LATEST NEWS
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం వెనుక ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ త్యాగం, కృషి, పట్టుదల ఉన్నాయనడంలో ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. పైగా పిఠాపురంలో తన విజయానికి సర్వశక్తులూ ఒడ్డి శ్రమించిన వర్మను విజయం తరువాత స్వయంగా పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వర్మ త్యాగాన్ని, కృషిని గుర్తించారు. సరైన న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.  నిజమే గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు, ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించి గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే పని చేస్తూ వస్తున్న వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన అభిమానులైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మను ఉండవల్లి పిలిపించుకుని మాట్లాడారు. కూటమి అవసరాలు వివరించారు. సమన్వయంతో పని చేసి పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడమని ఆదేశించారు. దీంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలా వర్మ ఆ క్షణం నుంచీ పవన్ కల్యాణ్ విజయమే లక్ష్యంగా పని చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ కూడా వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ అయితే వర్మకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది.  జనసేన మద్దతు దారులతో వర్మకు గ్యాప్ ఏర్పడింది. తన నాయకుడి ఘన విజయం క్రెడిట్ లో కొంతైనా వర్మకు ఇచ్చుందుకు ఇష్టం లేకపోవడమో మరో కారణమో తెలియదు కానీ నియోజకవర్గంలో వర్మను క్రమంగా దూరం పెట్టడం మొదలైంది. అంతే కాకుండా నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకులైన వైసీపీ వారిని జనసేనలో చేర్చుకున్నారు. ఇది సహజంగానే వర్మకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వర్మ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.  గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు వర్మకు ప్రధాన్యమున్న పోస్టులోకి తీసుకుం టానని హామీ ఇచ్చినట్లు చెబుతారు. ఇప్పుడు చంద్రబాబుతో వర్మ భేటీ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటువంటి తరుణంలో వర్మ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
క్రీ.పూ.1000 ఏళ్లనాటి నిలువురాయి కాపాడుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ మండలం, మటంపల్లిలో ఇనుపయుగపు ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, అహోబిలం కరుణాకర్‌, నసీరుద్దీన్‌, చంటి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం నాడు, ఆయన మటంపల్లి పాత శివాలయం దారిలో రోడ్డు పక్కనే ఉన్న 12 అడుగల ఎత్తు, 5 అడుగల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నిలువురాయి (స్మారకశిల)ని క్షుణ్ణంగా పరిశీలించి మటంపల్లి క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఇనుపయుగపు స్థావరమని చెప్పారు. ఆకాలంలో మరణించిన వారిని ఒక గుంటలో పూడ్చి, పైన మట్టితో కప్పి, గుర్తుగా ఒక స్మారక శిలను నిలిపే ఆచారముండేదని, అందులో భాగంగానే ఈ నిలువురాతిని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. పురావస్తు, చారిత్రక ప్రాధాన్యతగల ఈ నిలువురాయిని కాపాడుకోవాలని మటంపల్లి గ్రామస్థులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన హుజూర్‌నగర్‌ బార్‌కౌన్సిల్‌ అధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్‌ సాముల రామిరెడ్డికి శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
సీతయ్య అనే సినిమాకు ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదేమిటంటే ఎవరి మాటా వినడు అని. ఆ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ ఎంత వరకూ యాప్ట్ అన్నది పక్కన పెడితే.. ఎవడి మాటా వినడు అన్న ట్యాగ్ లైన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికి నట్లు సరిపోతుంది. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చెలాయించిన జగన్ తన అరాచక పాలన ద్వారా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు. అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం ఆయనకు నీ సేవలించ చాలు జగన్ బాబూ అని పక్కన పెట్టేశారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరంగా ఓడించి   నీకు మా తరఫున మాట్లాడే అర్హత కూడా లేదు అని  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు చెప్పకనే చెప్పారు. అయినా ఆ విషయం అర్ధం చేసుకోలేని జగన్ జనం కోరుకున్నదే చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ప్రజల తరఫున తాను మాట్లాడనని భీష్మించారు.  జగన్ పార్టీ ఘోర పరాజయం పాలై ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటికీ జగన్ కు ప్రజలను తనను ఎందుకు ఓడించారో అర్ధం కాలేదు. ఎవరైనా చెప్పబోయినా ఆయన ఎవరి మాటా వినరాయె. అందుకే ఆయన తీరిక దొరికినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా ఎవరైనా సరే ఆయన మాట్లాడింది వినాల్సిందే.. వేరే వారు ఎవరైనా మాట్లాడితే ఆయన వినరు. ఇప్పుడు తాజాగా గురువారం (ఫిబ్రవరి 6) ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తరువాత తొలి సారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం అంటే పొరబడతారేమో.. జగన్ తాను ఏర్పాటు చేసే మీడియా సమావేశానికి తనకు అనుకూల మీడియాను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆ ప్రెస్ మీట్ కు వచ్చన వారంతా ఆయన చెప్పింది విని రాసుకుపోవడం తప్ప మాట్లాడడానికీ, ప్రశ్నలు అడగడానికి ఇసుమంతైనా అవకాశం ఉండదు. గురువారం కూడా జగన్ అలాంటి ప్రెస్ మీట్ లోనే దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు.  ఈ రెండు గంటల ప్రసంగం కూడా సింగిల్ పాయింట్ ఎజెండా కేంద్రంగానే సాగింది. మళ్లీ ప్రసంగం అంటే ఆశువుగా తాను చెప్పదలచుకున్నది చెప్పేశారనుకునేరు. కాదు కాదు. రాసుకొచ్చిన లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదివారు. ఆ స్క్రిప్ట్ మొత్తం తన ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించే ఉంది. తాను బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ముల గురించే చెప్పుకున్నారు. పనిలో పనిగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గొప్పగా సంక్షేమం అమలు చేశాననీ, చంద్రబాబు సర్కార్ సంక్షేమాన్ని మూలన పడేసిందన్నదే ఆయన రెండు గంటల ప్రసంగ సారాంశం.  మరి అంత గొప్పగా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని జనం ఎందుకంత ఘోరంగా ఓడించారు? ఈ ప్రశ్న ఆ మీడియా మీట్ కు హాజరైన వారెవరూ అడలేదు. అడిగినా ఉపయోగం లేదని వారికి తెలుసు. కనీసం జగన్ కి అయినా ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ సందేహం వచ్చిన దాఖలాలు లేవు.  వాస్తవమేమిటంటే కేవలం ఉచితాలను అందించి అదే సంక్షేమం, అభివృద్ధి అంటే జనం ఆమోదించరనీ, అంగీకరించరనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కు తమ తీర్పుతో విస్పష్టంగా చెప్పారు. కానీ ఆ విషయం అర్ధం చేసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినరు మరి. ఇక విషయానికి వస్తే జగన్ కు పరిపాలన అంటే బటన్ నొక్కడం మాత్రమే. అదొక్కటే సరిపోదని ప్రజలిచ్చిన తీర్పును ఆయన పట్టించుకోరు. తనలా చంద్రబాబు బటన్ లు ఎందుకు నొక్కడం లేదని మాత్రం ప్రశ్నిస్తారు. ఆయన ఇదే తీరులో కొనసాగితే మాత్రం 2024లో ఎదురైన ఘోర పరాభవ పరాజయాన్ని మించిన ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆయన ఆ దిశగానే ముందుకు సాగుతున్నారనడానికి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీ ఎందకు మీడియా ఉందిగా అన్న ఆయన మాటలే తార్కానం. ఈ మీడియా సమావేశం ద్వారా భవిష్యత్ లో కూడా తాను అసెంబ్లీకి హాజరు కాబోనన్న స్పష్టత ఇచ్చారు. తానే కాదు తన పార్టీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీకి హాజరు కారన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు.  అంతే జగన్ ఎవరి మాటా వినరు.  అంతే కాదు.. ఎన్ని పరాభవాలెదురైనా మారరు. అంతే జగన్ అంటే అంతే మరి.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి నగదు లావాదేవీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తునకు తెలుగుదేశం కూటమి సిట్ ను ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం సిట్‌ను నియమిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది. నగదు లావాదేవీల్లో అక్రమాలతో పాటు హోలోగ్రామ్‍‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై కూడా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది.  జగన్ హయాంలో మద్యం అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిట్ కు అందజేయాలని ఎక్సైజ్ శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఇక సిట్ తన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ప్రతి 15 రోజులకు   ప్రభుత్వానికి నివేదిక  ఇవ్వాల్సి ఉంటుంది.  సీఐడీ డీఐజీ  నేతృత్వంలో  పని చేసే ఈ సిట్ బృందంలో.    ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీ సభ్యులుగా ఉన్నారు. 
అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ   ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించిన వైసీపీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి షాకిచ్చారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా  కూడా ఇవ్వ‌లేదు. దీంతో దారుణ ఓట‌మిని జీర్ణించుకోలేని జ‌గ‌న్‌.. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌ల‌పై ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుతున్నారు. నెల‌నెలా డ‌బ్బులు ఇచ్చా.. అయినా నాకు ఓటు వేయ‌లేదంటూ ప్ర‌జ‌ల‌పై నింద‌లు మోపుతూ శాప‌నార్దాలు సైతం పెట్టాడు. దారుణంగా ఓడిపోయినా బుద్దిరాక‌పోవ‌టంతో వైసీపీ నేత‌లుసైతం జ‌గ‌న్‌ తీరును జీర్ణించుకోలేక దూరం జరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు కీల‌క నేత‌లు ఆ పార్టీని వీడి టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లో చేరిపోయారు. విజ‌య‌ సాయిరెడ్డి, మ‌రి కొంద‌రు నేత‌లు వైసీపీకి రాజీనామా చేసి జ‌గ‌న్ వింత చేష్ట‌ల‌ను భ‌రించ‌లేమంటూ దూర‌మైపోయారు. ఇంకొందరు కూడా నేత‌లుసైతం రాజీనామా బాట ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  ఈ పరిస్థితుల్లో వైసీపీ మరో ఏడాదిలోనే ఉనికి మాత్రంగా కూడా లేకుండా పూర్తిస్థాయిలో నిర్వీర్యం అవుతుంద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌తుకుతుంది. మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అలా ఆయన చెప్పడం మీరెవ‌రూ పార్టీని వీడ‌కండి అంటూ  నేతలను, కార్యకర్తలను ప్రాధేయ పడుతు న్నట్లుగా కనిపించింది. అదే స‌మ‌యంలో  త‌న సైకోయిజాన్ని జగన్ మళ్లీ బయటపెట్టుకున్నారు.  ఈ సారి 30 ఏళ్ల పాటు వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుంది.. ఈసారి జ‌గ‌న్‌ 2.0ను చూస్తారంటూ చెప్పుకొచ్చారు. ఐదేళ్లే భరించ లేకపోయిన జనం జగన్ కు మళ్లీ అధికారం అప్పగిస్తారా? 30 ఏళ్ల పాటు ఆయన అరాచకాలను భరిస్తారా? అంటూ వైసీపీ నేతలే సెటైర్లు వేసేలా జగన్ ప్రసంగం సాగింది.  జ‌గ‌న్ ద్వంద వైఖ‌రి ప‌ట్ల వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్లుగా జ‌గ‌న్ తీరు ఉంద‌ని.. వైసీపీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్ధలోని వైసీపీ కార్పొరేటర్లు  ముఖ్య నాయకులతో జగన్ సమావేశమైన సందర్భంగా జగన్ ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఒక‌వైపు వైసీపీ చచ్చిపోతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూనే.. మ‌రో వైపు 30ఏళ్లు మ‌నం ఈ రాష్ట్రాన్ని పాలిస్తామంటూ వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అయోమ‌యానికి గురిచేశారు. జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని విన్న ఆ పార్టీ నేత‌లు.. ఈయన ఇక మారడు బాబోయ్ అని తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చారు.  అంతే కాదు.. ఇన్నాళ్లు కేవ‌లం ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేశా.. ఇప్పుడు జగన్ 2.0ను చూస్తారు. ఈసారి కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తా.. గతంలో పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వ లేకపోయానంటూ  జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆయనలో అయోమయం ఏ స్థాయిలో ఉందో అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఐదేళ్లలో జగన్ ప్రజల కోసం చేసిందేమీ లేదన్నది ఆయన పార్టీకి గత ఎన్నికలలో దక్కిన ఘోర ఓటమే నిర్ద్వంద్వంగా తేల్చేసింది. ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పిందేమిటంటే.. తాను ప్రజలనే కాదు పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోలేదని మాత్రమే. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మరో మారు గెలిపిస్తే 30 ఏళ్ల పాటు ప్రజలను పట్టించుకోను అని మాత్రమే.    నిజంగా ఐదేళ్ల తన పాలనలో జగన్  ప్ర‌జ‌ల‌కు మంచి చేసిఉంటే వైసీపీ ఇప్పుడు అధికారం కోల్పో యేదా..? అధికారం దేవుడెరుగు.. కేవ‌లం 11 సీట్ల‌కే ప‌డిపోయేదా.. 175 సీట్ల‌లో గెలుస్తామంటూ ఎన్నిక‌ల ముందు ప‌దేప‌దే చెప్పిన జ‌గ‌న్‌.. కేవ‌లం 11 స్థానాల‌కే ఎందుకు ప‌డిపోవాల్సి వ‌చ్చింది..? ఇలాంటి విష‌యాల‌పై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికీ ఆలోచన చేయకపోవడంతో వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకోవడం మంచిదన్న భావనలోకి వచ్చేశారు.   రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. అందుకు ఏ పార్టీ అతీతం కాదు. కానీ, ఓడిపోయిన త‌రువాత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ఒకేతాటిపైకి తెచ్చి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంకోసం ప్ర‌భుత్వంపై  పోరాటం చేయాలి.  ఆ బాధ్య‌త‌ను పార్టీ అధినేత తీసుకోవాలి. గ‌తంలో టీడీపీ ఓడిపోయిన ప్రతిసారీ చంద్రబాబు అదే చేశారు. ఆయన ఎన్నడూ ఎప్పుడూ ప్ర‌జ‌లు న‌న్ను ఓడించార‌ని వారిపై నింద‌లు వేయ‌లేదు. వాస్త‌వంగా చెప్పాలంటే.. ప్ర‌జ‌ల జీవన ప్రమాణాలు పెంచేందుకు  చంద్ర‌బాబు అనేక అద్భుత‌ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. చంద్ర‌బాబు చేసిన పాల‌న‌కు ప్ర‌జ‌లు టీడీపీని ఒక్క‌సారికూడా ఓడించ‌ కూడ‌దు. కానీ, రాజ‌కీయాల్లో గెలుపోట‌ముల అనివార్యం. జ‌గ‌న్ ఆ విష‌యాన్ని ఇప్ప‌టికీ గ‌మ‌నించ‌క పోవ‌టమే  వైసీపీ వేగంగా ప‌త‌నం కావ‌టానికి కార‌ణంగా మారుతోంది. అధికారం కోల్పోయి ఏడు నెల‌లు అవుతున్నా.. జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల‌పై నింద‌లు వేస్తూ ఐదేళ్లు తాను సుపరిపాలన అందించినా జనం తనను ఓడించారని చెబుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.   త‌ద్వారా పార్టీని మ‌రింత ప‌త‌కానికి తీసుకెళ్తున్నారు. జ‌గ‌న్ తీరుతో వైసీపీ నేత‌లు కూడా విసుగు చెందుతున్నారు. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌లు వైసీపీ అంటేనే ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. ఎందుకంటే జ‌గ‌న్ పాల‌న‌లో వైసీపీ నేత‌ల అరాచ‌కం ఆ స్థాయిలో కొన‌సాగింది. జ‌గ‌న్  తానుఅధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను క‌లిసేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన స‌మ‌యంలోనూ రోడ్డుకు ఇరువైపులా ప‌ర‌దాలు క‌ట్టుకొని వెళ్లారు. జనం ముఖం చూడటమే ఇష్టం లేదన్నట్లు వ్యవహరించారు. అటువంటి జగన్ కు ఇప్పుడు  ఉన్న‌ట్లుండి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చింది.  ఇందుకు కారణం లేకపోలేదు.. అక్రమాస్తుల కేసులో  త్వ‌ర‌లో జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భావిస్తున్నారు. గతంలో జైలుకు వెళ్లిన సమయంలో జగన్ పట్ల సానుభూతి వ్యక్తం అయ్యింది. ఆయనకు పెద్ద సంఖ్యలో పార్టీ వర్గాలూ, ప్రజలూ అండగా నిలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  పార్టీని కీలక నేతలు వీడిపోయారు. ప్రజలలోనూ పార్టీ పట్ల ఆదరణ లేదు. తన పట్ల సానుభూతి లేదు. ఈ పరిస్థితుల్లో తాను అరెస్టైతే కనీసం నిరసన తెలపడానికి కూడా ఎవరూ ఉండరు. అందుకే పార్టీ నేతలూ, కార్యకర్తలను ఆయన పార్టీ వీడొద్దని బతిమలాడుకుంటున్నారు. మద్దతు కోరుతున్నారు. తన వెంట నిలబడాలని ప్రాధేయపడుతున్నారు. అయితే ఆయన ఎంత బతిమలాడుకున్నా  వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మాత్రం ఈసారి జ‌గ‌న్‌ కోసం నిలబడే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Laila starring Mass Ka Das Vishwak Sen garnered great interest with the actor sporting a lady get-up for the first time. The movie has clearly hinted at being a comic caper with the teaser but in trailer as well it did not dial down on double entendres. The movie trailer released on 6th Feb and it is slightly underwhelming.  The movie trailer hints at it being inspired from Kya Kool Hain Hum kind of films. Rajendra Prasad's Madam and Kamal Haasan's Bhamane Satyabhamane have the leading actors' in lady get-ups but they have a lesser dependency on double meaning dialogues. Laila makers could lose family audiences with such innuendos.  Leading lady Akanksha Sharma's glamour dose has been huge in songs and in teaser, trailer, the dependency on double entendres is also slightly above the limit. So, the makers seem to be concentrating more on youth audiences rather than the families. Still, the trailer is eventful and happening with jokes sprinkled everywhere. 
The Telugu Film Chamber of Commerce has decided to celebrate February 6 as the birthday of Telugu Cinema. It has been chosen to celebrate this day every year from now on. Along with the awards given by the government, the Chamber has also decided to present awards in various categories. It has been decided that a special flag will be placed at the house and in the theaters of every Telugu cinema actor on his birthday. The Film Chamber has entrusted the responsibility of designing this flag to senior writer Parichuri Gopalakrishna. Chamber President Damodar Prasad said, speaking at a press meet organized on the occasion of Telugu Cinema's birthday, This is the Telugu Film Chamber's first celebration of Telugu Cinema Day. Cinema is like a mother to all of us. The Telugu Cinema Chamber, the mother body, has decided to do it every year from now on. Since it is the first year, we usually do it this time. We are going to organize it grandly starting next year." Secretary Prasanna Kumar said, “Today is the birthday of cinema. The first talkie film is Bhakta Prahlada. HM Reddy is the director of this film. Before Bhakta Prahlada, a movie called Kalidasu came out in 1931. Kalidasu had four reels of songs and dialogues in Telugu. No matter how you look at it, we should proudly say that Telugu cinema's greatness has spread worldwide.’’ Senior actor and producer Murali Mohan said, ‘’Today is a happy day. A festival that should have been celebrated since time immemorial. We should say that LV Prasad is the first among the people we can be proud of. There are many others along with him.. LV Prasad has acted in Hindi and Bengali films and excelled as a direct. Today, cinema people are more popular among the people than politicians. Film actors will always be in the hearts of the audience. It is a joy to celebrate Telugu Cinema Day on February 6."   Movie Artists Association Vice President Madala Ravi said, "Telugu cinema has now become a world cinema. The reason for that is because of great technicians and directors. Once upon a time, we were called Madrasis. That is how the whole world looks at our cinema. All associations should celebrate the birthday of Telugu cinema." Directors Association President Veera Shankar said, "It is a great thing that the chamber has decided to organize this festival this year. We are ready to organize whatever responsibility is given to our directors association. Thanks to Rentala Jayadev garu, who did the research to uncover this day. It must be said that we have fallen behind in calling Kalidas a Telugu film. Kalidas was the first film in which Telugu dialogues were heard on screen, so we should also own that film." Telangana Film Chamber Secretary Anupam Reddy said. “In the coming days, we will organize it grandly so that everyone knows the greatness of Telugu cinema. Thank you to Rentala Jayadev garu on this occasion," he said.
సుదీర్ఘ కాలం నుంచి చిత్ర నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'వైజయంతి మూవీస్(Vyjayanthi Movies)తెలుగు చిత్రసీమతో పాటు,తెలుగు ప్రేక్షకుల్లోఈ సంస్థకి ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.హిట్ చిత్రాలని నిర్మించడమే కాదు,ఆయా చిత్రాల ద్వారా హీరోల ఇమేజ్ ని కూడా హిమాలయ శిఖరాలకు చేర్చింది.తెలుగు చిత్ర సీమలో ఉన్న అందరి హీరోలు వైజయంతి బ్యానర్ లో సినిమా చెయ్యాలని కోరుకోవడమే కాదు,ఆయా హీరోల అభిమానులు కూడా తమ హీరో వైజయంతి బ్యానర్ లో సినిమా చెయ్యాలని కోరుకుంటారు.దీన్నిబట్టి ఆ బ్యానర్ యొక్క ఘన కీర్తిని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కి  పాల్పడుతున్న నీలేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్ట్ చెయ్యడం జరిగింది.దీంతో అతను వైజయంతి మూవీస్ లో వర్క్ చేస్తున్నాడనే కథనాలు  కొన్ని మీడియా ఛానెల్స్ తో పాటు సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చాయి.ఇప్పుడు ఈ వార్తలపై వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు నీలేష్ కి మా సంస్థకి ఎలాంటి సంబంధం లేదు.ఈ విషయంపై పోలీసు అధికారులతో కూడా చర్చించాం.ఒక వార్తని ప్రచురించే ముందుకు నిజానిజాలు తెలుసుకోవాలంటూ ఎక్స్ వేదికగా తెలిపింది.ఎన్టీఆర్(Ntr)ఏఎన్ఆర్(Anr)చిరంజీవి(Chiranjeevi)నాగార్జున(Nagarjuna)వంటి హీరోలతో హిట్ చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ గత ఏడాది ప్రభాస్(Prabhas)తో కల్కి 2898 ఏడి తెరకెక్కించి భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.          
1987లో విడుదలైన ‘ఆగ్‌ హి ఆగ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చుంకీ పాండే ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. ఆరోజుల్లో బాలీవుడ్‌లో సోలో హీరోల సినిమాల కంటే మల్టీస్టారర్స్‌ ఎక్కువగా వచ్చేవి. వాటిలో సెకండ్‌ హీరోగా, నలుగురిలో ఒక హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. అతని కుమార్తె అనన్య పాండే 2019లో విడుదలైన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైంది. ఓ నాలుగు సినిమాల్లో నటించిన తర్వాత తెలుగులో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘లైగర్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. చాలా మంది బాలీవుడ్‌ హీరోయిన్లు టాలీవుడ్‌లో టాప్‌ రేంజ్‌కి వెళ్ళారని తెలుసుకున్న చుంకీ పాండే.. తన కుమార్తెను ‘లైగర్‌’ సినిమా చేసేందుకు ఎంకరేజ్‌ చేశాడు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య రిలీజ్‌ అయిన ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమాకి పనిచేసిన ఎంతో మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మళ్ళీ టాలీవుడ్‌ వైపు చూడలేదు అనన్య.  ‘లైగర్‌’ చిత్రం రిలీజ్‌ అయి రెండున్నర ఏళ్ళు గడిచిన తర్వాత తను ఆ సినిమా చేయడం పెద్ద పొరపాటు అంటూ అనన్య చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా డిజాస్టర్‌ కావడమే కాదు, తన పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంది అనన్య. ఈ సినిమా గురించి తనకు మొదటి నుంచీ సందేహంగానే ఉందని, అందుకే సినిమా చెయ్యాలా వద్దా అనే విషయంలో తండ్రి చుంకీ పాండే సలహా తీసుకున్నానని చెప్పింది. దాని గురించి చుంకీ పాండే కూడా స్పందిస్తూ తెలుగులో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ కాబట్టి తప్పకుండా ఆ సినిమా చేస్తే మంచి ఫ్యూచర్‌ ఉంటుందని తానే ఆమెను ఒప్పించానని చెబుతున్నాడు. ఆ సినిమాలోని క్యారెక్టర్‌లో తను చాలా చిన్న పిల్లలా కనిపిస్తానని చెప్పిందని, అయినా బలవంతంగా ఆమెను ఒప్పించానని అంటున్నాడు చుంకీ. ‘లైగర్‌’ చిత్రంలో అనన్యకు తండ్రిగా నటించిన చుంకీ.. ఆ సినిమా రిలీజ్‌ తర్వాత తను రియలైజ్‌ అయినట్టు చెప్పాడు. నిజంగానే విజయ్‌ దేవరకొండ పక్కన చిన్న పిల్లలా ఉందని అంగీకరిస్తున్నాడు. 
  విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'లైలా' (Laila). లైలా మరియు సోను మోడల్‌ గా రెండు విభిన్న కోణాలున్న పాత్రలలో విశ్వక్‌ సేన్‌ సందడి చేయనున్నాడు. లైలా రాం నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ కథానాయిక. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. (Laila Trailer)   నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. మొదట సోను మోడల్‌ గా విశ్వక్ కనిపించాడు. అయితే ఎమ్మెల్యే చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం సోను అంటూ.. అతన్ని చంపాలని పలువురు తిరుగుతుంటారు. వారి నుంచి తప్పించుకోవడం కోసం లేడీ గెటప్ వేసుకొని లైలా గా మారతాడు విశ్వక్. లైలా నిజంగానే అమ్మాయి అనుకొని, ప్రేమ పేరుతో మగవారు వెంటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో డైలాగ్ లతోనే నవ్వించాడు విశ్వక్. అయితే డబుల్ మీనింగ్ డైలాగ్ ల డోస్ కూడా ఎక్కువగానే ఉంది. "నీ ఛాతి చూశాక నా ఛాతి చపాతీ అయింది", "నీది పువ్వు లేదు.. కాయ ఉన్నాయ్", "కాయ లేదు, పండు ఉన్నాయ్.. పువ్వు లేదు, కాయ ఉన్నాయ్." వంటి డైలాగ్ లు ట్రైలర్ లో ఉన్నాయి. మొదటి నుంచి సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ వస్తున్న విశ్వక్.. లైలాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.  
తన అధ్బుతమైన నటనతో అశేష తెలుగు ప్రజల అభిమాన కథానాయకుడిగా మారిన హీరో  సుమన్(Suman)ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా కూడా తన సత్తా చాటుతు వస్తున్నాడు. తెలుగు,తమిళ,మలయాళ భాషతో పాటు ఇతర భాషల్లో కలిపి సుమారు 700 చిత్రాలకి పైగానే చేసిన సుమన్ తన సినీ కెరీర్ ఉచ్చ దశలో ఉన్నప్పుడు నీలి చిత్రాల్లో నటిస్తున్నాడనే కేసులో చెన్నై లో అరెస్ట్ అయ్యి ఆరు నెలలపాటు జైలు జీవితాన్ని అనుభవించిన  విషయం తెలిసిందే.  ఇప్పడు ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటీ జయశీల(Jaya Sheela)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సుమన్ ని  పోలీస్ ఆఫీసర్ అయిన నా భర్త చంద్రమే అరెస్ట్ చేసాడు.అప్పుడు నేను సుమన్ తో నైట్ పది గంటల దాకా షూటింగ్ లోనే ఉన్నాను.సుమన్ ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.తను అలాంటి వాడు కాదని చెప్పాను.ఆయనకూడా నా మాటకి ఏకీభవించాడు.కానీ పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి.ముఖ్యమంత్రి ఎంజీ రామ్ చంద్రన్ కూడా అరెస్ట్ చెయ్యమని చెప్పారు.సుమన్ ఫ్రెండ్ దివాకర్ కూతురుకి,తమిళనాడులోనే అత్యంత ధనవంతుడైన    వడయార్ కూతురుకి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. అందుకే  దివాకర్ ఫ్రెండ్ సుమన్ కాబట్టి సుమన్ లాగా ఒక డూప్ ని పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసారు.ఆ తర్వాత సుమన్ ని కాపాడింది కూడా మా ఆయనే అని చెప్పుకొచ్చింది.ఇప్పడు ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.    
Cast: Ajith Kumar, Trisha Krishnan, Arjun Sarja, Regina Cassandra, Arav, Remya Subramanian Crew:  Based on Breakdown Movie Edited by N. B. Srikanth Music by Anirudh Ravichander Cinematography by Om Prakash Written & Directed by Magizh Thirumeni Produced by Subaskaran Allirajah Ajith Kumar is on an all-time high after being awarded with Padma Bhushan by Indian Government. His AK Racing team achieved podium position in debut race in Dubai 24H series. Now, the actor's much delayed Vidaamuyarchi, finally released in theatres. The movie has Trisha Krishnan, Arjun Sarja and Regina Cassandra in other prominent roles. Magizh Thirumeni directed this road thriller and Lyca Productions produced it with a huge budget. The movie released as Pattudala in Telugu and let's discuss about the film in detail.  Plot:  Arjun (Ajith Kumar) is working as Vice-President in an US MNC in Azerbaijan. His wife, Kayal (Trisha Krishnan), is a tamilian settled in Azerbaijan and the couple's marriage is in doldrums after 12 years. Kayal asks for divorce from Arjun and she even reveals that she has been having an affair when Arjun tries to persuade. She wants to move out of their house to her parents home. Arjun decides to drop her and persuades her to accept his offer. On the road, they meet another Tamil couple, Rakshith (Arjun Sarja) and Deepika (Regina Cassandra), who offer her a lift when their car breaks down. What happens next? Watch the movie to know more.  Analysis:  Ajith Kumar is one of the biggest stars of Tamil Cinema and he needs content that suits his image. After a point, any star film cannot have a simple drama and if it prefers to have such a premise, it needs a very strong character. The iamge of the star is so high that a regular man character has to achieve something so unimaginable to suit the larger than life image. Director Magizh Thirumeni couldn't satisfy this condition.  Breakdown premise has been used numerous times in Hollywood, post the movie's success on VOD and Vidaamuyarchi makers should have been careful about shot to shot remake. The premise being old, the screenplay has become predictable. Also, Ajith's larger-than-life persona hinders the ambition of the makers to showcase him as a common man. His character needed to have some extra-ordinary challenges that he would solve with the help of his skills and abilities.  Indian Audience are not accustomed to see their stars in simple regular man roles and this is movie is an experiment from Ajith to break all his image shackles. Ajith's performance as a regular man, his vulnerability, his ability to shed all the starry slow motion shots and mass elements is commendable. He is truthful to his character and is able to showcase the other side of his persona on screen, brilliantly. Trisha, Arjun, Regina, Arav and others all did their best.    Anirudh Ravichander did try his best to elevate scenes but the scope for his work is limited. He did well in giving a popular track like Sawadeeka and it is picturised well, too. Om Prakash's cinematography works very well in detailing an unexplored landscape like Azerbaijan and harsh terrains of the desert very well. His overhead shot during a combat in Hummer is commendable and highly difficult to achieve. Production values by Lyca Productions are also appreciable.  Magizh Thirumeni could handle the romantic portions well. But the slow narrative as the action begins does bring down the impact. Also, being predictable, the movie losses all the charm it does have after a point. In the second hour, when Ajith takes over the proceedings into his hand, the movie looks like it caught good pace but till then it is a too much of a slow burn to digest easily. Vidaamuyarchi needs a lot of patience to sit through as the narrative drags towards climax further. On the whole, Ajith's efforts to shed down his star image is appreciable but the script doesn't suit his image and it is too flat to be exciting.  In Conclusion:  Too Slow paced and drags in second hour Rating: 2.25/5   
గత కొన్ని గంటలుగా ఈ వార్త మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఎవరీ ఐటమ్‌ గాళ్‌ అంటే.. ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషనల్‌లో వచ్చిన టెంపర్‌ చిత్రంలోని ఐటమ్‌ సాంగ్‌లో తన అందచందాలతో, స్టెప్పులతో తొలిసారి కనువిందు చేసింది. ఆ తర్వాత బాహుబలిలోని మనోహరీ.. సాంగ్‌లోనూ తన నృత్య విన్యాసాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. అలాగే కిక్‌2, షేర్‌, ఊపిరి వంటి సినిమాల్లో కూడా ఐటమ్‌ సాంగ్స్‌ చేసింది. నోరా పుట్టినరోజు ఫిబ్రవరి 6. దానికి ఒకరోజు ముందే ఆమె ఒక ప్రమాదంలో మరణించిందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. బంగీ జంప్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ కొన్ని అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పడిపోవడం వల్ల ఆమె మృతి చెందింది అనేది ఆ వార్త. దానికి ఒక వీడియోను కూడా జత చేసి పోస్ట్‌ చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్న యువతి నోరా కాదని, ఎవరో మార్ఫింగ్‌ చేశారని కొందరు నెటిజన్లు పదే పదే చెప్పారు. కానీ, దాన్ని కొందరు పట్టించుకోకుండా ఆ వీడియోను, న్యూస్‌ను షేర్‌ చేస్తూనే ఉన్నారు. దీంతో ఆ న్యూస్‌ కాస్తా వైరల్‌ అయిపోయింది.  ఈ వార్తతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ ఉలిక్కి పడిరది. ఈ వార్తలో నిజం ఎంత వుందనేది తెలుసుకోవాలని ఆమె ఎకౌంట్‌కు వేల సంఖ్యలో మెసేజ్‌లు వెళ్లిపోయాయి. ఇది గమనించిన నోరా టీమ్‌ వెంటనే స్పందించింది. దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వీడియోలో ఉన్నది నోరా కాదని ఆమె టీమ్‌ స్పష్టం చేసింది. గురువారం ఆమె పుట్టినరోజు కావడంతో ప్రస్తుతం ఆ వేడుకల్లో తలమునకలై ఉంది నోరా ఫతేహి. ఆమె బర్త్‌డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్త ఫేక్‌ అని  కన్‌ఫర్మ్‌ చేసుకున్నారందరూ. కెనడా దేశానికి చెందిన నోరా ఫతేహి బాలీవుడ్‌లో హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలతో పాటు పలు భారతీయ భాషల్లోని సినిమాల్లో నటించిన నోరా.. తను ఇండియన్‌ని అనే ఫీలింగ్‌ కలుగుతోందని ఎంతో ఆనందంగా చెబుతోంది. ప్రస్తుతం నోరా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. వాటిలో కాంచన 4 కూడా ఉంది. తనకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు లభించిందని, భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సంక్రాంతి కానుకగా 'గేమ్ చేంజర్'(Game Changer)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా, డ్యూయల్ రోల్ లో చరణ్ ప్రదర్శించిన పెర్ఫార్మెన్సు కి అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ మూవీ తర్వాత చరణ్ ఉప్పెన ఫేమ్ 'బుచ్చిబాబు'(Buchi Babu)దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ,చరణ్ కెరీర్ లో 16 వ చిత్రం .ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ మూవీలో చరణ్ అంధుడుగా కనిపించబోతున్నాడనే రూమర్స్ కొన్ని రోజుల నుంచి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చరణ్ సన్నిహిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.కళ్ళు కనిపించని పాత్రలో కాదు గాని,చరణ్ కి మరో వైకల్యం ఉంటుందనే రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి,మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది,కొన్ని రోజులు ఆగితే గాని తెలియదు.చరణ్ సరసన శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా  చేస్తుండగా,వివిధ భాషలకి చెందిన నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.   ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్(A.R Rehman)సంగీతాన్ని అందిస్తుండగా,మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకొని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసురావాలనేది చిత్ర బృందం యొక్క ప్లాన్.ఈ మూవీపై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.      
