మహిళలలో నడుము నొప్పి.. ఈ ఆహారాలతో చెక్ పెట్టవచ్చు!
మహిళలలో నడుము నొప్పి.. ఈ ఆహారాలతో చెక్ పెట్టవచ్చు! మహిళల శరీరం ప్రతి దశలో చాలా రకాల మార్పులకు లోనవుతుంది. ఋతుచక్రం మొదలైనప్పటి నుండి.. వివాహం, గర్బం, ఆపరేషన్లు, మెనోపాజ్.. ఇలా చాలా కారణాల వల్ల మహిళల శరీరం పోరాడుతూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు వయసు పెరిగే కొద్దీ నడుము నొప్పి వస్తుంది. కింద కూర్చోవడం లేవడం, బరువులు ఎత్తడం, పిల్లలను ఎత్తుకోవడం, కొన్ని సార్లు ప్రశాంతంగా పడుకోవడానికి కూడా నడుము నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. 40 ఏళ్ల వయసు తర్వాత, పోషకాహార లోపాలు, ఎముకల బలహీనత , జీవనశైలి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఎక్కువ సేపు కూర్చోవడం, సరైన పొజిషన్ లేకపోవడం , వ్యాయామం లేకపోవడం కూడా వెన్నెముకపై ఒత్తిడిని పెంచి, ఎప్పుడూ నడుము నొప్పిగా ఉండటానికి కారణం అవుతాయి. నడుము నొప్పికి చెక్ పెట్టాలంటే మహిళలు కొన్ని ఆహారాలు తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకూ నడుము నొప్పికి చెక్ పెట్టడానికి ఏ ఆహారాలు తినాలో తెలుసుకుంటే.. నడుము నొప్పికి ప్రత్యేక ఆహారం ఎందుకు ముఖ్యం.. నడుము నొప్పి కేవలం కండరాల సమస్య మాత్రమే కాదు, ఇది ఎముకల బలహీనత, వాపు , పోషకాహార లోపాలతో కూడా ముడిపడి ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి , మెగ్నీషియం లోపం శరీరాన్ని బలహీనపరిచి, నొప్పిని పెంచుతుంది. అందువల్ల రోజువారీ ఆహారంలో పోషకమైన ఆహార పదార్థాలను చేర్చుకోవడం ముఖ్యం. అల్లం, పసుపు.. అల్లం , పసుపులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది నడుము నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపు పాలు లేదా అల్లాన్ని టీ , ఆహారంలో కలుపుకోవచ్చు, ఇది కూడా నడుము నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. గుడ్లు, రాగులు.. గుడ్లు కాల్షియం , విటమిన్ డికి మంచి మూలం, ఇవి ఎముకలను బలపరుస్తాయి. శాకాహారులకు రాగి ఒక అద్భుతమైన కాల్షియం కాంపౌండ్, ఇది ఎముకలను బలపరచడంలో సహాయపడుతుంది. ఆకుకూరలు.. పాలకూర, మెంతి , క్యాబేజీ వంటి ఆకుపచ్చ ఆకు కూరలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది , గాయాలను నివారించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్, ద్రాక్ష.. డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం ఉంటుంది, ఇది ఎముకలకు చాలా అవసరం. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు, ఆలివ్ నూనె.. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి వాపును తగ్గిస్తాయి. ఆలివ్ నూనెలోని బలమైన మూలకాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని చెబుతారు. పులియబెట్టిన ఆహారాలు.. పెరుగు, ఇడ్లీ , దోస వంటి పులియబెట్టిన ఆహారాలలో విటమిన్ బి12 , ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి నాడీ వ్యవస్థను మెరుగుపరిచి, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఏ ఆహారాలు తీసుకోకూడదంటే.. కొన్ని రకాల ఆహారాలు నడుము నొప్పిని తీవ్రతరం చేస్తాయి. అధిక చక్కెర, ఉప్పు, మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలు, వేయించిన ఆహారాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలు వాపును పెంచి, ఎముకలను బలహీనపరుస్తాయి. అంతేకాకుండా, అధిక ఉప్పు శరీరం నుండి కాల్షియంను బయటకు తీసి, సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా, జీవనశైలిలో మార్పులు కూడా చాలా అవసరమని వైద్యులు నొక్కి చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన పొజిషన్ లో కూర్చోవడం, నడవడం, నిలబడటం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం నడుము నొప్పిని బాగా కంట్రోల్ లో ఉంచగలుగుతుంది. *రూపశ్రీ.
read moreరోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా!
రోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా! పేరుకు కూరగాయ అయినా టమాటాను అందరూ పండు అని పిలుస్తారు. టమాటాను కూరలో వాడతారు, నేరుగా సలాడ్ రూపంలో తింటారు. ఇది ఆహారానికి రుచిని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు.. చర్మానికి అందాన్ని కూడా ఇస్తుంది. చాలా మంది తమ చర్మ సంరక్షణలో టమాటాను చేర్చుకుంటారు. అయితే.. ప్రతిరోజూ ముఖానికి టమాటాను రుద్దుతూ ఉంటే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ ముఖానికి టమాటా రుద్దితే.. టమాటాలో క్లీనింగ్ ఏజెంట్లు ఉంటాయి. ప్రతిరోజూ టమాటాను ముఖానికి రుద్దుతూ ఉంటే చర్మంలో పేరుకునిపోయిన నూనె, మురికిని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. సాధారణంగా చాలామంది సూర్య కిరణాల ప్రబావం వల్ల చర్మం మీద టానింగ్ సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. కానీ టమాటా టానింగ్ సమస్యను దూరం చేస్తుంది. ప్రతిరోజూ టమాటాను ముఖం మీద రుద్దుతూ ఉంటే చర్మం మీద ఉండే టానింగ్ మెల్లిగా మాయమవుతుంది. తద్వారా చర్మాన్ని రక్షిస్తుంది. నేటికాలంలో అతిచిన్న వయంలోనే చర్మం మీద ముడుతలు, గీతలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రతిరోజూ టమాటాను రుద్దుతూ ఉంటే.. ముఖం మీద గీతలు, ముడుతల తగ్గి చర్మం యవ్వనంగా మారుతుంది. వయసు అయ్యేకొద్ది చర్మం వృద్దాప్యంగా మారుతుంది. కానీ కొందరికి చిన్న వయసులోనే చర్మం ముసలి వాళ్లలా కనిపిస్తుంది. టమాటాతో ప్రతి రోజూ ముఖం మీద రుద్దుతూ ఉంటే చర్మం బిగుతుగా మారుతుంది. ముఖం డల్ గా, కాంతిహీనంగా ఉన్నవారు ప్రతిరోజూ టమాటాతో ముఖం మీద రుద్దుతూ ఉంటే చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది. ఉపయోగించే విధానం.. టమాటాను రెండు ముఖ్కలుగా కట్ చేయాలి. సగం టమాటాను నేరుగా ముఖం మీద మెల్లిగా రసం అంతా ముఖ చర్మానికి పట్టేలాగా రుద్దాలి. పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆరిపోయాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. *రూపశ్రీ.
read moreమంచి ఆహారం తీసుకుంటున్నా హిమోగ్లోబిన్ లోపం ఉంటోందా.. అసలు కారణం ఏంటంటే!
మంచి ఆహారం తీసుకుంటున్నా హిమోగ్లోబిన్ లోపం ఉంటోందా.. అసలు కారణం ఏంటంటే! మహిళల్లో చాలామంది ఎదుర్కునే సమస్యలలో హిమోగ్లోబిన్ లోపం కూడా ఒకటి. చాలామంది మహిళలు హిమోగ్లోబిన్ లోపంతో వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. వైద్యులు చాలా వరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులు రాసిస్తుంటారు. అయితే.. ఈ మందులు వాడినప్పుడు మాత్రం హిమోగ్లోబిన్ పెరిగి, ఆ తరువాత తిరిగి తక్కువ స్థాయిలకు పడిపోతూ ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరగడం కోసం మంచి ఆహారం తీసుకుంటున్నా సరే.. చాలామంది మహిళలలో హిమోగ్లోబిన్ పెరగకుండా లోపంలాగానే ఉండిపోతుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల అలసట, కళ్లు మసకబారడం, దృష్టి తగ్గిపోవడం, తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అసలు మంచి ఆహారం తీసుకున్నా హిమోగ్లోబిన్ లోపం ఎందుకు వస్తుంది? దీని వెనుక కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. హిమోగ్లోబిన్ లోపం ఎందుకు వస్తుంది? మంచి ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నప్పటికీ, శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. శోషణ ప్రాముఖ్యత.. హిమోగ్లోబిన్ పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం తింటే సరిపోదని వైద్యులు చెబుతున్నారు. తినే ఆహారం మన శరీరానికి సరిగ్గా శోషించబడుతోందని కూడా నిర్ధారించుకోవాలని అంటున్నారు. చాలాసార్లు ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పండ్ల వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను సమృద్దిగా తీసుకున్నా.. శరీరం వాటిని సరిగ్గా శోషించుకోలేవు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది, ఇది రక్తహీనతకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్-సి పాత్ర.. హిమోగ్లోబిన్ లోపానికి విటమిన్ సి లోపం కూడా కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే విటమిన్-సి శరీరం ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది. అందువల్ల ఐరన్ తీసుకుంటూ, నిమ్మకాయలు, నారింజ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోతే శరీరం ఐరన్ ను శోషించుకోలేదు. జీర్ణవ్యవస్థ.. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే, శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీనివల్ల గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తి, హిమోగ్లోబిన్ స్థాయి తగ్గడానికి కారణం కావచ్చు. మహిళల్లో సమస్య ఎక్కువ.. హిమోగ్లోబిన్ లోపం సమస్య మహిళల్లో, ముఖ్యంగా నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అయ్యేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కాకుండా, గర్భధారణ సమయంలో శరీరానికి ఎక్కువ ఐరన్ అవసరం ఉంటుంది, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే హిమోగ్లోబిన్ తగ్గే అవకాశం ఉంటుంది. విటమిన్ -బి12, పోలిక్ యాసిడ్ లోపం.. విటమిన్ బి12 , ఫోలిక్ యాసిడ్ లోపం కూడా హిమోగ్లోబిన్ పెరగకుండా అడ్డుకుంటుంది, ఎందుకంటే ఈ రెండూ ఎర్ర రక్త కణాల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి, శరీరంలో వీటి లోపం ఉంటే, శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియ ప్రభావితమవుతుంది. *రూపశ్రీ.
read moreమహిళలకు నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తే ప్రమాదమా.. వైద్యులేం చెప్తున్నారంటే!
మహిళలకు నెలలో రెండు సార్లు పీరియడ్స్ వస్తే ప్రమాదమా.. వైద్యులేం చెప్తున్నారంటే! నెలకు ఒకసారి రుతుస్రావం కావడం సాధారణమే. సాధారణంగా ఆడపిల్లలలో రుతుచక్రం మొదలైనప్పుడు నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. ఆ తరువాత చాలా ఏళ్ల వరకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన మహిళకు నెలకు ఒకసారి పీరియడ్స్ రావడం జరుగుతుంది. అయినప్పటికీ కొందరు మహిళలకు నెలకు రెండుసార్లు పీరియడ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇది మహిళలకు ఆందోళన కలిగించే విషయం. అయితే, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒక మహిళకు నెలకు రెండుసార్లు పదేపదే రుతుస్రావం అవుతుంటే, ఆమె వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకాకుండా, ఈ రోజుల్లో మహిళల్లో రుతుస్రావానికి సంబంధించిన అనేక సమస్యలు సాధారణంగా ఉంటున్నాయి. నెలకు రెండు సార్లు పీరియడ్స్ రావడం గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. ఋతుచక్రాన్ని అర్థం చేసుకోవాలి.. సాధారణంగా, ఋతు చక్రం 28 రోజులు ఉంటుంది, కానీ అది 21 నుండి 35 రోజుల మధ్య ఉంటే, దానిని సాధారణంగా పరిగణిస్తారు. అయితే ఋతు చక్రం 21 రోజుల కంటే తక్కువగా లేదా 36 రోజుల కంటే ఎక్కువగా ఉంటే, లేదా దాని తేదీలు నెలనెలా చాలా వ్యత్యాసంగా మారితే, దానిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా పరిగణిస్తారు. ఒత్తిడి లేదా జీవనశైలి మార్పుల కారణంగా ఋతుస్రావం అప్పుడప్పుడు హెచ్చుతగ్గులకు గురికావడం కూడా పూర్తిగా సాధారణమే. అయితే, ఇది పదేపదే లేదా ఎక్కువసార్లు జరిగితే, అది శరీరానికి ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంటుంది. నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడానికి కారణాలు.. హార్మోన్ల అసమతుల్యత.. నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడానికి హార్మోన్ల హెచ్చుతగ్గులే అత్యంత సాధారణ కారణం. ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఋతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, పీరియడ్స్ క్రమరహితంగా మారతాయి. నెలలో ఒకటి కంటే ఎక్కువసార్లు పీరియడ్స్ రావచ్చు. అధిక ఒత్తిడి లేదా జీవనశైలిలో మార్పులు ఈ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయగలవని అర్థం చేసుకోవడం ముఖ్యం. PCOS.. PCOS అనేది ఒక సాధారణ హార్మోన్ల సమస్య, దీనివల్ల నెలసరి క్రమరహితంగా ఉండవచ్చు. నెలకు రెండుసార్లు కూడా రావచ్చు. ఈ పరిస్థితిలో మహిళల అండాశయాలలో చిన్న తిత్తులు ఏర్పడతాయి, ఇవి నెలసరి సక్రమంగా రావడంలో అంతరాయం కలిగిస్తాయి. గర్భాశయ ఫైబ్రాయిడ్లు.. గర్భాశయ ఫైబ్రాయిడ్లు అనేవి గర్భాశయంలో ఏర్పడే చిన్న గడ్డలు. ఈ గడ్డలు ఉన్న ప్రదేశాన్ని బట్టి , వాటి పరిమాణాన్ని బట్టి, అధిక రక్తస్రావం లేదా నెలసరిలో క్రమరాహిత్యం ఉండవచ్చు, కొన్నిసార్లు నెలసరి నెలకు రెండుసార్లు కూడా రావచ్చు. థైరాయిడ్ సమస్యలు.. హైపర్థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలు ఋతుచక్రాన్ని అస్తవ్యస్తం చేయగలవు. ఈ వ్యాధులు థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లను ప్రభావితం చేస్తాయి, దీనివల్ల పీరియడ్స్ సమయం, రక్తస్రావం జరగడంలో మార్పులు వస్తాయి. *రూపశ్రీ.
read moreవేసవిలో జుట్టు ఎక్కువ రాలుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో!
వేసవిలో జుట్టు ఎక్కువ రాలుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో! వేసవి కాలం మొదలవగానే చాలామంది జుట్టు రాలడం అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్య ముఖ్యంగా ఏప్రిల్ , మే నెలల్లో మరింత తీవ్రమవుతుంది. చాలామంది ఈ హెయిర్ ఫాల్ సమస్య గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలా వేసవిలో హెయిర్ ఫాల్ కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం రాలుతున్న జుట్టు కారణంగా చాలా అసహనం, డిప్రెషన్ కు లోనవుతారు. అసలు వేసవికాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుంది? ఈ హెయిర్ ఫాల్ ను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, చిట్కాలు ఏంటి? తెలుసుకుంటే.. వేసవిలో జుట్టు రాలడానికి గల కారణాలు.. చెమట , జిడ్డు.. వేసవికాలం తీవ్రమైన వేడిగాలులను తెస్తుంది. చెమట, జిడ్డు, దుమ్ము తలపై పేరుకుపోయి, వెంట్రుకల కుదుళ్లను మూసుకుపోయేలా చేస్తాయి. ఈ చెమట, నూనె, దుమ్ము కాంబినేషన్ జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఎక్కువ ఎండ, పొడి బారడం.. సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు జుట్టులోని తేమను పీల్చుకుంటాయి, దీనివల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా, బలహీనంగా , సులభంగా విరిగిపోయేలా చేస్తుంది. కుదుళ్లు.. తలలో వేడి, చెమట ఎక్కువైనప్పుడు జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి, దీనివల్ల జుట్టు పెరుగుదల ప్రభావితమవుతుంది. డీహైడ్రేషన్.. శరీరంలో నీటి కొరత వల్ల వెంట్రుకల కుదుళ్లు పొడిబారి, జుట్టు రాలడానికి దారితీస్తుంది. తగినంత నీరు త్రాగడం చాలా అవసరం. హార్మోన్ల మార్పులు.. వేసవి కాలంలో శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగవచ్చు, దీనివల్ల జుట్టు రాలడం జరుగుతుంది. పోషకాహార లోపాలు.. ప్రోటీన్, ఐరన్ , విటమిన్ల లోపం వల్ల జుట్టు పలుచగా , పెళుసుగా మారుతుంది. సమతుల్య ఆహారం చాలా అవసరం. వేసవిలో హెయిర్ పాల్ తగ్గడానికి చిట్కాలు.. సరైన హెయిర్ కేర్ ను డైలీ లైఫ్ స్టైల్ లో బాగం చేసుకుంటే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. తేలికపాటి షాంపూయింగ్, నూనె రాయడం , తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది. హోమ్ టిప్స్.. కలబంద, కొబ్బరి నూనె , ఉసిరి వంటి సహజ నివారణలు జుట్టుకు పోషణనిచ్చి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. వారానికి రెండుసార్లు కొబ్బరి లేదా బాదం నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవాలి. అయితే నూనెను అలాగే తలమీద వదిలేయకూడదు. కనీసం ఒక గంట తర్వాత తప్పకుండా షాంపూ చేసుకోవాలి. ఇది జుట్టును కుదుళ్ల నుండి బలపరుస్తుంది. వేసవిలో జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. జుట్టుకు పోషణ అందాలంటే, శరీర పోషణపై శ్రద్ధ వహించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు త్రాగాలి. *రూపశ్రీ.
