LATEST NEWS
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ..  ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  అయితే..  ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా..  అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు   అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా  హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..  పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది.  ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే..  అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన  జియోపాలిటికల్ జూదం  (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా..  తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై   అపనమ్మకమే   కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను  బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా  డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక  ఉపయోగకరమైన  వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్  గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు,  పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం,  మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి.  శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.    ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా..  దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి. -సీతారాం కంఠంనేని
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ  అన్నారు.  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న  తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, అటువంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.    అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారనీ..  ఆ విషయాన్ని   తెలుగు ప్రజలు గానీ మర్చిరన్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందన్న నారాయణ..  చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని చెప్పారు.
బెంగాల్ చరిత్రను చూస్తే..  ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు. భారత ఉపఖండం ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన ప్రాంతం. మొఘల్ కాలంలో హుగ్లీ నది పరివాహక ప్రాంతం.. ఓడరేవులు, జనపనార, మస్లిన్, పట్టు, నౌకా నిర్మాణం వంటి రంగాల ద్వారా బెంగాల్ భారత వాణిజ్య వ్యవస్థలో ప్రధాన స్థానం దక్కించుకుంది. బ్రిటిష్ పాలనలో కూడా కోలకత్తా 1911 వరకు రాజధానిగా ఉండటం వల్ల ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా మేధో, రాజకీయ ప్రభావాన్ని కొనసాగించింది. బెంగాల్ పునరుజ్జీవనం: ఆలోచనల కేంద్రబిందువు 19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది. అందువల్ల బెంగాల్ కేవలం భౌగోళిక ప్రాంతం కాకుండా, భారత రాజకీయ ఆలోచనలకు ఒక ప్రయోగశాలగా నిలిచింది. విభజనల ప్రభావం.. రాజకీయ బలం క్షీణత  ఆరంభం బెంగాల్ పతనానికి ప్రధాన మలుపు 1905 విభజన. బ్రిటిష్  విభజించి పాలించు  విధానం హిందూ–ముస్లిం విభేదాలను మరింత లో ఎగదోసి, ప్రాంతీయ సమైక్యతను దెబ్బతీసింది. 1911లో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం బెంగాల్ రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించింది. 1947 విభజన తర్వాత తూర్పు భాగం పాకిస్తాన్‌లోకి వెళ్లడం, వలసలు, మార్కెట్ విభజన, సరిహద్దు రాజకీయాలు.. ఇవన్నీ  కలిసి బెంగాల్ ఆర్థిక నిర్మాణాన్ని దీర్ఘకాలంలో బలహీనపరిచాయి.  1947 తరువాత కూడా బెంగాల్ వెంటనే కూలిపోలేదు. పారిశ్రామిక పునాది, విద్యా సంప్రదాయం, పట్టణ మధ్యతరగతి, వాణిజ్య వాతావరణం దీన్ని కొంతకాలం నిలబెట్టాయి. కానీ ఈ ప్రారంభ బలం క్రమంగా రాజకీయ అస్థిరత, యూనియన్ సంఘర్షణలు, పరిశ్రమల పట్ల అపనమ్మకం, విధాన వైఫల్యాల కింద క్షీణించసాగింది. లెఫ్ట్ ఫ్రంట్ యుగం.. సంక్షేమం, నియంత్రణ, నెమ్మదిగా క్షీణించిన పారిశ్రామిక పునాది 1977 తరువాత దశాబ్దాలపాటు కొనసాగిన లెఫ్ట్ ఫ్రంట్ పాలన బెంగాల్ చరిత్రలో అత్యంత ప్రభావమంతమైన ఘట్టం. ఈ పాలన గ్రామీణ పేదలకు భూ హక్కులు, పంచాయతీ బలోపేతం, స్థానిక స్వపాలన వంటి రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది.  ఆపరేషన్ బర్గా  ద్వారా కౌలుదారులకు భద్రత లభించడం, గ్రామీణ జీవితంలో లెఫ్ట్‌కు దీర్ఘకాలిక మద్దతును నిర్మించింది.  అయితే ఇదే కాలంలో పారిశ్రామిక వృద్ధి క్రమంగా వెనక్కి వెళ్లింది. సమ్మెలు, లాకౌట్లు, ఘెరావ్ లు, కేడర్ ఆధారిత రాజకీయ ప్రభావం, పెట్టుబడుల పట్ల అపనమ్మకం ఇవి పరిశ్రమలకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించాయి. బెంగాల్ ఒకప్పుడు దేశ పరిశ్రమల్లో నాయకత్వం వహించిన రాష్ట్రం అయినప్పటికీ..  కాలక్రమంలో అది పెట్టుబడిదారులకు ప్రమాదకరమైన గమ్యంగా మారడం ప్రారంభమైంది. ఈ మార్పు ఒక్క రాత్రిలో జరగలేదు..  కానీ దశాబ్దాలపాటు పేరుకుపోయిన విధాన వైఫల్యాలు, కార్మిక సంబంధాల దృఢత్వం,   రాజకీయ నియంత్రణ దానిని లోపలినుంచి బలహీనపరిచాయి. సింగూర్, నందిగ్రామ్.. రాజకీయ మార్పుకు మలుపు 2000ల మధ్యలో సింగూర్, నందిగ్రామ్ ఘటనలు బెంగాల్ రాజకీయ సమీకరణాన్ని మార్చాయి. టాటా నానో ప్రాజెక్ట్ కోసం భూసేకరణపై వచ్చిన వ్యతిరేకత, నందిగ్రామ్‌లో రసాయన హబ్ ప్రతిపాదనపై నిరసనలు, పోలీసు చర్యలు, హింస   అన్నీ లెఫ్ట్ ఫ్రంట్‌ను ప్రజల దృష్టిలో తిరిగి నిర్వచించాయి.  