తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
కల్వకుంట్ల కవిత కొత్త  రాజకీయ పార్టీ పేరు   ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  (టీఆర్ఎస్)  పేరు  ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత..  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం  టీఆర్ఎస్  పేరు ఖరారు విషయంలో  పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె   న్యాయపోరాటానికి దిగారు.  పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా  టీఆర్ఎస్  అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి.    ప్రస్తుతం చలామణిలో ఉన్న..  లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత  చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు.  ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు,  తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు శివాజీ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించిన ఆయన, ఆ తర్వాత కాలంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఆ క్రమంలో సినిమాలకు పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. ఒకానొక దశలో రాజకీయాల్లోనూ చురుగ్గా లేక, ఇటు సినిమాల్లోనూ కనిపించక శివాజీ కెరీర్ పూర్తిగా ఫేడవుట్ అయిపోయిందని అందరూ భావించారు. ఇక ఆయనను వెండితెరపై చూడటం కష్టమే అనుకుంటున్న తరుణంలో, ఊహించని విధంగా బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ షో ద్వారా ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, విపరీతమైన పాపులారిటీని దక్కించుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎంతో గ్రాండ్‌గా రీస్టార్ట్ చేశారు శివాజీ. రీఎంట్రీలో ఆయనకు లభించిన మొదటి అవకాశం 'కోర్ట్' వెబ్ సిరీస్ / మూవీ. ఈ ప్రాజెక్ట్‌ను రెండు చేతులా అందిపుచ్చుకుని, తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. శివాజీ కెరీర్ మొదటి ఇన్నింగ్స్‌లో కూడా రానంతటి భారీ క్రేజ్ మరియు ప్రశంసలు ఈ 'కోర్ట్' ప్రాజెక్ట్ ద్వారా ఆయనకు దక్కడం విశేషం. దీని తర్వాత 'దండోరా' అనే చిత్రంతోనూ శివాజీ వైవిధ్యమైన నటనను కనబరిచి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ఇటీవల హీరోగా నటించిన 'సంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ, శివాజీ డిమాండ్‌కు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఈ వారంలోనే విడుదల కాబోతున్న మరో క్రేజీ మూవీ 'లెనిన్' లోనూ ఆయన అత్యంత కీలకమైన పాత్రలో అలరించబోతున్నారు. ఇలా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న శివాజీకి, తాజాగా పక్కనే ఉన్న కోలీవుడ్ నుండి ఒక భారీ, అద్భుతమైన అవకాశం లభించింది. 'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' వంటి చిత్రాలతో అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ స్వయంగా కథ అందిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న సరికొత్త క్రేజీ ప్రాజెక్టులో శివాజీ ఒక కీలక పాత్రకు ఎంపికయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్ర బృందం చాలా డిఫరెంట్‌గా, ఒక రేంజ్‌లో ప్లాన్ చేసి విడుదల చేసింది. ఆరుగురు ప్రతిభావంతులైన కుర్రాళ్లు కలిసి 'పీఆర్ ఆల్ఫా యూనిట్' పేరుతో రూపొందిస్తున్న ఈ క్రేజీ చిత్రంలో సౌత్ క్రష్, పాపులర్ నటి మామిత బైజు కథానాయికగా ప్రధాన పాత్ర పోషిస్తోంది. 'డ్రాగన్' చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుండగా, మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రధారిగా తెలుగు నటుడు శివాజీని ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా అఫీషియల్‌గా పరిచయం చేశారు. ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ వీడియోలో శివాజీకి స్పేస్ ఇచ్చి, హైలైట్ చేశారంటేనే సినిమాలో ఆయన పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ లాంచ్ వీడియోకి ఒక్క‌రోజులోనే 10 మిలియ‌న్ వ్యూస్ ల‌భించ‌డం గొప్ప విశేషంగా చెప్పుకోవ‌చ్చు. నిజానికి 'కోర్ట్', 'దండోరా' వంటి సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టుల వల్ల ఇతర భాషల మేకర్స్‌లోనూ శివాజీ నటనపై మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. శివాజీలో ఉన్న అద్భుతమైన పెర్ఫామర్‌ను, టైమింగ్‌ను గుర్తించి ప్రదీప్ రంగనాథన్ స్వయంగా ఆయనను ఈ ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తమిళ చిత్రంలో గనుక శివాజీ తనదైన ముద్ర వేసి, అక్కడి ప్రేక్షకులను మెప్పించగలిగితే కోలీవుడ్‌లోనూ ఆయనకు వరుస ఆఫర్లు రావడం ఖాయం. ఒక నటుడిగా కెరీర్ ముగిసిపోయింది అనుకున్న దశ నుండి, ఇలా ఊహించని రీతిలో పుంజుకుని, పరభాషా చిత్రాల్లో సైతం క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటూ శివాజీ సాగిస్తున్న ఈ ప్రయాణం మరియు కెరీర్ గ్రాఫ్ నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా, స్ఫూర్తినిచ్చేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.     Shivaji Sontineni, Pradeep Ranganathan, Mamitha Baiju
Thaman started promoting his film, Hrudhayam Murali/ Idayam Murali. He acted in the movie and composed music too. He promoted the film in Hyderabad and talked about how he is happy with the film. He called it one of his best romantic films and has a nostalgic connection with actor Murali.  During his speech, he stated that he used to play cricket with Rajamouli team and had fun. As college students asked about OG 2 Update, he stated that something is brewing in September. Pawan Kalyan has took over the production of the film from DVV Danayya and he actively started promoting as well with his PKCW producing.  Pawan Kalyan Creative Works is producing it in a big way and Sujeeth is directing the most awaited prequel to OG. As Pawan Kalyan's birthday falls on 2nd September, the movie makers seem to planning to start shoot and reveal an update. Seems like the makers have some big plans coming up.  Idayam Murali has Atharvaa, Fahadh Faasil, Kayadu Lohar, Preity Mukundan, Niharika NM playing in lead roles with Thaman. The movie is releasing on 10th July in Telugu and Tamil languages. It is directed by Aakash Baskaran.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లలో రాఘవ లారెన్స్ ఒకరు. గ్రూప్ డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగి, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఒక సాదాసీదా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ కాబోతున్నాడనే వార్త వచ్చినప్పుడు టాలీవుడ్‌లో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, కింగ్ అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో లారెన్స్ లోని క్రియేటివిటీని నమ్మి, తన సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడిగా అవకాశం ఇవ్వడం అప్పట్లో ఒక సంచలనం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా లారెన్స్ తెరకెక్కించిన 'మాస్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ ఒక్క సినిమాతో తన దర్శకత్వ ప్రతిభపై అంచనాలు పెంచేసిన లారెన్స్, ఆ తర్వాత హార్రర్ కామెడీ జానర్‌లో 'కాంచన' సిరీస్‌తో ఇండస్ట్రీ షేక్ అయ్యే రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం లారెన్స్ చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి స్వీయ దర్శకత్వంలో 'కాంచన-4' సినిమాను ప్లాన్ చేస్తుండగా, మరోవైపు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రొడక్షన్‌లో 'బెంజ్' అనే విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో కూడా రాఘవ లారెన్స్ తన సొంత బ్యానర్‌లో ఒక సరికొత్త సినిమాను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా లారెన్స్ కెరీర్‌లో మైల్‌స్టోన్ లాంటి 30వ సినిమా కావడం విశేషం. అయితే ఈ ల్యాండ్‌మార్క్ సినిమా వెనుక ఒక ఊహించని ట్విస్ట్ ఉంది, అదే ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి లారెన్స్ ఒంటరిగా కాకుండా, మరొక కొత్త దర్శకుడితో కలిసి మెగాఫోన్ పట్టబోతున్నారు. పుగళ్ అనే నూతన దర్శకుడితో కలిసి లారెన్స్ ఈ 30వ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కించనుండటం విశేషం. సాధారణంగా ఇండస్ట్రీలో ఇద్దరు దర్శకులు కలిసి సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. తెలుగు