read moreమగవారి కంటే మహిళలకు ఒమేగా-3 ఎక్కువ అవసరం ఇందుకే..!
మగవారి కంటే మహిళలకు ఒమేగా-3 ఎక్కువ అవసరం ఇందుకే..! శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పోషకాలు అవసరం అవుతాయి. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరం. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ప్రధానమైనవి. ఆరోగ్యకరమైన జీవనానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అత్యవసరం. పురుషుల కంటే మహిళలకు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా అవసరమట. శరీరం ఎదగడానికి, అనేక శారీరక విధులకు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. పురుషుల కంటే మహిళలకు ఒమేగా-3లు ఎందుకు ఎక్కువగా అవసరమవుతాయి? దీని గురించి మహిళా వైద్యులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. నెలసరి నొప్పి.. చాలా మంది మహిళలు నెలసరి సమయంలో కడుపు నొప్పితో సహా తీవ్రమైన బాధను అనుభవిస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల సమస్య.. పురుషుల కంటే మహిళలకు కీళ్లవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్ల తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది శరీర రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. కీళ్ల నొప్పి , వాపును తగ్గించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. హార్మోన్ల నియంత్రణ.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మహిళలు తమ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లను చేర్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల శరీరంలో వాపు కూడా తగ్గుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గర్భాశయంలో పిండం అభివృద్ధి చెందే సామర్థ్యాన్ని పెంచుతాయి. శరీరంలో హార్మోన్లను నియంత్రించడం ద్వారా నెలసరి సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటివి రాకుండా చేయడంలో కూడా ఒమేగా--3 ఫ్యాటీ యాసిడ్లు సహాయపడతాయి. గుండె ఆరోగ్యం.. ఒమేగా 3 గుండె ఆరోగ్యానికి మంచిది. ఒమేగా 3 తీసుకోవడం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , రక్తంలోని కొవ్వును తగ్గిస్తుంది, తద్వారా ధమనులలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమేగా-3 లభించే ఆహారాలు.. సాల్మన్ పిష్,ట్రౌట్, కాడ్ , రొయ్యలు, ఆయిస్టర్స్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వాల్నట్, చియా గింజలు, అవిసె గింజలు, ఆకుప్చచ ఆకుకూరలలో కూడా ఒమేగా-3 ఉంటుంది. *రూపశ్రీ.
read moreమహిళలకు అసలు పొట్ట ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే..!
మహిళలకు అసలు పొట్ట ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలంటే! అందరూ సాధారణంగా పిలుచుకునే బెల్లీ ఫ్యాట్ చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ ఇది మహిళలను చాలా ఇబ్బంది పెడుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడమే బెల్లీ ఫ్యాట్ గా పిలవబడుతుంది. అయితే ఈ పొట్ట భాగంలో కొవ్వు వచ్చినంత వేగంగా తగ్గదు. పొట్ట వచ్చిందంటే చాలామందిలో కామన్ గా అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా సులువుగా వచ్చేస్తాయి. మగవాళ్లకు పొట్ట వస్తే సరదాగా నాలుగు జోకులు వేసుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మహిళలు దీన్ని అంత సరదాగా తీసుకోలేరు. పైగా ఇంట్లోనే వారిమీద చాలా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదురవుతాయి. అసలు ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. మహిళలో పొట్ట కొవ్వు పేరుకుని పోవడానికి కారణం శరీరంలో హార్మోన్ల స్థితిలో మార్పు. జీర్ణాశయ పనితీరు తగ్గడం, జీవక్రియ రేటు దారుణంగా పడిపోవడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు పేరుకుని పోతుంది. ఈిస్టోజెన్ స్థాయిలు పెరిగి పొత్తికడుపు భాగంలో కొవ్వు పేరుకుని పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి పొట్ట పడుతుంది. ఇది చాలా సాధారణమైన విషయమే అయినా దాన్ని ఎలా తగ్గించుకోవాలో చాలామందికి తెలియదు. ఈ పొట్ట కొవ్వుకు కారణం ఏంటి? దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే.. ఆహారం.. సరైన ఆహారం తీసుకోకపోతే పొట్ట కొవ్వు పెరుగుతుంది. తీసుకునే చాలా ఆహారాలలో కొవ్వులు ఉంటాయి. శారీరక శ్రమకు మించి కొవ్వు పదార్థాలు తీసుకుంటే అవి పొట్ట రావడానికి కారణం అవుతాయి. జంక్ ఫుడ్, కోక్, కూల్ డ్రింక్స్, మైదా, బేకరీ ఐటమ్స్, కృత్రిమ జ్యూసులు చాలా ఈజీగా పొట్టకు కారణం అవుతాయి. పొట్ట తగ్గించాలని అనుకుంటే మొదట వీటన్నింటిని వదిలెయ్యాలి. గర్భం దాల్చడం.. గర్భం దాల్చిన మహిళలలో చాలామందికి బిడ్డను మోయడం వల్ల పొట్ట సాగుతుంది. ప్రసవం తరువాత ఈ పొట్ట సెట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు మహిళలు వ్యాయామాలు, యోగా చేయడం ద్వారా తొందరలోనే దీన్ని సెట్ చేసుకుంటారు. కానీ ప్రసవం తరువాత బిడ్డ సంరక్షణ, శరీరం చురుగ్గా లేకపోవడం వల్ల వ్యాయామం చేయకుండా ఉంటారు. దీని కారణంగా పొట్ట కొవ్వు పేరుకుపోతుంది. పిండి పదార్థాలు.. ప్రతి ఒక్కరూ బరువు పెరగడానికి ప్రధాన కారణం పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగానూ, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానూ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి. శరీరంలోకి వెళ్లే కేలరీల కంటే శరారీక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు తక్కువగా ఉంటే అవి కొవ్వుగా రూపాంతరం చెంది బరువు పెరుగుతారు. ఈ కొవ్వు ఎక్కువగా శరీరంలో పొట్ట భాగంలోనే పేరుకుపోతుంది కాబట్టి ఇది బెల్లీ ఫ్యాట్ కు కారణం అవుతుంది. దీన్ని తగ్గించాలంటే కార్బోహై్డ్రేట్లు తక్కువ తీసుకోవాలి. శారీరక శ్రమ ద్వారా ఖర్చయ్యే కేలరీలకు సరిపడా కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. పరిష్కారం.. పొట్ట తగ్గడానికి ముఖ్యంగా ఆహారం నియంత్రణతో పాటు వర్కౌట్లు కూడా చేయాలి. వాకింగ్, బ్రిస్క్ వాక్, యోగా, సూర్యనమస్కారాలు, పొట్ట తగ్గడానికి నిర్దేశించిన వ్యాయామాలు చేయాలి. ఆహారాన్ని ఒకే సారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. ముఖ్యంగా సిట్టింగ్ వర్క్ చేసేవారు ఆహారాన్ని చాలా మితంగా తీసుకోవాలి. ఫైబర్, ప్రోటీన్ గల ఆహారాన్ని , నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. సిట్టింగ్ వర్క్ లో ఉన్నవారు ప్రతి గంటకు ఒకసారి ఓ 5 నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. *నిశ్శబ్ద.
read moreరాత్రి పడుకునే ముందు బొడ్డులో ఆవాల నూనె వేస్తే ఏం జరుగుతుందో తెలుసా!