ఈ పోరాటాన్ని మమతా బెనర్జీ తన రాజకీయ ఎదుగుదలకు బలంగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఎంసీ స్థాపన వరకు ఆమె ప్రయాణం, ఆమెను  ప్రజల పక్షాన నిలిచే నాయకురాలు గా ఎదగడానికి సహాయపడింది. సింగూర్, నందిగ్రామ్ నేపథ్యంలో టీఎంసీ 2011లో  అధికారంలోకి వచ్చింది. టీఎంసీ పాలన.. సంక్షేమం బలం, పరిశ్రమల సమస్య టీఎంసీ పాలనలో రాష్ట్రం సంక్షేమ ఆధారిత రాజకీయాలను మరింత విస్తరించింది. మహిళలు, పేదలు, అణగారిన వర్గాల కోసం అనేక పథకాలు మమతా బెనర్జీకి బలమైన రాజకీయ మద్దతును అందించాయి. ఆమె వ్యక్తిగత రాజకీయ శైలి.. సాధారణ దుస్తులు, నిరాడంబరత ప్రజల మధ్య ప్రత్యక్షంగా తిరగడం ఆమెను  సహజ నాయకురాలుగా నిలబెట్టాయి.  అయితే, ఈ విజయాల వెనుక రాష్ట్రం అభివృద్ధి   అనేక సవాళ్లను ఎదుర్కొంది. పారిశ్రామిక పెట్టుబడులు పరిమితంగానే ఉండటం, ప్రధాన కార్యాలయాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం, ఉద్యోగ సృష్టి నెమ్మదించడం వంటి సమస్యలు పెరిగాయి. బెంగాల్ తలసరి ఆదాయ స్థానం, జాతీయ ప్రమాణాలతో పోలిస్తే, మునుపటి బలంతో పోల్చితే దిగజారింది. స్థానిక అధికారం,  కట్ మనీ,  రాజకీయ ఆర్థిక వ్యవస్థ బెంగాల్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశం స్థానిక పార్టీ నెట్‌వర్క్‌ల ప్రభావం. కట్ మనీ, సిండికేట్ వ్యవస్థ, కాంట్రాక్టర్ ఆధారిత మధ్యవర్తిత్వం వంటి అంశాలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనే కాకుండా, వాటిపై రాజకీయ నియంత్రణను కూడా పెంచాయన్న విమర్శలు ఉన్నాయి. పంచాయతీ స్థాయి నుంచి బ్లాక్ స్థాయి వరకు కార్యకర్తల ప్రభావం ఉన్నప్పుడు, రాజకీయ అధికార మార్పు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. అది స్థానిక ఆర్థిక వ్యవస్థలోని అధికారం మార్పుగా మారుతుంది. ఇది ఎన్నికల హింసను కూడా పెంచుతుంది. బెంగాల్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాల మోహరింపు హింసను తగ్గిస్తుందని అనేకసార్లు రుజువైంది. అంటే..  రాష్ట్రంలోని ప్రజాస్వామ్య ప్రక్రియ ఇప్పటికీ పూర్తిగా సాధారణీకరించబడలేదని ఇది సూచిస్తుంది. మతం, వలసలు, మరియు ఓటు రాజకీయాలు బెంగాల్ రాజకీయ చర్చలో ముస్లిం జనాభా పెరుగుదల, సరిహద్దు వలసలు, మరియు గుర్తింపు రాజకీయాలు కూడా కీలక అంశాలుగా మారాయి. అయితే ఈ అంశాలను పరిశీలించేటప్పుడు జాగ్రత్త అవసరం. జనాభా మార్పు, సరిహద్దు భౌగోళికత, ఆర్థిక వలస, డాక్యుమెంటేషన్ సమస్యలు,  రాజకీయ ఆధారాలు  అన్నీ కలిసి ఒక క్లిష్టమైన నిజాన్ని రూపొందిస్తాయి. కేవలం మత గణాంకాలతో మాత్రమే రాజకీయ మార్పును వివరించడం సరిపోదు. అదే సమయంలో, మైనారిటీ ఓటు బ్యాంకు, పార్టీల వ్యూహాలు,   స్థానిక నాయకత్వం మిళితమై ఎన్నికల సమీకరణాన్ని ప్రభావితం చేస్తాయని కూడా అంగీకరించాలి. బెంగాల్‌లో మతం కేవలం విశ్వాస సమస్య కాదు..  అది రాజకీయ ప్రతినిధిత్వం, భద్రత, అభివృద్ధి,   గుర్తింపు ప్రశ్నలతో ముడిపడిన అంశం. నేటి ప్రశ్న: బెంగాల్ తిరిగి ఎటు? బెంగాల్ పునరుజ్జీవనం ఇచ్చిన సాంస్కృతిక గొప్పతనం, లెఫ్ట్ ఫ్రంట్ అందించిన గ్రామీణ భద్రత, టీఎంసీ ఇచ్చిన సంక్షేమ ముఖచిత్రం.. ఈ మూడింటి మధ్య రాష్ట్రం తన అభివృద్ధి దారిని ఇంకా వెతుకుతోంది. కానీ వాస్తవం ఏమిటంటే..  కేవలం నినాదాలతో, పెట్టుబడి సమ్మేళనాలతో, లేదా చిహ్నాత్మక రాజకీయాలతో బెంగాల్ పాత వైభవాన్ని తిరిగి పొందలేదు. అందుకు దీర్ఘకాలిక పెట్టుబడి భరోసా, శాంతిభద్రతల స్థిరత్వం, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, మరియు రాజకీయ హింసపై కఠిన నియంత్రణ అవసరం. రాష్ట్రం ఒకప్పుడు భారతదేశానికి మేధో కేంద్రంగా నిలిచింది. భవిష్యత్తులో అది మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకోగలదా అనే ప్రశ్న, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల కేంద్రంలో ఉంది. Reference: రాహుల్ సాంకృత్యాయన్ జీవన తాత్వికత - పిళ్లా కుమారస్వామి: రవీంద్రనాథ్ ఠాగూర్  వికీపీడియా పశ్చిమ బెంగాల్‌లో మతం భారత్-బంగ్లాదేశ్ వాస్తవిక సాదృశ సదస్సుపై సంయుక్త ప్రకటన     -సీతారాం కంఠంనేని  
  హరీష్‌ బీజేపీలోకి అంటూ ఒకటే ప్రచారం! ఢిల్లీ టూర్ వెనుక రహస్యం ఏంటి.  రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.   తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న తరుణంలో, హరీశ్ రావు హఠాత్తుగా హస్తినకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ పర్యటనపై అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటని కాంగ్రెస్ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బీఆర్ఎస్‌లో అంతర్గత పోరు మొదలైందని ఆరోపించారు. ఈ పరిణామాలపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ మరియు కేటీఆర్‌లదేనని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరింత ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హరీశ్ రావు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు ఢిల్లీ వెళ్ళింది బీజేపీ అధిష్టానాన్ని కలవడానికేనని, త్వరలోనే ఆయన కమలం పార్టీ గూటికి చేరతారన్న ప్రచారం నిజమేనని సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే స్పందించింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, ఇది కేవలం పార్టీ పరమైన పని అని స్పష్టం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే హరీశ్ రావు, వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్రలతో కూడిన త్రిసభ్య కమిటీ ఢిల్లీకి వెళ్లిందని పార్టీ పేర్కొంది. ఏప్రిల్ 22న తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ అంశంపై రాబోయే తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులకు సంబంధించి న్యాయపరమైన సలహాలు తీసుకునేందుకే తాము ఢిల్లీ పర్యటన చేపట్టామని బీఆర్ఎస్ వివరణ ఇచ్చింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి, తదుపరి కార్యాచరణను సిద్ధం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు, కోర్టుల తీర్పులు రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయ సమీకరణాలను ఏ మేరకు మార్చబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం, రానున్న కాలంలో రాజకీయ వేడిని మరింత పెంచే అవకాశం ఉంది.
  భారత రాజకీయ యవనికపై నరేంద్ర మోదీ ప్రస్థానం ఒక విశిష్ట అధ్యాయం. సాధారణంగా రాజకీయ నాయకులు అనగానే తక్షణ ఓటు బ్యాంకు రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటములు, దైనందిన వార్తల్లో ఎలా నిలవాలి అనే అంశాలపైనే  ఆలోచిస్తుంటారు. అయితే మోదీ శైలి వీటికి భిన్నంగా ఉంటుంది.  ఆయన కేవలం వచ్చే ఐదేళ్ల పదవీ కాలం గురించి కాకుండా, రాబోయే ఐదు దశాబ్దాల పాటు భారతదేశం ప్రపంచ పటంలో ఎలా ఉండాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని మోదీ రాజకీయ చదరంగంలో ఎప్పుడూ ప్రత్యర్థుల కంటే పది అడుగులు ముందే ఉంటారు. ఆయన నాయకత్వంలో రెండు ప్రధాన కోణాలు కనిపిస్తాయి. ఒకటి  ప్రాక్టివ్  నాయకత్వం, అంటే దేశానికి అవసరమైన కఠినమైన సంస్కరణలను ముందుగానే ఊహించి అమలు చేయడం. రెండవది  రియాక్టివ్  అవగాహన.  అంటే ప్రత్యర్థుల ఎత్తుగడలను నిశితంగా గమనిస్తూ, వారు వేసే అడుగులను ముందే పసిగట్టి సమర్థవంతమైన ప్రతివ్యూహాలను సిద్ధం చేయడం. ఈ అరుదైన వ్యూహరచనే ఆయనను సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా నిలబెడుతోంది. గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన  కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి,  చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల కల్పన , తయారీ రంగం బలోపేతం వంటి అంశాలపై మోదీ ప్ర  ప్రత్యేక దృష్టి సారించారు.  విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ విజయవంతం కావడానికి మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వ విధానాలే కారణమని ఆర్థిక వేత్తలు అంటున్నారు. కేవలం తక్షణ ఉపశమనం కలిగించే పథకాల కంటే, దేశ భవిష్యత్తును మార్చే పునాదులపైనే ఆయన ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. సహజంగానే ఏ నాయకత్వానికైనా విమర్శలు అనివార్యం మోడీ వ్యతిరేకులు తరచూ ఆర్థిక విధానాలు, అంతర్గత రాజకీయాలు లేదా విదేశాంగ విధానంపై విరుచుకుపడుతుంటారు. అయితే, ఈ విమర్శలు చాలావరకు తాత్కాలిక సమస్యల చుట్టూ తిరుగుతుంటాయని, మోదీ మాత్రం శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు వేస్తారని ఆయన మద్దతుదారులు వాదిస్తారు. విమర్శకులు ఈ రోజు గురించి ఆలోచిస్తే, మోదీ రేపటి భారతాన్ని నిర్మిస్తున్నారని వారి వాదన. భారతదేశం ప్రస్తుతం అంతర్జాతీయంగా ఒక ప్రభావమంతమైన శక్తిగా ఎదుగుతోంది. జియోపాలిటికల్ గా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  రాబోయే కాలంలో భారత్ ను ఒక సురక్షితమైన, ఆర్థికంగా తిరుగులేని దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతుందని అంచనా. ఈ ప్రయాణం చివరకు భారతదేశాన్ని ‘విశ్వగురు’ స్థానంలో నిలబెడుతుందని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.ముగింపుగా చూస్తే, మోదీ నాయకత్వాన్ని కేవలం ఎన్నికల గెలుపోటముల కోణంలో చూడలేం. అనుకూల వర్గం ఆయనను ఒక దార్శనికుడిగా కొనియాడుతుంటే, విమర్శకులు భిన్నంగా స్పందిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ, మోదీ తీసుకునే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక బలమైన పునాది అని ఆయన అనుచరులు బలంగా నమ్ముతున్నారు. ఆయన రాజకీయాలు కేవలం ఈనాటి వార్తల కోసం కాదు, రాబోయే తరాల శ్రేయస్సు కోసం ఉద్దేశించినవని స్పష్టమవుతోంది. -సీతారాం కంఠంనేని
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపై కనిపిస్తే ఆ వైబ్రేషన్ వేరేలా ఉంటుంది. తనదైన మేనరిజమ్స్, అదిరిపోయే డైలాగ్ డెలివరీతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రామ్ కెరీర్‌లో మ‌స్కా సినిమా ఒక మైలురాయి. తాజాగా ఈ సినిమాలోని కొన్ని హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి పీటల మీద రామ్ చేసే రచ్చ చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు రావాల్సిందే. ఈ వీడియోలో రామ్ తన ప్రేయసి నిశ్చితార్థాన్ని అడ్డుకోవడానికి మాస్ ఎంట్రీ ఇస్తాడు. కేవలం రెండు నిమిషాల సమయం అడిగి, అక్కడ ఉన్న పెళ్లి కూతురు తండ్రిని తుపాకీతో బెదిరించే సీన్ సినిమాకే హైలైట్. "నేను నిశ్చితార్థం చెడగొట్టడానికి రాలేదు, జస్ట్ టూ మినిట్స్" అంటూ రామ్ చెప్పే డైలాగ్స్, ఆ బాడీ లాంగ్వేజ్ అప్పట్లో థియేటర్లలో ఈలలు వేయించాయి. పాత కాలపు స్వయంవరం పద్ధతులను నేటి కాలపు ప్రేమకు ముడిపెడుతూ రామ్ చేసే హంగామా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఈ వీడియోలో సీనియర్ నటులతో రామ్ చేసే కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంది. నకిలీ డాక్టర్‌గా ఎంపీకి ట్రీట్‌మెంట్ చేసే సీన్లలో రామ్ ఎనర్జీ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. బాంబు బ్లాస్ట్ కేసులో చిక్కుకున్న విలన్ గ్యాంగ్‌ను ఆటాడుకుంటూనే, తన ప్రేమను గెలిపించు కోవడానికి రామ్ చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా సాగుతాయి. రాజకీయ కుట్రలు, ఎంపీ పదవుల చుట్టూ తిరిగే కథలో రామ్ ఒక సామాన్య యువకుడిగా ఎలా చొరబడ్డాడో ఈ క్లిప్స్‌లో చూడవచ్చు. ఈ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తుంటే రామ్ ఎనర్జీ అప్పట్లో ఎలా ఉండేదో అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగ్స్ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ‌స్కాలోని సాంగ్స్ మరియు ఫైట్స్ రామ్ కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఈ పాత వీడియోలు మళ్ళీ వెలుగులోకి రావడంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాబోయే సినిమాల్లో కూడా రామ్ నుండి ఇలాంటి పక్కా మాస్ ఎనర్జీని ఆశిస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మ‌రిన్ని ఎన‌ర్జిటిక్ సీన్స్ కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
The much-awaited film Kara, starring Dhanush and directed by Vignesh Raja, is all set for a theatrical release in Telugu on April 30, 2026. The Telugu version will be released by CH Sathish Kumar & Rajesh Kumar Bobbara under Vigneswara Entertainments - R Star Logistics, ensuring the widest reach across the Telugu States. Produced by Dr. Ishari K. Ganesh under Vels Film International Ltd, in association with Think Studios and Vigneswara Entertainments, Kara has been steadily building strong momentum across Tamil, Telugu, and overseas markets. Dhanush, who enjoys a strong and consistent fan base in Telugu, has delivered successful films like Raghuvaran B.Tech (VIP), Asuran, and Saar (Vaathi), all of which Telugu audiences received well. With Kara, he returns with a film already carrying strong expectations and growing curiosity. The film’s buzz has been built across multiple fronts. The Telugu version of the song Kannamma Naa Kannamma has clocked over 4.1 million views on YouTube, creating a strong emotional connection with Telugu audiences. While this is the only song released in Telugu so far, it has played a key role in introducing the film’s tone and world. At the same time, Telugu audiences have widely followed the Tamil songs, promotional glimpses, and interviews, with viewers actively engaging with the content beyond language barriers. This cross-language traction highlights how Kara is not just gaining attention in Tamil, but is equally building its presence in the Telugu market, alongside growing interest in international territories. Directed by Vignesh Raja, who earned acclaim for Por Thozhil, the film is expected to offer a compelling narrative driven by strong performances and rooted storytelling. The film stars Mamitha Baiju as the female lead, along with a notable supporting cast including Jayaram, K. S. Ravikumar, Karunas, and M. S. Bhaskar. On the technical front, Kara brings together a highly accomplished team. Cinematographer Theni Eswar, known for Peranbu, lends a naturalistic visual tone, while editor Sreejith Sarang of Vikram Vedha fame ensures a sharp narrative flow. Music is composed by G. V. Prakash Kumar, whose work in Saar (Vaathi) and Asuran received strong appreciation among Telugu audiences.  The film’s action is handled by Dinesh Kasi, with Mayapandi serving as art director. Costumes are designed by Dinesh Manoharan and Kavya Sriraam, with makeup by Raja and special makeup by Promeon Xavier, contributing to the film’s authentic presentation. With strong buzz driven by music, content, and cross-market engagement, along with Dhanush’s proven popularity in Telugu, Kara is gearing up to arrive with solid expectations. Kara is releasing on April 30th, worldwide.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు తన క్రేజ్‌ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. బన్నీ ముంబైలో ఒక ఖరీదైన విల్లా కొనుగోలు చేశారని, త్వరలోనే ఆయన ఫ్యామిలీతో సహా అక్కడికి మకాం మార్చబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టాలీవుడ్‌ను వదిలి బన్నీ బాలీవుడ్‌కు వెళ్ళిపోతున్నారా అని సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలుపెట్టారు. అసలు ఈ ముంబై ఇంటి గుట్టు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కాకపోతే, ముంబైలో ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న మాట వాస్తవమే. ప్రస్తుతం బన్నీ తన తదుపరి చిత్రాల కోసం ముంబైలో ఎక్కువగా సమయం గడపాల్సి వస్తోంది. ప్రతిసారీ స్టార్ హోటళ్లలో ఉండటం కంటే, సొంతంగా ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటే బాగుంటుందని