![]() |

కుశలవ్, తన్మయి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వెంకట్ బులెమోని రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ "మయూఖం". ఈ చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు. వంద శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా "మయూఖం" అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీరశంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ కార్యక్రమంలో యాక్టర్ రాంకీ, బ్యాంకింగ్ కమిటీ చైర్మన్ హరి గోవింద్, రెడ్ ఎఫ్ఎం నుంచి మాజీ మార్కెటింగ్ మేనేజర్ బద్రినాథ్, ఫోర్స్ మోటార్స్ సంస్థ నుంచి శివకుమార్, మామ్ కంపెనీ సీఈవో రాహుల్, హీరో, నిర్మాత రాంకీ, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ.. "మా సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసింది. అందులో ప్రస్తుతం రాజా సాబ్ మూవీ ఉంది. మనమే, అహింస, ఆడవాళ్లు మీకు జోహార్లు..ఇలా దాదాపు 140 చిత్రాలకు మేము ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేశాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాం. మా సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ నుంచి "మయూఖం" అనే భారీ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాం. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. దీన్నొక ఫ్రాంఛైజీలా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో "తాల్" అనే మూవీ చేశారు. హాలీవుడ్ లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు. మా సినిమాలో వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసినా ఏ బ్రాండ్ కూడా మీకు ప్రోమోట్ చేసినట్లుగా కనిపించదు. హిస్టారికల్, మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం." అన్నారు.

డీవోపీ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ.. "వెంకట్ గారు నాకు చాలా కాలంగా పరిచయం. ఆయన ఒకరోజు పిలిచి జాతిరత్నాలు తర్వాత ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయావ్ అని అడిగారు. ఆ తర్వాత "మయూఖం" కథ వినిపించారు. కథ వినగానే సార్ మనం ఈ సినిమా చేస్తున్నాం. మిగతావి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను. ఆయన కథను చెప్పిన విధానం, చేసిన ప్రెజెంటేషన్ చూశాక ఇదొక గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఏర్పడింది. సినిమా కోసం ప్యాషనేట్ గా కష్టపడే వెంకట్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇస్తుంది. ఈ సినిమాకు పనిచేయడం కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా" అన్నారు.
హీరో కుశ్ లవ్ మాట్లాడుతూ.. "మయూఖం చిత్రంతో నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నా. డైరెక్టర్ వెంకట్ గారు ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా పర్ ఫార్మెన్స్ నచ్చుతుంది, మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్." అన్నారు.
హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ.. "మయూఖం సినిమాలో హీరోయిన్ గా నేను పర్పెక్ట్ గా సెట్ అవుతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ గారికి థ్యాంక్స్. నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. మీ అందరినీ థియేటర్స్ లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నా. "మయూఖం" చిత్రాన్ని మీరంతా సపోర్ట్ చేయండి." అన్నారు.
అతిథిగా వచ్చిన లేడీ డైరెక్టర్ మంజుల మాట్లాడుతూ - "మయూఖం" అనే టైటిల్ చాలా బాగుంది. పోస్టర్ తోనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఈ సినిమా వెంకట్ గారికి ఆయన టీమ్ అందరికీ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాం. హీరో కుశ లవ్ ప్రతిభ కలవాడు. ఈ సినిమాతో అతనికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు నటరాజ్ మాట్లాడుతూ.. "ఈ ఫ్రైడే మంచి ముహూర్తంలో మా సినిమా ప్రారభించుకున్నాం. మరో ఫ్రైడే రిలీజ్ డేట్ తో మీ ముందుకు వస్తాం. ఈ చిత్రంతో ఎంతోమంది కొత్త వాళ్లకు మా డైరెక్టర్ వెంకట్, నిర్మాత శ్రీలత గారు అవకాశం కల్పిస్తున్నారు. మా కొత్త టాలెంట్ ను మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా." అన్నారు.
నటి సునీత మనోహర్ మాట్లాడుతూ.. "మయూఖం చిత్రంలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇలాంటి గొప్ప చిత్రంలో పార్ట్ కావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ వెంకట్ గారికి, ప్రొడ్యూసర్ శ్రీలత గారికి థ్యాంక్స్ చెబుతున్నా." అన్నారు.
నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. "మయూఖం మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు ఉండాలని కోరుకుంటున్నా." అన్నారు.
నటుడు తుషార్ మాట్లాడుతూ.. "ఆడిషన్ ద్వారా ఈ చిత్రంలో ఓ మంచి రోల్ కు నన్ను సెలెక్ట్ చేశారు డైరెక్టర్ వెంకట్ గారు. నాకు తెలుగు రాదు. ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా." అన్నారు.
నటుడు అమర్ జిత్ మాట్లాడుతూ.. "కొత్త వాళ్లమైనా మాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు వెంకట్ గారికి థ్యాంక్స్. ఆయన నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాం." అన్నారు.
నటుడు దేవిల్ మాట్లాడుతూ.. "నేను సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఆడిషన్ ద్వారా నేను ఈ మూవీలో సెలెక్ట్ అయ్యాను. మాకు ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం. "మయూఖం" తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది." అన్నారు.
నటుడు అయాన్ మాట్లాడుతూ.. "ఈ రోజు మా మూవీ లాంఛింగ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈ చిత్ర కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద స్కేల్ మూవీ అవుతుందని నమ్మకం కలిగింది. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా." అన్నారు.
అతిథిగా వచ్చిన హీరో, ప్రొడ్యూసర్ రాంకీ మాట్లాడుతూ.. "డైరెక్టర్ వెంకట్ గారు చాలా టాలెంటెడ్. ఆయన మయూఖం చిత్రంతో ఎంతోమంది కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారు. మీలో ఎవరైనా స్టార్ కావొచ్చు. స్టార్ అయ్యాక డైరెక్టర్ వెంకట్ గారు చేసిన హెల్ప్ మర్చిపోవద్దు. "మయూఖం" సినిమా పోస్టర్ చూస్తుంటే హరి హర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలి." అన్నారు.
![]() |