రాత్రి పడుకునే ముందు బొడ్డులో ఆవాల నూనె వేస్తే ఏం జరుగుతుందో తెలుసా! మనిషి శరీరానికి కేంద్ర స్థానం బొడ్డు. బిడ్డ తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడు పోషకాలు అన్నీ బొడ్డు ద్వారానే అందుతాయి. అందుకే బొడ్డును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బొడ్డు ఆరోగ్యంగా లేకపోతే కడుపు చాలా తొందరగా అప్సెట్ అవుతుంది. బొడ్డు ఆరోగ్యం కోసం ఆవనూనె చాలా ఆరోగ్యకరమైనదిగా పేర్కొంటారు. ఈ నూనెలో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఒమేగా-3 , ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E ఉంటాయి. రోజూ పడుకునే ముందు నాభికి ఆవనూనె రాసుకుంటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెబుతాయట. ఇంతకీ అవేంటో.. బొడ్డులో ఆవాల నూనె రాయడం వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. వెచ్చదనం.. శరీరం చలువ స్వభావం ఉన్నవారు బొడ్డులో ఆవాల నూనె వేసుకోవడం చాలా మంచిది. ఆవ నూనెను నాభికి పూయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది, ఎందుకంటే ఆవ నూనె సహజంగానే వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. కడుపు ఆరోగ్యం.. నేటి జీవనశైలి వల్ల చాలా మంది కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలతో బాధపడటం సాధారణం అయింది. అలాంటి సమస్యలు ఉన్నవారు ప్రతి రాత్రి పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయాలి, ఎందుకంటే నాబి ప్రాంతం ప్రేగులకు అనుసంధానించబడి ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు.. ఆవ నూనెలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. శీతాకాలంలో తరచుగా కీళ్ల నొప్పులు ఎదుర్కునేవారు పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయాలి. ఇది మంటను చాలా వరకు తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ వంటి ప్రమాదకరమైన సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తి.. నేటికాలంలో చాలా మంది రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని చెబుతూ ఉంటారు. ఏ చిన్న ఇన్ఫెక్షన్లకు అయినా చాలా తొందరగా ఇబ్బంది పడతారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటే తరచుగా అనారోగ్యానికి దారితీస్తుంది. పడుకునే ముందు నాభికి ఆవ నూనెను పూయడం వల్ల రోగనిరోధక శక్తి మూలాల నుండి బలపడుతుంది. ఇది ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కొన్ని రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. నిద్ర సమస్యలు.. నిద్ర సమస్యలతో బాధపడేవారు పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాసుకోవాలి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే తగినంత నిద్ర లేకపోతే, అది రోగనిరోధక శక్తి బలహీనపడటం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. చర్మ ఆరోగ్యం.. పడుకునే ముందు నాభికి ఆవ నూనె రాయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా చేయడం. ఇది ముడతలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఆవ నూనెలో విటమిన్ E ఉంటుంది, ఇది చర్మానికి లోతుగా పోషణ ఇస్తుంది. ఆవనూనెను బొడ్డుకు రాయడం వల్ల మంచి ఫలితాలు లభించాలంటే.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కనీసం నెలరోజులు అయినా దాన్ని రాత్రి పడుకునే ముందు బొడ్డు మీద రాయాలి. *రూపశ్రీ.
read moreమెదడును వృద్దాప్యం నుండి కాపాడే వ్యాయామం.. 40 ఏళ్లు దాటిన వాళ్లకు ఎంతో ముఖ్యం!
మెదడును వృద్దాప్యం నుండి కాపాడే వ్యాయామం.. 40 ఏళ్లు దాటిన వాళ్లకు ఎంతో ముఖ్యం! ప్రతి మనిషికి మెదడు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం. కొంతమందికి చిన్న వయసులోనే మతిమరుపు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగడాన్ని వైద్యుడు మెదడు వృద్దాప్యానికి చేరడం అని చెబుతారు. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత చాలామందిలో మెదడు వృద్దాప్యానికి లోనవడం కనిపిస్తూ ఉంటుంది. కానీ మెదడు వృద్దాప్యానికి లోనవకుండా ఉండాలంటే వ్యాయామాలు చాలా చక్కగా సహాయం చేస్తాయి. పరిశోధనల ప్రకారం ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన వారి మెదడు, దినచర్యలో ఎటువంటి శారీరక మార్పులు చేయని వారి కంటే ఇంకా యంగ్ గా మారిందని తేలింది. మరీ ముఖ్యంగా వృద్దులు కూడా వ్యాయామం చేయడం వల్ల.. ఏ వ్యాయామం చేయని తక్కువ వయసులో ఉన్నవారి కంటే మెదడు మరింత చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. ఈ వ్యాయామం గురించి తెలుసుకుంటే.. జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యం.. మెదడును జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా సంవత్సరాల పాటు కొనసాగే దీర్ఘకాలిక ప్రక్రియ. . మెదడు వయస్సులో చిన్న మార్పులు కూడా దశాబ్దాల తర్వాత గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఏరోబిక్ వ్యాయామం మెదడును యవ్వనంగా ఉంచడమే కాకుండా, అనేక ఇతర మానసిక ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే ఆలోచనలో స్పష్టత మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది .మొత్తం మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏరోబిక్ వ్యాయామం అంటే.. ఏరోబిక్ వ్యాయామాన్నే "కార్డియో" అని కూడా పిలుస్తారు. ఈ వ్యాయామం మెదడుకు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఏరోబిక్ వ్యాయామం ప్రయోజనాలు.. ఊపిరితిత్తులు, గుండ, కండరాలను బలోపేతం చేస్తాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడతాయి. స్ట్రోక్, డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వేగంగా నడవడం, ఈత, సైక్లింగ్ వంటివి కూడా ఈ ఏరోబిక్ వ్యాయామాల కిందకు వస్తాయి. వీటిని దినచర్యలో భాగం చేసుకుంటే మంచిది. *రూపశ్రీ.
read moreగర్భాశయ ఆరోగ్యానికి హిస్టెరోస్కోపీ.. మీరు తెలుసుకోవలసిన పూర్తి సమాచారం!
