ARTICLES
డెట్రాయిట్‌లో సంక్రాంతి వేడుకలు

 

సంక్రాంతి వేడుకలలో భాగంగా అమెరికాలోని డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్ (డిటిఎ) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. నొవై వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో 30 మందికి పైగా ప్రవాస తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీలలో మొదటి బహుమతిని మల్ల పద్మ, కూన శారద జట్టు గెలుచుకుంది. రెండో బహుమతిని ఆకెళ్ళ శిరీష, దొంతి దివ్య జట్టు, మూడో బహుమతిని నంబూరి సుభాషిణి, ధేనువకొండ జయ జట్టు గెలుచుకున్నాయి. నాలుగో బహుమతిని అకినేపల్లి నాగజ్యోతి, రమ్య రత్నాకర్ జట్టు, ఐదో బహుమతిని పసుపులేటి సురేఖ, జలిగమ కవిత జట్లు దక్కించుకున్నాయి. గ్రావిటీ సొల్యూషన్స్ తరఫున ఉష, మధు కొండూరు దంపతులు ప్రాయోజకులుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;