పశ్చిమ బెంగాల్‌లో తదుపరి శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తీవ్రమైన పోటీ, మారుతున్న ఓటర్ల మనోభావాలు, మరియు ఎన్నికల ప్రక్రియలపై పెరిగిన నిశిత పరిశీలనతో రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. అధికారంలో ఉన్న  తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ  మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. 1. ఎన్నికల వాతావరణం,  ప్రజాభావన మార్పు కోసం పెరుగుతున్న ఆకాంక్ష. ఓటర్లలోని కొన్ని వర్గాలలో రాజకీయ మార్పు కోసం బలమైన ఆకాంక్ష ఉన్నట్లు కనిపిస్తోంది. టీఎంసీ తన బలమైన సంస్థాగత పునాదిని కొనసాగిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో ఓటర్ల మనోభావాలు ప్రత్యామ్నాయాల పట్ల పెరుగుతున్న సుముఖతను సూచిస్తున్నాయి. బీజేపీ సన్నాహాలు.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మరింత వ్యవస్థీకృతమైన, వ్యూహాత్మకమైన విధానాన్ని చేపట్టింది. మెరుగైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు క్షేత్రస్థాయి సమీకరణను పెంపొందించడం బలమైన ప్రచార ప్రణాళిక మరియు ప్రచార సందేశం ఈ మెరుగుదలలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా సంస్థాగత బలం పరిమితంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలలో పార్టీ ఇప్పటికీ స్థానిక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2. ఎన్నికల సంఘం పాత్ర ఎన్నికల సమగ్రతను బలోపేతం చేసే లక్ష్యంతో తీసుకున్న అనేక చర్యలతో, భారత ఎన్నికల సంఘం పాత్ర ప్రముఖంగా చర్చనీయమైంది: పరిపాలనాపరమైన చర్యలు: నిష్పక్షపాతాన్ని నిర్ధారించడానికి అధికారులను తొలగించడం లేదా వేరే విధులకు బదిలీ చేయడం పోస్టల్ బ్యాలెట్ సంస్కరణలు: అవకతవకలను తగ్గించడానికి కఠినమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టడం సాంకేతిక ఏకీకరణ: బూత్ క్యాప్చరింగ్ వంటి అవకతవకలను నిరోధించడానికి పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ మరియు సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేయడం ఈ చర్యలు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను పెంచగల సానుకూల చర్యలుగా విస్తృతంగా పరిగణించబడుతున్నాయి. 3. ఎన్నికల సమాచారం మరియు అంచనాలు సుధాశీల్ ఘోష్ విశ్లేషణతో సహా, ఇటీవలి అభిప్రాయ సేకరణలు హోరాహోరీ ఎన్నికల వాతావరణాన్ని సూచిస్తున్నాయి: బీజేపీ అంచనా: సుమారు 157 సీట్లు టీఎంసీ అంచనా: సుమారు 119 సీట్లు ఇలాంటి అంచనాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉన్నప్పటికీ, గత ఎన్నికలతో పోలిస్తే మరింత సమతుల్యమైన పోటీ వైపు మార్పు వచ్చే అవకాశం ఉందని ఇవి సూచిస్తున్నాయి. 2021 నుండి పాఠాలు ఈ విశ్లేషణ 2021 ఎన్నికలను కూడా పునఃసమీక్షిస్తూ, ఈ క్రింది అంశాలను హైలైట్ చేస్తుంది: ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొన్న నిర్మాణాత్మక మరియు లాజిస్టికల్ సవాళ్లు ఆనాటి స్థానిక రాజకీయ పరిస్థితుల ప్రభావం ఓటర్ల జాబితా సమగ్రత రాబోయే ఎన్నికలలో ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడం ఒక కీలక అంశం, ముఖ్యంగా ఈ క్రింది వారిని తొలగించడం: గైర్హాజరు స్థానమార్పిడి మరణించిన వారి (ASD) వివరాలు ఈ ప్రక్రియ, ముఖ్యంగా హోరాహోరీగా పోటీ ఉన్న నియోజకవర్గాలలో, ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు. 4. ప్రాంతాల వారీ రాజకీయ గతిశీలత ఉత్తర బెంగాల్ కూచ్ బెహార్ మరియు ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాలు స్థిరమైన ఓటర్ల మద్దతుతో బీజేపీకి కంచుకోటలుగా కొనసాగుతున్నాయి. కేంద్ర మరియు పట్టణ ప్రాంతం కోల్‌కతాతో సహా పట్టణ కేంద్రాలు హోరాహోరీగా ఉన్నాయి, రెండు పార్టీలు తమ స్థావరాలను చురుకుగా పటిష్టం చేసుకుంటున్నాయి. దక్షిణ బెంగాల్ హుగ్లీ మరియు బీర్భూమ్ వంటి జిల్లాలలో ఈ క్రింది సూచనలు కనిపిస్తున్నాయి: టీఎంసీ సాంప్రదాయ ఆధిపత్యం క్షీణించడం బీజేపీకి ఎన్నికల పరంగా ఆదరణ పెరగడం ఈ ప్రాంతీయ వైవిధ్యాలు తుది సీట్ల పంపిణీని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. 5. ముగింపు: ఎన్నికల సమగ్రతపై ఆధారపడిన పోటీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైన మరియు హోరాహోరీగా సాగే రాజకీయ పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఫలితం కేవలం ప్రచార వ్యూహాలు, ఓటర్ల మనోభావాలపైనే కాకుండా, ఎన్నికల ప్రక్రియలోని నిష్పాక్షికత మరియు పారదర్శకతపై కూడా అత్యంత కీలకం. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా మరియు నిష్పాక్షికంగా జరిగితే, బీజేపీ 148 సీట్ల గడపను దాటి, అధికారానికి బలమైన పోటీదారుగా నిలవగలదని ప్రస్తుత అంచనాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో, టీఎంసీకి ఉన్న బలమైన సంస్థాగత బలం ఈ పోటీని అత్యంత ఉత్కంఠభరితంగా ఉంచుతుంది. దీంతో ఇది ఇటీవలి కాలంలో అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలలో ఒకటిగా నిలుస్తోంది. సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు ఓటు బ్యాంకుకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైసీపీ చాలా సీరియస్ గా పావులు కదుపుతోంది. కాపు ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అంబటి తనదైన స్టైల్ లో చేయగలిగినన్న ప్రయత్నాలూ చేస్తున్నారు. కాపులలో సానుభూతి పొందేందుకూ, వారికి దగ్గరయ్యేందుకు ఆయన ఏకంగా జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా ఆయన జైలుకు వెళ్లారో లేదో.. అలా వైసీపీయులు ఆయనను కాపు నేత అంటూ ఆకాశానికి ఎత్తేశారు.  అక్కడితో ఆగకుండా ఏకంగా దివంగత వంగవీటి రంగాతో సమానమైన నాయకుడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే పార్టీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి  తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.  ఇందుకు   తార్కానాలు కూడా చూపుతున్నారు.  ఇటీవల అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన , అంబటిని ముద్రగడ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.  కాపు నాయకుడిగా అంబటి తన తరువాతే అని చాటేందుకే ముద్రగడ అంబటి నివాసానికి వెళ్లి పరామర్శ పేరుతో తనను తాను కాపు లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  కాపు సామాజిక వర్గంలో ఎవరైనా సరే తనతో సమానంగా కానీ, తనను మించి గానీ పేరు తెచ్చుకోవడాన్ని ముద్రగడ జీర్ణించుకోలేరని ఆ సమాజికవర్గంలోనే టాక్ ఉంది. ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అదేనని కూడా అంటారు.   ఇక ప్రస్తుతానికి వస్తే.. కాపు నేతలను ఏకం చేస్తాననీ, వారిని వైసీపీ వైపు తీసుకువస్తానని ఇటీవలి కాలంలో ముద్రగడ అడిగిన వారీకి అడగని వారికీ కూడా అదే పనిగా చెబుతున్నారట. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం, జనసేప పార్టీలలో ఉంటూ.. సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉన్న నాయకుల కోసం గాలిస్తున్నారట. అటువంటి నాయకులతో సమావేశాలు నిర్వహించి, వారిని వైసీపీలోకి ఆహ్వానించాలన్నదే ఆయన వ్యూహంగా చెబుతున్నారు.   అయితే ఇక్కడ ముద్రగడకు ఎదురైన చిక్కు ఏమిటంటే.. ఆయన ప్రయత్నాలకు వైసీపీయుల నంచే వ్యతిరేకత వస్తున్నది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల కాపు కోఆర్డినేటర్లు ఈ విషయంలో ముద్రగడను బలంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.  ఇప్పుడు కూటమిలోని కాపు నేతలన పార్టీలోకి ఆహ్వానించి తన పదవులకు, ఉనికికి ముద్రగడ ఎసరుపెట్టేలా ఉన్నారన్నదే వారి వ్యతిరేకతకు కారణమంటున్నారు. ఇక్కడే వారు ముద్రగడ తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. తగుదునమ్మా అని ఇప్పుడు కాపులను ఏకం చేస్తాననడమేంటని ప్రశ్నిస్తున్నారు.  ఆయన ప్రయత్నాలు పార్టీకి చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, కాపు సామాజికవర్గాన్ని వైసీపీకి దూరం చేస్తాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో కాపు సామాజికవర్గానికి లీడర్ ఎవరు అన్న విషయంలో అంబటి వర్సెస్ ముద్రగడగా సీన్ మారిందని వైసీపీలోనే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో?  
ఆంధ్రప్రదేశ్  ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఆ బిల్లు చట్టరూపం దాల్చే దిశగా తుది అడుగుకు చేరింది.   ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ  ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.   అమరావతి బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింద. ఉభయ సభలూ ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. వైసీపీ వినా దాదాపు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అమరావతికి సై అన్నాయి. వైసీపీ ఓ వైపు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లుపై జరిగిన చర్చను మాత్రం బాయ్ కాట్ చేసి ఓటింగ్ కు దూరంగా ఉన్నది. పార్లమెంట్‌లో ఉభయ సభలలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లును  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది.  కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రపతి ఆమోదం అనేది కేవలం లాంఛనప్రాయమే. రాష్ట్రపతి సంతకం చేయడంతోనే  అమరావతి రాజధాని చట్టం  అమలులోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి   తెరపడుతుంది.  
