![]() |
![]() |

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన "నేను కీర్తన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు 'బేబీ' దర్శకుడు సాయి రాజేష్. ఈ చిత్రంలోని "సీతాకోకై ఎగిరింది మనసే" గీతం లిరికల్ వీడియోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... "నేను - కీర్తన"లో సక్సెస్ కళ కనబడుతోంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాట చాలా బాగుంది. చిమటా రమేష్ బాబుకి దర్శకుడిగా, హీరోగా ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తోంది" అన్నారు.
చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం "నేను-కీర్తన".
ఎంతో బిజీ షెడ్యూల్ లో సైతం తమ కోసం సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్ కు హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. "నేను - కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రమేష్ బాబు అన్నారు.

మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది "నేను కీర్తన" చిత్రం. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రం విడుదల తేది అతి త్వరలో ప్రకటించనున్నారు.
సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎల్.రాజా సంగీతం అందించగా సినిమాటోగ్రాఫర్ గా కె. రమణ, ఎడిటర్ గా వినయ్ రెడ్డి బండారపు వ్యవహరించారు.
![]() |
![]() |