![]() |
![]() |

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)వన్ మాన్ షో 'దేవర' తో 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)ప్రెస్టేజియస్ట్ మూవీ 'పెద్ది'(Peddi)ద్వారా మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమవుతుంది. త్వరలోనే తెలుగులో అగ్ర హీరోయిన్ గా మారే అవకాశం ఉందనే మాటలు కూడా సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. జాన్వీ కపూర్ ఈ రోజు 'పరం సుందరి'(Param Sundari)అనే కొత్త మూవీతో, బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా చెయ్యగా రివ్యూస్ పర్లేదనే స్థాయిలోనే వస్తున్నాయి.
పరం సుందరి ప్రమోషన్స్ లో భాగంగా 'జాన్వీ కపూర్' రీసెంట్ గా ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ 'ఐఎండిబి' నిర్వహించిన 'స్పీడ్ డేటింగ్' ప్రోగ్రాం లో పాల్గొంది.ప్రోగ్రాం రూల్ ప్రకారం ఇంటర్వ్యూలో పాల్గొన్న వాళ్ళు తమ మొదటి ప్రేమ,డేటింగ్ గురించి చెప్పాలి. దీంతో జాన్వీ కపూర్ మాట్లాడుతు 'నేను ఇప్పటికి చాలా సార్లు వివాహం అయ్యిందని చెప్పాను. విదేశాలకి వెళ్ళినప్పుడు చాలా మంది యువకులు నాతో చనువుగా ఉండటానికి ప్రయత్నించే వారు, అడక్కుండానే హోటల్ రూమ్ కి రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెచ్చే వాళ్ళు. దాంతో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి 'ఓర్రీ'(Orry)తో నా పెళ్లి అయ్యిందని చెప్పాను. ఈ విధంగా చాలా సార్లు జరిగిందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
'ఓర్రీ' అనే వ్యక్తి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. ఫ్యాషన్ డిజైనర్ గా కూడా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎంతో మంది బాలీవుడ్ నటీనటులు, స్టార్ కిడ్స్తో సన్నిహితంగా ఉంటాడు.
![]() |
![]() |