతాళంలోకి దిగజారిపోవడం ఖాయం.    సీఈసీపై అవిశ్వాస తీర్మానంపై ఇప్పటి వరకూ దాదాపు 195 మంది ఎంపీలు సంతకాలు చేశారు.  అలా సంతకాలు చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరైనా వైసీపీ ఎంపీ లేరు. దీంతో వైసీపీది ద్వంద్వ నీతి, నైతికతనీ నైతికత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయమేంటంటే.. కేసుల భయంతో జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణంగానే సీఈసీపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ ఎంపీలు నిలబడే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం కంటే.. జగన్ కు కేసుల నుంచి రక్షణ పొందడమే ముఖ్యమనీ, అందుకే  వైసీపీ ఎంపీలు సీఈసీపై అవిశ్వాన తీర్మానంపై సంతకాలు చేయడానికి ముందుకు రావడం లేదనీ అంటున్నారు. రాజకీయవర్గాలలో వైసీపీ నైతిక పతనానికి దీనిని సంకేతంగా చూపుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూడాలి మరి సీఈసీపై అవిశ్వాత తీర్మానం విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?
ALSO ON TELUGUONE N E W S
తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే, ఇటీవల తిరుమల కొండపై చోటు చేసుకున్న కేక్ కటింగ్ వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంలోకి అనవసరంగా తన పేరును లాగడంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. అసలు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనపై నిందలు వేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి, తన స్నేహితురాలు తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో కేక్ కట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి చర్యలు పవిత్రతను దెబ్బతీస్తాయని భక్తులు మండిపడటంతో, టీటీడీ.. విజిలెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు కావడంతో మాధురి ఆత్మరక్షణలో పడ్డారు. ఈ వివాదంపై వివరణ ఇస్తూ దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో జాన్వీకపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారు, అప్పుడు లేని అభ్యంతరం నేను చేస్తేనే ఎందుకు? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీడియాకి ఏదో ఒక హాట్ టాపిక్ కావాలి. టిఆర్‌పి రేటింగ్ పెంచుకోవడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారు. అలాగే చెయ్యనివ్వండి. నేను అలా ఉపయోగపడడం నాకూ గర్వంగానే ఉంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాన్వీకపూర్ దృష్టికి వెళ్లాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే జాన్వీ, ఈ అబద్ధపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘అసలు ఈ మహిళ ఎవరు?’ అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. తాను తిరుమలలో ఎప్పుడూ కేక్ కట్ చేయలేదని, తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. ప్రచారం కోసం ఇతరులపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. జాన్వీకపూర్ శ్రీవారికి పరమ భక్తురాలు. ఆమె తరచుగా తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, అలాంటి పవిత్ర స్థలంలో తాను ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం తనను తాను సమర్థించుకోవడానికి సెలబ్రిటీల పేర్లు వాడటం సరికాదని సూచించారు. ఈ విషయంలో నెటిజన్లు కూడా జాన్వీకపూర్‌కే మద్దతుగా నిలుస్తున్నారు. శ్రీవారి భక్తురాలైన జాన్వీపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మాధురి మూర్ఖత్వమని విమర్శిస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే కానీ పక్కదారి పట్టించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్ మరియు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమల కొండపై పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్ వంటివి నిషేధం. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా నిబంధనలు పాటించాల్సిందేనని భక్తులు కోరుతున్నారు. జాన్వీ ఇచ్చిన కౌంటర్‌తో దివ్వెల మాధురి మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
    -నిన్న జరిగిన ఉస్తాద్ ప్రీ  రిలీజ్ ఈవెంట్  -అందరిలో మూవీపై భారీ అంచనాలు -తాను మళ్ళీ బిజీ అవుతుందా!   ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath SIngh)పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawak Kalyan)అభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు బుక్ మై షో తో పాటు ఆన్ లైన్ టికెట్స్ యాప్స్ పై ఉంది. ఉగాది సందర్భంగా ఈ నెల 19 న థియేటర్స్ లోకి అడుగుపెడుతున్నా కూడా, ముందు రోజు బెనిఫిట్ షో ఉండటంతో ఏ నిమిషాన ఆన్ లైన్ లో లోడ్ చేస్తారో, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఎక్కడ టికెట్స్ అయిపోతాయో అనే చిన్నపాటి దిగులు కూడా వాళ్ళల్లో ఉంది. దీంతో ఎన్ని పనులు ఉన్నా ఫోన్ ని మాత్రం వదలడం లేదు. మరో వైపు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని అందరి స్పీచ్ లని మరోసారి మననం చేసుకుంటు 'ఉస్తాద్' అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ లిస్ట్ లో రాశి ఖన్నా కూడా ఉంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ఆమె మాటలు చూద్దాం. రాశి ఖన్నా(Raashii Khanna)మాట్లాడుతు కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. . పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఒక వ్యక్తిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. చాలా తక్కువ మాట్లాడతారు కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. అంతటి   గొప్ప స్టార్ తో స్క్రీన్ ని పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.  నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్(Harish Shankar)గారికి ధన్యవాదాలు. ఉస్తాద్ కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందనే నమ్మకం నాలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలి. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుందని  రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. Also read: Ustaad Bhagat Singh: ఈ సారి నిలబడతాడా! ఆ స్పీచ్ ఏంటి స్వామి  ఢిల్లీకి చెందిన రాశి ఖన్నా 2014 లో ఊహలు గుసగుసలాడేతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై టేక్ ఆఫ్ అయ్యింది. సుప్రీమ్, ప్రతి రోజు పండగే తర్వాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు గత ఏడాది చేసిన 'తెలుసు కదా' వరకు పరాజయాలని ఎదుర్కొంది. సినిమాల లిస్ట్ కూడా అంత పెద్దగా లేదు. ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ హిట్ తో తెలుగుతో పాటు ఇతర బాషల్లోను వరుస అవకాశాలని దక్కించుకుంది. మరి ప్రస్తుతం డల్ గా ఉన్న రాశి ఖన్నా కెరీర్ కి  పవన్ తన ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ జోరుని అందిస్తాడేమో చూడాలి.        
-ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే  -ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న హరీష్ శంకర్ మాటలు  -హిట్ అందుకుంటాడా!    మాస్, క్లాస్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడుగా హరీష్ శంకర్(Harish Shankar)కి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. టేకింగ్, డైలాగ్స్ పరంగా కూడా తనకంటు సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హరీష్ శంకర్ ప్రీవియస్ మూవీ మిస్టర్ బచ్చన్ పరాజయంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19 న విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అభిమానుల్లో అయితే అంచనాల రేంజ్ ఊహలకి కూడా అందని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి అవేంటో చూద్దాం. హరీష్ శంకర్ మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్(UStaad Bhagat singh)ఆలస్యానికి, ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోవడానికి నేనే కారణం. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు స్టోరీ అనుకున్నాం. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. అప్పటినుంచి ఎంతో ఉత్సాహంతో చేసాం. ఆయన పరుగెత్తారు, మమ్మల్ని పరుగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇప్పుడు ఆ  డైలాగ్ మార్చుకున్నాను. కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది. నా గుండె లోపల పవన్ కళ్యాణే, నా గుండె బయట పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే. పగలు ప్రజాసేవలో ఉండి, రాత్రుళ్ళు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రాణం పెట్టి పనిచేశారు  ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ . ఉస్తాద్ కోసం అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. కాలరే ఎత్తరా సాంగ్ సెట్ మైత్రి కెరీర్ లోనే అతి పెద్ద సెట్. ఆనంద్ సాయి గారు అద్భుతమైన సెట్ లు వేశారు. కథ మారినా, నా గురించి బయట కథలు కథలుగా చెప్పుకున్నా రెండున్నరేళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ గారికి  కృతఙ్ఞతలు. మా రమేష్ రెడ్డి గారికి, ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ గారికి కూడా కృతఙ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే, తెర వెనుక హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన పాటలు అందించారు. అలాగే థమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఉగాదికి తీసుకొస్తున్నాం. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారు గొప్ప క్యారెక్టర్స్ పోషించారు. also read: Ustaad Bhagat Singh: పవన్ గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు సబబేనా!.. ఐరెన్ లెగ్ ముద్ర పోతుందా! శ్రీలీల(Sreeleela)గారు అనగానే అందరికీ డ్యాన్స్ లు గుర్తుకొస్తాయి. ఇక ఉస్తాద్ తో తన పెర్ఫార్మ్ గురించి మాట్లాడుకుంటారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ లు ఈ సినిమాలో చూస్తారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పని చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. మార్చి 19న థియేటర్లలో ఉస్తాద్ ఉగాది జరుపుకుందామని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. అభిమానులైతే హరీష్ శంకర్, పవన్ మరో సారి గబ్బర్ సింగ్ ని మించి విజయాన్ని అందుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.    
  -నిన్న గ్రాండ్ గా జరిగిన ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్  -శ్రీలీల స్పీచ్ వైరల్  -అభిమానుల రియాక్షన్ ఏంటి! వేసవి కాలం ఇంకా స్టార్ అయ్యిందో లేదో అనే డౌట్ చాలా మందిలో ఉంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్(UStaad Bhagat Singh)మానియా స్టార్ట్ అయ్యిందనే విషయంలో మాత్రం ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. పైగా ఓజి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో పాటు 18 నైట్ బెనిఫిట్ షో చూసే 19 న ఉగాది జరుపుకోవాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ విషయంలో మూవీ లవర్స్ కూడా పోటీ వస్తారనే విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్ కూడా లేదు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నే అందుకు సాక్ష్యం. సదరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పాటు వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన శ్రీలీల(Sreeleela)మాటలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆమె మాటలేంటో చూద్దాం. శ్రీలీల మాట్లాడుతు మా హీరో పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, పీపుల్ స్టార్. ఆయన గురించి మాట్లాడే అంత పెద్దదాన్నికాదు. ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నానని తెలిసి తమిళ, కన్నడ సినిమాల సెట్స్ కి వెళ్ళినప్పుడు పవన్ గారి గురించి అడిగేవారు. పాజిటివ్ గా ఉండటం, మన జీవితం మనం చూసుకోవడం కాకుండా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రకృతిని ప్రేమించడం ఇలా ఎన్నో విషయాలు పవన్ గారిని చూసి నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చేయడం అనేది సినిమాకే మంచింది. ఎందరికో ఆయన నిజమైన స్ఫూర్తి. ఈ ఉగాదిని ఉస్తాద్ ఉగాది చేస్తారని కోరుకుంటున్నాను. మార్చి 19న థియేటర్లలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం.అందరకి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చింది.  also read: Ustaad Bhagat Singh: ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ స్పీచ్ అదరహో.. కానీ ఆ మాటల్ని గమనించారా హరీష్ శంకర్, నిర్మాతలు, దేవిశ్రీప్రసాద్ గురించి మాట్లాడుతు హరీష్ గారి నుంచి కూడా ఎంతో నేర్చుకున్నాను. నిజాయితీగా పని చేయడం వల్ల ముక్కుసూటిగా ఉంటారు. సరిగా నిద్ర పోకుండా ఒక యజ్ఞంలా మూవీని కంప్లీట్ చేసారు. ఆ యజ్ఞం ఫలించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారికి కృతఙ్ఞతలు. ప్రతి చిన్న విషయంలో ఎంతో శ్రద్ధతో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన పాటలు అందించారు. మూవీలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు అని శ్రీలీల చెప్పుకొచ్చింది. శ్రీలీల మాత్రం గత కొంత కాలంగా వరుస పరాజయాల్ని చవి చూస్తూ గోల్డెన్ లెగ్ నుంచి  ఐరెన్ లెగ్ అనే టాగ్ లైన్ ని సినీ సర్కిల్స్ లో పొందింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.    
ప్రముఖ తమిళ కవి, గేయ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్‌ పురస్కారం దక్కడంపై టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. వైరముత్తు సాహితీ ప్రతిభను కొనియాడుతూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా 'మీటూ' ఉద్యమం ద్వారా వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గాయని చిన్మయి దీనిపై ఘాటుగా స్పందించారు. చిన్మయి తన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తీరును తప్పుబట్టారు. గతంలో వైరముత్తుపై దాదాపు 17 మంది మహిళలు వేధింపుల ఆరోపణలు చేశారని, అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఎలా అభినందిస్తారని ఆమె ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలవాల్సిన నాయకులు, ఇలాంటి వారికి మద్దతు తెలపడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైరముత్తుపై వచ్చిన ఆరోపణల విషయంలో చిన్మయి గత కొన్నేళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు కూడా తగ్గాయి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడు కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో కేవలం వైరముత్తు సాహిత్య సేవను మాత్రమే ప్రస్తావించారు. కానీ, చిన్మయి మాత్రం "సాహిత్యం గొప్పదైతే సరిపోదు, మనిషి ప్రవర్తన కూడా ముఖ్యం" అని గట్టిగా చెబుతున్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే జనసేనాని, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గౌరవించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు చిన్మయి లేవనెత్తిన అంశాల్లో నిజం ఉందని మద్దతు తెలుపుతున్నారు. ఒక మహిళగా చిన్మయి పడుతున్న ఆవేదనను అర్థం చేసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. మొత్తానికి వైరముత్తుకు దక్కిన ఈ గౌరవం మరియు పవన్ కళ్యాణ్ అభినందనలు ఇప్పుడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ ఈ విమర్శలపై స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, మహిళా రక్షణ మరియు గౌరవం విషయంలో చిన్మయి చేస్తున్న పోరాటం మరోసారి చర్చకు దారితీసింది.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగు వెలుగుతోంది అందాల భామ త్రిష కృష్ణన్. నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్ మరియు నటనతో నేటి తరం కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే కాకుండా, తమిళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా త్రిష వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో త్రిషకు ఉన్న అనుబంధంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్న తరుణంలో, అందులో త్రిష పేరు కూడా తరచూ వినిపిస్తోంది. వీరిద్దరూ గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు కావడంతో ఈ రూమర్లు మరింత జోరందుకున్నాయి. ఇటీవల ప్రముఖ నిర్మాత సురేష్ కల్పతి కుమారుడి వివాహ వేడుకకు విజయ్ మరియు త్రిష ఇద్దరూ కలిసి హాజరవ్వడం టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆశ్చర్యకరంగా వీరిద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి, ఒకే కారులో వేడుకకు రావడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. వీరి మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న వార్తలకు ఈ సంఘటన మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా మార్చి 13న త్రిష చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఒక విలేకరి ఏకంగా "విజయ్‌తో కలిసి ఒకే కారులో పెళ్లికి ఎందుకు వెళ్లారు?" అని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్న వెంటనే త్రిష ముఖ కవళికలు మారిపోయాయి. ఆమె ఎటువంటి సమాధానం చెప్పకుండా, మౌనంగా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. త్రిష మౌనంగా వెళ్లిపోవడానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం సమాధానం చెప్పకపోవడం వల్ల అనుమానాలు పెరుగుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్-త్రిషల మధ్య ఉన్న స్నేహం కేవలం ప్రొఫెషనల్ మాత్రమేనా లేక అంతకు మించి ఏదైనా ఉందా అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. వీరిద్దరూ త్వరలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్లపై వీరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే.