  తారాగణం: అజిత్‌ కుమార్, త్రిష, అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు సంగీతం: అనిరుధ్ డీఓపీ: ఓం ప్రకాష్ ఎడిటర్: ఎన్.బి. శ్రీకాంత్ దర్శకత్వం: మగిజ్‌ తిరుమేని  నిర్మాత: సుభాస్కరన్  బ్యానర్: లైకా ప్రొడక్షన్స్  విడుదల తేదీ: ఫిబ్రవరి 6, 2025   కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్ (Ajith Kumar) కథానాయకుడిగా నటించిన చిత్రం 'విదాముయార్చి' (Vidaamuyarchi). తెలుగులో 'పట్టుదల' పేరుతో విడుదలైంది. మగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించారు. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా కీలక పాత్రలు పోషించారు. తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ 'పట్టుదల' చిత్రం, ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. (Pattudala Movie Review)   కథ: అర్జున్ (అజిత్ కుమార్), కాయల్ (త్రిష) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. 12 ఏళ్ళ తర్వాత మరో వ్యక్తిని ప్రేమించిన కాయల్, తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. భార్యను ఎంతో ప్రేమించే అర్జున్, ఆమెతో కలిసి చివరి ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో.. పుట్టింటి దగ్గర దిగబెడతానని అంటాడు. అలా భార్యాభర్తలు ఇద్దరూ కారులో బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో వారికి ఊహించని సంఘటలు ఎదురవుతాయి. కాయల్ మిస్ అవుతుంది. ఆమెని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? ఈ ప్రయాణంలో ఎదురైన దీపిక (రెజీనా), రక్షిత్ (అర్జున్) పాత్రలు ఏంటి?. భార్య కాయల్ ను కాపాడుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? చివరికి కాయల్ ను కాపాడుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ: 1997లో వచ్చిన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ 'బ్రేక్‌డౌన్'కి ఆధారంగా పట్టుదల రూపొందింది. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచ సినిమా అర చేతిలోకి వచ్చిన ఈరోజుల్లో రీమేక్ ల జోలికి వెళ్లడం సాహసమనే చెప్పాలి. ఒకవేళ రీమేక్ చేసినా.. ఇక్కడికి తగ్గట్టుగా కొత్త మెరుపులు ఏమైనా జోడించాలి లేదా ఒరిజినల్ కి మించిన థ్రిల్ ను పంచాలి. కానీ పట్టుదల విషయంలో అదేదీ జరగలేదు. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. మొదటి గంట అజిత్-త్రిష మధ్య వచ్చే సన్నివేశాలు చప్పగా సాగాయి. కాయల్ (త్రిష) కిడ్నాప్ తర్వాతే కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు మెప్పిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో మళ్ళీ అదే తంతు. ఊహకందే కథనంతో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేకుండా సినిమా సాగుతుంది. అసలు ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలి. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను ప్రేక్షకులలో క్రియేట్ చేయగలగాలి. కానీ ఆ విషయంలో దర్శకుడు విఫలమయ్యాడు. విజువల్ గా 'పట్టుదల' బాగుంది. దర్శకుడిగా మగిజ్‌ తిరుమేని మేకింగ్ స్టైల్ మెప్పించింది. కానీ రచయితగా మాత్రం ఆయన తడబడ్డాడు. అదే సినిమాకి మైనస్ గా మారింది. పైగా సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి కథకి అజిత్ లాంటి స్టార్ అవసరం లేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అనిరుధ్ మ్యూజిక్ లో పెద్దగా మెరుపుల్లేవు. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమాకి ప్రధాన బలంగా కెమెరా పనితనం నిలిచింది. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ తేలిపోయింది.    నటీనటుల పనితీరు: అజిత్ తనదైన స్క్రీన్ ప్రజెన్స్ తో మెప్పించాడు. లుక్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు, ఎమోషన్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా వారి పాత్రలకు న్యాయం చేశారు.   ఫైనల్ గా.. కథనంలో పట్టుతప్పిన 'పట్టుదల' ప్రయాణం అంత ఆసక్తికరంగా సాగలేదు.    రేటింగ్: 2.25/5  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషి జీవితంలో విజయం అనేది స్థాయిని పెంచుతుంది.  సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం మొదలైనవి సంపాదించి పెడుతుంది. విజయం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అయితే విజయం సాధించిన వ్యక్తికి మాత్రం కష్టం అంటే ఏమిటి?? కష్టం ఎలా ఉంటుంది?? కష్టం తరువాత విజయం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?? విజయ సూత్రం ఏంటి?? ఇలాంటి విషయాలు తెలిసి ఉంటాయి.  ఒక విజేతను "మీ విజయరహస్యం ఏమిటి?" అని ప్రశ్నించినప్పుడు  "నేను జీవితంలో  విజయాలు సాధించడానికి కారణం నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే హాజరు కావటమే” అని అన్నాడట! మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడేతత్వం ఉన్నా చేసే పని ఇంకా మిగిలుందే అని కాలాన్ని పట్టుకుని ఆపలేడు. నిరంతర ప్రవాహిని లాగా కాలం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే చేసే పనిపట్ల అవగాహన పెంచుకుంటే కాలాన్ని ఆదా చేయవచ్చు. నిర్ణీత సమయంలో పని పూర్తి కావాలంటే ఆ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం ఒకటే మార్గం. చేసే పని గురించి అవగాహన పెంచుకుంటే సమయాన్ని ఆదా చేసే కళ తెలుస్తుంది. సమయాన్ని ఆదా చేయడం కూడా ఒక కళనా అని అనిపిస్తుందేమో!!  కాలాన్ని ఆదా చేయడమనే కళ!! మనం నిత్యం చేయవలసిన పనులను అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో రూపొందించుకోవాలి. ఈ ప్రక్రియనే కాలాన్ని ఆదాచేసే కళ అంటారు. క్రమపద్ధతిలో రూపొందించుకోవడం అంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన పనులను సమయ ప్రణాళిక వేసుకుని ఒక పట్టిక రూపొందించుకోవడం. అయితే ఇలా రూపాందించుకోవటంతోనే సమేక్మ్ ఆదా అయిపోదు. రూపొందించుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆచరించినప్పుడే సరైన ఫలితం. దక్కుతుంది.   “నిన్న జరిగిన దానిని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఈ రోజు కూడా వృధా చేసుకోవటం నిరర్ధకం. నిన్నటికంటే ఈరోజు మనిషిలో ఆలోచనాపరంగా బుద్ధి వికాసం కలగాలి. అలా కలగకపోతే  మన జీవితంలో మరొక రోజు వ్యర్ధమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అనేది మన ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది.  గడిచి పోయిన క్షణాలు తిరిగిరావు, అలాంటప్పుడు గడిచిపోయిన కాలంలో ఎలాంటి బాధపెట్టే విషయాలు ఉన్నా వాటిని తలచుకుంటూ బాధపడకూడదు.  ఏపుగా పెరిగిన పైరుని కోయకపోతే దాని పరమార్ధం దెబ్బ తింటుంది. అలాగే వికసించిన పూలను కోసుకోకపోతే వాటి ప్రయోజనమే దెబ్బ తింటుంది. అదే విధంగా వయస్సులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఎందుకంటే ఆలస్యమయితే కాలం మన చేతిలో ఉండదు. గడిచిపోయే ప్రతి నిమిషం తన విలువను గుర్తుచేసే సందర్భాలు భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఆ సందర్భాలలో " అయ్యో!! అప్పుడు ఆ కాలాన్ని అలా వృధా చేయకపోతే ఇప్పుడు ఇలా కలలను కోల్పోయి ఉండను కదా!!" అనుకునేలా ఉంటుంది మనసు పరిస్థితి. ఈ సెకను, ఈ నిమిషం, ఈ రోజు నాది. నేను ఏ పనినైనా చేయగలను అనుకునేవాడిదే ఈ ప్రపంచం. కాలానికి ఎదురుపడి ప్రయాణం చేసేవాడే విజేత. ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది అనే విషయం మర్చిపోకూడదు. కాలాన్ని సరిగా అర్ధం చేసుకున్నవాడే జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు.  మనం నిమిషాల గురించి జాగ్రత్త పడితే గంటలు అవే జాగ్రత్త పడతాయి. రూపాయలను పొదుపుచేస్తే వేలు అయినట్టు, కాలం ఆ విధంగానే పొదుపు అవుతుంది. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఎప్పుడూ పరాజితులుగా మిగిలిపోతారు. మరికొందరు పరాజయానికి, కాలం వృధా అవ్వడానికి సాకులు వెతికి వాటిని చూపిస్తుంటారు. వాటివల్ల ఇతరులను నమ్మించగలరేమో కానీ అలా తనని తాను మభ్యపెట్టుకోవడం తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఇతరులకంటే అలా సాకులు చెప్పేవారికే నష్టం. అందుకే   ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని ఆదా చేసే కళ నేర్చుకుంటే జీవితంలో విజేతలుగా గుర్తించబడతారు.                                        ◆నిశ్శబ్ద.
