![]() |
![]() |

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ పాత్రధారులుగా, 'పిట్టగోడ' ఫేమ్ అనుదీప్ కె.వి. డైరెక్ట్ చేసిన 'జాతిరత్నాలు' మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే పెట్టుబడిలో 70 శాతం పైగా వసూలు చేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్స్లో ఒకటిగా నిలిచేందుకు ఉరకలు వేస్తోంది. రెండో రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.8 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
రెండు రోజులకు కలిపి అది సాధించిన షేర్ రూ. 6. 75 కోట్లకు చేరుకుంది. ప్రి బిజినెస్తో పోలిస్తే 71 శాతం పైగా రికవరీ సాధించింది. 'జాతిరత్నాలు' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 9.45 కోట్లని అంచనా. ఒక చిన్న సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడం చిన్న విషయం కాదు.
స్వప్న సినిమా బ్యానర్పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు విడుదలకు ముందు సోషల్ మీడియాలో అసాధారణ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్కు తగ్గట్లే ఓపెనింగ్స్ ఉండటం గమనార్హం. తొలిరోజు ఈ సినిమా రూ. 3.95 కోట్ల షేర్ వసూలు చేసింది.
డైరెక్టర్ కల్పించిన సీన్లు, రాసిన డైలాగులు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కలిసి 'జాతిరత్నాలు'ను హిలేరియస్ ఎంటర్టైనర్గా మార్చాయి. 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' మూవీ తర్వాత, దానికి మించి 'జాతిరత్నాలు' సినిమా నవీన్ పోలిశెట్టికి పెద్ద పేరు తెచ్చింది. ఇవాళ అతని గురించే ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు.
![]() |
![]() |