  -నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక  -పవన్ స్పీచ్ పై ఫ్యాన్స్ హ్యాపీ  -ప్రతి ఒక్కర్ని అభినందించాడు సిల్వర్ స్క్రీన్ పై ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాలు మోపడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కెరీర్ లో ఫస్ట్ టైం తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది రోజు 19 న అడుగుపెట్టబోతుండటం, పైగా 18 నుంచే ప్రీమియర్స్ పడుతుండటంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి వాతారణం నెలకొని ఉంది. రిలీజ్ ని పురస్కరించుకొని నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ కి హాజరైన అభిమానులకి, లైవ్ లో వీక్షిస్తున్న ప్రజలకి నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైన దితో పాటు అన్నం పెట్టింది. ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది కూడా సినిమానే.  అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకోవడంతో పాటు సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకి ఆనందం కలగాలని కోరుకుంటాను. నా మూవీ ఎంత వసూలు చేసిందని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సినిమా బాగుండాలని మాత్రమే కోరుకుంటాను. తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా అనేది ఉండదు.  భారతీయ సినిమా మాత్రమే ఉంటుందని నమ్ముతాను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం. నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్వీట్ చేసిన రామ్ చరణ్ కి కూడా నా కృతఙ్ఞతలు. సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్(Harish Shankar)చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. వీటన్నింటి మధ్య నేను రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా రోజుకి ఐదారు గంటల లోపే పనిచేస్తూ నలభై నలబైదు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసాం. హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. పాలిటిక్స్ లో ఉన్నా కూడా సినిమాలు చేయొచ్చు అనే భరోసాని కూడా ఉస్తాద్ ఇచ్చింది. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని  మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది. నవీన్ గారు నాతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయాలని ఉందని ఎప్పటినుంచో చెప్పేవారు. ఆ కోరిక ఉస్తాద్ తో నెరవేరుతుందని ఆశిస్తున్నాను. లిరిక్స్  అందించిన చంద్రబోస్ గారికి, భాస్కరభట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి కృతఙ్ఞతలు. పీఆర్ఓ లక్ష్మి వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గారికి, కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ కి, స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ గార్లకి రచయితలు రమేష్ రెడ్డి గారికి, దశరథ్ గారికి, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి, సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ గారికి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారికి, నేపథ్య సంగీతం బాధ్యతలు తీసుకున్న తమన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి పెర్ఫార్మర్. తన కెరీర్ లో గుర్తుండిపోయే క్యారక్టర్ ని ఉస్తాద్ లో పోషించింది. రాశి ఖన్నా గారు నాతో కలిసి నటించాలనే ఉద్దేశంతో కథ కూడా వినకుండా అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్య క్యారెక్టర్స్ చేసిన పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారికి కృతఙ్ఞతలు.. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్. మీలో ఒకరు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుత దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకొని ఎంతో తపనతో ఈ సినిమా చేశాడు.  Also read: Allu Arjun: నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అల్లు అర్హ.. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్  నా గుండెల్లో నుంచి ప్రేమ పూర్వకంగా చెబుతున్నాను.. హరీష్ శంకర్ కి హ్యాట్సాఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తుంది. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. అభిమానులకి  నాకు రెండు గుండెలు దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు, మంచి సందేశం ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. ఈ వేడుక జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతఙ్ఞతలు. అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు." అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ తన స్పీచ్ లో ప్రతి ఒక్కర్ని పేరు పేరున ప్రస్తావించడంపై అభిమానులు పవన్ కి ఉన్న సినీ నిబద్ధతని మరో సారి ప్రశంసిస్తున్నారు.    