మూలాలున్న రాజ్-డీకే లాంటి ఎంతోమంది కాంబినేషన్లు సక్సెస్ అయ్యాయి. కానీ, ఇప్పటికే దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి, మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ లాంటి సీనియర్, ఇప్పుడిలా ఒక కొత్త దర్శకుడితో దర్శకత్వాన్ని పంచుకోవడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే లారెన్స్, ఈ నిర్ణయంతో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మ్యూజిక్ సెన్సేషన్‌గా దూసుకుపోతున్న సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూర్తి కాస్ట్ అండ్ క్రూ వివరాలతో పాటు, ఒక అదిరిపోయే అనౌన్స్‌మెంట్ టీజర్‌ను ఈ నెల 12వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమైంది. ఇప్పటివరకు స్వీయ దర్శకత్వంలో ఎక్కువగా హార్రర్ కామెడీలతో మెప్పించిన లారెన్స్, ఈ కొత్త దర్శకుడి కాంబినేషన్‌లో ఎలాంటి సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.     Raghava Lawrence, Kanchana 4, Sai Abhyankar 
Karan Johar has pulled off one of the biggest distribution deals in recent Bollywood history. According to the latest reports, Dharma Productions has acquired the India theatrical distribution rights of Ranbir Kapoor's much-awaited mythological epic Ramayana: Part 1 in a deal worth around ₹250 crore. The agreement reportedly brings Dharma on board as the nationwide distributor for one of Indian cinema's most ambitious projects. Produced by Namit Malhotra's Prime Focus Studios in association with Yash's Monster Mind Creations, Ramayana has already generated massive buzz with its first glimpse. The film stars Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita, and Yash as Ravana, while Nitesh Tiwari directs the two-part epic. The makers are mounting the franchise on a reported budget of nearly ₹4,000 crore for both installments, making it one of the costliest Indian film projects ever. For Dharma Productions, the deal marks a major strategic move. While the banner has produced and distributed several blockbuster films over the years, securing the theatrical distribution rights of Ramayana further strengthens its position in the exhibition business. Industry circles see it as a vote of confidence in the film's box office potential, especially with the Diwali release window expected to attract audiences across the country. With the distribution partner now locked, the focus shifts to the film's marketing campaign. Given the scale of the project, the star cast, and the mythology-driven appeal, Ramayana: Part 1 is already shaping up to be one of the biggest theatrical events in Indian cinema. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  సుదీర్ఘ కాలం నుంచి సౌత్ చిత్రపరిశ్రమలో రాణిస్తూ తనదైన పెర్ఫార్మ్ తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీత అచ్చ తెలుగు నటి 'అంజలి'(Anjali). సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి  అంజలి వ్యక్తిగత జీవితం, తోటి హీరోలతో ముడిపెడుతూ కొన్ని  రూమర్లు షికారు చేస్తున్నాయి. అంజలి అప్ కమింగ్  తమిళ చిత్రం 'మగుడం' ప్రచార కార్యక్రమాల్లో రూమర్స్ పై  అంజలి స్పందించింది. అంజలి మాట్లాడుతు 'ఇండస్ట్రీలో ఒకరితో పని చేసిన ప్రతిసారీ ఇలాంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరం. నేను ఒకరి పేరు చెప్పి క్లారిటీ ఇస్తే, మీరు వెంటనే ఇంకొకరి గురించి అడుగుతారు. అందుకే నేను ఎవరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించదలచుకోలేదు.   ప్రస్తుతం నా జీవితంలో ఎవరూ లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. స్కూల్ చదువుకునే రోజుల్లో ఒక క్లాస్‌మేట్  వరుసగా ప్రపోజ్ చేస్తూ వెంటపడేవాడు. ఒకరోజు  నాకు ఒక వింత ఛాలెంజ్ విసిరాడు. "నువ్వు నాకు రాఖీ కట్టి చూడు" అంటూ సవాల్ చేసాడు. దాంతో  ఏమాత్రం సంకోచించకుండా అతనికి రాఖీ కట్టేసాను. అలా రాఖీ కడితే ఇక ఆ అబ్బాయి తన వెంట పడటం ఆపేస్తాడని భావించాను. కానీ  సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆ అబ్బాయి ఏమాత్రం తగ్గకుండా, వెంటనే ఆ రాఖీని చేతి నుంచి తీసేసి, తిరిగి నాకే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అంజలి చెప్పుకొచ్చింది. anjali, magudam Also read: maa inti bangaaram: మూడోవారంలో మా ఇంటి బంగారం కలెక్షన్స్ పరిస్థితి ఇదే   
