![]() |
![]() |

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది హీరోయిన్ డింపుల్ హయతి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులను ఇంట్లో పనిని పెట్టుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, చిత్ర హింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తాయి. వారిని వివస్త్రను చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. (Dimple Hayathi)
డింపుల్ హయాతి, ఆమె భర్త తమ ఇంటి పనులు మరియు పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలని ఒక పరిచయస్తురాలికి చెప్పారట. దీంతో ఆమె ఒడిస్సా నుండి ఇద్దరు యువతులను రప్పించి.. డింపుల్ హయాతి ఇంటికి పంపించింది. డింపుల్ దంపతులు కొన్ని రోజులు వారిని బాగానే చూసుకున్నారట. ఆ తర్వాత ఆ యువతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా.. సడెన్ గా బయటకు వెళ్ళిపోమన్నారట. దీంతో ఆ యువతులు అపార్ట్మెంట్ దగ్గర ఆందోళనకు దిగగా.. డింపుల్ దంపతులు బెదిరింపులకు పాల్పడ్డారట. మాకు చాలా మంది లాయర్లు తెలుసు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరించారట. అంతేకాకుండా, ఆ యువతులను హైదరాబాద్ కి తీసుకువచ్చిన మహిళపై కూడా డింపుల్ దంపతులు ఫైర్ అయ్యారట.
దీంతో ఆ ఒడిశా యువతులు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తమతో వెట్టి చాకిరీ చేపించుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగ్నంగా చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి కూడా ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరి డింపుల్ హయాతి దంపతులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
![]() |
![]() |