ALSO ON TELUGUONE N E W S
సినిమా తారలకు అభిమానులు ఉండడం సహజం. అందులోనే కొందరు వీరాభిమానులు కూడా ఉంటారు. తమ అభిమాన నటీనటుల కోసం అప్ప్పుడప్ప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఈ విషయంలో ముఖ్యంగా హీరోయిన్లు కొంత అసౌకర్యానికి గురవుతుంటారు.  ఇటీవలికాలంలో ఎంత పెద్ద స్టార్స్ అయినా అభిమానుýను కలుస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. వారితో ఇంటరాక్ట్ కూడా అవుతున్నారు. ఒక్కోసారి శ్రుతి మించిన అభిమానం వల్ల స్టార్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతంలో కూడా కొన్ని అనూహ్య సంఘటనలు జరగడం, హీరోయిన్లు షాక్‌కి గురవడం జరిగింది.  తాజాగా మలయాళ హీరోయిన్ మంజు వారియర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పేరు తెచ్చుకున్న పాలక్కాడ్‌లో ఒక జ్యూయలరీ షాప్ ఓపెనింగ్‌కి హాజరయ్యారు మంజు వారియర్. ఆమె అక్కడికి వస్తున్నారన్న సమాచారంతో లెక్కకు మించిన అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని అదుపు చేస్తున్న క్రమంలోనే ఒక లేడీ అభిమాని మంజును హగ్ చేసుకొని లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. వెంటనే ఆమెను అక్కడి నుంచి పంపించేశారు సెక్యూరిటీ సిబ్బంది.  ఈ హఠాత్ సంఘటనతో మంజు వారియర్ షాక్ అయినప్పటికీ కాసేపటికి తేరుకొని ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించారు. ఇటీవల మరో హీరోయిన్ హనీ రోజ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక అభిమాని ఆమె నడుము మీద చెయ్యి వేసే ప్రయత్నం చేశాడు. ఇలాంటి ఘటనలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని, అది ఆరోగ్యకరం కాదని అంటున్నారు. సెలబ్రిటీలకు ఇలాంటి సందర్భాల్లో భద్రత కరువైందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.    https://x.com/Billa2Harry/status/2040736091574337612?s=20
  -సౌత్ సినీ, టీవీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్  -ఎంతో భవిష్యత్తు ఉన్న సుభాషిణి సూసైడ్  -నిన్న రాత్రి ఏం జరిగింది -హస్బెండ్ వేధింపులే సూసైడ్ కి కారణమా   -పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది  నటనా రంగంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రముఖ నటి 'సుభాషిణి'(Subhashini)మరణించిన సంఘటన ఇప్పుడు సౌత్ టివి, సినీ సర్కిల్స్ ని షాక్ గురి చేస్తుంది. పైగా అందర్నీ కలిచి వేస్తున్న విషయం ఏంటంటే సుభాషిణిది సూసైడ్. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సుభాషిణి సుదీర్ఘ కాలం నుంచి యాక్టింగ్ ని తన వృత్తిగా చేసుకొని పలు సీరియల్స్ లో చేస్తూ వస్తుంది. ముఖ్యంగా' కయల్'(Kayal)అనే తమిళ సీరియల్ లోని క్యారక్టర్ అనేక మంది అభిమానులని ఏర్పడేలా చేసింది. అలాంటి సుభాషిణి నిన్న నైట్ చెన్నై నగరంలోని పోరూరులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని బలవన్మరణకి పాల్పడింది. నిన్న నైట్ భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగినట్లుగా  తెలుస్తోంది. దాంతో  తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకి సిద్దపడినట్టుగా చెప్తున్నారు. పోలీసులు కూడా ఇదే అనుమానాన్ని వెల్లడి చేస్తూ తమ దర్యాప్తుని ప్రారంభించారు. Also Read: Anil ravipudi: హీరోగా అనిల్ రావిపూడి!.. ఈ హీరోయిన్ ఓకేనా!   సుభాషిణి భర్త పేరు పిప్పిన్‌. ఇద్దరు కలిసి  బెంగళూరులో నివసిస్తూ ఉంటారు. షూటింగ్‌ల కారణంగానే చెన్నైలో అపార్ట్ మెంట్ రెంట్ కి తీసుకొని ఒక్కటే ఉంటుంది. కొన్ని సినిమాల్లోను చేసినట్టుగా చెప్తున్నారు. సుభాషిణి శ్రీలంక దేశస్థురాలు కాగా వయసు 36 సంవత్సరాలు. ఇన్‌స్టాగ్రామ్‌లోను యాక్టీవ్ గా ఉండే సుభాషిణికి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు.  
- పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ బోల్డ్ రియాక్షన్ - ఫోటోల యాంగిల్స్ గురించి షాకింగ్ విషయాలు - అలాంటి ఫోటోలు తీసి మళ్ళీ కామెంట్స్ చేస్తారా? అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటో షూట్‌లతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ, తాజాగా పాపరాజీల (సినిమా ఫోటోగ్రాఫర్లు) ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత విషయాలు, తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూస్తుంటే తనకు చాలా కోపం వస్తుందని ఆమె కుండబద్ధలు కొట్టింది. సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ జిమ్ కి వెళ్ళినా, ఎయిర్ పోర్ట్ కి వెళ్ళినా పాపరాజీలు వారిని వదలకుండా వెంటాడుతుంటారు. ఈ క్రమంలో జాన్వీ ధరించే దుస్తులపై తరచూ విమర్శలు వస్తుంటాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ.. పాపరాజీలు ఫోటోలు తీసే విధానాన్ని తప్పుబట్టింది. "నేను ఎంతో కష్టపడి ఫోటో షూట్స్ చేస్తాను, అక్కడ నా లుక్ బాగుంటుంది. కానీ పాపరాజీలు కొన్నిసార్లు అసౌకర్యంగా ఉండే యాంగిల్స్ నుండి ఫోటోలు తీస్తారు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు 'ఈమె హాట్‌గా లేదు, అందంగా లేదు' అని కామెంట్స్ చేయడం చూస్తే చాలా బాధగా, కోపంగా అనిపిస్తుంది" అని ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా మహిళా నటీమణుల విషయంలో కెమెరా యాంగిల్స్ మార్చి, క్లిక్ బైట్ కోసం అసభ్యకరంగా కనిపించేలా ఫోటోలు తీయడం సరైన పద్ధతి కాదని జాన్వీ అభిప్రాయపడింది. "నేను ఏం ధరించాలి అనేది నా ఇష్టం. కానీ నేను కంఫర్ట్‌గా లేని సమయంలో వింత వింత యాంగిల్స్ నుండి ఫోటోలు తీసి, మళ్ళీ వాటిపై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు" అని ఆమె గట్టిగా స్పందించింది. గతంలో పాపరాజీలతో స్నేహపూర్వకంగా ఉండే జాన్వీ, ఇప్పుడు ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. గత ఏడాది బాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతోందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె తన ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపై పెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర అప్‌డేట్స్ చూస్తుంటే, ఇందులో జాన్వీ ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, వారిని కేవలం ఆబ్జెక్టిఫై చేయకూడదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, తనపై వచ్చే విమర్శలను ధైర్యంగా ఎదుర్కోవడంలో జాన్వీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పెద్ది' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. టాలీవుడ్‌లో ఈ మూవీ కనుక హిట్ అయితే, జాన్వీ ఇక్కడ టాప్ హీరోయిన్ల సరసన చేరడం ఖాయం. హిందీలో కూడా కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తన సినిమాలతో పాటు ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో జాన్వీ ఎప్పుడూ వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.