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ను తీవ్రంగా వేధిస్తోన్న ఒకే ఒక్క సమస్య 'పర్సంటేజ్ విధానం'. సినిమా కలెక్షన్లలో థియేటర్ల యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య వచ్చే లాభాల వాటా గురించిన ఈ వివాదం ఇప్పుడు టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చింది. కొద్దిరోజుల క్రితం పెద్ది సినిమా విడుదలయ్యే ముందు ఈ పర్సంటేజ్ విధానం మీద ఎగ్జిబిటర్లు తీవ్రమైన హడావుడి చేశారు. ఆ సమయంలో పరిస్థితి చేజారిపోకుండా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగారు. ఎగ్జిబిటర్లతో మాట్లాడి, ఈ సమస్యను తాత్కాలికంగా సద్దుమణిగించారు. తనకు కొంచెం సమయం ఇవ్వాలని, ఈసారి ఎలాంటి వాయిదాలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని చిరంజీవి హామీ ఇవ్వడంతో ఎగ్జిబిటర్లు కూడా వెనక్కు తగ్గారు.  కానీ ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. అనుకున్న సమయం దాటిపోవడంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా కలిసి నిన్న అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగానే కొందరు కీలక సభ్యులు వెళ్లి చిరంజీవిని మరోసారి కలిసినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో చిరంజీవి ఎగ్జిబిటర్ల బాధలను విన్నారని, ఈ సమస్యపై మరింత లోతుగా చర్చించేందుకు తనకు మరో వారం రోజుల సమయం కావాలని కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ పర్సంటేజ్ వివాదంపై నిర్మాతల ఆలోచన మాత్రం పూర్తిగా వేరుగా ఉంది. థియేటర్ల యాజమాన్యాలు కోరుతున్న ఈ పర్సంటేజ్ ఆలోచనను కనీసం ఒక ఏడాదిన్నర పాటు పక్కన పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే, రాబోయే ఈ ఏడాదిన్నర కాలంలో ప్రస్తుతం ప్లానింగ్ దశలో ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ థియేటర్లలోకి వచ్చేస్తాయి. ఆ క్రేజీ ప్రాజెక్టులన్నీ విడుదలైపోయిన తర్వాత, అంటే వచ్చే 2028 సంవత్సరం నుంచి ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేసుకోవచ్చు అనేది నిర్మాతల ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. కానీ, నిర్మాతల ప్రతిపాదనను ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలం పాటు తాము ఆగితే, అప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు తట్టుకోలేవని, చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ పూర్తిగా మాయం అయిపోతాయని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నిర్మాతల మదిలో ఉన్న అసలు ప్లాన్ కూడా ఇదే అయి ఉండొచ్చనే అనుమానాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. మరో ఏడాదిన్నర కాలం పాటు ఈ వివాదాన్ని సాగదీస్తే, ఈలోగా పట్టణాల్లో, నగరాల్లో మల్టీప్లెక్స్‌లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. మల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరిగితే, అప్పుడు ఈ పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లతో వచ్చే తలనొప్పులు, డిమాండ్లు ఏవీ నిర్మాతలకు ఉండవు. ఈ పరిణామాలు గమనిస్తుంటే మొత్తం మీద ఈ పర్సంటేజ్ వివాదం ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.      Tollywood, Percentage Controversy, Exhibitors, Chiranjeevi  
