![]() |
![]() |

ఏ క్యారక్టర్ లోకైనా పరకాయప్రవేశం చేసి, సదరు క్యారక్టర్ ని ప్రేక్షకుల మనస్సులో సజీవ రూపంగా నిలిచేలా చేసే నటుల్లో 'పద్మశ్రీ అల్లురామలింగయ్య'(Allu Ramalingaiah)కూడా ఒకరు. ఆయన పేరుపై ఇండియన్ గవర్నమెంట్ ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసిందంటే, అల్లు రామలింగయ్య గారి ప్రాభవాన్ని అర్ధం చేసుకోవచ్చు. 81 సంవత్సరాల వయసులో 2004 వ సంవత్సరంలో అల్లు రామలింగయ్య గారు చనిపోవడం జరిగింది. రీసెంట్ గా ఈ రోజు ఆయన సతీమణి కనకరత్నం(Allu kanakaratnam)గారు హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు ప్రస్తుతం 94 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలు తలెత్తడంతోనే చనిపోవడం జరిగింది.
అల్లు రామలింగయ్య, కనకరత్నం గార్లకి మన దేశానికీ స్వాతంత్రం రాక ముందే వివాహం జరిగింది. నూలు వడకడంలో కనకరత్నం గారు జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి అందుకోవడంతో పాటు,స్వాతంత్రోద్యమంలో పాల్గొందని కనకరత్నం గారిని రామలింగయ్య గారు తన జీవితంలోకి ఆహ్వానించడం జరిగింది.
కనకరత్నం గారి మరణ వార్త తెలిసిన వెంటనే 'పెద్ది' సాంగ్ షూటింగ్ నిమిత్తం మైసూర్ లో ఉన్న 'రామ్ చరణ్'(Ram Charan),అట్లీ మూవీ షూటింగ్ కోసం ముంబై లో ఉన్న 'అల్లు అర్జున్(Allu Arjun)'హైదరాబాద్ బయలుదేరారు. చిరంజీవి(Chiranjeevi)తో పాటు పలువురు సినీ, వ్యాపార,రాజకీయ ప్రముఖులు కనకరత్నం గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
![]() |
![]() |