  -దర్శకుడిగా అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ తెలిసిందే -మరి సిల్వర్ స్క్రీన్ పైకి హీరోగా వస్తే  -హీరోయిన్ గా ఎవరు బాగుంటారు కొన్ని సినిమాల న్యూస్ కి సమ్మర్ ని సైతం కూల్ గా మార్చే శక్తి ఉంటుంది. అలాంటి ఒక న్యూస్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి సంబంధించిన నయా అప్ డేట్. నిన్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. సదరు ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతు అనిల్ రావిపూడిని నటుడుగా నేనే చేస్తానంటూ చెప్పాడు. మరి ఆ మాటని మంచి శుభముహూర్తం చూసి అన్నాడో ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే దిల్ రాజు అలా అన్నాడో లేదో అనిల్ రావిపూడి అభిమానులు, మూవీ లవర్స్ లో కూడా  సహజంగా ఉండే సోమవారం డల్ నెస్ ని పోగొట్టి అసలైన పనిని కల్పించింది. మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. దిల్ రాజు అనిల్ రావిపూడిని నటుడుగా నేనే చేస్తానని అనగానే ఫ్యాన్స్, మూవీ లవర్స్ రంగంలోకి దిగి అనిల్ రావిపూడి ఒక వేళ హీరోగా చేస్తే ఏ హీరోయిన్ అయితే బాగుంటుందని తమ సినీ మెదళ్ళకి పని కల్పిస్తున్నారు. కొంత మందైతే సదరు హీరోయిన్ల  పేర్లని కూడా సోషల్ మీడియా వేదికగా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతానికైతే అనిల్ రావిపూడికి స్క్రీన్ పై యాక్టర్ గా కనపడటం ఇష్టపడలేదు. బట్ భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయి. దిల్ రాజు(Dil Raju)మాట్లాడిన ఈవెంట్ లోనే అనిల్ కూడా మాట్లాడుతు ఇప్పట్లో చేయనని మాత్రమే చెప్పాడు. అంటే భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయి. also read; VIjay antony:  వంద దేవుళ్ళు.. ఆసక్తికరంగా మారిన వ్యాఖ్యలు   దిల్ రాజు, అనిల్ రావిపూడి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకం.  అనిల్ ఇప్పటి వరకు తొమ్మిది చిత్రాలకి దర్శకత్వం వహిస్తే అందులో ఆరు చిత్రాలు దిల్ రాజు నిర్మించినవే. మరి అంతటి అనుబంధం నెలకొని ఉన్న నేపథ్యంలో అనిల్ ని దిల్ రాజు హీరోగా పరిచయం చేస్తే అంతకంటే క్రేజ్ కా కబాబ్ న్యూస్ మరొకటి ఉండదు. అనిల్ ప్రెజెంట్ వెంకటేష్(Venkatesh),కళ్యాణ్ రామ్(kalyan Ram)తో మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు. నెక్స్ట్ సంక్రాంతికే వచ్చే అవకాశాలు ఉన్నాయి.  
- మెగాస్టార్ కొత్త సినిమాలపై వీడని నీలినీడలు - మేకర్స్ మౌనం వెనుక అసలు కారణమేంటి? - మెగా ఫ్యాన్స్‌లో పెరుగుతున్న టెన్షన్ - చిరు అప్‌కమింగ్ ప్రాజెక్టులపై లేటెస్ట్ అప్‌డేట్! టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక ప్రభంజనం. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఇటీవల 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చిరు, అదే ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తారని అభిమానులు ఆశించారు. అయితే, ప్రస్తుతం ఆయన లైనప్‌లో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తుంటే మెగా ఫ్యాన్స్‌లో కొంత ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భారీ అంచనాలున్న 'విశ్వంభర'తో పాటు బాబీ దర్శకత్వంలో రావాల్సిన సినిమా అప్‌డేట్స్ విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న మౌనం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ 'విశ్వంభర'. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై దాదాపు 15 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ విడుదల తేదీపై స్పష్టత రాకపోవడం గమనార్హం. గతంలో విడుదలైన గ్లింప్స్‌లో గ్రాఫిక్స్ నాణ్యతపై విమర్శలు రావడంతో, మేకర్స్ రాజీ పడకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, కనీసం ఒక చిన్న అప్‌డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఇదే నిర్మాణ సంస్థ నిర్మించిన ఇతర చిన్న సినిమాలు వరుసగా విడుదలైపోతుంటే, కేవలం 'విశ్వంభర' విషయంలోనే ఎందుకు ఇంత జాప్యం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. గ్రాఫిక్స్ పనుల వల్లే ఆలస్యమవుతోందా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా స్పందించాల్సిందే. విశ్వంభర వంటి విజువల్ వండర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో ఈ నిశ్శబ్దం మెగా ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. ఇక మెగాస్టార్ 158వ ప్రాజెక్ట్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీతో చిరంజీవి మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కేవీఎన్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంకా పట్టాలెక్కలేదు. దీనికి ప్రధాన కారణం ఈ నిర్మాణ సంస్థలో ఇతర భారీ ప్రాజెక్టులైన 'టాక్సిక్' వంటివి ఆలస్యం కావడమేనని ఇండస్ట్రీ వర్గాల టాక్. అంతర్జాతీయ పరిణామాలు, ఇతర షూటింగ్ షెడ్యూల్స్ వల్ల చిరు సినిమా ప్రారంభం వెనక్కి వెళ్తూ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' పరాజయం తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్తదనం ఉండేలా కథలను ఎంచుకుంటున్నారు. అందుకే వశిష్ట లాంటి యంగ్ డైరెక్టర్‌కు 'విశ్వంభర'తో అవకాశం ఇచ్చారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్వాలిటీ విషయంలో చిరు కూడా ఎక్కడా తగ్గవద్దని మేకర్స్‌కు సూచించినట్లు సమాచారం. అందుకే అవుట్‌పుట్ అద్భుతంగా రావడం కోసమే ఈ నిరీక్షణ అని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'విశ్వంభర' అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. అటు బాబీ సినిమాపై కూడా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మెగాస్టార్ స్థాయికి తగ్గట్టుగా ప్రమోషన్స్ ఉండాలని, పీరియాడికల్ అప్‌డేట్స్‌తో సందడి చేయాలని ఆశిస్తున్నారు. ఏదేమైనా, ఈ రెండు భారీ ప్రాజెక్టులపై యూవీ క్రియేషన్స్ మరియు కేవీఎన్ బ్యానర్స్ మౌనం వీడి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేస్తే తప్ప మెగా అభిమానుల టెన్షన్ తగ్గేలా లేదు. రాబోయే రోజుల్లో అయినా మెగాస్టార్ సినిమాల నుంచి పక్కా ప్లానింగ్‌తో కూడిన వార్తలు వస్తాయని ఆశిద్దాం.