భావించి ఈ అద్దె ఇంటిని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, చర్చలు ప్రస్తుతం ముంబైలోనే జరుగుతున్నాయి. అట్లీ టీమ్‌తో నిరంతరం టచ్‌లో ఉండేందుకు బన్నీ తరచుగా ముంబై వెళ్తున్నారు. గతంలో హోటల్ స్టే కోసం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఆ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు షూటింగ్‌కు సౌకర్యంగా ఉండేందుకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నారని టాక్. అల్లు అర్జున్ కేవలం సినిమా షూటింగ్ అవసరాల కోసమే అక్కడ ఉంటున్నారు తప్ప, శాశ్వతంగా ముంబైకి షిఫ్ట్ అయ్యే ఆలోచన లేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 'రాకా' (RAKA) వంటి భారీ ప్రాజెక్టుల పని ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా షూటింగ్ అవసరాల కోసం ఇటలీ వంటి ప్రాంతాల్లో అద్దె ఇళ్లను వాడుతుంటారు, బన్నీ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
టాలీవుడ్ లో తనదైన మార్కు డైలాగులు, పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్లతో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ మాస్ ఇమేజ్‌ను అందించిన పూరీ, సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు.  పూరీ సార్.. మీతో పని చేయడం గౌరవంగా ఉంది! విజయ్ సేతుపతి 'ఎక్స్' (ట్విట్టర్)లో పూరీ జగన్నాథ్ తో కలిసి సెట్స్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగ సందేశాన్ని రాశారు. "ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. సినీ రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఇది ధైర్యం, నమ్మకం, నిర్భయమైన గొంతుకతో నిర్మించుకున్న ఒక గొప్ప లెగసీ. డియర్ పూరీ సార్, మీతో కలిసి 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' చిత్రంలో పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు. నటుల మీద నమ్మకం ఉంచి, వారిని కంఫర్ట్ జోన్ దాటి మరింత మెరుగ్గా నటించేలా ప్రోత్సహించే దర్శకుల కోసం తాము ఎదురుచూస్తుంటామని, పూరీ సార్ ఆ పనిని చాలా సునాయాసంగా చేస్తారని విజయ్ సేతుపతి కొనియాడారు. ఈ సినిమా తమందరికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సరికొత్త కాంబినేషన్: స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్' (Slumdog: 33 Temple Road) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, జె.బి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూటింగ్ సెట్ నుండి విజయ్ సేతుపతి షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి.  పూరీ జగన్నాథ్ తన 26 ఏళ్ళ కెరీర్‌లో ఎంతో మంది నటులను సరికొత్తగా చూపించారు. ఇప్పుడు ఆయన డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి లాంటి వర్సటైల్ యాక్టర్ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.   https://x.com/VijaySethuOffl/status/2046102796244779092
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి లేదా ప్రెగ్నెన్సీ వార్తలు వస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటారు. కానీ, తమన్నా షేర్ చేసిన లేటెస్ట్ పోస్ట్ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాను గర్భవతినంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసి, నెటిజన్లకు పెద్ద షాక్ ఇచ్చింది. తమన్నా సింహాద్రి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "స్పెషల్ ట్రీట్‌మెంట్ సక్సెస్ అయింది.. త్వరలోనే తల్లిని కాబోతున్నాను" అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఒక ట్రాన్స్ ఉమెన్ తల్లి కావడం సాధ్యమేనా? ఇది నిజమా లేక కేవలం ప్రాంక్ మాత్రమేనా? అనే చర్చ మొదలైంది. గతంలో తన వెడ్డింగ్ యానివర్సరీ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసిన ఆమె, ఇప్పుడు ఈ అప్‌డేట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. వైద్య శాస్త్రం ప్రకారం చూస్తే, ట్రాన్స్ ఉమెన్ (పుట్టుకతో పురుషులు, తర్వాత స్త్రీలుగా మారిన వారు) సహజంగా గర్భం దాల్చడం ప్రస్తుతం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే గర్భధారణకు అవసరమైన గర్భాశయం (Uterus), అండకోశాలు (Ovaries) వీరి శరీరంలో ఉండవు. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ మార్పిడి (Uterus Transplant) పై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, అది ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కాబట్టి తమన్నా 'స్పెషల్ ట్రీట్‌మెంట్' అని చెప్పడం వెనుక ఉన్న మర్మమేంటో ఆమెకే తెలియాలి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తనదైన శైలిలో గొడవలు పడుతూ, ముక్కుసూటిగా మాట్లాడుతూ గుర్తింపు తెచ్చుకున్న తమన్నా సింహాద్రి, ఆ తర్వాత రాజకీయాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ తరపున గొంతు వినిపిస్తూ నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆమె, అప్పుడప్పుడు ఇలాంటి ఆసక్తికర పోస్ట్‌లతో వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే ఈ ప్రెగ్నెన్సీ వార్త సరోగసీ (Surrogacy) ద్వారా సాధ్యమా? లేక దత్తత తీసుకుంటున్నారా? అనే కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. ట్రాన్స్ జెండర్ సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు ఆమె ఇలాంటి ఫోటోషూట్ చేసి ఉండవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, తన మాతృత్వపు కాంక్షను చాటుకోవడంలో ఆమె చూపిస్తున్న ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో, తమన్నా సింహాద్రి దీనిపై మరింత క్లారిటీ ఇస్తుందేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆమె నిజంగానే తల్లి కాబోతుందా లేదా ఆ 'స్పెషల్ ట్రీట్‌మెంట్' ఏంటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సెలబ్రిటీల జీవితంలో ఇలాంటి మలుపులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.