గర్భాశయ ఆరోగ్యానికి హిస్టెరోస్కోపీ.. మీరు తెలుసుకోవలసిన పూర్తి సమాచారం! స్త్రీ ఆరోగ్యం కుటుంబానికి ఆధారం. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో చాలామంది మహిళలు గర్భాశయ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, తీవ్రమైన నొప్పి లేదా సంతానలేమి సమస్యలు ఎదురైనప్పుడు మనం ఆందోళన చెందడం సహజం. అటువంటి సమయాల్లో ఆధునిక వైద్యశాస్త్రం మనకు అందించిన ఒక గొప్ప వరమే 'హిస్టెరోస్కోపీ'. ఈ ప్రక్రియ ద్వారా గర్భాశయ సమస్యలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి, చికిత్స చేయవచ్చు. expert gynecologist Dr. Prithivi Perum చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం హిస్టెరోస్కోపీ ఎందుకు చేయించుకోవాలి? (Why should we?) గర్భాశయంలోని అంతర్గత సమస్యలను స్పష్టంగా చూడటానికి ఈ పరీక్ష ఎంతో అవసరం. ముఖ్యంగా ఈ క్రింది సందర్భాల్లో వైద్యులు దీనిని సూచిస్తారు: • ఫైబ్రాయిడ్ల తొలగింపు: గర్భాశయంలో ఉండే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్లను గుర్తించడానికి మరియు హిస్టెరోస్కోపిక్ గైడెడ్ పద్ధతిలో వాటిని తొలగించడానికి ఇది కీలకం. • హార్మోన్ల మార్పులు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కలిగే హైపర్ప్లాసియా వంటి సమస్యలను గుర్తించవచ్చు. • మెనోపాజ్ తర్వాత రక్తస్రావం: మెనోపాజ్ (ముట్లు ఉడగడం) వచ్చిన ఏడాది తర్వాత కూడా రక్తస్రావం కనిపిస్తే, అది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి హిస్టెరోస్కోపీ చేస్తారు. • రోగ నిర్ధారణ మరియు చికిత్స: ఇది కేవలం సమస్యను గుర్తించడానికే (Diagnostic) కాకుండా, అదే సమయంలో చికిత్స (Operative) చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. హిస్టెరోస్కోపీ ఎలా చేస్తారు? (How it’s done?) ఇది చాలా సులభమైన మరియు తక్కువ సమయం పట్టే ప్రక్రియ. 1. అనస్థీషియా: రోగికి ఎటువంటి నొప్పి తెలియకుండా ఉండటానికి అనస్థీషియా ఇస్తారు. 2. ప్రక్రియ: యోని (Vagina) ద్వారా గర్భాశయంలోకి ఒక చిన్న స్కోప్ను పంపిస్తారు. ఇది ఎండోస్కోపీ లేదా సిస్టోస్కోపీ వంటి పద్ధతినే పోలి ఉంటుంది. 3. పరీక్ష: గర్భాశయం లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు (Atrophic endometritis) లేదా అసాధారణ కణజాలం ఉంటే దీని ద్వారా వైద్యులు నేరుగా చూస్తారు. ఏం చేయకూడదు? (What not to do?) • లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వారు లేదా 48 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలు పీరియడ్స్ సమస్యలను లేదా కడుపులో నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. • భయపడవద్దు: ఇది చాలా కష్టమైన ఆపరేషన్ అని భయపడాల్సిన అవసరం లేదు; ఇది ఒక సులభమైన వైద్య ప్రక్రియ. • విశ్రాంతి తప్పనిసరి: చికిత్స తర్వాత వైద్యులు సూచించినంత కాలం నిశ్శబ్దంగా ఉండాలి మరియు విశ్రాంతి తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) • ప్రశ్న: ఇది చాలా నొప్పి కలిగించే ప్రక్రియనా? •సమాధానం: లేదు, అనస్థీషియా ఇవ్వడం వల్ల రోగికి ఎటువంటి ఇబ్బంది కలగదు. • ప్రశ్న: గర్భాశయంలో పెద్ద గడ్డలు (Cysts) ఉంటే ఇది పని చేస్తుందా? •సమాధానం: 10 నుండి 12 సెంటీమీటర్ల పెద్ద గడ్డలు లేదా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు కూడా పరిస్థితిని బట్టి హిస్టెరోస్కోపీ ద్వారా పరీక్ష లేదా చికిత్స చేస్తారు. • ప్రశ్న: దీని కోసం ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉండాలి? •సమాధానం: ఇది సాధారణంగా డే-కేర్ ప్రక్రియగా ఉంటుంది, కానీ చికిత్స తర్వాత కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం అవసరం. మీ ఆరోగ్యం పట్ల మీరు చూపే శ్రద్ధ మీ కుటుంబ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. గర్భాశయ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ను సంప్రదించండి. మీకు హిస్టెరోస్కోపీ గురించి ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నాయా? డాక్టర్ పృథ్వి పేరుమ్ గారు అందించిన మరిన్ని ఆరోగ్య సూత్రాలు ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్లో చూడిండి (సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreతెల్ల జుట్టు నల్లగా మారాలా.. ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్!
తెల్ల జుట్టు నల్లగా మారాలా.. ఇంట్లోనే సింపుల్ సొల్యూషన్! తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలా? మీరు తెలుసుకోవాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు మరియు నిజాలు! ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'తెల్ల జుట్టు'. అద్దంలో మొదటిసారి తెల్ల జుట్టు కనిపించినప్పుడు కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. కొంతమందికి ఇది వంశపారంపర్యంగా వస్తే, మరికొందరికి ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. అయితే, తెల్ల జుట్టు రాగానే కంగారు పడి రసాయనాలతో కూడిన డైలు వాడి జుట్టును మరింత పాడు చేసుకునే కంటే, నిపుణుల సలహాతో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మనం జుట్టు విషయంలో ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) జుట్టు కేవలం అందానికి మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసానికి కూడా గుర్తు. తెల్ల జుట్టు రావడం అనేది ఒక సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, మన శరీరంలో మెెలనిన్ పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఇది జరుగుతుంది. తెల్ల జుట్టు సాధారణ జుట్టు కంటే నాలుగు రెట్లు వేగంగా పెరుగుతుంది. అందుకే, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనం యవ్వనంగా మరియు ఉత్సాహంగా కనిపించవచ్చు. ఏమి చేయకూడదు? (What Not To Do) తెల్ల జుట్టు కనిపించగానే మనం చేసే కొన్ని తప్పులు జుట్టును మరింత దెబ్బతీస్తాయి: • జుట్టును పీకడం: తెల్ల జుట్టును పీకితే పక్కన ఉన్నవి కూడా తెల్లబడతాయనేది అపోహ మాత్రమే, కానీ అలా పీకడం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. • PPD మరియు అమ్మోనియా డైలు: పిపిడి (PPD) మరియు అమ్మోనియా ఉన్న డైలను అస్సలు వాడకూడదు. వీటివల్ల ముఖం వాపు, అలర్జీలు, చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. • బ్లాక్ హెన్నా: 'బ్లాక్ హెన్నా' అనేది సహజమైనది కాదు, ఇందులో అధిక మోతాదులో పిపిడి ఉంటుంది, ఇది జుట్టుకు చాలా హానికరం. • ఎండలో తిరగడం: హెయిర్ డై వేసుకున్న తర్వాత ఎండలో ఎక్కువగా తిరగకూడదు, ఎందుకంటే సూర్యరశ్మి బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేసి డై రంగు త్వరగా పోయేలా చేస్తుంది. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి? (How To) • సరైన డై ఎంపిక: పర్మనెంట్ డైల కంటే 'డెమీ పర్మనెంట్' (Demi-permanent) డైలు సురక్షితం. ఇవి 20 నుండి 28 వాష్ల వరకు ఉంటాయి • రూట్ టచ్-అప్స్: జుట్టు మొత్తానికి కలర్ వేయకుండా, కేవలం తెల్లబడిన కుదుళ్ల వద్ద మాత్రమే ప్రతి 4 నుండి 6 వారాలకు ఒకసారి రూట్ టచ్-అప్ చేసుకోవడం ఉత్తమం. • సహజమైన మార్గాలు: హెన్నా (గోరింటాకు), ఇండిగో, కాఫీ లేదా బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్ వంటి సహజమైన వెజిటేబుల్ డైలను ఉపయోగించడం వల్ల జుట్టుకు తక్కువ నష్టం జరుగుతుంది. • సరైన షాంపూ: సల్ఫేట్ లేని (Sulfate-free) షాంపూలను మరియు కండిషనర్లను వాడటం వల్ల జుట్టు డ్రై అవ్వకుండా ఉంటుంది. • ఆహారం మరియు విటమిన్లు: జింక్, విటమిన్ బి12, ఐరన్ (Ferritin), సెలీనియం మరియు రాగి (Copper) వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు పెరుగుదలను తగ్గించవచ్చు. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: తెల్ల జుట్టు చిన్న పిల్లల్లో కూడా రావచ్చా? జ: అవును, జన్యుపరమైన కారణాల వల్ల 9 ఏళ్ల వయసున్న పిల్లల్లో కూడా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉంది. ప్ర: తెల్ల జుట్టు నల్ల జుట్టు కంటే వేగంగా పెరుగుతుందా? జ: అవును, శరీరం మెలనిన్ ఉత్పత్తికి ఖర్చు చేసే శక్తిని ఆదా చేయడం వల్ల తెల్ల జుట్టు సాధారణ జుట్టు కంటే 4 రెట్లు వేగంగా పెరుగుతుంది. ప్ర: ఆనియన్ జ్యూస్ జుట్టు ఎదుగుదలకు పనిచేస్తుందా? జ: దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ, అలర్జీ లేని వారు వాడవచ్చు. అయితే ఇది అందరికీ ఒకేలా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. గుర్తుంచుకోండి, తెల్ల జుట్టు రావడం అనేది వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పు. దీని గురించి అతిగా ఆందోళన చెంది ఒత్తిడికి గురైతే జుట్టు మరింత తెల్లబడే అవకాశం ఉంది. మీ జుట్టును ప్రేమించండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఆరోగ్యకరమైన ఆహారం మరియు సరైన జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్ "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreకళ్ల కింద వాపు కనిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ సమస్య ఉండచ్చు!
కార్టిసాల్ ఫేస్.. ముఖం, కళ్ల కింద వాపు కనిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ సమస్య ఉండచ్చు! ముఖం అందంగా కనిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అయితే నేటికాలంలో చాలామంది ముఖం వాపు ఉండటం, కళ్ల కింద వాపు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇది చర్మ సంబంధిత సమస్య అనుకుని చాలా రకాల చర్మ ఉత్పత్తులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది చర్మ సంబంధ సమస్య కాదని, ఇది పూర్తీగా కార్టిసాల్ పేస్ సమస్య అని అంటున్నారు వైద్యులు. ఇంతకూ కార్టిసాల్ పేస్ సమస్య ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏమిటి? తెలుసుకుంటే.. కార్టిసాల్ ఫేస్.. నేటి యువత రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు. మరీ ముఖ్యంగా జంక్ ఫుడ్ను అతిగా తింటుంటారు. ఇది మంటను పెంచుతుంది, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. చదువులు లేదా ఉద్యోగాల ఒత్తిడి కూడా మనస్సు ప్రశాంతతను దెబ్బతీస్తుంది, ఇది ఒత్తిడికి దారితీస్తుంది. మనస్సు నిరంతరం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది చర్మ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిని కార్టిసాల్ ఫేస్ అని కూడా పిలుస్తారు. కార్టిసాల్ అంటే.. కార్టిసాల్ అనేది ఒత్తిడి సమయంలో శరీరంలో గణనీయంగా పెరిగే హార్మోన్. ఇది తక్కువ మొత్తంలో అవసరం అయినప్పటికీ, ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే, దాని ప్రభావాలు ముఖంపై కనిపిస్తాయి. ముఖం ఉబ్బడం, కళ్ళ కింద ఉబ్బడం, తరచుగా మొటిమలు, చర్మం నిస్తేజంగా మారడం వంటివి సాధారణ లక్షణాలు. కొన్నిసార్లు ముఖం మెరుపు కూడా మాయమవుతుంది. శరీరంపై ప్రభావం.. ఒత్తిడి ముఖం మీద మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ముఖంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ముఖం పూర్తిగా నిర్జీవంగా కనిపిస్తుంది. కార్టిసాల్ ఫేస్ ఎలా నివారించాలి.. కార్టిసాల్ ఫేస్ సమస్యను నివారించుకోవాలనుకుంటే ముందుగా నిద్రను మెరుగుపరచుకోవాలి. ప్రతిరోజూ కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా అవసరం. కొంచెం వ్యాయామం, యోగా, ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారాన్ని మెరుగుపరచుకోవడం వల్ల కార్టిసాల్ ఫేస్ ను నివారించవచ్చు. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లను ఆహారంలో చేర్చుకోవాలి. శరీరంలో టాక్సిన్లు బయటకు పంపడానికి ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. ముఖం పై వాపు లేదా మొటిమలు ఎక్కువ కాలం ఉంటే వైద్యుడిని తప్పకుండా కలవాలి. *రూపశ్రీ.
read moreచిన్నవయసులోనే పీరియడ్స్ వస్తే డేంజరా...ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం..!
చిన్నవయసులోనే పీరియడ్స్ వస్తే డేంజరా...ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం..! పీరియడ్ అనేది సహజమైన ప్రక్రియ. ప్రతి అమ్మాయి ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ దశలోకి చేరడం సహజం. భారతదేశంలో మొదటిసారి రజస్వల అయ్యే అమ్మాయిల సగటు వయస్సు 12 సంవత్సరాలు. అయితే ఈరోజుల్లో ఆడపిల్లలు 7-8 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయస్సులోనే రజస్వల కావడం ఆరోగ్యకరం కాదట. దీని వల్ల భవిష్యత్తులో స్థూలకాయం, మధుమేహం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎముకల పెరుగుదల ఆగిపోతుందట. దీని కారణంగా పిల్లల ఎత్తు సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లీ దీని గురించి పూర్తీగా తెలుసుకోవాలి. సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి కారణం. సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్, ప్రకటనలు లేదా ఫిల్మ్లను చూసే పిల్లలలో పిట్యూటరీ గ్రంధిపై చాలా ప్రభావం ఉంటుంది. ఇది హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ఆడపిల్లలో తొందరగా రజస్వల కావడానికి కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉన్నాయి. బాల్యంలో నాన్-వెజ్ లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే అమ్మాయిలకు చిన్న వయస్సులో రజస్వల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇది ఆరోగ్యానికి హానికరం. చిన్నప్పటి నుండి పిల్లలు చాలా తీపి పదార్థాలు తింటారు. అది స్వీట్లు, చాక్లెట్లు లేదా ప్యాక్డ్ ఫుడ్ ఇలా చాలా ఉంటాయి. వీటిలో ఉండే చక్కెర హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు ఆడపిల్లలు రెగ్యులర్ గా తీసుకుంటే త్వరగా రజస్వల రావచ్చు. రోజువారీ జీవితంలో సోమరితనం, చురుకుగా లేని అమ్మాయిలకు పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా 30-40 నిమిషాల పాటు ఎటువంటి శారీరక వ్యాయామం చేయని అమ్మాయిలకు నిర్ణీత వయసు కంటే ముందే రజస్వల ప్రారంభమవుతుంది. పిల్లల మీద అతిప్రేమతో చాలా రకాల ఆహారాలు వద్దనకుండా కొనిపెట్టడం వల్ల బరువు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు మరింకొంత మంది బరువు తక్కువగా ఉంటారు. వీటి వల్ల కూడా ప్రీమెచ్యూర్ పీరియడ్స్ రావడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన బరువు శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అయితే అనారోగ్యకరమైన బరువు హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది. ఇది ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి కారణం అవుతుంది. ప్రారంభ కాలాల అవకాశాలను పెంచుతుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు... *రూపశ్రీ.
read moreపరిగెత్తేటప్పుడు లెగ్గింగ్స్ లేదా షార్ట్స్ ఏవి ధరిస్తే మంచిది!
పరిగెత్తేటప్పుడు లెగ్గింగ్స్ లేదా షార్ట్స్ ఏవి ధరిస్తే మంచిది! పరుగు ఆరోగ్యానికి చాలామంచిది. చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అవగాహనతో రోజువారీ వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. అయితే చాలామంది వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి చేస్తున్నా.. వాటికి తగిన దుస్తులు ఎంపిక చేసుకోవడంలో, ధరించడంలో మాత్రం అంతగా అవగాహన కలిగి ఉండరు. అయితే ముఖ్యంగా పరిగెత్తేటప్పుడు పాదాలు చురుగ్గా ఉంటాయి. ఇలాంటి సందర్బంలో దుస్తుల వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైతే రన్నింగ్ అయినా, వాకింగ్ అయినా సరిగా చేయలేరు. ఇంతకూ రన్నింగ్ చేసేటప్పుడు లెగ్గింగ్స్ ధరించడం మంచిదా? లేదా షార్ట్స్ ధరించడం మంచిదా? తెలుసుకుంటే.. పరుగు ఆరోగ్యానికి చాలామంచిది. రోజూ కనీసం రెండు నుండి మూడు కిలోమీటర్లు అయినా రన్నింగ్ చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. రన్నింగ్ చేసేటప్పుడు ప్రోఫెషనల్ రన్నర్ లు అయితే షార్ట్స్ ధరిస్తారు. చాలామంది మహిళలు మాత్రం లెగ్గింగ్స్ ధరిస్తారు. రన్నింగ్ చేసేటప్పుడు ఏది ధరించాలి అనే విషయం తెలియని వారు మాత్రం గందరగోళంలో ఏదో ఒకటి అన్నట్టు ధరిస్తుంటారు. లెగ్గింగ్స్.. లెగ్గింగ్స్ కాళ్ల కండరాలకు బాగా సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే లెగ్గింగ్స్ సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది సాగడం కారణంగా కండరాలు సంకోచ, వ్యాకోచాలు సజావుగా జరుగుతాయి. కండరాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తాయి. ఎక్కువ దూరం పరిగెత్తినప్పుడు కాళ్ళు, ముఖ్యంగా తొడల చర్మం ఒరుసుకుని పోకుండా చేయడంలో లెగ్గింగ్స్ సహాయపడతాయి. దీని వల్ల చికాకు తగ్గుతుంది. చలికాలంలో లెగ్గింగ్స్ ధరించడం వల్ల కాళ్లు వెచ్చగా ఉంటాయి. కండరాలను చలి నుండి రక్షిస్తాయి. పరిగెత్తేటప్పుడు సౌకర్యంగా కూడా ఉంటాయి. లెగ్గింగ్స్ వేసుకున్నప్పుడు రన్నింగ్ చేయడానికే కాకుండా ముందుకు, వెనక్కు, కూర్చోవడం, లేవడం వంటి కదలికలకు కూడా బాగా సహాయపడుతుంది. చాలామంది సాధారణ జీన్స్ వంటివి వేసుకోవడం వల్ల రన్నింగ్ మాత్రమే కాకుండా చాలా కదలికలకు ఇబ్బందిగా ఉంటుంది. మంచి నాణ్యత కలిగిన లెగ్గింగ్స్ అయితే చెమటను కూడా బాగా పీల్చుకోగలుగుతాయి. తద్వారా చర్మాన్ని పొడిగా కూడా ఉంచుతాయి. నడుస్తున్నప్పుడు లేదా రన్నింగ్ చేస్తున్నప్పుడు సౌకర్యవంతంగా కూడా ఉంచుతాయి. శరీరానికి సరిగ్గా సరిపోయే లెగ్గింగ్స్ వేసుకోవడం వల్ల రన్నింగ్ చాలా సజావుగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా బరువులు ఎత్తడం, యోగా, ఎరోబిక్స్ వంటి అన్ని రకాల వ్యాయామాలకు కూడా లెగ్గింగ్స్ బాగా సెట్ అవుతాయి. సరైన లెగ్గింగ్స్ ఎలా ఎంచుకోవాలంటే.. రన్నింగ్ కోసం అయితే నైలాన్, స్పాండెక్స్ లేదా పాలిస్టర్ వంటి సింథటిక్, గాలి ప్రసరణ జరిగేలా ఉండే లెగ్గింగ్ లను ఎంచుకోవాలి. ఇవి చెమటను తొందరగా తొలగించి చర్మాన్ని పొడిగా ఇంచుతాయి. లెగ్గింగ్స్ ను ఎప్పుడూ ఎక్కువ ఎలాస్టిక్ గుణం ఉన్నవే ఎంచుకోవాలి. ఎలాస్టిక్ గుణం తక్కువ ఉన్నవి ఎంచుకుంటే అసౌకర్యాన్ని కలిగిస్తాయి. *రూపశ్రీ.
read more45 నుండి 55 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం..!
45 నుండి 55 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం..! మహిళలలో నెలసరి మొదలయ్యే దశ ఎలా ఉంటుందో.. అలాగే ముగిసే దశ కూడా ఉంటుంది. నెలసరి చక్రం పూర్తీగా ఆగిపోయే దశను మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ అంటే కేవలం పీరియడ్స్ ముగియడం అని తరచుగా అనుకుంటాము. కానీ ఇది మెదడు నిర్మాణాన్ని కూడా నిశ్శబ్దంగా మారుస్తుందని అంటున్నారు పరిశోధకులు. మెనోపాజ్ అనేది కేవలం శారీరక మార్పు కాదు.. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 45 నుండి 55ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వయసు గల వారిలోనే మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. పరిశోధనలు ఏం చెబుతున్నాయి.. మెదడు నిర్మాణంలో మార్పులు.. మెనోపాజ్ తర్వాత, మెదడులోని అనేక ముఖ్యమైన భాగాలలో 'బూడిద పదార్థం' పరిమాణం తగ్గినట్లు పరిశోధనలలో బయటపడిందని పరిశోధనా నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం.. ఆందోళన, నిరాశ, నిద్ర సమస్యల స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలలో కనుగొనబడింది. మానసిక ఆరోగ్యంపై నిద్ర ప్రభావం.. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో రుతుక్రమం ఆగిన స్త్రీల కంటే మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు ఆందోళన లేదా నిరాశ కోసం వైద్యుడిని లేదా మానసిక వైద్యుడిని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రుతువిరతి తర్వాత నిద్రలేమి, నిద్ర లేకపోవడం వంటి కంప్లైంట్ లు చాలా సాధారణం అయిపోయాయని చెబుతున్నారు. తగినంత నిద్రపోయిన తర్వాత కూడా మహిళలు ఎప్పుడూ అలసిపోతున్నట్లు, ఎంత విశ్రాంతి తీసుకున్నా, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నాశరీరం అలసటగా ఉన్నట్టు చెప్పడం గమనార్హం. HRT అంటే హార్మోన్ పునఃస్థాపన చికిత్స తీసుకునే స్త్రీలలో ఆందోళన, నిరాశ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నివేదించారు. అయితే నిశితంగా పరిశీలించినప్పుడు ఈ సమస్యలు మెనోపాజ్ ప్రారంభానికి ముందే ఉన్నాయని తేలింది. మెదడు మందగించడం, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం.. మెనోపాజ్ తర్వాత జ్ఞాపకశక్తికి, ఏదైనా నేర్చుకోవడానికి కారణమయ్యే మెదడులోని ప్రాంతాలలో అంటే హిప్పోకాంపస్ వంటి ప్రాంతాలలో బూడిద రంగు పదార్థం తగ్గుతుందని కనుగొన్నారు. వయసు పెరిగే కొద్దీ సహజంగా స్పందించే సామర్థ్యం మందగిస్తుంది, కానీ మెనోపాజ్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రభావితమైన మెదడు ప్రాంతాలు అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న ప్రాంతాల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. పురుషుల కంటే స్త్రీలలో చిత్తవైకల్యం వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని దీని కారణంగా చెబుతున్నారు. *రూపశ్రీ.
read moreబీట్రూట్ లేదా గుమ్మడి గింజలు.. వేటిలో ఐరన్ మెరుగ్గా ఉంటుంది!
బీట్రూట్ లేదా గుమ్మడి గింజలు.. వేటిలో ఐరన్ మెరుగ్గా ఉంటుంది! ఆహారంతోనే ఆరోగ్యం సాధ్యమని ఆయుర్వేదం ఎప్పుడో చెప్పింది. ఇప్పటికీ ఆరోగ్య సమస్యలకు చాలా వరకు ఆహారంతోనే పరిష్కారం చెప్పేది ఆయుర్వేదమే.. అయితే నేటికాలపు ఇంగ్లీషు వైద్య విధానం ప్రతి సమస్యకు ఒక కొత్త పేరు పెట్టి, వాటికి తగ్గ మందులను సూచిస్తుంది. కానీ మనిషి శరీరంలో ఎంతో అత్యవసర ద్రవ్యమైన రక్తం విషయంలో మాత్రం ఏ వైద్యమైనా ఆహారం ద్వారా మెరుగు పడటమే ఉత్తమం అని చెబుతుంది. మనిషి శరీరంలో రక్తం చాలా ముఖ్యమైనది. రక్తానికి రంగును, హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడేది ఐరన్. ఐరన్ వల్లే రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. పోషకాలు సరఫరా అవుతాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. సాధారణంగా ఐరన్ కోసం చాలామంది బీట్రూట్ తినమని లేదా బీట్రూట్ జ్యూస్ తాగమని చెబుతుంటారు. కానీ ఐరన్, గుమ్మడి గింజలు రెండింటిలో ఐరన్ ఉంటుంది. అయితే.. ఈ రెండింటిలో ఎందులో ఐరన్ ఎక్కువ ఉంటంది? ఈ విషయం తెలిస్తే ఐరన్ కోసం ఏది తింటే బెటర్ అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. గుమ్మడి గింజలు.. శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. దాన్ని తిరిగి భర్తీ చేయడంలో బీట్రూట్ బెస్ట్ అని అనుకుంటారు. కానీ.. పోషకాహార నిపుణులు మాత్రం దీని గురించి కొన్ని రహస్యాలు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజలలో బీట్రూట్ కంటే ఎక్కువ శాతం ఐరన్ ఉంటుందట. గుమ్మడికాయ గింజలలో 100గ్రాముల గింజలలో దాదాపు 8.8mg ల నుండి 9mg ల వరకు ఐరన్ ఉంటుంది. రోజువారీ శరీరానికి అవసరం అయిన ఐరన్ లో ఎక్కువ శాతాన్ని గుమ్మడి గింజలు భర్తీ చేయగలుగుతాయి. గుమ్మడి గింజలు ఇలా తింటే బెస్ట్.. గుమ్మడికాయ గింజలలో నాన్-హీమ్ ఐరన్ ఉంటుంది. శరీరానికి దీనిని సమర్థవంతంగా గ్రహించడానికి విటమిన్-సి అవసరం అవుతుంది. అందుకే ఈ విత్తనాలను కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ నీటితో తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మెరుగవుతుంది. బీట్రూట్.. బీట్రూట్ హిమోగ్లోబిన్ ను పెంచుతుందని అనుకుంటారు. కానీ 100గ్రాముల బీట్రూట్ లో కేవలం 0.8mg ఐరన్ మాత్రమే ఉంటుంది. అందుకే గుమ్మడికాయ విత్తనాల కంటే బీట్రూట్ లో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. *రూపశ్రీ.
read more30ఏళ్లు నిండిన ప్రతి మహిళ చేయించుకోవాల్సిన పరీక్షలు.. ఇవి ఎంత ముఖ్యమంటే..!
