![]() |
![]() |

ఇంకెంత మహా అయితే ఎనిమిది గంటలు..అంటే మిడ్ నైట్ ఒంటి గంట నుంచి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సలార్ సునామి ప్రారంభం కాబోతుంది. ప్రభాస్ ఫాన్స్ మొట్టమొదటి సారిగా గడియారాలకి దణ్ణం పెడుతు త్వరగా ఒంటి గంట అవ్వాలని వేడుకుంటున్నారు. ఇప్పుడు ఆ టైం దాకా ఇది వింటు హీరోలా తయారవ్వండి అంటూ మేకర్స్ సలార్ కి సంబంధించిన రెండో పాటని విడుదల చేసారు.
సలార్ నుంచి కొంచం సేపటి క్రితమే సెకండ్ సాంగ్ విడుదల అయ్యింది. అలా విడుదల అయ్యిందో లేదో యుట్యూబ్ లో రికార్డ్ వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. పాట వింటున్నప్పుడు అణిచివేతకి గురయ్యే ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ రావడం గ్యారంటీ.అంతలా ఆ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు..అణచగనే పుడతాడు రాజే ఒకడు..శత్రువునే కడతేర్చే పనిలో మన రాజు అనే పల్లవి తో ప్రారంభం అయిన పాట చివరి దాకా కూడా అంతే టెంపోని కొనసాగిస్తూ సూపర్ గా ఉంది.

చిన్న పిల్లల స్కూల్ తరగతి గదిలో ప్రారంభం అయిన ఆ పాటలో టీచర్ గా ఉన్న ఈశ్వరి రావు ఒక పిల్లవాడ్ని లేపి నేను నేర్పించిన పాట గుర్తుంది కదా పాడు అనగానే ఆ పిల్లవాడు పాడటం ప్రారంభిస్తాడు.ఆ సాంగ్ లో శృతి హాసన్ తో పాటు ప్రముఖ కామెడీ నటుడు సప్తగిరి కూడా కనిపించాడు .అలాగే సాంగ్ చివరిలో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా స్కూల్ లోని బోర్డు మీద విజయాలు యుద్ధాల వలన రావు.. ఇవ్వడం,క్షమించడం వలన వస్తాయి అనే కొటేషన్ ఉంది.
![]() |
![]() |