నాగచైతన్య, సమంత పెళ్లి మూడునాళ్ల ముచ్చట.. వారిరువురు విడాకులు తీసుకుంటున్నారు.. విడాకులు తర్వాత సమంతకు భరణంగా కోట్ల రూపాయిలు చెల్లించనున్న హీరో నాగ చైతన్య.. అక్టోబర్ 7వ తేదీతో సదరు జంట ఓ నిర్ణయం.. ఆ తర్వాత సమంత హైదరాబాద్ వదిలి బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు ముంబై చెక్కేస్తుంది... ఇలా మీడియా, సోషల్ మీడియా ఎక్కడైనా... ఎప్పుడైనా... ఎందులో అయినా... ఒకటా రెండా సామ్, నాగచైతన్య జంటపై వచ్చిన కథనాలు కోకొల్లలు.
అయితే ఏమైందో ఏమో తాజాగా సమంత, అక్కినేని నాగ చైతన్య జంట పిల్లల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నారనే కథనం తాజాగా మీడియాలో వైరల్ అయింది. పిల్లల కోసం సమంత నటించేందుకు పుల్ స్టాప్ పెట్టనుందంట. ఆ క్రమంలో కొత్త సినిమాలకు సైతం సమంత సైన్ చేయడం లేదంట. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి.. భర్త, హీరో నాగ చైతన్య ఒడిలో సేద తీరాలని మనసా వాచా కర్మణా సమంత ఓ నిర్ణయం తీసుకున్నట్లు ఓ కొత్త కథనం మీడియాలో ట్రెండ్ అవుతోంది.
అందుకోసమే సమంత మౌనంగా ఉన్నట్లు సమాచారం. అందుకే... ఏక్కడైనా, ఎప్పుడైనా మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. వారికి సమాధానం చెప్పకుండా.. సమంత మౌనంగా ఉండిపోతోందట. అలాగే సమంత హైదరాబాద్లోనే ఉంటానని.. ఈ భాగ్యనగరాన్ని వదిలి తాను ఎక్కడికి వెళ్లనని... సోషల్ మీడియా సాక్షిగా తన ఫ్యాన్స్కు కుండ బద్దలు కొట్టి మరీ చెప్పింది. సమంత ప్రస్తుతం నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్లో 'కాదు వాకుల రెండు కాదల్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటున్న విషయం విదితమే. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీని పూర్తి చేసింది.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 'ఏ మాయ చేశావే' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ చిత్రంలో హీరోగా నాగ చైతన్య నటించాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ 'మనం', 'ఆటోనగర్ సూర్య', 'మజిలీ' చిత్రాల్లో నటించారు. 'ఏ మాయ చేశావే' చిత్ర సమయంలో వారి మధ్య స్నేహం చిగురించి.. అది కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత 2017లో నాగచైతన్య, సమంత మూడు ముళ్ల ద్వారా ఒక్కటయ్యారు.