టాలీవుడ్ 'కలెక్షన్ కింగ్', 'డైలాగ్ కింగ్' డాక్టర్ మోహన్ బాబు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఒడుదొడుకులు, సాధించిన విజయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టి, నేడు ఇండస్ట్రీలో ఒక లెజెండ్‌గా ఎదగడం వెనుక దశాబ్దాల కష్టం ఉంది. సినిమా రంగంలోకి రాకముందు మోహన్ బాబు గారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మద్రాసులో ఉన్న సమయంలో సరైన భోజనం కూడా దొరకక పస్తులున్న రోజులు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి 'రాజమకుటం' సినిమా చూడటమే తన సినీ ప్రేరణకు మొదటి అడుగు అని చెప్పారు. ఆ పట్టుదలే ఆయనను దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దృష్టిలో పడేలా చేసింది. 'స్వర్గం-నరకం' చిత్రంతో మొదలైన ఆయన ప్రయాణం ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. మోహన్ బాబు నటనలో వైవిధ్యం చూపించడంలో దిట్ట. విలన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 560కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. "నేను నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, సినిమా ఫలితం ఎలా ఉన్నా నా నటనతో ప్రేక్షకులను అలరించాను" అని ఆయన గర్వంగా చెబుతుంటారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆయన, సెట్స్‌లో సమయపాలన విషయంలో ఎంతో కఠినంగా ఉంటారు. రాజకీయాల్లోకి వెళ్లినా, విద్యా సంస్థలను స్థాపించినా సినిమా అంటే ఆయనకు ప్రాణం. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌ల గురించి మాట్లాడుతూ, తాను వాటిని అస్సలు పట్టించుకోనని, అందరూ బాగుండాలని కోరుకుంటానని హుందాగా సమాధానమిచ్చారు. మొత్తానికి 50 ఏళ్ల ఈ ప్రయాణం కేవలం ఒక నటుడి విజయగాథ మాత్రమే కాదు, పట్టుదల ఉంటే శూన్యం నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నిరూపించిన ఒక చరిత్ర. తన సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది నవంబర్ వరకు ప్రతి నెలా ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. అభిమానుల ప్రేమే తనను ఇక్కడి వరకు నడిపించిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
    -అరుదైన ఘనత సాధించిన అల్లు అర్హ -అభినందనల వెల్లువ  -ఇంతకీ ఆ ఘనతేంటి అల్లు అర్హ(Allu Arha).. ఇది కేవలం పేరు కాదు బ్రాండ్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటు తగ్గేదెలే అనే రీతిలో తన క్యూట్ వీడియోస్ తో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. కొన్ని సందర్భాల్లో అయితే తన తండ్రి అల్లు అర్జున్ వీడియోస్ కంటే తన వీడియోస్ కే ఎక్కువ లైక్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని బట్టి అర్హ పాపులారిటీని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా అల్లు అర్హ అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకుంది. మరి ఆ చిచ్చరపిడుగు సాధించిన విజయమేంటో చూద్దాం.   అల్లు అర్హ హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఏరియాలో ఉన్న'రాయ్ చెస్ అకాడమీ'లో 'చెస్ గేమ్' లో ట్రైనింగ్ తీసుకుంటుంది. సదరు గేమ్ లో ఎంతో ప్రావీణ్యురాలు. ఎంతలా అంటే చెస్ లో సుమారు యాభై మంది వరకు ట్రైనింగ్ ఇచ్చేంతలా. అవును తాను ఒక యాభై మంది వరకు ట్రైనింగ్ ఇచ్చింది. చెస్ ఎలా ఆడాలో, ఎలా ఆడితే విజేతగా నిలుస్తారో వాళ్ళకి క్షుణ్ణంగా వివరించినట్టు  సమాచారం. పైగా కేవలం రెండు నెలల్లోనే వాళ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. దీంతో  చిన్న వయసులోనే  అంత మందికి ట్రైనింగ్ ఇవ్వడం కారణంగా ప్రఖ్యాతి గాంచిన నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో  స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుండంతో అభిమానులు, నెటిజన్స్ అర్హ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. also read:  Arjun das: అర్జున్ దాస్ ఎమోషనల్ బ్రేక్ అప్ పోస్ట్.. ఆ హీరోయిన్ నేనా!  ఫ్యూచర్ లో ఇండియాకి కూడా ఆడే విధంగా అర్హ ని మరింతగా ఎంకరేజ్ చెయ్యాలని అల్లు అర్జున్(Allu Arjun)ని కోరుతు మెసేజెస్ కూడా చేస్తున్నారు. అల్లు అర్హ వయసు ప్రస్తుతం తొమ్మిది సంవత్సరాలు. ఐదేళ్ల వయసులోను చెస్ శిక్షణ ఇచ్చినందుకు గతంలో కూడా   నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అర్హ స్థానాన్ని సంపాదించిన విషయం తెలిసిందే.     
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. సినిమా ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని చిరంజీవి కొనియాడారు. "మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే" అని అని ఆయన ట్వీట్ చేశారు. ట్రైలర్ లింక్‌ను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ ప్రశంసలపై దర్శకుడు హరీష్ శంకర్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ, సమయం కేటాయించి మరీ ట్రైలర్ చూసి అభినందించడం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.  "అయ్యబాబోయ్... అన్నయ్య. మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఏ రేంజులో నచ్చిందో నాకర్థమైంది. మీరు ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారని తెలిసింది, అయినా సరే వీలు చేసుకుని మా ట్రైలర్ చూసినందుకు, అభినందనలు తెలిపినందుకు నా ఆనందానికి అవధులు లేవు. మెగా ఆశీర్వాదం' కూడా దొరికింది కాబట్టి ఇక మెరుపు వేగంతో దూసుకెళ్ల డమే, ఎందుకంటే.. "మీరు ట్వీటు పెడితే...హీటు పెరిగినట్టే" అంటూ హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. నేడు (మార్చి 15) హైదరాబాద్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. https://x.com/harish2you/status/2033053569335833066
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే.. మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు.  గ్యాస్ సిలిండర్ కోసం కిలీమీటర్ల మేర క్యూ కట్టిన జనాన్ని వార్తల్లో కూడా చూపిస్తున్నారు. ఈ నైపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే.. ఇంట్లో ఉన్న గ్యాస్ ను పదుపుగా వాడుకోవడం చాలా మంచిది. గ్యాస్ ను సేవ్ చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. చాలా మంది వినియోగదారులకు దేశీయ LPG సిలిండర్ యొక్క అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు, ఇందులో 14.2 కిలోల గ్యాస్ మరియు 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామ్‌ను ఇది సూచిస్తుంది. వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. పాత్రల సెలక్షన్..  ఉపయోగించే వంట పాత్రల రకం కూడా  గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ  అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి.  ఈ  పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా  ఉంటే, వేడి వ్యాపిస్తుంద,  వంట సమయం ఎక్కువ అవుతుంది, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మీడియం ప్లేమ్.. అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని,  గ్యాస్ వినియోగం తగ్గుతుందని  అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. అధిక వేడి ఆహారాన్ని కాల్చేస్తుంది,  ఎక్కువ గ్యాస్‌ను కూడా వినియోగించుకుంటుంది. చాలా కూరగాయలు, పప్పులు,  బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా,  సమర్ధవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెజర్ కుక్కర్.. వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మూత పెట్టి వండటం.. వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి  ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. బర్నర్.. బర్నర్ శుభ్రతపై  శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది  మంట బాగా వచ్చేలా చేస్తుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.                                                   *రూపశ్రీ.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే.. టెంపరేచర్... చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఏసీ, ప్యాన్ కాంబినేషన్.. ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు. డోర్స్, విండోస్.. చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కర్టెన్లు.. కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు. ఫిల్టర్.. చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ మోడ్ లేదా టైమర్.. వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు. పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.                                        *రూపశ్రీ.