  ఇప్పటి రోజుల్లో టీ.వీ, సినిమాలు, సోషల్ మీడియా, రికార్డింగ్ డ్యాన్సుల మైకంలో పడిన జనాలకి   ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ విలువ తెలియట్లేదేమో కానీ, ఒకప్పుడు ఊరిలో బుర్రకథ ఉందంటే చాలు  పిల్లా పిచ్చుకతో సహా ఊరు ఊరంతా ఆ స్టేజి ముందే వాలిపోయేవారు. అప్పట్లో బుర్ర కథని మించిన వినోదం లేదనే చెప్పాలి. అలాంటి బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన  షేక్ నాజర్ ఒక గొప్ప నటుడు, ప్రజారచయిత, గాయకుడు.   బుర్రకథ కోసం ఆయన  చేసిన కృషివల్ల  బుర్రకథా పితామహుడయ్యాడు.  “ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ,సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడాయన.. ఈ రోజు ఆయన జన్మదిన సంధర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే.....  షేక్ నాజర్ జీవిత విశేషాలు..... ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద  ముస్లిం కుటుంబంలో, 1920, ఫిబ్రవరి 5 వ తేదీన జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". అతను కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. హార్మోనిస్టు ఖాదర్ అతనిని "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించాడు. కానీ పేదరికం వల్ల నాజర్ అక్కడ  ఉండలేకపోయాడు. తరువాత అతను బాలమహ్మదీయ సభ పేరిట మళ్ళీ నాటకాలాడి మంచిపేరు తెచ్చుకున్నాడు. టైలరుగా కూడా పని చేశాడు.  ఆర్యమత సిద్ధాంతం నచ్చటంతో మాంసాహారం తినటం మానేసాడు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించాడు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యాడు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు.  పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు చారిత్రక కథలకి  సమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు.   నాజర్‌ ఆత్మకథ  ‘పింజారి’ చిన్న పుస్తకమే అయినప్పటికీ తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్చుకోవటానికి  ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చింది అనే విషయాలన్నీ వివరంగా చెప్పాడు.  తనను చేరదీసి, అన్నం పెట్టిన, విద్య నేర్పిన  మహా పండితుల నుండి విద్యలో  తనకంటే  చిన్నవారి  నుంచి కూడా తానేం నేర్చుకున్నానో పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. చివరికి నలబై సంవత్సరాల నాటక ప్రస్థానం ముగిస్తూ, 1997లో  ఫిబ్రవరి 22 న అంగలూరులో మరణించారు.  కళకే ‘కళ’ తెచ్చిన ఆయన ప్రతిభ ...... షేక్‌ నాజర్‌ తన హావభావాలతో, ఆటపాటలతో  జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే  అనే పాత  సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి.  తెలుగు చిత్ర పరిశ్రమలో  గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారికి పూలరంగడు సినిమా కోసం ఈ  విద్యని నేర్పించాడు. అతని గళ గాంభీర్యానికి , మాధుర్యానికి మంత్రముగ్ధులైన సినీ ప్రముఖులు సినీ రంగంలో స్థిరపడమని చెప్పినా కూడా ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆయన రాసిన ఆసామీ  నాటకానికి 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ లభించింది.  ప్రశంసలు- సత్కారాలు..... తెలుగు సినీ నటకిరీటుల్లో ఒకరైన ఎన్‌టిఆర్ గుంటూరుకు వచ్చినప్పుడు నేను మీ అభిమానినని నాజర్ చెప్పిన మాటకి  ‘నేను... మీ అభిమానినని’ చెప్పి అందరినీ ఆనందపరిచారు. ప్రముఖ రచయిత  శివప్రసాద్ "నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు" అని అన్నారు. ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది. 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది. నేటి తరం మన జాతి కోసం కృషి చేసిన ఇలాంటి మహానుభావులెవరినీ మరవకూడదు. మన ప్రాచీన సంస్కృతిని, జానపద కలలని అసలే  మర్చిపోకూడదు. అలా మర్చిపోయామంటే మన ఉనికిని మనం మర్చిపోతున్నట్టే.                                        *రూపశ్రీ
  ఇప్పటి రోజుల్లో టీ.వీ, సినిమాలు, సోషల్ మీడియా, రికార్డింగ్ డ్యాన్సుల మైకంలో పడిన జనాలకి   ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ విలువ తెలియట్లేదేమో కానీ, ఒకప్పుడు ఊరిలో బుర్రకథ ఉందంటే చాలు  పిల్లా పిచ్చుకతో సహా ఊరు ఊరంతా ఆ స్టేజి ముందే వాలిపోయేవారు. అప్పట్లో బుర్ర కథని మించిన వినోదం లేదనే చెప్పాలి. అలాంటి బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన  షేక్ నాజర్ ఒక గొప్ప నటుడు, ప్రజారచయిత, గాయకుడు.   బుర్రకథ కోసం ఆయన  చేసిన కృషివల్ల  బుర్రకథా పితామహుడయ్యాడు.  “ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ,సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడాయన.. ఈ రోజు ఆయన జన్మదిన సంధర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే.....  షేక్ నాజర్ జీవిత విశేషాలు..... ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద  ముస్లిం కుటుంబంలో, 1920, ఫిబ్రవరి 5 వ తేదీన జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". అతను కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. హార్మోనిస్టు ఖాదర్ అతనిని "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించాడు. కానీ పేదరికం వల్ల నాజర్ అక్కడ  ఉండలేకపోయాడు. తరువాత అతను బాలమహ్మదీయ సభ పేరిట మళ్ళీ నాటకాలాడి మంచిపేరు తెచ్చుకున్నాడు. టైలరుగా కూడా పని చేశాడు.  ఆర్యమత సిద్ధాంతం నచ్చటంతో మాంసాహారం తినటం మానేసాడు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించాడు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యాడు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు.  పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు చారిత్రక కథలకి  సమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు.   నాజర్‌ ఆత్మకథ  ‘పింజారి’ చిన్న పుస్తకమే అయినప్పటికీ తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్చుకోవటానికి  ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చింది అనే విషయాలన్నీ వివరంగా చెప్పాడు.  తనను చేరదీసి, అన్నం పెట్టిన, విద్య నేర్పిన  మహా పండితుల నుండి విద్యలో  తనకంటే  చిన్నవారి  నుంచి కూడా తానేం నేర్చుకున్నానో పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. చివరికి నలబై సంవత్సరాల నాటక ప్రస్థానం ముగిస్తూ, 1997లో  ఫిబ్రవరి 22 న అంగలూరులో మరణించారు.  కళకే ‘కళ’ తెచ్చిన ఆయన ప్రతిభ ...... షేక్‌ నాజర్‌ తన హావభావాలతో, ఆటపాటలతో  జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే  అనే పాత  సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి.  తెలుగు చిత్ర పరిశ్రమలో  గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారికి పూలరంగడు సినిమా కోసం ఈ  విద్యని నేర్పించాడు. అతని గళ గాంభీర్యానికి , మాధుర్యానికి మంత్రముగ్ధులైన సినీ ప్రముఖులు సినీ రంగంలో స్థిరపడమని చెప్పినా కూడా ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆయన రాసిన ఆసామీ  నాటకానికి 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ లభించింది.  ప్రశంసలు- సత్కారాలు..... తెలుగు సినీ నటకిరీటుల్లో ఒకరైన ఎన్‌టిఆర్ గుంటూరుకు వచ్చినప్పుడు నేను మీ అభిమానినని నాజర్ చెప్పిన మాటకి  ‘నేను... మీ అభిమానినని’ చెప్పి అందరినీ ఆనందపరిచారు. ప్రముఖ రచయిత  శివప్రసాద్ "నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు" అని అన్నారు. ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది. 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది. నేటి తరం మన జాతి కోసం కృషి చేసిన ఇలాంటి మహానుభావులెవరినీ మరవకూడదు. మన ప్రాచీన సంస్కృతిని, జానపద కలలని అసలే  మర్చిపోకూడదు. అలా మర్చిపోయామంటే మన ఉనికిని మనం మర్చిపోతున్నట్టే.                                        *రూపశ్రీ