సమంత(Samantha)పని ఇక అయిపోయిందా అనే అనుమానపు మాటలు అభిమానులు, ప్రేక్షకుల నోళ్ళల్లో వినిపిస్తున్న వేళ, మీ అనుమానాలు నా దగ్గర నడవవు అంటు  'మా ఇంటి బంగారం' తో ఇచ్చి పడేసింది. రిలీజైన ఫస్ట్ డే నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రెజెంట్ సినీ రోజుల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి మార్కెట్‌లో ఉండే అంచనాలను తలకిందులు చేస్తూ, మూడో వారంలోనూ అదే జోరును ప్రదర్శిస్తుండటం ట్రేడ్ వర్గాలని  సైతం  ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 50 కోట్ల మైలురాయిని దాటగా, 100 కోట్ల క్లబ్‌కి అత్యంత చేరువలో నిలిచింది. స్టిల్  ప్రపంచవ్యాప్తంగా 96.74 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగా సరికొత్త రికార్డుని  లిఖించింది. మా ఇంటి బంగారం  ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే, మొదటి రోజే థియేటర్లలో సాలిడ్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2,658 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం తొలిరోజే రూ.13.25 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందరినీ ఆకట్టుకుంది. ఇందులో కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే రూ.4.75 కోట్ల గ్రాస్ వసూలు కాగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ.6.50 కోట్ల భారీ వసూళ్లు రావడం విశేషం. మిగిలిన ప్రాంతాలైన కర్ణాటకలో రూ.90 లక్షలు, తమిళనాడులో రూ.38 లక్షల గ్రాస్ నమోదయ్యాయి. ఈ సినిమాకు లభించిన మౌత్ టాక్ కారణంగా మొదటి రోజు ఉదయం షోలకు కేవలం 26.15 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ, రాత్రి షోల సమయానికి ఏకంగా 51.38 శాతానికి పెరిగింది. మరీ ముఖ్యంగా ప్రీమియం తెలుగు EPIQ ఫార్మాట్‌లో ఏకంగా 96 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీతో థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. Also read: Vijay: అదంతా పక్కా ఫేక్.. మరి అంత హడావిడి చేసారుగా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై తన భర్త తో కలిసి సమంత  నిర్మించిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి కీలక రోల్స్  పోషించగా, సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.నందిని రెడ్డి దర్శకురాలు.    
కళ్లు చెదిరే భారీ యాక్షన్ సీక్వెన్సులు, వెండితెరపై హై వోల్టేజ్ ఎలివేషన్లు, ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించే పవర్‌ఫుల్ నలుపు రంగు షేడ్స్.. ఇవీ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనగానే మనకు గుర్తొచ్చే అంశాలు. కేజీయఫ్, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లతో మాస్ పల్స్ పట్టుకున్న ఈ క్రేజీ దర్శకుడు ఒకవేళ కలర్‌ఫుల్‌గా ఉండే ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? నిజానికి ప్రశాంత్ నీల్ తన కెరీర్ ఆరంభంలో తీయాల్సింది యాక్షన్ సినిమా కాదు, ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం. అవును, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావాల్సిన ఆ రెండో సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీ. కానీ, ఆ సినిమా కథ ఇండస్ట్రీలో ఒక అనూహ్య మలుపు తిరిగి, ఆ స్థానంలో యాక్షన్ సంచలనం కేజీయఫ్ పట్టాలెక్కింది. మరి, తాను ఎంతో ఇష్టపడి రాసుకున్న ఆ అందమైన కుటుంబ కథను భవిష్యత్తులోనైనా ప్రశాంత్ నీల్ వెండితెరపై ఆవిష్కరిస్తారా లేదా అనే ఆసక్తికరమైన ప్రశ్నకు ఈ మాస్ డైరెక్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ చేదు నిజాన్ని వెల్లడించారు. ఆ ఫ్యామిలీ సినిమా ఇక ఎప్పటికీ రాదని ఆయన స్పష్టం చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన కెరీర్ తొలినాళ్లలో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథను కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారు. ఈ సున్నితమైన స్క్రిప్ట్‌తోనే ఆయన మొదట ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధినేతలను సంప్రదించారు. అయితే, ఆ సమయంలో నిర్మాణ సంస్థకు ఫ్యామిలీ సినిమా కంటే ఒక భారీ కమర్షియల్ యాక్షన్ చిత్రం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉంది. నిర్మాత అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ప్రశాంత్ నీల్ వెంటనే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ సీన్‌ను వారికి లైవ్‌గా వినిపించారు. ఆ సీన్ ఇంపాక్ట్ నిర్మాతలకు విపరీతంగా నచ్చేయడంతో, ఆ తర్వాత పూర్తి కథగా రూపాంతరం చెందిందే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన కేజీయఫ్ సిరీస్. యశ్ హీరోగా రెండు భాగాలుగా వచ్చిన ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేజీయఫ్ సినిమా ప్రయాణంలో పడి ఆ ఫ్యామిలీ కథ తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే, దురదృష్టవశాత్తు 