![]() |
![]() |

మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఓ వైపు.. చిన్న కుమారుడు మనోజ్ మరోవైపు అన్నట్టుగా వివాదం నడుస్తోంది. ఆ గొడవ ఇప్పుడిప్పుడే సైలెంట్ అవుతోంది అనుకుంటున్న సమయంలో మోహన్ బాబుకి మరో కొత్త తలనొప్పి మొదలైంది. 20 ఏళ్ళ క్రితం చనిపోయిన సౌందర్య మరణం వెనుక.. మోహన్ బాబు హస్తం ఉందంటూ.. ఒక వ్యక్తి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. (Mohan Babu)
ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి తాజాగా మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ జల్ పల్లిలో ఆరు ఎకరాలలో సౌందర్యకు చెందిన గెస్ట్ హౌస్ ఉండగా.. దానిని అమ్మమని మోహన్ బాబు అడిగాడు. అందుకు సౌందర్య నిరాకరించడంతో.. సాక్ష్యాలు దొరక్కుండా హెలీకాప్టర్ ప్రమాదంలో హత్య చేయించారని ఫిర్యాదులో ఆరోపించాడు. సౌందర్య మరణం తర్వాత, జల్ పల్లి గెస్ట్ హౌస్ ను మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడని.. దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నాడు. అంతేకాదు.. మోహన్ బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కూడా చిట్టిమల్లు ఫిర్యాదులో కోరాడు. (Soundarya)
సౌందర్య అభిమానిగా చెబుతూ చిట్టిమల్లు అనే వ్యక్తి మోహన్ బాబుపై చేసిన ఫిర్యాదు హాస్యాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సౌందర్య మరణించి 20 ఏళ్ళు దాటిపోయింది. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆమె మరణం గుర్తుకు వచ్చిందా?. పైగా అతనేమీ సౌందర్య కుటుంబ సభ్యుడు కాదు. కేవలం అభిమాని మాత్రమే. ఒక అభిమానికి సౌందర్య ఆస్తుల గురించి, వ్యక్తిగత విషయాల గురించి తెలిసే అవకాశం లేదు. మరి చిట్టిమల్లు, ఈ కేసుని కేవలం సంచలనం కోసం పెట్టాడా? లేక అతని మానసిక పరిస్థితి ఏమైనా బాలేదా? వంటి విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
![]() |
![]() |