ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేయగా తను తొలిసారి విలన్గా నటించిన 'వి' మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు నాని. అంతకుముందు నిర్మాతగా హిట్ సాధించిన విజయాన్ని ఆస్వాదించాడు. క్వారంటైన్ కాలంలో కొడుకుతో కలిసి ఆడుతూ తెగ అల్లరి చేస్తున్నాడు. అయినా ఆయన ఏమాత్రం ఖాళీగా ఉండకుండా తదుపరి ప్రాజెక్టుల మీద శ్రద్ధ వహిస్తున్నాడు. కరోనా ప్రభావం తగ్గి షూటింగ్లు పునరుద్ధరించగానే రెండు సినిమాల సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.
వాటిలో ఒకటి 'టక్ జగదీష్'. మూడేళ్ల క్రితం తనకు 'నిన్ను కోరి' వంటి హిట్ సినిమాను అందించిన శివ నిర్వాణ డైరెక్షన్లోనే ఈ సినిమా చేస్తున్నాడు నాని. ఇందులో ఇద్దరు నాయికలు.. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్తో రొమాన్స్ చేస్తున్నాడు. తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ మూవీలో జగదీశ్ ప్రసాద్ అనే డిఫరెంట్ రోల్లో నాని కనిపించబోతున్నాడు. అలాగే జగపతిబాబుతో ఫైట్లు చేయనున్నాడు.
నాని హీరోగా తెరకెక్కబోతున్న మరో సినిమా 'శ్యామ్సింగ రాయ్'. ఇదివరకు విజయ్ దేవరకొండతో 'టాక్సీవాలా' మూవీని రూపొందించిన రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. సాయిపల్లవి ఓ నాయికగా ఎంపిక కాగా మరో ఇద్దరు నాయికల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇటీవల వరుస విజయాలు సాధిస్తూ వార్తల్లో నిలుస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'వి' కాకుండా ఈ జోడు చిత్రాలు తనకు మంచి పేరుతో పాటు బాక్సాఫీస్ హిట్లను అందిస్తాయని నాని ఆశిస్తున్నాడు.