2021లో కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆ మనస్తాపంతో, తాను కేవలం పునీత్ కోసమే రాసుకున్న ఆ కథను మరెవరితోనూ తీసే ప్రసక్తే లేదని నీల్ ప్రకటించారు. పునీత్ లేని ఆ స్క్రిప్ట్‌ను ఇక ఎప్పటికీ తెరకెక్కించనని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ప్రశాంత్ నీల్ సినిమాలలో మనకు పైకి కేవలం భారీ యాక్షన్, రక్తం చిందించే ఫైట్లు మాత్రమే కనిపిస్తున్నా, వాటన్నింటికీ మూలకారణం అంతర్లీనంగా ఉండే బలమైన సెంటిమెంట్, ఎమో షన్. ఆ ఎమోషనల్ డ్రామానే తన అసలైన బలమని ప్రశాంత్ నీల్ ఎప్పుడూ నమ్ముతుంటారు. అందుకే కేజీయఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం బాండ్ అంతగా క్లిక్ అయ్యాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం డ్రాగన్ (Dragon) పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎంతో కఠినమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది అనగా 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. దీనితో పాటు, తాను ఇప్పటికే ఒక మైథాలజీ కథను కూడా సిద్ధం చేశానని, తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన వెంటనే ఆ పౌరాణిక చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తానని ప్రశాంత్ నీల్ తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఫ్యామిలీ డ్రామాలు మిస్ అయినా, రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరింత పవర్‌ఫుల్ సెల్యులాయిడ్ వండర్స్ రావడం మాత్రం ఖాయం.     Prashanth Neel, Puneeth Rajkumar, KGF, NTR, Dragon
  ఇళయదళపతి విజయ్(Vijay) వన్ మాన్ షో 'జన నాయగన్' (Jana Nayagan) చుట్టూ జరుగుతున్న హైప్, వివాదాలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు మాత్రం జన నాయగన్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెడుతుందా అనే అతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జన నాయగన్  సెన్సార్ రిపోర్ట్ మరియు విడుదల తేదీపై అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రోజున 'జన నాయగన్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చిందంటూ ఒక సెన్సార్ సర్టిఫికేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. సుమారు 3 గంటల రన్‌టైమ్‌తో కూడిన ఈ నకిలీ పత్రంలో డైలాగ్స్ మ్యూట్ చేయడం, హింసను తగ్గించడం వంటి మార్పులను కూడా ప్రస్తావించారు. అయితే, ఈ సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే అసలు నిజం బయటపడింది. కొందరు నెటిజన్లు ఆ సర్టిఫికేట్‌ను నిశితంగా పరిశీలించగా, అది గతంలో విజయ్ నటించిన 'లియో' (Leo) సినిమా ఒరిజినల్ సెన్సార్ సర్టిఫికేట్‌ని  ఎడిట్ చేసి సృష్టించిన నకిలీ (ఫేక్) పత్రమని తేలింది. ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) మరియు బిజినెస్ హెడ్ సుప్రీత్ మోహన్ తక్షణమే స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సదరు సెన్సార్ సర్టిఫికేట్ పూర్తిగా నకిలీది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల తాజా సమీక్షని పూర్తి చేసింది. అందులో భాగంగా కొన్ని తుది సవరణల (Final Revisions) జాబితాని  పంపింది. ఆ సవరణలన్నీ పూర్తి చేసి బోర్డుకు సమర్పించిన తర్వాతే అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. బోర్డు సూచించిన తుది మార్పులను వేగంగా పూర్తి చేస్తున్నాం. అన్ని అనుకూలిస్తే జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. Also read: Anirudh vs sai abhayankar: అనిరుధ్ వర్సెస్ సాయి అభయంకర్.. బాగుపడేది మాత్రం వాళ్ళే  vijay, kvn productions, h vinoth