30ఏళ్లు నిండిన ప్రతి మహిళ చేయించుకోవాల్సిన పరీక్షలు.. ఇవి ఎంత ముఖ్యమంటే..! మహిళల శరీరం ప్రతి దశలో చాలా మార్పులకు లోనవుతూ ఉంటుంది. రుతుచక్రం మొదలైన దగ్గర నుండి వివాహం, ప్రసవం, మెనోపాజ్.. ఇలా చాలా దశలలో మహిళల శరీరం కుదుపులకు లోనవుతూ ఉంటుంది. అంతేకాదు.. ఇలా దశలు మారుతున్నప్పుడు చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. 30ఏళ్లు నిండిన ప్రతి మహిళ కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వీటిని చేయించుకోవడం వల్ల శరీరంలో ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి, వాటికి తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇంతకీ 30ఏళ్లు నిండిన మహిళలు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటో తెలుసుకుంటే.. CBC టెస్ట్.. ఇది కంప్లీట్ బ్లట్ కౌంట్ టెస్ట్. ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉందో లేదో తెలుసుకోవచ్చు. భారతదేశంలో 80శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించి ఆరోగ్యంగా మారడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్న మహిళలలో అలసట, బలహీనత వంటి సమస్యలు ఉంటాయి. చికిత్స తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా.. బలహీనత, అలసట వంటివి కూడా తగ్గుతాయి. బ్లడ్ షుగర్ టెస్ట్.. నేటికాలంలో మధుమేహం చాలా చిన్న వయులోనే వస్తోంది. డయాబెటిస్ వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించడం వల్ల దాన్ని రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ముందుగానే ఈ పరీక్ష చేయించుకుంటే చాలా జాగ్రత్త పడవచ్చు. థైరాయిడ్ టెస్ట్.. చాలా మంది మహిళలు అసాధారణంగా బరువు పెరగడం, బరువు తగ్గడం వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే జుట్టు బాగా రాలిపోవడం, అలసట, నెలసరి సమస్యలు ఎదురుకావడం వంటివి కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇవన్నీ థైరాయిడ్ వల్ల ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసినా, సరిగా పనిచేయకపోయినా కూడా శరీరంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. లిపిడ్ ప్రోపైల్.. (కొలెస్ట్రాల్ టెస్ట్).. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలు తెలుసుకోవడానికి లిపిడ్ ప్రోపైల్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. పాప్ స్మియర్ టెస్ట.. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ముఖ్యమైనది. ఇది చాలా ప్రమాదమైనది. దీన్నే సర్వై కల్ క్యాన్సర్ అంటారు. 30ఏళ్లు దాటిన మహిళలు ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, పెల్విస్.. మహిళలలో గర్భధారణ సమస్యలు, రక్తహీనత, నెలసరి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, పెల్విన్ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలను అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకోవడం మంచిది. ఇది పైబ్రాయిడ్స్, సిస్ట్స్, పిసిఓయస్, గర్భాశయం, అండాశయాల ఆరోగ్యం మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్-డి, విటమిన్-బి-12.. మహిళలలో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, నరాల సమస్యలు లేకుండా బాగుండాలన్నా, అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి లేకుండా ఉండాలన్నా విటమిన్-డి, విటమిన్-బి12 చాలాముఖ్యం. ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా విటమిన్ లోపాలు తెలుసుకుని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు. రక్తపోటు.. బీపి.. చాలామంది చిన్న వయసులోనే హై బీపితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే హై బీపి అనేది ఒకేసారి బయట పడదు. అందుకే అప్పుడప్పుడు బీపి చెక్ చేయించుకుంటూ ఉంటే దాని స్థాయులను బట్టి ఆహార జాగ్రత్తల ద్వారా బీపి కి చెక్ పెట్టవచ్చు. బరువు, బిఎంఐ.. నేటికాలంలో డయాబెటిస్, పిసిఓయస్ వంటి సమస్యలు రావడానికి అధికబరువు కారణం అవుతుంది. అందుకే ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. దీనికోసం బిఎంఐ టెస్ట్ బాగా సహాయపడుతుంది. అలాగే అప్పుడప్పుడు బరువును చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్రెస్ట్ పరీక్ష.. మహిళలు ఎదుర్కునే క్యాన్సర్ లలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ముఖ్యమైనది. బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుని, తర్వాత సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం మంచిది. ఇది బ్లెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడానికి సహాయపడుతుంది. పై పరీక్షలను ఏడాదికి ఒకసారి లేదా 2ఏళ్లకు ఒకసారి చేయించుకోవడం వల్ల మహిళల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. *రూపశ్రీ.
read moreశీతాకాలంలో ఉదయాన్నే వాకింగ్.. ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది!
శీతాకాలంలో ఉదయాన్నే వాకింగ్.. ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది! వాకింగ్ ఆరోగ్యానికి చాలామంచిది. వేసవికాలంలో అయినా, శీతాకాలంలో అయినా వాకింగ్ చేయడానికి మంచి వాతావారణం ఉండాలని అనుకుంటాం. అయితే ప్రతి ఏడాది ఎండలు అయినా, చలి అయినా విపరీతంగా పెరుగుతూ వస్తోంది. దీని కారణంగా చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఉదయాన్నే వాకింగ్ చేయడం మంచిదే అయినా చలికాలంలో విపరీతమైన చలి, పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఉదయం పూట వాకింగ్ ప్రమాదాలు కూడా కలిగించే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో ఉదయాన్నే వాకింగ్ చేయడం గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుంటే.. చలికాలంలో వాకింగ్.. మహిళకు మంచిదా? ఎముకలు, కండరాల సాంద్రత, బలం వంటివి మగవారితో పోలిస్తే ఆడవారిలో చాలా తక్కువ. మహిళలు చాలా వరకు పోషకాలు, ప్రోటీన్ లోపాన్ని, కాల్షియం లోపాన్ని ఎదుర్కుంటూ ఉంటారు. చలికాలంలో చలి కారణంగా ఎముకలు, కండరాల పనితీరు మారుతుంది. చలికి ఎముకలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. దీని వల్ల కీళ్లు, కండరాల నొప్పులు వంటివి దారుణంగా ఎదుర్కుంటూ ఉంటారు. మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా చలికాలంలో ఉదయం వాకింగ్ అంత సేప్ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వాకింగ్ ఎందుకు వద్దు.. తీవ్రమైన చలిలో ఉదయాన్నే బయటకు వెళ్లడం వల్ల కోల్డ్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు, మహిళలు, వృద్దులు సూర్యోదయం తర్వాత మాత్రమే బయటకు వెళ్లడం మంచిది. శీతాకాలంలో సాధారణ రోజుల కంటే ఎక్కువగా కాలుష్యం ఉంటుంది. అది కూడా భూమికి దగ్గరగా ఉంటుంది. పొగమంచులో కాలుష్యం చిక్కుకుని ఉంటుంది. తెల్లవారుజామున వాకింగ్ వెళ్లడం వల్ల కలుషిత గాలి ఊపిరితిత్తులలోకి లోతుగా చేరే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి ఊపిరితిత్తుల, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాకింగ్ కు సరైన సమయం.. చలికాలంలో వాకింగ్ చేయాలంటే ఉదయం 5 లేదా 6 గంటలకు బయటకు వెళ్లడం సరికాదు. సూర్యుడి కిరణాలు బాగా ప్రసరించే సమయంలో వాకింగ్ కు వెళ్లడం ఉత్తమం. ఉదయం పూట సుమారు 8 నుండి 9 గంటల మధ్య వాకింగ్ చేయడం మంచిది. దీని వల్ల శరీరానికి విటమిన్-డి కూడా అందుతుంది. శరీర ఉష్టోగ్రత బాలెన్స్డ్ గా ఉంటుంది. వాకింగ్ కు ప్రత్యామ్నాయం.. సాధారణంగా మహిళలకు ఉదయం సమయంలో ఇంటి పనులు అంటూ చాలా ఉంటాయి. ఈ కారణంగా వాకింగ్ అనేది కుదరదు. అలాంటి వారు యోగా, స్ట్రెచింగ్, ఇంట్లోనే స్పాట్ రన్నింగ్ వంటివి చేయవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగై శరీర ఉష్ణోగ్రత బాగుంటుంది. పైగా మహిళలు వంట పనితో పాటు ఇంట్లో పనులన్నీ చేసుకోవడం కోసం నీటిలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కాబట్టి వారి ఉష్ణోగ్రత బాలెన్స్డ్ గా ఉండటం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
read more






