-విజయ్ అంథోని నెక్స్ట్ ప్రాజెక్ట్ వంద దేవుళ్ళు  -ఈ సారి హిట్ అందుకుంటాడా! -టీజర్ లో ఏముంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తెలుగు హీరోలే చోటు సంపాదించడానికి నానా సినీ అవస్థలు పడుతున్నారు. అలాంటిది తమిళ హీరో విజయ్ అంథోని(Vijay Antony)దశాబ్దం నుంచే తెలుగు ప్రేక్షకుల హార్ట్స్ లో చోటు సంపాందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు తమిళ హీరో అని ఇంట్రడ్యూస్ చేద్దామన్నా ఆ విషయంలో ఎప్పుడో చేయి దాటి పోయింది. గత ఫిబ్రవరిలో 'బూకీ' కి విజయ్ మ్యూజిక్ ని అందించాడని తెలియడంతో   తెలుగు ప్రేక్షకులు బాగానే తరలి వెళ్లారు. ఇప్పడు విజయ్ అంథోని  'వంద దేవుళ్ళు'(Vanda Devullu)అనే చిత్రంతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యి రిలీజ్ రోజు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితిని మూవీ లవర్స్ కి కల్పించేలా ఉంది. డీటెయిల్స్ చూద్దాం  సుమారు నిమిషం ముప్పై ఆరు సెకన్ల నిడివితో ఉన్న టీజర్ ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒక గ్రామంలో మహిళ పట్ల జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిందనే విషయం అర్ధమవుతుంది. మేకర్స్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.  ఊరి వ్యక్తి మాట్లాడుతు  నేను మాత్రమే కాదండి. దీనిని ఎవరు అంగీకరించరు అని చెప్పడం, సదరు మహిళని ఊరివాళ్ళు చులకనగా చూడటం, మనం మన కులాన్ని కాపాడుకునేది ఆడవాళ్ళని అడ్డుపెట్టుకునే వంటి డైలాగ్ తో కథ ఏంటనే క్యూరియాసిటీ ఏర్పడింది. విజయ్ అంథోని రోల్ ని చేస్తే ఈ సారి వంద దేవుళ్ళు ద్వారా మెస్మరైజ్ చేడబోతున్నాడని తెలుస్తుంది. శ్వాసిక విజయ్, అజయ్ దిషాన్, శక్తీ కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. Also read: Ranveer singh: రణవీర్ సింగ్ అప్ కమింగ్ మూవీ ప్రళయ్.. ఆ పుస్తకంలోని కథేనా! ఇక ఈ చిత్రం స్పెషల్ ఏంటంటే శశి కాంత్(SasiKanth)దర్శకుడు కావడం. శశికాంత్ ఎవరో కాదు విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా నిలిచిన బిచ్చగాడు దర్శకుడు. సదరు బిచ్చగాడు తర్వాత ఆ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ. మరి ఎంత ప్రెస్టేజియస్ట్ గా తీసుకొని తెరకెక్కించారో అర్ధం చేసుకోవచ్చు. రామాంజనేయులు జవ్వాజి తో కలిసి విజయ్ ఆంథోనీ నే నిర్మిస్తున్నాడు.    
