నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరి'. సెప్టెంబర్ 24 న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఐదు రోజులలో రూ.26 కోట్లకు పైగా షేర్లను సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవిల యాక్టింగ్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఓ మెగా హీరో మిస్ చేసుకున్నాడని తెలుస్తోంది.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు మెగా హీరో వైష్ణవ తేజ్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. 'లవ్ స్టోరి' మూవీని మిస్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా కొత్తవాళ్ళతో సినిమాలు చేసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరి' సినిమాని కూడా అలాగే ప్లాన్ చేశారట. సినిమాలో కొంత భాగాన్ని కొత్తవాళ్ళతోనే తెరకెక్కించగా.. అది అనుకున్న విధంగా రాకపోవడంతో దానిని ఆపేసారట. ఆ తర్వాత ఈ స్టోరీని వైష్ణవ తేజ్ కి వినిపించాడట. అయితే ఆయన నటిస్తున్న 'ఉప్పెన' కూడా అదే జానర్ కావడంతో పాటు.. కథ కూడా కొంచెం అలాగే ఉండడంతో వైష్ణవ తేజ్ ఈ సినిమాకి నో చెప్పాడని టాక్ వినిపిస్తోంది.
'ఉప్పెన' తరువాత వైష్ణవ తేజ్ 'లవ్ స్టోరి' సినిమా చేసుంటే రిజల్ట్ ఎలా ఉండేదో గానీ.. నాగ చైతన్యకు మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది.