![]() |
![]() |
![]()
స్టార్స్ లేకపోయినా, కంటెంట్ తో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించవచ్చని నిరూపించిన తాజా చిత్రం 'మహావతార్ నరసింహ'. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యానిమేషన్ ఫిల్మ్.. అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. (Mahavatar Narsimha)
'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకున్న హోంబలే ఫిలిమ్స్.. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను ప్రకటించింది. అందులో భాగంగా మొదటి చిత్రంగా 'మహావతార్ నరసింహ' వచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.
![]()
'మహావతార్ నరసింహ' సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హిందీ, తెలుగు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో రోజురోజుకి వసూళ్లు పెరుగుతున్నాయి. కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం రూ.105 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ప్రస్తుత జోరు చూస్తుంటే త్వరలోనే రూ.150 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డివోషనల్ ఫిల్మ్ కావడం, యానిమేషన్ వర్క్ బాగుందని టాక్ రావడం, పిల్లలు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించడం.. వంటి కారణాలతో 'మహావతార్ నరసింహ'కు ఈ స్థాయి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వీక్ డేస్, వీకెండ్ అనే తేడా లేకుండా టికెట్లు బుక్ అవుతున్నాయి. ఈరోజు సోమవారం అయినప్పటికీ.. బుక్ మై షోలో గంటకు 13 వేలకు తగ్గకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయంటే.. ఆడియన్స్ ఏ స్థాయిలో ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదు.
![]() |
![]() |