![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ పై కొన్ని ఫెయిర్స్ కి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు లభిస్తుంది. అలాంటి గుర్తింపు లభించిన మరో జంట 'కోర్ట్'(Court)మూవీ ఫేమ్ శ్రీదేవి(Sridevi)రోషన్(Roshan). ఈ ఇద్దరు చందు, జాబిలి క్యారెక్టర్స్ లో ఒదిగిపోయి నటించిన తీరు ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికి చాలా మంది ఆ ఇద్దరిని చందు, జాబిలి అనే పిలుస్తున్నారంటే, తమ పాత్రల ద్వారా ఆ ఇద్దరు సృష్టించిన ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ జంట మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. ఈ విషయంపై శ్రీదేవి తన ఇనిస్టాగ్రమ్(Inistagram)లో పోస్ట్ చేస్తు 'కోర్ట్ మూవీ తర్వాత మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ఆ నటులతోనే మళ్ళీ కొత్త జర్నీని ప్రారంభించబోతున్నా. మీ ఆశీర్వాదాలు కావాలి. కోనా ఫిలిం కార్పొరేషన్ తో పని చెయ్యడం ఎంతో ఎగ్జైట్ గా ఉంది. టైటిల్ అనౌన్స్ మెంట్ సెప్టెంబర్ 17 ఉదయం తొమ్మిది గంటల నలబై ఐదు గంటలకి అధికారకంగా ప్రకటించనున్నారని తెలియచేసింది. రోషన్ కూడా ఇనిస్టాగ్రమ్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేసాడు.
అగ్ర రచయిత 'కోన వెంకట్'(Kona Venkat)నిర్మాణ సారధ్యం వహిస్తున్న కోన ఫిలిం కార్పొరేషన్ కి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఆరు చిత్రాలు విభిన్న 'కథాంశంతో' తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి, రోషన్ జంట మరోసారి సిల్వర్ స్రీన్ పై మెస్మరైజ్ చేయడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి ప్రస్తుతం తమిళంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో 'కేజెఆర్' హీరో కాగా నిర్మాతగా కూడా కె జె ఆర్ నే వ్యవహరిస్తున్నాడు. రేగన్ స్టానిస్లాస్ దర్శకుడు.

![]() |
![]() |