![]() |
![]() |

2019 సంక్రాంతి హిట్ ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2లో హీరోహీరోయిన్లుగా నటించిన విక్టరీ వెంకటేష్ - మిల్కీ బ్యూటీ తమన్నా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్.. ఈ కొనసాగింపు చిత్రంలోనూ సందడి చేయనున్నారు. ఎఫ్ 2ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 14 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.
కాగా, ఈ సీక్వెల్ లో ఎఫ్ 2కి మించిన కామెడీనే కాదు.. గ్లామర్ కూడా ఉంటుందని టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తమన్నా, మెహ్రీన్ తో పాటు మరో ముగ్గురు నాయికలు కూడా ఎఫ్ 3లో సందడి చేస్తారని తెలిసింది. అందులో ఒకరు ప్రత్యేక గీతంలో మెరిస్తే.. మరొకరు వెంకీకి ప్రియురాలిగా, ఇంకొకరు వరుణ్ కి లవర్ గా దర్శనమిస్తారట. మొత్తానికి.. ఐదుగురు హీరోయిన్స్ తో ఎఫ్ 3 మరింత కనువిందుగా ఉంటుందన్నమాట.
2021 వేసవిలో ఎఫ్ 3 థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |