![]() |
![]() |

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సినిమా టికెట్ ధరల విషయంలో కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్ ధరలను రూ.200 కి పరిమితం చేస్తున్నట్లు వెల్లడించారు. మల్టీప్లెక్స్లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని సీఎం తెలిపారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంపై సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, సినీ పరిశ్రమ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ఫామ్ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సిద్ధ రామయ్య ప్రకటించారు. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్లో ఒక ఫిల్మ్సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీని నిర్మాణానికి రూ.500 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
![]() |
![]() |