RELATED NEWS
NEWS
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ డాలస్ లోమహాత్మా గాంధీకి నివాళి

 

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు

డా. కె. లక్ష్మణ్ డాలస్‌లో హాత్మా గాంధీకి నివాళి

 

 


డాలస్, టెక్సాస్ (జూలై 26, 2018) : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరియు ముషీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ డాలస్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు ఘన నివాళులర్పించారు.

తన ఈ అమెరికా పర్యటనలో అమెరికా లో నే అతి పెద్ద గాంధీ మెమోరియల్ గా ప్రసిద్ధి గాంచిన ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించడం ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందని, భారత దేశ స్వాతంత్రం కోసం మరియు ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాల కోసం తన జీవితాన్ని అంకితం చేసి విశ్వ మానవుడి గా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని డాలస్ లో నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని, దీని సాధనలో కృషి చేసిన గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూరను, కార్యవర్గ సభ్యులను, ప్రభుత్వ అధికారులను, ప్రవాస భారతీయులను” డాక్టర్ కె. లక్ష్మణ్ అభినందించారు.

 

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుననుసరించి ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ఈ మెమోరియల్ దగ్గర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సముచితంగా ఉందన్నారు.

 

 

 

మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ ఛైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర డాక్టర్. లక్ష్మణ్ కు స్వాగతం పలుకుతూ ఇదే ప్రాంగణం లో ఆగష్టు 15 వ తేదీన భారతదేశపు 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వందలాది ప్రవాస భారతీయుల మధ్య ఉత్సాహంగా జరుపుకోవడానికి తగు సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు. తీరికలేని కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా వీలు చేసుకొని గాంధీ మెమోరియల్ ను సందర్సించినందులకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కు తమ సంస్థ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూతురు శ్రీనివాస్ రెడ్డి, అజయ్ కల్వల, సతీష్, భీమ పెంట, రవి పటేల్ ప్రభృతులు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;