Sharwanand's latest film, Biker, is off to a promising start at the box office following its release on April 3rd. The film is successfully drawing in both youth and family audiences, fueled by strong word-of-mouth and positive critical reception. It collected Rs.18.09 crores gross worldwide in the first weekend.  Audiences are particularly appreciating the seamless blend of thrilling racing sequences with engaging family emotions. This unique concept, combined with strong content, has helped the movie trend consistently on booking platforms like BookMyShow. The positive momentum actually began with highly praised paid premieres and has translated into a solid opening weekend. As the new week begins, Biker is holding its ground well. Monday ticket sales remain steady, proving its continued appeal to family crowds and showing strong weekday sustainability. The film's success is largely being attributed to the standout performances by Sharwanand and Rajasekhar, along with director Abhilash Reddy's focused execution. Furthermore, the high-quality production values and technical brilliance from UV Creations have significantly elevated the overall theatrical experience, making it a well-rounded entertainer that is finding its audience.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -1600 కోట్ల గ్రాస్ తో వీరవిహారం చేస్తున్న రణవీర్  -నెక్ట్ మూవీ ప్రళయ్ పై భారీ అంచనాలు  -కథ ఇదేనా! ఇక నుంచి రణవీర్ సింగ్ ని ఎవరు పిలవాలన్నా 'ధురంధర్  రణవీర్ సింగ్' అని పిలవడం భారతీయ సినీ మేకర్స్, ప్రేమికులధర్మం. అంతలా ధురంధర్ రెండు భాగాల్లో హంజా అలీ మజారి ఉరఫ్ జస్కి రాత్ సింగ్ గా మెస్మరైజ్ చేసి ధురంధర్ విజయ శాతాన్ని పెంచాడు. కలెక్షన్స్ పరంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తు స్టిల్ 1600 కోట్ల గ్రాస్ తో ఉన్నాడు. దీంతో ధురంధరుడి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'ప్రళయ్' పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఉదాహరణగా అంచనాల స్థాయిని  చెప్పినా అంతకు మించి అని చెప్పే ధురంధర్ ఫ్యాన్స్ ఆత్మవిశ్వాసానికి లెక్కే ఉండదు. అందుకే అంచనాల జోలికి వెళ్లకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం. కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో 'బ్లైండ్ నెస్' అనే బుక్ ఆధారంగా 'ప్రళయ్'(Pralay)తెరకెక్కతోందనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో 'బ్లైండ్ నెస్' ప్రియులతో గూగుల్ క్రాష్ అయ్యే పరిస్థితి. ఇక ఈ మాత్రం లేటు చేయకుండా  రీసెంట్ గా ఈ విషయంపై  ప్రళయ్ ప్రొడ్యూసర్ 'హన్సల్ మెహతా' స్పందిస్తు ప్రళయ్ మూవీ ఏ పుస్తకం ఆధారంగా తెరకెక్కడం లేదు. అసలు పుస్తకాన్ని సినిమాగా తీసుకురావడం అంత ఈజీ కాదు. దర్శకుడు జై మెహతా చాలా సంవత్సరాల నుంచి ప్రళయ్ కోసం వర్క్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ బాగా వస్తుంది. సదరు స్క్రిప్ట్ తో పాటు జై మెహతా(Jai Mehta)పై రణవీర్ కి చాలా నమ్మకం ఉంది. బాలీవుడ్ చిత్రాల్లో ఇంతవరకు చూడని సరికొత్త వరల్డ్ ప్రళయ్ ద్వారా ప్రత్యక్షం కాబోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో బ్లైండ్ నెస్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. Also read: Dacoit: డెకాయిట్ రిలీజ్ వేళ మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తన అజెండా అదేనంట  ఇక ప్రళయ్ జోనర్ కి వస్తే జాంబీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. జాంబీ థ్రిల్లర్ అంటే జీవించి ఉన్న వ్యక్తులపై దాడి చేసి, వారి రక్తాన్ని తాగడంతో పాటు  మాంసాన్ని తినే ఒక అరుదైన రాక్షస జాతి కథలు. ప్రాచీన డెవిల్స్ కథలుగా కూడా   చెప్పుకోవచ్చు. జాంబీ రెడ్డి, కొత్త లోక చాప్టర్ 1 చిత్రాలు కూడా ఒక ఉదాహరణ. హాలీవుడ్ లో 1970  నాటి నుంచే తెరకెక్కిస్తూ ఉన్నారు. బ్లైండ్ నెస్  బుక్ లో ఉన్న విషయానికి వస్తే   పేరు చెప్పని నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న, వివరించడానికి కూడా వీలు లేని సామూహిక అంధత్వ మహమ్మారి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. సామాజిక పతనాన్ని ఎదుర్కొంటున్న అనేక క్యారెక్టర్స్ కూడా బుక్ లో కనపడుతూ ఉంటాయి  పోర్చు గీసు రచయిత 'జోస్ సరమగో'(Jose saramago)1995 లో రచించాడు.    
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్నీ ఉన్నా కరెంట్ కోత వల్ల అవి  పనిచేయడం ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.  ఈ చిట్కాలు తెలుసుకున్న వారు వేసవి వేడి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా,  కరెంట్ కోత ఉన్న సమయంలో అయినా టెన్షన్ పడకుండా రిలాక్స్ ఫీల్ అవుతారు.  ఇంతకీ కరెంట్ లేకపోయినా చల్లగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కిటికీల, తలుపులు.. వేసవిలో విద్యుత్ కోత  గురించి  చింతించాల్సిన అవసరం లేదు. కిటికీలు, తలుపులను తడిపి, వాటిని తెరిస్తే చాలు, చల్లని గాలి గదిలోకి ప్రవహిస్తుంది. లేదంటే కిటికీలు,  తలుపులకు తడి కర్టెన్లు ఏర్పాటు చేసుకున్నా చల్లగా ఉంటుంది. వట్టివేర్ల మ్యాట్.. బయటి వేడి గాలి లోపలికి రాకుండా కిటికీలలో వట్టివేర్ల  చాపను వేయాలి.  ఈ చాపను కిటికీల దగ్గర ఏర్పాటు చేసి వాటిని అప్పుడప్పుడ తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతిని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వట్టివేర్లు చాలా చాలా చల్లగా ఉంచుతుంది. సీజనల్ ప్రూట్స్.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే, వేసవి కాలంలో  లభించే పండ్లను కూడా తినవచ్చు. పెరుగు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అవి వేడిని తట్టుకోవడానికి  సహాయపడతాయి. చన్నీటి స్నానం..  