The Telugu theatrical trailer for the Malayalam blockbuster Vaazha 2 has been officially launched by Natural Star Nani. After grossing a massive 200 crores worldwide, producer Sahu Garapati is bringing his own highly successful project to the Telugu states. The newly released footage shows a clear effort to translate the original film's organic success into a fresh market, capturing the attention of a brand new demographic. Analyzing the trailer cut, the editing has been sharply tailored to suit the dynamic viewing preferences of the local audience. It maintains a crisp pace, seamlessly balancing energetic comedy with more serious dramatic sequences. This specific version highlights the universal appeal of the plot while keeping the unpolished, natural charm of the original movie fully intact. The video presents a striking mix of all emotions, exploring the chaotic and unfiltered lives of the main characters. The storytelling looks highly relatable and impactful in presenting the stories of the young boys as they navigate academic stress, heavy family expectations, and loyal friendships. Its honest portrayal of teenage rebellion and brotherhood feels genuinely engaging on screen without being overly dramatic. Directed by Savin SA with writing by Vipin Das, the project features grounded performances from Hashir, Alan Bin Siraj, Ajin Joy, and Vinayak, alongside Aju Varghese and Alphonse Puthren. Backed by an upbeat musical score from Ankit Menon and Malayali Monkeys, the film promises a very captivating cinematic experience when the highly anticipated release date arrives on April 24th.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  - అనుదీప్ కేవీ డైలాగ్స్, భీమ్స్ మ్యూజిక్ - హైదరాబాద్‌లో గ్రాండ్‌గా మూవీ ఓపెనింగ్ - హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బెల్లంకొండ గణేష్ టాలీవుడ్ ప్రేక్షకులను తనదైన క్లాసిక్ లవ్ స్టోరీలతో కట్టిపడేసిన సెన్సిబుల్ డైరెక్టర్ ఏ. కరుణాకరన్ చాలా కాలం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టారు. యువ నటుడు బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందనున్న సరికొత్త చిత్రం నేడు హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మౌనిక రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ముహూర్తపు వేడుక సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి, తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే, ‘జాతి రత్నాలు’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక కామెడీ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ఆయన స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేయడమే కాకుండా కెమెరా స్విచ్ ఆన్ కూడా చేశారు. అనుదీప్ మార్క్ కామెడీ, కరుణాకరన్ సెన్సిబిలిటీస్ కలిస్తే ఈ సినిమా కచ్చితంగా యూత్‌ను అలరిస్తుందని ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. దర్శకుడు కరుణాకరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’తో టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు మార్చిన ఆయన, ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘హ్యాపీ’, ప్రభాస్‌తో ‘డార్లింగ్’, రామ్‌తో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి చిత్రాలతో ప్రేమకథలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. కొంతకాలంగా విరామం తీసుకున్న ఆయన, ఇప్పుడు బెల్లంకొండ గణేష్ కోసం ఒక ఫ్రెష్ రొమాంటిక్ కామెడీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గణేష్ కెరీర్‌లో ఇది ఒక కీలక మలుపు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’, ‘నేను స్టూడెంట్ సార్’ వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ కరుణాకరన్ చేతిలో పడటంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రానికి మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్‌ను ఊపేస్తున్న భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండటం మరో అదనపు ఆకర్షణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అనుదీప్ కేవీ డైలాగ్స్ అనగానే సినిమా ఏ రేంజ్ ఫన్ రైడ్‌గా ఉండబోతుందోనని నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. కరుణాకరన్ మార్క్ విజువల్స్, భీమ్స్ మ్యూజిక్ కలిసి ఒక మెలోడియస్ హిట్‌ను ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. త్వరలోనే చిత్ర యూనిట్ మరిన్ని వివరాలను, నటీనటుల వివరాలను ప్రకటించనుంది.
సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేయడం, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెట్టడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇలాంటి వేధింపులపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ఎప్పటికప్పుడు గళం విప్పుతూనే ఉన్నారు. తాజాగా ఆమెపై ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 'చంటి' అనే వ్యక్తి @chantidhorapally అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా అనసూయపై అసభ్యకరమైన కామెంట్స్ చేయడమే కాకుండా, ఆమె ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఈ వేధింపులు మితిమీరిపోవడంతో అనసూయ పోలీసులను ఆశ్రయించారు. అనసూయ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వారి ఫోటోలను మార్ఫింగ్ చేసినా లేదా అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టినా కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు మరోసారి హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరులను దూషించడం కాదని, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ చేయడం ఒక ఫ్యాషన్‌గా మారుతున్న తరుణంలో, ఈ అరెస్ట్ ఒక హెచ్చరికగా నిలుస్తుంది. అనసూయ చూపిన ధైర్యం ఇతర బాధితులకు కూడా స్ఫూర్తినిస్తుంది.   
Hombale Films announced Mahavatar Parshuraam film exactly on Parshuram Jayanti. The announcement instantly ignited a massive frenzy across all social media platforms. The intense visual of a battle-ready warrior holding a blood-stained axe went viral in minutes. Fans immediately started trending the powerful tagline, When Dharma Falls The Parshu Rises, praising the dramatic tone and the sheer cinematic scale of this expanding mythological universe.   Netizens flooded the internet with enthusiastic reactions, expressing deep pride in the rapid evolution of the Indian animation industry. Social media users actively celebrated the studio's grand vision, pointing out how the leap from Mahavatar Narsimha in 2025 to this upcoming 2027 release showcases incredible progress.  With expectations running sky-high, many passionate fans confidently predicted another monumental global blockbuster, with comments like minimum five hundred crore box office loading dominating the discussion boards across various platforms. Audiences are also widely discussing the meticulous world-building of the broader Mahavatar Cinematic Universe.  Film enthusiasts are continuously comparing the sheer impact of this title reveal to other major mythological films, noting that this simple motion poster feels bigger than full-length teasers of other expensive projects. The unparalleled buzz and overwhelming positivity on social media clearly prove that fans are eagerly counting down the days until December 2027 to witness this spectacular chapter on the big screen.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి భారీ చిత్రాన్ని పట్టాలెక్కించారు. 'హాయ్ నాన్న' వంటి క్లాసిక్ హిట్‌తో మెప్పించిన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నేడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ముహూర్తపు వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా ఈ వేడుకలో నేచురల్ స్టార్ నాని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు నాని తొలి షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరు హీరోలు, ఇప్పుడు ఇలా ఒక సినిమా లాంచ్‌లో కనిపించడం అభిమానులను అలరించింది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్‌లో జరిగిన సందడికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా లాంచ్‌కు ముందే రిలీజ్ చేసిన ‘దట్స్ ఏ రోర్’ (That’s A Roar) వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. "కిరీటం లేకపోయినా.. రాజులాగే నడుస్తా" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో వచ్చిన ఈ వీడియో, విజయ్ దేవరకొండ మేనరిజానికి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యింది. ఒక సామాన్యుడు శక్తివంతుడిగా ఎదిగే క్రమాన్ని, మైథలాజికల్ టచ్ ఇస్తూ దర్శకుడు శౌర్యువ్ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ లుక్ కూడా ఈ సినిమాలో సరికొత్తగా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు. అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ఎరిక్ డర్స్ట్ చూసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సురేష్ సెల్వరాజన్, సంగీత దర్శకుడిగా హేషమ్ అబ్దుల్ వహాబ్ తమ సేవలను అందిస్తున్నారు. ఇంత భారీ టీమ్ ఈ సినిమా కోసం పని చేస్తుండటం గమనిస్తే, విజయ్ నుంచి ఒక విజువల్ వండర్ రాబోతోందని స్పష్టమవుతోంది. విజయ్ దేవరకొండ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయినా, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శౌర్యువ్ మార్క్ ఎమోషన్స్, విజయ్ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో సైతం #VDxShouryuv ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో విజయ్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గ్లోబల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర నటీనటుల వివరాల కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రౌడీ స్టార్ మళ్ళీ పవర్ ఫుల్ యాక్షన్ తో బాక్సాఫీస్ వేటను మొదలుపెట్టబోతున్నాడని ఇండస్ట్రీ టాక్.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన  పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే  కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా,  రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే.. ఇది గుర్తుపెట్టుకోవాలి.. మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క  కలపాలి. పరిశుభ్రత.. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు  రుచిని,  ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.. పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం  ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.  వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. తీపి పెరుగు.. కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు.  తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు,  ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం,  సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.                               *రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా,  మంచి విద్యార్థులుగా,  మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే  చిన్న మార్పులు  పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.  దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల  పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మాట్లాడటం.. నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా  పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు  పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది.  వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు.. పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు  విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు  సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది. స్క్రీన్ టైం.. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం.  పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి. ఎంకరేజ్.. ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది. తమ పని తాము చేసుకోవడం.. పిల్లలకు వారి బ్యాగ్  వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం. పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.                                         *రూపశ్రీ.
  మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ  హీమోఫిలియా  దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ జబ్బు గురించి,  ఈ జబ్బు లక్షణాల గురించి,  ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే.. హీమోఫిలియా లక్షణాలు.. గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం,  కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు. ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు? ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం,  రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం. థీమ్ ఇదే.. వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స,  సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం. హీమోఫిలియా.. శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది.  రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి,  నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి. ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి,  ప్రజలను అప్రమత్తం చేయడానికి,  లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం,  జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం,  ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.                                  *రూపశ్రీ.