  అన్నం భారతీయుల ప్రధాన ఆహారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో  అన్నం లేకపోతే తిన్నట్టు ఉండదని అంటుంటారు. అయితే అన్నం తినడం వల్ల  బ్లడ్ షుగర్ పెరుగుతుందని అంటారు.  అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అంటారు. ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నానికి దూరం ఉండటం మంచిదని అంటారు. అయితే అన్నాన్ని కింది పద్దతిలో వండుకుని తింటే చక్కెర స్థాయిలు పెరగవు.  అదెలాగో తెలుసుకుంటే..  బియ్యాన్ని బాగా కడగాలి.. అన్నాన్ని వండటానికి  ముందు బియ్యాన్ని బాగా కడగాలి. కనీసం 3 నుండి 4 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడగడం వల్ల బియ్యం మీద ఉన్న దుమ్ము, ధూళి పోవడమే కాదు.. బియ్యానికి అంటుకుని ఉండే ముతక పదార్థం వదిలిపోతుంది. బియ్యాన్ని వండటానికి నీరు పోసి అందులో నాలుగైదు లవంగాలు వేయాలి.  నీళ్ళు బాగా మరిగించాలి.  నీరు మరుగుతున్నప్పుడు అందులో బియ్యం వేయాలి. ఇలా నీటిలో బియ్యం వేసినప్పుడు పైన నురుగు వస్తుంది.  ఈ నురుగును తొలగించాలి.  స్టవ్ ఆప్ చేసి బియ్యంలో నీటిని వంపేయాలని.  ఇలాఒంపేసిన తరువాత వేరే నీటితో బియ్యాన్ని మళ్లీ కడగాలి.  ఇలా చేయడం వల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయట. బియ్యంలో సాధారణంగానే గ్లైసెమిక్ ఇండెక్స్  ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నాన్ని ఏ పద్దతిలో వండినా కార్బోహైడ్రేట్స్,  గ్లూకోజ్ శరీరంలోకి వెళతాయి.  ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నం తినే విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. పై పద్దతిలో బ్లడ్ షుగర్ పెరగకపోయినా మరీ అతిగా అన్నం తినడం ప్రమాదమే.. ముఖ్యంగా అన్నం,  బంగాళదుంపలు మధుమేహాన్ని చాలా తొందరగా పెంచుతాయి. అన్నం, బంగాళదుంపల కాంబినేషన్ అస్సలు తినకపోవడం మంచిది.                                                   *రూపశ్రీ
  ఈ రోజుల్లో చాలా మందిలో కనిపించే సమస్యలలో పొట్ట సంబంధ సమస్యలు ఎక్కువ.   మరీ ముఖ్యంగా పొట్టలో గ్యాస్ ఏర్పడటం ప్రధానంగా ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడితే  కడుపు పూర్తిగా గట్టిగా ఉంటుంది. దీని కారణంగా చాలా ఇబ్బంది ఎదుర్కోవాలి.  కడుపు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.  మల విసర్జన సాఫీగా జరగకపోవడం వల్ల   ఈ సమస్య వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య  శారీరక స్థితిని మాత్రమే కాకుండా, మానసిక స్థితిని కూడా  ప్రభావితం చేస్తుంది. మలబద్ధకం సమస్య అనేక సమస్యలను కలిగిస్తుంది. మలబద్దకం తగ్గితే  చాలా వరకు గ్యాస్ ప్రాబ్లం ను అధిగమించడానికి వీలవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యకు చెక్ పెట్టడానికి ఇంట్లోనే ట్రై చేయాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. నిమ్మకాయ, సెలెరీ.. చాలాకాలంగా మలబద్దకం,  గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడేవారు నిమ్మకాయతో సెలెరీ కలిపి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.  ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవాలి.  ఉదయం నిద్రలేవగానే సెలెరీ జ్యూస్ తయారుచేసుకోవాలి.  ఇందులో కాస్త నిమ్మరసం పిండి ఆ జ్యూస్ ను తాగాలి.  ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే శరీరం మొత్తం శుభ్రమవుతుంది.  పొట్ట సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. గ్రీన్ టీ.. మలబద్దకం నుండి ఉపశమనం పొందడానికి గ్లీన్ టీ బాగా పని చేస్తుంది. గ్రీన్ టీ లోో పైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.  ఇది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. చాలా కాలంగా మలబద్దకంతో బాధపడుతుంటే ముందుగా పాలతో చేసిన టీ,కాఫీ తాగడం మానెయ్యాలి.  పాలతో చేసిన టీ, కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. ఇది గ్యాస్ సమస్యను పెంచుతుంది. వీటి స్థానంలో  గ్రీన్ టీ తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఇసబ్గోల్.. గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి  ఇసాబ్గోల్‌ను కూడా ఉపయోగించవచ్చు . ఇది సహజ భేదిమందు. ఇది గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇసబ్గోల్ ను నీటిలో కలిపి ద్రావణం తయారు చేసి త్రాగాలి. ఇది చాలా త్వరగా సమర్థవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి.. ఎప్పుడూ గ్యాస్,  మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటుంటే ప్రతిరోజూ బొప్పాయి తినవచ్చు. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య నుండి చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు.                                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
దుస్తులు శరీరాన్ని కప్పి ఉంచుతాయి.  శరీరానికి వాతావరణం నుండి రక్షణ కూడా ఇస్తాయి.  ఇప్పట్లో లో దుస్తులు ధరించడం చాలా కామన్. ఆడవారు అయినా మగవారు అయినా లో దుస్తులు ధరిస్తారు.  అయితే లో దుస్తుల ఎంపికలో కొందరు తప్పులు చేస్తారు.  చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తారు.  లో దుస్తులే కదా ఏం అవుతుందిలే అనే కారణంతో కొందరు సైజ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా లో దుస్తులు కొనుగోలు చేస్తారు.  అయితే లో దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు,  ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి,  సౌకర్యం, సైజ్ వంటి విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలా టైట్ గా ఉన్న లో దుస్తులు ధరిస్తే శరీరం షేప్ బాగా కనిపిస్తుందని అనుకుంటారు. కానీ చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. లో దుస్తులు ధరించడం వల్ల నష్టాలు కలుగుతాయి.  అవి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల పెల్విక్ ప్రాంతం చుట్టూ దురద వస్తుంది. దీని కారణంగా నొప్పితో పాటు దురద కూడా వస్తుంది.  ఇది క్రమంగా ఇన్ఫెక్షన్లు, చర్మం దెబ్బ తినడానికి కారణం అవుతుంది. చాలా బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే అది తొడపై భాగంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది తొడపై ప్రభావం చూపిస్తుంది.  రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఆ ప్రాంతాలలో కండరాలు, నరాలపై ప్రభావం పడుతుంది. బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే తొడపై ప్రభావం పడుతుంది.  దీని వలన కాళ్లు తిమ్మిరిగా అనిపించవచ్చు. ఈ పరిస్థితిని తేలికగా తీసుకుంటే చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇలా బిగుతుగా ఉన్న దుస్తులు ఎక్కువ కాలం వేసుకుంటూ ఉంటే అది నడవడంలో ఇబ్బందులు సృష్టిస్తుంది.  ముఖ్యంగా లో దుస్తులను రోజంతా వేసుకుంటాం కాబట్టి సమస్య ఎక్కువ ఉంటుంది. బిగుతుగా ఉండే బ్రా,  పెట్టీ కోట్స్,  టాప్స్ వంటివి వేసుకోవడం వల్ల పొట్ట కూడా బిగుతుగా ఉంటుంది.  దీని వల్ల అసిడిటీ సమస్య రావచ్చు.  బిగుతుగా ఉండే లో దుస్తులు ధరించడం వల్ల ఛాతీ బాగానికి రక్తప్రసరణ కూడా తగ్గుతుంది. బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే ప్రైవేట్ ప్రాంతంలో గాలి ప్రసరణ నిరోధిస్తుంది.  దీని వల్ల చెమట ఆరిపోవడానికి అవకాశం ఉండదు.  దీని కారణంగా బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ఏర్పడుతుంది.  అందుకే బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించకూడదు.  లో దుస్తులు ఎప్పుడూ కాటన్ వే ఎంచుకోవాలి. ఇవి చెమటను పీల్చుకుని ప్రైవేట్ ప్రాంతాన్ని పొడిగా ఉంచుతాయి.  అలాగే లో దుస్తులను బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి.   వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాల్సిన పని లేదు.  సరిగా ఆరని లో దుస్తులు ధరించినా,  శుభ్రత లేని లో దుస్తులు ధరించినా వాటి వల్ల ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి.                                      *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...