![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం షో ఐతే ఇంకా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు.. ఇక ఈ షోకి 7 / జి బృందావన్ కాలనీ మూవీ నుంచి సోనియా అగర్వాల్, రవి కృష్ణ ఈ షోకి వచ్చి హైలైట్ గా నిలిచారు. వీళ్ళతో యాంకర్ రవి, అష్షు పాపా ఇద్దరూ రకరాల డైలాగ్స్ చెప్పించారు. "అనితా నేను తింటాను, పడుకుంటాను, ఎవరినైనా కొట్టమంటే కొడతాను" అనే డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఇక ఆ డైలాగ్ ని రవికృష్ణతో చెప్పించారు.
అలాగే అదే డైలాగ్స్ ని టీవీ నటుడు చందు గౌడా, త్రినయని చేత కూడా చెప్పించారు. ఆ తర్వాత వీళ్ళు ఆడియన్స్ ని ఒక గుడ్ న్యూస్ ఐతే చెప్పారు. 7 / జి బృందావన్ కాలనీ పార్ట్ 2 షూటింగు జరుగుతోంది. 50 పెర్సెంట్ పూర్తయ్యింది. ఇంకా కొద్దీ రోజుల్లో 80 పర్సెంట్ పూర్తి కావొస్తోంది. ఇక క్లైమాక్స్ ఒక్కటే ఉంటుంది అంటూ మూవీ హీరో రవికృష్ణ చెప్పుకొచ్చాడు. అలాగే యాంకర్ రవి హీరో రవికృష్ణతో ఒక డైలాగ్ చెప్పించాడు.."ఇట్స్ క్లియర్ స్కై యార్...ఎండ మండింగ్....చెమట పట్టింగ్" ఆ డైలాగ్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఐతే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ చనిపోయినట్టు కానీ హీరోకి మాత్రమే ఆమె ఆత్మ కనబడేలా చూపిస్తారు. కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అసలు స్టోరీ ఎలా ఉండబోతోంది అన్నదే ఆసక్తికరంగా మారింది. షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈ ఏడాది సమ్మర్లోనే సినిమా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. తమిళ్తో పాటు తెలుగులోనూ ఈ సీక్వెల్కి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ మూవీ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004లో రిలీజయ్యింది. అంటే 21 ఏళ్ళు అవుతుంది.
![]() |
![]() |