![]() |
![]() |

కమెడియన్ నుంచి హీరోగా ‘కలర్ ఫొటో’ ఫేమ్ సుహాస్ విభిన్న సినిమాలతో అలరిస్తున్నాడు. ఈ ఏడాది 'రైటర్ పద్మభూషణ్'తో హీరోగా మంచి హిట్ అందుకున్న సుహాస్.. ప్రస్తుతం 'ఆనందరావు అడ్వెంచర్స్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు', 'కేబుల్ రెడ్డి' వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా మరో సినిమాని ప్రారంభించాడు.
సుహాస్ కథానాయకుడిగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.4 గా రూపొందుతోన్న చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంకీర్తన విపిన్ కథానాయిక.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రశాంత్ నీల్ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. బలగం వేణు గౌరవ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్ను అందించారు.
'బలగం' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో 'ఆకాశం దాటి వస్తావా' రెండో చిత్రంగా రూపొందుతోంది. రీసెంట్గా ఆశిష్తో మూడో సినిమాను స్టార్ట్ చేశారు. ఇప్పుడు సుహాస్ కథానాయకుడిగా నాలుగో సినిమా ప్రారంభమైంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.
ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గోపరాజు రమణ, మురళీ శర్మ, రఘుబాబు, పృథ్వీ, శివన్నారాయణ, రూప లక్ష్మి, విజయ లక్ష్మి తదితరులు నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయిశ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ గా రామ్ అరసవిల్లి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |