![]() |
![]() |
.webp)
శర్వానంద్(Sharwanand),ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి(Krithi Shetty)జంటగా శ్రీరామ్ ఆదిత్య(sriram Adithya)దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి జె విశ్వప్రసాద్(TJ Viswaprasad)నిర్మించిన చిత్రం 'మనమే(Manamey.వెన్నెల కిషోర్,సీరత్ కపూర్, ముకేశ్ రుషి,రాహుల్ రామకృష్ణ, సచిన్ కెడ్కర్ కీలక పాత్రలు పోషించారు.గత ఏడాది జూన్ లో థియేటర్స్ లోకి అడుగుపెట్టగా,పెద్దగా ప్రేక్షకాదరణని పొందలేకపోయింది.
రీసెంట్ గా ఈ మూవీ మార్చి 7 నుంచి ఓటిటి వేదికగా అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతుంది.రిలీజైన రెండో రోజు నుంచే వ్యూయర్స్ పరంగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నట్టుగా అమెజాన్ ప్రైమ్ అధికారకంగా వెల్లడి చేసింది.ఇప్పటికి నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతునట్టుగా కూడా సదరు సంస్థ చెప్పుకొచ్చింది.
మూవీ మొత్తం కూడా 90 పర్సెంట్ ఫారిన్ లోనే జరుగుతుంది.విక్రమ్,సుభద్ర అనే క్యారెక్టర్స్ లో శర్వానంద్,కృతి శెట్టి నటించారనేకంటే జీవించారని చెప్పవచ్చు.విక్రమ్,సుభద్ర ఫ్రెండ్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతారు.దీంతో వాళ్ళిద్దరి కొడుకు ఖుషికి తల్లి తండ్రులుగా విక్రమ్,సుభద్ర బాధ్యతలని తీసుకుంటారు.ఈ క్రమంలో ఏం జరిగిందనేదే మనమే చిత్ర కథ.
.webp)
![]() |
![]() |