ఇంట్లో కరెంట్ పోయినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే,  చల్లటి నీటితో స్నానం చేయవచ్చు.  వేడిగా అనిపించకుండా ఉండటానికి  చేతులు, పాదాలు, ముఖాన్ని తరచుగా కడుక్కోవడం కూడా మంచి మార్గం. కుండనీరు..  మట్టి కుండలోని నీటిని త్రాగడం కూడా మంచి ఉపశమనం. ఈ నీరు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ,  శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచుతుంది. తడిబట్ట.. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు తడిబట్ట పెట్టడం అంటే. గదిలో ప్లోర్ ను తుడవడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది డీప్ క్లీన్ కానక్కర్లేదు. కేవలం కాస్త నీరు చల్లి ప్లోర్ తుడుచుకున్నా చల్లగా ఉంటుంది. రూప్ కూలింగ్.. మేడపైన కూలింగ్ పెయింట్ వేస్తుంటారు కొందరు.  వేసవిలో ఈ పెయింట్ వేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని చెబుతారు.  అయితే ఇలా కాకపోయినా ఇంటి మేడ పైన రూఫ్ ను నీటితో తడుపుతూ ఉన్నా కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు. ఇది సాధారణ పండుగలా ఆనందంతో జరుపుకునే రోజు కాదు..  దీని వెనుక ఉన్న భావం ఎంతో గంభీరమైనది,  ఆధ్యాత్మికతతో నిండినది. యేసు ప్రభువు త్యాగాన్ని ప్రతిబింబించేది.. గుడ్ ఫ్రైడే గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. యేసు క్రీస్తు తన బోధనల ద్వారా ప్రేమ, క్షమ, దయ వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన మార్గం సహనం, పరస్పర గౌరవంతో కూడుకుని ఉంది. అయితే ఆయన బోధనలు అప్పటి కొందరు అధికారులకు నచ్చకపోవడంతో ఆయనను శిక్షించడానికి కుట్రలు పన్నారు. చివరకు ఆయనను శిలువపై వేయడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. గుడ్ ఫ్రైడే రోజు యేసు క్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి, మానవాళి పాపాల విమోచన కోసం తనను తాను అర్పించుకున్నారని క్రైస్తవులు విశ్వసిస్తారు. ప్రేమకు, క్షమకు ఉన్న అపారమైన శక్తిని  ఈ త్యాగం ద్వారా యేసు ప్రభువు ప్రపంచానికి చాటి చెప్పాడని అంటారు. తనను బాధించిన వారిని కూడా క్షమించగలిగిన హృదయం ఉండాలని.. ఈ  గొప్ప సందేశాన్ని ఆయన తానే ఒక ఉదాహరణగా మారి ప్రజలకు, ప్రపంచానికి అందించారు. గుడ్ ఫ్రైడే ను గుర్తు చేసుకునే విధానం కూడా ఎంతో ప్రత్యేకమైనది. గుడ్ ఫ్రైడే రోజు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు, యేసు ప్రభువు శిలువ అయిన విధానాన్ని స్మరించుకుంటారు,  చాలా మంది ఉపవాసం పాటిస్తారు. ఇది ఆత్మపరిశీలనకు, ప్రతి ఒక్కరూ తమ  తప్పులను గుర్తించి మార్పు చెందడానికి  అవకాశం కల్పిస్తుంది. గుడ్ ఫ్రైడే ప్రతి ఒక్కరికి  ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.. నిజమైన ప్రేమ అనేది త్యాగంతో కూడుకున్నదని,  క్షమించగలిగే మనసు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని నేర్పుతుంది.  ప్రతి ఒక్కరు తమ  జీవితాల్లో కూడా ఇతరులను ప్రేమించడం, సహాయం చేయడం, క్షమించడం వంటి విలువలను అలవాటు చేసుకోవాలని గుడ్ ఫ్రైడే అందరికీ గుర్తు చేస్తుంది. గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువును శిలువ వేసిన కారణంగా.. ఈ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు, సోదరి..  ఎంతో భావోద్వేగంగా యేసును స్మరించుకుంటారు.  గుడ్ ఫ్రైడే అనేది ఒక విషాద దినం మాత్రమే కాదు,  ఇది మానవత్వాన్ని, దయను,  నిస్వార్థ త్యాగాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన రోజు. మనసును శుద్ది చేసుకుని,  ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు నడిచేందుకు గుడ్ ఫ్రైడే ఒక మార్గం చూపిస్తుంది.                                 *రూపశ్రీ.
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను  పెంచేటప్పుడు, తల్లిదండ్రులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పులు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాయి.  ఆడపిల్లలను పెంచే తల్లిదండ్రులు చేయకూడని తప్పులేంటి? ఆడపిల్లను పెంచేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటి? ఆచార్య చాణక్యుడు దీని గురించి ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ఆంక్షలు, పరిమితులు.. ఆడపిల్ల అంటే  కుటుంబానికి పరువుగా  భావిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు తరచుగా  ఆడపిల్లల  కలలను అల్పమైనవిగా భావించి, వాటిపై ఆంక్షలు విధిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం ఆడపిల్లల  కలలను ఎన్నడూ పరిమితం చేయకూడదు. ఆమె చదువును, వృత్తిని నిర్లక్ష్యం చేయకూడదు. ఆడపిల్ల  అభివృద్ధి చెందడానికి ప్రతి అవకాశమూ కల్పించాలి. ఆడపిల్ల చదువులో,  వృత్తిలో ఎదిగే ఇంటికి అంతులేని గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్వేచ్ఛ.. అతిగా స్వేచ్ఛ ఇవ్వడం ఎవరికీ మంచిది కాదు. అలాగే, ప్రతి విషయంలోనూ అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదు. నిరంతరం ఆంక్షలు విధించడం మంచి ఆలోచన కాదు. అలా చేయడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కొడుకు అయినా, కూతురు అయినా, వారి సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. కొడుకుకు అయితే అన్నీ తెలుసు వారికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవడం,  కూతురుకు ఏమీ తెలియదు అని ఏ విషయాన్ని ఆమె ఆలోచించకుండా,  ఆమె నిర్ణయించుకోకుండా చెయ్యడం మంచిది కాదు. వివాహం పట్ల అబిప్రాయం.. నేటి సమాజం మారుతున్నప్పటికీ, కొందరు అమ్మాయిలు మాత్రమే  పెళ్లి విషయంలో తమ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది తండ్రులు ఇప్పటికీ తమ కూతుళ్ల పెళ్లి విషయమై వారి అభిప్రాయం తెలుసుకోరు. నేటికీ కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు ఉంటున్నారు.  సమాజపు ఒత్తిడికి లొంగి కూతురికి పెళ్లి చేయడం లేదా అనారోగ్యకరమైన బంధంలోనే ఉండమని ఒత్తిడి చేయడం మంచిది కాదు. పెంపకం.. కూతుళ్ల పెంపకం రెండు విధాలుగా ఉంటుంది.  కొందరు ఆడపిల్లను ప్రేమగా పెంచుతారు.  అలాంటి వారు కూతుళ్లతో ప్రేమగా, స్నేహంగా అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడేలా పెంచుతారు. కానీ కొందరు భయం గుప్పెట్లో పెంచుతారు. ఇలాంటి పెంపకంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర, పెద్ద వారి దగ్గర,  సమాజంలోని వ్యక్తుల దగ్గర కూడా నోరు విప్పాలంటే భయపడుతుంది. దీని వల్ల ఆడపిల్ల తనను తాను కోల్పోతుంది.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ ఫూల్ లేదా బావులలో ఈత కొట్టడం కూడా ఒక మార్గం.  అయితే చాలా మంది ఈత కొట్టడం అంటే మునిగిపోతారనో లేక జలుబు,  చెవి సమస్యలు వస్తాయనో కంగారు పడుతూ ఉంటారు. కానీ ఈత కొట్టడం వల్ల వీటి కంటే పెద్ద సమస్య.. అందులోనూ నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా కంగారు పెట్టే సమస్య ఒకటుంది. అదే కంటి ఇన్ఫెక్షన్లు.. ఈత వల్ల కళ్లకు చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. స్విమ్మింగ్ ఫూల్  నీటిలోని క్లోరిన్, రసాయనాలు,  బ్యాక్టీరియా కొన్నిసార్లు కళ్లలోని సున్నితమైన పొరను దెబ్బతీసి, చికాకు, ఎరుపు, దురద, దృష్టి మసకబారడానికి కారణమవుతాయి. జనం ఎక్కువగా  ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఈత కొడుతున్నప్పుడు కంటి సంరక్షణ గురించి కూడా ఆలోచించాలి. వేసవిలో అధిక చెమట, దుమ్ము , రద్దీ కారణంగా కళ్ల సెన్సిటివ్  పెరుగుతుంది.  స్విమ్మింగ్ పూల్ నీటిని సరిగ్గా శుభ్రపరచకపోతే, అందులో బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయి.  ఈ బాక్టీరియా కంటి బయటి పొర (కంజంక్టివా) వాపుకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మంట, కళ్ళు ఎర్రబడటం, దురద , కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కలుగవచ్చు. మురికిగా ఉన్న లేదా జనం ఎక్కువగా ఉండే ఈత కొలనులలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంటాక్ట్ లెన్సులు ధరించి ఈత కొట్టడం ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. స్విమ్మింగ్ ఫూల్ మెయింటెన్స్ సరిగా లేకపోతే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా ప్రోటోజోవాలు డవలప్ అవుతాయి. ఇవి కళ్లకు సోకి, వాపును కలిగిస్తాయి. ఎక్కువ కాలం వీటికి గురికావడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ రియాక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈత కొట్టే ముందు శుభ్రమైన, సరిగ్గా సరిపోయే, నీరు చొరబడని గాగుల్స్ ధరించాలి. రసాయన రియాక్షన్స్  తగ్గించడానికి, కంటి మేకప్ లేదా జిడ్డు క్రీములను తొలగించిన తర్వాతే  ఈత కొట్టాలి. స్విమ్మింగ్ పూల్‌లో  అటు ఇటు నుండి చిమ్మే నీటి నుండి  జాగ్రత్త పడాలి. నీరు కంటి మీద పడకుండా చూసుకోవాలి.  ఈత కొట్టిన తర్వాత కళ్లను చల్లని, శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి. అవసరమైతే కంటికి తేమను అందించే చుక్కల మందును వాడాలి.  స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి ప్రత్యేకంగా టవల్ ను సొంతంగా తీసుకెళ్లడం మంచిది.  స్విమ్మింగ్ ఫూల్ దగ్గర జనం ఎక్కువగా కనిపించినా, నీరు మురికిగా కనిపిస్తున్నా అక్కడ ఈత కొట్టకపోవడం మంచిది.                               *రూపశ్రీ.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు.  అయితే చాలా మంది ప్రజలు తరచుగా తమ రోజును  కప్పు టీతో లేక కాఫీతో మొదలుపెడుతుంటారు.  దీని వల్ల ఉదయాన్నే చురుగ్గా పనిచేయగలుగుతామని చెబుతారు. అయితే టీకి బదులుగా ఉదయాన్నే  ఒక గ్లాసు నీరు త్రాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు , రోజుకు ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో.. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే.. ఎన్ని లీటర్ల నీరు తాగాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన మోతాదులో నీరు త్రాగడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. వేసవి కాలంలో మరింత నీరు త్రాగడం మంచిది. జిమ్‌కు వెళ్లేవారు కూడా నీటిని ఎక్కువగా తాగాలి. ఎప్పుడు నీరు తాగాలి?  ప్రతి ఒకటి నుండి రెండు గంటలకు కొద్దిగా నీరు త్రాగాలి. ఒకేసారి ఎక్కువగా నీరు త్రాగడం మంచిది కాదు. కొద్దికొద్దిగా నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. అలాగే  పడుకునే ముందు కొద్దిగా నీరు తాగవచ్చు, కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయాన్నే ఎందుకు తాగాలి? రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయిన తర్వాత, శరీరానికి తిరిగి తేమను అందించడానికి నీరు అవసరం. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. చర్మానికి మంచిది.. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అందాన్ని పెంచుతుంది. నిజానికి, నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుపై కూడా ప్రభావం చూపుతుంది. నీళ్లు తాగడం వల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల ముఖ ముడతలు తగ్గుతాయి , శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. జీవక్రియ.. ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల  జీవక్రియ వేగవంతమవుతుంది. జీవక్రియను పెంచుకోవడం బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.  దీని వల్ల  కాలేయం,  మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం వల్ల పైన చెప్పుకున్న లాభలన్నీ ఉంటాయి.  అంతేకాకుండా ప్రతి రోజూ తప్పకుండా శరీరానికి తగినంత నీరు తాగడం వల్ల చాలా రకాల వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి.                                    *రూపశ్రీ.