ఇంట్లోనే లభించే ఆయుర్వేద మూలికలతో మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టండి! నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతోంది. అయితే, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మోకాళ్ళలో జిగురును పెంచడానికి మరియు నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. ముఖ్యమైన చిట్కాలు మరియు పరిష్కారాలు: మోకాళ్ళలో జిగురు (Knee Pulp) పెరగడానికి: వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్ళలో ఉండే సహజమైన జిగురు తగ్గిపోతుంటుంది. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురై తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో సూచించిన సహజమైన ఔషధాల గురించి డాక్టర్ గారు వివరించారు. ఆయుర్వేద మూలికల ఉపయోగాలు: కరక్కాయ పొడి, వాము మరియు శొంఠి వంటి పదార్థాలు మన వంటింట్లోనే లభిస్తాయి. వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరంలోని వాత దోషాలు తగ్గి, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. జీవనశైలి మార్పులు: నొప్పులు తగ్గాలంటే కేవలం మందులే కాకుండా, తీసుకునే ఆహారం మరియు రోజువారీ వ్యాయామం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఆయుర్వేద పద్ధతులను పాటించి చూడండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను తప్పక వీక్షించండి.
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది. చాలా మందికి తల తిరగడం, తలనొప్పి, నీరసం, లేదా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. వీటికి ప్రధాన కారణాలు శరీరంలో నీటి శాతం తగ్గడం,  తీవ్రమైన వేడి. అయితే,  దినచర్యలోనూ,  ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.  వేసవిలో  ఎండకు గురికావడం  శక్తిని ఎలా హరించివేస్తుందో, రోజంతా చురుగ్గా ఉండటానికి ఏమి చెయ్యాలో తెలుసుకుంటే.. వేసవి ఎండలో  ఉన్నప్పుడు శరీరం శక్తి ఎలా కోల్పోతుంది? వేసవిలో ఎండకు గురికావడం వల్ల, అధిక ఉష్ణోగ్రతలు శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.  ఎండలో ఉన్నప్పుడు, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి  ఎక్కువగా చెమట పడుతుంది. ఈ ప్రక్రియ శరీరం నుండి నీటిని , అవసరమైన ఎలక్ట్రోలైట్లను తొలగిస్తుంది, దీనివల్ల  డీహైడ్రేషన్ జరుగుతుంది. నీటి కొరత రక్త ప్రసరణను కూడా నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ , పోషణ అందవు, ఫలితంగా అలసట, నీరసం , తల తిరగడం వంటివి కలుగుతాయి. అంతేకాకుండా, మండే ఎండలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల, గుండె మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది,  శక్తి వేగంగా ఖర్చవుతుంది. అందుకే వేసవిలో కొద్దిసేపు ఎండలో ఉన్నా కూడా శరీరం త్వరగా అలసిపోయినట్లు ,  నీరసంగా అనిపిస్తుంది. రోజంతా చురుకుగా ఉండటానికి ఏమి చేయాలి? శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి..  వేసవిలో అత్యంత ముఖ్యమైన విషయం శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం. రోజంతా కొద్దికొద్దిగా నీరు త్రాగాలి.  దాహం వేసే వరకు వెయిట్ చేయకూడదు.  కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ,  ఓఆర్ఎస్ వంటి పానీయాలను కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజాలను , లవణాలను అందిస్తాయి. అలాగే, పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ , నారింజ వంటి పండ్లను తినాలి, ఎందుకంటే వాటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.. వేసవిలో తేలికగా , సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి . వేయించిన, మసాలా, నూనెతో కూడిన ఆహారాలు శరీర వేడిని పెంచుతాయి.  ఆహారంలో పెరుగు, సలాడ్, పెసలు, ఆకుకూరలు చేర్చుకోవాలి. ఉదయం నానబెట్టిన బాదం, అరటిపండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. సూర్యరశ్మి నుండి రక్షణ..  మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి, ఎందుకంటే ఈ సమయంలో సూర్యరశ్మి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ  తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే,  తలను టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగుతో కప్పుకోవాలి.  శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి.  ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ తప్పులు చేయకూడదు.. ఎండ నుండి వచ్చిన వెంటనే చల్లటి నీటిని తాగకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగాలి. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయకూడదు.  5 నుండి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే ఇలా చేయండి. అలాగే, పని నుండి తిరిగి వచ్చిన వెంటనే ఏసీలోకి వెళ్లే బదులు, ముందుగా ఫ్యాన్ కింద కూర్చోవాలి, దీనివల్ల మీ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. చల్లని ఆహార పదార్థాలను..   ఎండలో నుండి ఇంటికి  వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్, చల్లని పండ్లు లేదా ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగడం మానుకోవాలి. దీనివల్ల గొంతు నొప్పి లేదా దగ్గు రావచ్చు. శరీరానికి విశ్రాంతి, నిద్ర..   వేడిలో శరీరం త్వరగా అలసిపోతుంది, కాబట్టి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండటానికి, ప్రతి రాత్రి కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. తేలికపాటి వ్యాయామం, యోగా..    ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.                                 *రూపశ్రీ.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు,  ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట.  ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు?  దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.. సిట్రస్ ఫ్రూట్స్.. నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది.  ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ,  కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పైనాపిల్.. పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు,  పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు. జామకాయ.. జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట.  ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది. సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్.. సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. బొప్పాయి.. బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు. నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు.. నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ,  బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.                                  *రూపశ్రీ.