![]() |
![]() |
శ్రీముఖి.. ఈ పేరు తెలియని వారుండరు. బుల్లితెరపై సందడి చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరైంది. యాంకర్గా పరిచయం కాకముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి శ్రీముఖికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. బుల్లితెరపై రకరకాల షోలు చేస్తూ ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉండే శ్రీముఖి తన అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉంటుంది. ఏదైనా అనుకోని ఘటన జరిగినపుడు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది.
తన ప్రోగ్రామ్స్ ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి ఒక స్పెషల్ వీడియోతో అందరి ముందుకు వచ్చింది. అదేమిటంటే శ్రీముఖి బిఆర్ఎస్ పార్టీలో చేరింది. అసలు తాను బిఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు చేరాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏయే కార్యక్రమాల వల్ల బీఆర్ఎస్కి ఆకర్షితురాలైంది అనే విషయాలను తన తాజా వీడియోలో తెలియజేసింది.
ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ ‘మాది నిజామాబాద్ అని మీ అందరికీ తెలుసు. మా ఊరు పదేళ్ళ క్రితం ఎలా ఉండేది, ఇప్పుడెలా వుంది అనేది గమనిస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ పదేళ్ళలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు గుర్తించాను. చాలా మార్పులు కూడా జరిగాయి. అవన్నీ మీతో పంచుకోవడానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వ పాఠశాలను అధునాతనంగా తీర్చిదిద్దారు. వాటర్ ట్యాంక్స్ను పునరుద్ధరించారు. ఇంకా రోడ్లు, బ్రిడ్జ్లు, హాస్పిటల్స్, డ్రైనేజ్ సిస్టమ్స్... అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఒక్క నిజామాబాద్లోనే కాదు, తెలంగాణ మొత్తం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, సక్సెస్ఫుల్గా చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తే మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓటు వెయ్యండి’ అన్నారు.
![]() |
![]() |