![]() |
![]() |

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమకు వేతనాలు 30 శాతం పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటామని తేల్చి చెప్పింది. దీంతో ప్రస్తుతం చిత్రీకరణ దశలో పలు సినిమాలు, సిరీస్ ల షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశముంది.
సినీ కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలనే నిబంధన జూన్ 30తో ముగిసింది. దీంతో 30 శాతం వేతనాలు పెంచాలని, లేదంటే ఆగస్టు 1 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే ఫెడరేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించి కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది.
సోమవారం(ఆగస్టు 4) నుంచి 30 శాతం వేతనాలు పెంపుకి అంగీకరించి, కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన నిర్మాతల షూటింగ్ లకి మాత్రమే తమ సభ్యులు వెళ్తారని ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది. పెంపుకి అంగీకరించకపోతే అప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్ ల షూటింగ్ లో పాల్గొనేది లేదని స్పష్టం చేసింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పలు షూటింగ్ లకు బ్రేక్ పడే ప్రమాదముంది.

![]() |
![]() |