గోపీచంద్ హీరోగా మారుతి డైరెక్ట్ చేసిన 'పక్కా కమర్షియల్' మూవీకి ఆశించిన రీతిలో ఓపెనింగ్స్ రాలేదు. విడుదలకు ముందు ఈ మూవీకి వచ్చిన హైప్తో గోపీచంద్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలిరోజు రూ. 2.62 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. గతంలో అతను హీరోగా నటించిన 'పంతం' (రూ. 2.82 కోట్లు), 'సీటీమార్' (రూ. 2.98 కోట్లు) సినిమాలకు ఇంతకంటే ఎక్కువగా షేర్ రావడం గమనార్హం.
ఆంధ్రాలో రూ. 1.40 కోట్ల షేర్ వసూలు చేసిన 'పక్కా కమర్షియల్'.. రాయలసీమలో రూ. 42 లక్షలు, తెలంగాణాలో రూ. 80 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ ఏరియాల్లో ఈ మూవీ ప్రి బిజినెస్ విలువ రూ. 13.50 కోట్లు అని అంచనా. అంటే తొలి రోజు ఈ సినిమా 19.4 శాతం రికవరీ మాత్రమే సాధించగలిగింది.
ఏరియాల వారీగా చూస్తే.. ఆంధ్రాలో రూ. 7.50 కోట్ల ప్రి బిజినెస్ వాల్యూకు 18.6 శాతం, రాయలసీమలో రూ. 2 కోట్ల బిజినెస్ వాల్యూకు 21 శాతం, తెలంగాణాలో రూ. 4 కోట్ల బిజినెస్ వాల్యూకు 20 శాతం రికవరీ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 3.07 కోట్ల షేర్ వచ్చింది. శని, ఆదివారాల కలెక్షన్ మీద ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది.
హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్, స్క్రీన్ప్లేలో దొర్లిన తప్పులు, పాత తరహా కథాకథనాలతో 'పక్కా కమర్షియల్' ప్రేక్షకుల్ని ఆశించిన రీతిలో ఆకట్టుకోవట్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.