Home  »  News  »  Dulquer salmaan: దుల్కర్ మెడకి చుట్టుకున్న స్మగ్లింగ్ కేసు.. అభిమానుల ఆందోళన 

Updated : Jul 2, 2026

 

 

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌(Dulquer salmaan)తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. భూటాన్ సరిహద్దుల గుండా భారతదేశంలోకి లగ్జరీ కార్లని  అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలపై కొచ్చిలో కస్టమ్స్ అధికారులు దుల్కర్ ని విచారించడం ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. 'ఆపరేషన్ నమ్‌ఖోర్' (Operation Numkhor) పేరిట కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా దుల్కర్‌ని సుమారు 4 గంటల పాటు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ స్మగ్లింగ్ రాకెట్‌ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, నకిలీ పత్రాల సృష్టి ఎలా జరిగింది అనే కోణంలో విచారణ సాగింది.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, భూటాన్ ఆర్మీ ఉపయోగించి వదిలేసిన లేదా స్క్రాప్‌గా మారిన అత్యంత ఖరీదైన లగ్జరీ వాహనాలను భారత్‌లోకి అక్రమంగా తీసుకువస్తున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. భూటాన్, నేపాల్ సరిహద్దుల ద్వారా ఈ కార్లని  దేశంలోకి ప్రవేశపెట్టి, నకిలీ పత్రాలు (Forged Documents), నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లను సృష్టించి కోట్లాది రూపాయల కస్టమ్స్ డ్యూటీ, పన్నులను ఎగవేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్‌లో కేరళ వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగానే దుల్కర్ సల్మాన్ నివాసంలో కూడా తనిఖీలు చేపట్టారు.

ఆ సోదాల్లో భాగంగా దుల్కర్ సల్మాన్‌కు చెందిన 4 అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కార్లను అధికారులు సీజ్ చేశారు. ఇందులో ల్యాండ్ రోవర్ డిఫెండర్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మరియు ఆయన నటించిన 'లక్కీ భాస్కర్' సినిమాలో ఉపయోగించిన నిస్సాన్ పెట్రోల్ వంటి వాహనాలు ఉన్నాయి. వీటిలో రెండు వాహనాలను దుల్కర్ ఇప్పటికే తాత్కాలికంగా (Provisional Release) విడిపించుకోగా, మిగిలిన రెండు కార్లు ఇంకా అధికారుల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ విచారణలో భాగంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తాను ఈ కార్లని  చట్టబద్ధంగానే కొనుగోలు చేశానని, ఇవి భూటాన్ నుండి అక్రమంగా స్మగ్లింగ్ చేయబడి వచ్చాయనే విషయం తనకు అసలు తెలియదని దుల్కర్ సల్మాన్ అధికారులకు స్పష్టం చేశారు. అయితే కస్టమ్స్ అధికారులు మాత్రం ఈ స్టేట్‌మెంట్‌ని  పూర్తిగా నమ్మడం లేదు.


Also read: Pawan Kalyan: పవన్ కొత్త పిక్స్ వైరల్.. సోషల్ మీడియా షేక్


ఈ అంతర్రాష్ట్ర లగ్జరీ కార్ల స్మగ్లింగ్ స్కామ్ ఎంత పెద్దదో అధికారులు వెల్లడించిన గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. ఆపరేషన్ నమ్‌ఖోర్ ద్వారా ఇప్పటివరకు కేరళ వ్యాప్తంగా సుమారు 60కి పైగా హై-ఎండ్ లగ్జరీ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం కేరళలోనే దాదాపు 200 వాహనాలు ఇలా అక్రమంగా రిజిస్ట్రేషన్ అయి తిరుగుతున్నట్లు కస్టమ్స్ అంచనా వేస్తోంది. ఈ భారీ స్కామ్‌లో ఇప్పటివరకు 7 గురు నిందితులను అరెస్ట్ చేశారు. దుల్కర్ సల్మాన్‌తో పాటు మరికొందరు సినీ ప్రముఖుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. దుల్కర్‌కు చెన్నై తదితర ప్రాంతాల్లో మరిన్ని లగ్జరీ కార్లు ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు, వాటికి సంబంధించిన అసలు పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని స్పష్టం చేయడంతో ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తన హిట్ మూవీ లక్కీ భాస్కర్ లో దుల్కర్ కారు స్మగ్లింగ్ చేసిన విషయం తెలిసిందే. 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.