![]() |
![]() |

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'తో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా కంటే ముందే నితిన్ హీరోగా 'శ్రీశ్రీశ్రీ రాజా వారు' సినిమా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకుడు కావడం విశేషం. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
'గుర్తుందా శీతాకాలం', 'రంగ మార్తాండ' చిత్రాల నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితమైన పేరు చింతపల్లి రామారావు. వరుస సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతున్న ఆయన.. సంక్రాతి నేపథ్యంలో ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ "శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సోలో హీరోగా దర్శకుడు వేగేశ్న సతీష్ కాంబినేషన్లో 'శ్రీశ్రీశ్రీ రాజావారు' నిర్మిస్తున్నాను. ఇది అదిరి పోయే మంచి కమర్షియల్ సినిమా. ఈ నెలలో తొలి కాపీ సిద్ధం కాబోతుంది. అలాగే ఈ ఇయర్ లో కన్నడ లో ఓ ప్రముఖ స్టార్ తో భారీ సినిమా చేస్తున్నాం . అలాగే మరాఠీ లో మరో సినిమా నిర్మించబోతున్నాను. అలాగే తెలుగులో ఓ స్టార్ హీరోతో ఈ ఇయర్ ఎండింగ్ లో ఓ భారీ సినిమా నిర్మించబోతున్నాను. నేను ఎంత భారీ సినిమాలు చేసిన , మంచి కమర్షియల్ వాల్యూస్ తో పాటు, సమాజానికి మేలు చేసే అంశాలు వుండేలా సినిమాలు నిర్మిస్తాను. ఈ క్రమంలో ఏడాదికి మూడు సినిమాలు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు.
![]() |
![]() |