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బాదం.. బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ప్రయోజనాలు.. మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్.. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.   వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది. జీడిపప్పు.. జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.  చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పిస్తా పప్పు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..   పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది. ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ప్రయోజనాలు..   రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..  జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఖర్జూరం.. ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..    ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి,  వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  వేసవి కాలంలో  హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు,  కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు.  మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం,  మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి.  ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన,  ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే.. బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ  పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి.  వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి.  ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి.  స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార,  నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు.  పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి.  గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి.  దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది.  ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం,  శరీరానికి చలువ,  గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి,  నిమ్మరసం, నల్ల ఉప్పు,  పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే.   సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో  తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం.  కడుపును చల్లబరుస్తుంది,  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు,  వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ.  పెరుగు నుండి  వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ.  ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు,  పొదీనా వేసి తాగుతారు.  మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు.  ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.                               *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదు.. ఇది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. ఈ రోజు మనం మన ఆరోగ్యం గురించి గంభీరంగా ఆలోచించకపోతే, రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  Metabolic and Bariatric Surgeon Dr. Kona Lakshmi చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (Why should we care?) ఊబకాయం అనేది ఇతర ప్రమాదకరమైన రోగాలకు ఒక ముఖద్వారం లాంటిది. దీనివల్ల కలిగే నష్టాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి: గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం: మీ బరువు పెరిగేకొద్దీ మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది. సడన్ కార్డియాక్ డెత్స్‌కు ఊబకాయం ప్రధాన కారణం. క్యాన్సర్ ముప్పు: దాదాపు 13 రకాల క్యాన్సర్లు నేరుగా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెటబాలిక్ వ్యాధులు: డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్, మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు బాడీలోని "ఇంజిన్"ను లోపల నుండి దెబ్బతీస్తాయి. కీళ్ల నొప్పులు: అధిక బరువు వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏమి చేయకూడదు? (What not to do?) మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనారోగ్యం వైపు నెట్టేస్తాయి: పెద్ద సైజు దుస్తులపై ఆధారపడకండి: మార్కెట్‌లో 3XL నుండి 5XL వరకు దుస్తులు దొరుకుతున్నాయి కదా అని, బరువు తగ్గడానికి బదులు పెద్ద సైజు బట్టలు కొనడం అలవాటు చేసుకోవద్దు. మీ డ్రెస్ సైజు పెరుగుతుంటే, మీ అనారోగ్యం పెరుగుతోందని గుర్తించండి. నిర్లక్ష్యం వద్దు: "నేను బాగానే నడుస్తున్నాను కదా, నాకు ఏమీ కాదు" అని భ్రమపడకండి. లోపల షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉందో బయటకి కనిపించదు. కెమికల్స్ వినియోగం: ఫుడ్ కలర్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మరియు విపరీతమైన కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? (How to manage?) BMI పర్యవేక్షణ: మీ ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉన్నారో లేదో చూసుకోండి. సాధారణంగా BMI 18 నుండి 24 మధ్య ఉండాలి. ముందస్తు గుర్తింపు: మీకు ఆయాసం వస్తున్నా లేదా 15 నిమిషాలు కూడా నిరంతరంగా నడవలేకపోతున్నా మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జీవనశైలి మార్పులు: కాలుష్యం, జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కు దూరంగా ఉంటూ, శారీరక శ్రమను పెంచుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) 1. సన్నగా ఉన్నవారికి కూడా ఊబకాయం సమస్యలు ఉంటాయా?  అవును, బరువు తక్కువగా ఉన్నా మెటబాలిక్ సమస్యలు (షుగర్, బిపి) ఉండవచ్చు. ఊబకాయం అంటే కేవలం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు, శరీర అంతర్గత వ్యవస్థల పనితీరులో లోపం కూడా. 2. 'మార్బిడ్ ఒబేసిటీ' అంటే ఏమిటి? BMI 40 కంటే ఎక్కువ ఉంటే దానిని 'మార్బిడ్ ఒబేసిటీ' అంటారు. ఈ స్థితిలో ఊబకాయం అనేది కేవలం బరువు సమస్య కాదు, అది ప్రాణాపాయ స్థితిని (Life risk) సూచిస్తుంది. 3. బేరియాట్రిక్ సర్జరీ అంటే కేవలం బరువు తగ్గడమేనా?  కాదు, ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ డిసీజెస్ (డయాబెటిస్, హై బిపి) కూడా కంట్రోల్ అవుతాయి, అందుకే దీనిని మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఊబకాయం అనేది మనకు సమయం ఇస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలంటే ఈ రోజే మనం మారాలి. ఆరోగ్య విషయాలపై మరింత లోతైన అవగాహన కోసం మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా జీవించండి!