మలయాళ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథలతో, విలక్షణమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన సరికొత్త చిత్రం 'ఐ, నోబడీ' (I, Nobody) ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ తెలుగు రిలీజ్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటూ, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. 1 నిమిషం 13 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్, ప్రేక్షకుడికి ఒక సరికొత్త మైండ్ గేమ్, పవర్‌ఫుల్ సోషల్ డ్రామాను పరిచయం చేయబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. ఈ టీజర్‌లో వినిపించే డైలాగ్స్ ఆలోచనాత్మకంగా, నేటి సమాజపు చేదు నిజాలను కళ్లకు కట్టేలా ఉన్నాయి. "రాజీవ్.. స్కూల్లో ఫుడ్ చైన్ గురించి చదివావు కదా, ఆహారపు గొలుసు.. బహుశా మర్చిపోయి ఉంటావు. నేను చాలా సింపుల్ గా చెప్తాను విను. మిడత గడ్డిని తింటుంది, మిడతని కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది, పాముని డేగ తింటుంది. ఈ డేగ చచ్చిన తర్వాత మొదట చెప్పిన గడ్డికి ఇది ఎరువవుతుంది. మన సొసైటీ కూడా సరిగ్గా ఇలాంటి ఒక ఫుడ్ చైన్ లాంటిదే రాజీవ్" అంటూ సాగే వాయిస్ ఓవర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కలిసి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సమాజంలో బలవంతుడు బలహీనుడిని ఎలా అణచివేస్తాడో, చివరకు ప్రకృతి న్యాయం ఎలా జరుగుతుందో వివరించే ఈ సంభాషణలు సినిమా థీమ్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. అయితే, ఈ కథ అక్కడితోనే ఆగిపోలేదు. ఈ ఫుడ్ చైన్ సిద్ధాంతానికి ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తూ టీజర్‌లో ముందుకు సాగుతారు. "కానీ ఈ సొసైటీ చైన్ లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి, అంటే బ్రతికి బట్టకట్టడానికి ఆ మిడత కేవలం గడ్డిని మాత్రం తింటే సరిపోదు, అవసరమైతే కప్పను కూడా తినాలి. ఇక సమాజంలో పైకి రావడానికి నువ్వు ఎవరి తలలు తినాలో నువ్వే నిర్ణయించుకో రాజీవ్..." అంటూ వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్ సినిమా ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో ముందే హింట్ ఇస్తోంది. బ్రతకడం కోసం ఎంతటి క్రూరమైన నిర్ణయాలైనా తీసుకోవాల్సి వస్తుందనే కోణంలో సాగే ఈ కథాంశం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండి ఉందని అర్థమవుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు నటి పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అనగానే సహజంగానే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. నిసామ్ బషీర్ (Nisam Basheer) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ అనిపిస్తోంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, E4 ఎక్సపెరిమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 9న విడుదల కానుంది.     I Nobody Teaser, Prithviraj Sukumaran, Parvathy Thiruvothu, TeluguOne  
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం.  అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు.  అసలు డింక్ అంటే ఏమిటి?  దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది,  సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా,  వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా  నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. డింక్ అంటే.. DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని  అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం. డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో  పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థిక భారం.. చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే..   ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది. క్వాలిటీ లైఫ్.. పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం.  పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు.  పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు. మరొక మార్గం.. చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది  బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు.  కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి  తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా,   కుటుంబాన్ని కాపాడుకోవడం ,  జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.                                    *రూపశ్రీ.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు.  ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.  బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ ను ఫాలో అవుతూ ఉండండి.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)