Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాక్రోచే దిక్కు అంటున్న జగన్.. చేతులెత్తేసినట్టేనా?
posted on: Jun 11, 2026 3:39PM

రాజకీయాల్లో ఏ ఎండకా గొడుగు పట్టడంలో వైసీపీ అధినేత జగన్ ది అందె వేసిన చెయ్యిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగుదేశం ఘనతలను తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించిన జగన్ ఇప్పుడు.. నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంపై యువత ఆగ్రహం నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ను చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. నీట్ లీకేజీని ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల అంశానికి లింక్ చేసిమైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాడేపల్లిలో గురువారం (జూన్ 11) జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దాదాపు రెండున్నర గంటల పాటు జగన్ రెండున్నర గంటల పాటు సాగిన మీడియా సమావేశంలో జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇది జెన్-జీ కాలం.. ఇప్పుడు జెన్-ఆల్ఫా కూడా నడుస్తోంది. ఏపీలో కూడా కాక్రోచ్లు బయటకు వస్తాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. నిజానికి ఆ రెండు జనరేషన్ల అర్థాలు ఏమిటి? అన్నది జగన్ కు ఎంత వరకూ తెలుసో కానీ, జగన్ మాత్రం తాను ఏపీ కాక్రోచ్ మూవ్ మెంట్ ను లీడ్ చేస్తానంటూ అన్యాపదేశంగా ప్రకటించేశారు.
అయితే దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది. ఈ డీఎస్సీ ప్రక్రియలో ఒక్కటంటే ఒక్క లీకేజీని కూడా జగన్ చూపించలేదు. ఆరోపణలు తప్ప ఆధారాలేవీ బయటపెట్టలేదు. అయినప్పటికీ.. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే.. ఏపీ యువత నమ్మేసి రోడ్లెక్కి చంద్రబాబు ప్రభుత్వంపై దాడి చేస్తారని ఆయన నమ్ముతున్నారు.
వాస్తవాలతో సంబంధం లేకుండా, ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నేత.. అసత్య ప్రచారాలతో జనాలను నమ్మించాలని చేస్తున్న ప్రయత్నాల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి. ట్రెండ్ సృష్టించడమెందుకు.. ఫాలో అయితే పోలా అన్న చందంగా జగన్ .. కాక్రోచ్ జనతా పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ నీట్ లీకేజీకీ, ఏపీ డీఎస్సీకీ ముడిపెట్టి లబ్ధి పొందాలని చూసిన తీరును నెటిజనులు ఎండగడుతున్నారు. తాజా ప్రెస్ మీట్ లో జగన్ పదే పదే కాక్రోచ్ లు వస్తాయి అనడంతో నెటిజనులు వైసీపీ పేరును.. కాక్రోచ్ జగన్ పార్టీ అని మార్చేస్తారేమో అని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ కొత్తగా మొదలెట్టిన బొద్దింకల రాజకీయం ఏపీలో జగన్కు మైలేజీ ఇవ్వడం మాట అటుంచి.. జనంలో ఆయన నవ్వుల పాలు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


.webp)



