బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినే అలవాటు ఉందా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
నేటి బిజీ జీవితాలలో బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా మంది ఆలోచలో పడిపోతారు. ఉద్యోగాలకు వెళ్లేవారు పిల్లలను స్కూల్ కు పంపేవారు ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నానికి లంచ్ రెండూ తయారు చేయడం అంటే కాస్త కష్టమే. పైగా తల్లి కూడా ఉద్యగస్తురాలు అయితే ఇక వంట చేయడం దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. చాలా మంది సులువైన పరిష్కారాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వాటిలో బ్రెడ్ కూడా ఒకటి. ఉదయాన్నే బ్రెడ్ కు కాస్త జామ్ రాస్ శాండ్విచ్ తయారు చేస్తే ఇంటిల్లిపాదీ ఈజీగా బ్రేక్పాస్ట్ చేసేయవచ్చు. అయితే ఇలా అల్పాహారంగా ప్రతి రోజూ బ్రెడ్ తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలామంది ఆలోచన చేయరు. దీని గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే.. బ్రెడ్లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, ప్రిజర్వేటివ్లు శరీర జీవక్రియను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది మద్యం తాగకపోయినా వారి శరీరంలో ఆల్కహాల్ ఏర్పడటం ప్రారంభమవుతుందట. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ABS) లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వైద్య పరిస్థితి. ఈ స్థితిల, ఒక వ్యక్తి కడుపు లేదా ప్రేగులలో ఉండే కొన్ని రకాల ఈస్ట్ (ఫంగస్) శరీరంలోకి తీసుకున్న కార్బోహైడ్రేట్లను బ్రెడ్, బియ్యం లేదా స్వీట్లు వంటివి - కిణ్వ ప్రక్రియకు గురిచేసి ఆల్కహాల్గా మారుస్తాయి. ఫలితంగా ఒక వ్యక్తి మద్యం తాగకపోయినా, తలతిరగడం, అలసట, గందరగోళం వంటి మత్తు లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే అది క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందట. బ్రెడ్ వల్ల సమస్య ఎందుకు? బ్రెడ్ తయారీలో ఉపయోగించే శుద్ధి చేసిన పిండి, ప్రిజర్వేటివ్స్, అధిక సోడియం కంటెంట్ జీర్ణక్రియను బలహీనపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. బ్రెడ్ లో పోషకాలు లోపిస్తాయి, దీని కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఏమీ అందవు. ఎవరు తినకూడదు.. డయాబెటిస్, రక్తపోటు లేదా థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా బ్రెడ్ తినకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి, ఇది క్రమంగా 'స్లో పాయిజన్' లాగా పనిచేస్తుంది. బ్రెడ్ బదులు ఏం తినవచ్చంటే.. రోజువారీ బ్రెడ్ కు బదులుగా మల్టీగ్రెయిన్ రోటీ, ఓట్స్ ఉప్మా, క్వినోవా, శనగపిండి చీలా లేదా దోశ లేదా ఇంట్లో తయారుచేసిన ఫ్రూట్ స్మూతీ వంటివి ఎంచుకోవచ్చు. అవి పోషకమైనవి మాత్రమే కాదు, సులభంగా జీర్ణమవుతాయి, రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreకాలేయం దెబ్బ తింటే కనిపించే లక్షణాలు ఇవే..!
కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది కలుషితమైతే శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. జీవన శైలి సరిగా లేకపోవడం, ఆహారం తీసుకునే విధానం సరిగా లేకపోవడం. ఆరోగ్యకర ఆహారం తీసుకోకపోవడం వంటివి లివర్ పాడవడానికి కారణం అవుతాయి. ఎక్కువ కొవ్వు పదార్థాలు, బేకరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాలేయం దెబ్బ తింటే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకుంటే.. కాలేయం దెబ్బతిన్నప్పుడు, కాలేయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు శరీరంలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం. అంటే తరచుగా కామెర్ల వ్యాధి రావడం. తగ్గిపోయిన కొన్ని రోజులకే కామెర్ల వ్యాధి మళ్లీ వస్తుంటే కాలేయం పనితీరు మందగించిందని అర్థం. దీని వల్ల కాలేయం దెబ్బ తిన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కాలేయంలో ఏదైనా సమస్య ఉన్నా, లేదా కాలేయం దెబ్బ తిన్నా అలాంటి వ్యక్తులు సాధారణ వ్యక్తులతో పోలిస్తే బాగా అలసటగా కనిపిస్తుంటారు. వీరు ఎప్పుడూ అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. కడుపులో వాపు లేదా నొప్పి ఉన్నా కాలేయం దెబ్బ తిన్నదని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కడుపులో కుడి వైపు ఎగువ భాగంలో నొప్పిగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే ఆకలి అనిపించదు. లేదా అసలు ఆకలి వేయదు. ఏమీ తినాలని కూడా అనిపించదు. అంతేకాదు.. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. తరచుగా వికారం, వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాలేయ సమస్యలు ఉన్నవారికి మల విసర్జన ద్వారా కూడా సంకేతం వస్తుంది. మల విసర్జనకు వెళ్లినప్పుడు మలం రంగులో మార్పులు ఉంటాయి. మలం బురద నలుపు రంగులో ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్టు అర్థం చేసుకోవచ్చు. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreగుల్కంద్తో మలబద్దకం సమస్యలు పరార్!
మలబద్దకం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఆహారం ఎలాంటి సంకోచం లేకుండా హాయిగా తినాలంటే తిన్న ఆహారం బాగా జీర్ణమై ఆహారపు వ్యర్థాలు మలం రూపంలో అంతే సాఫీగా బయటకు వెళ్లిపోవాలి. కానీ కొందరిలో మలవిసర్జన సాఫీగా జరగదు. ఈ విషయం గురించి ఎవరితో అయినా మాట్లాడటమే కాదు.. కనీసం వైద్యుల దగ్గరకు వెళ్లాలన్నా కూడా సంకోచిస్తారు చాలామంది. అయితే మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఈజీ మలబద్దకాన్ని తగ్గించుకోవడానికి మంచి సువాసన కలిగిన గులాబీ రేకలు బాగా సహాయపడతాయి. గులాబీ పువ్వును సాధారణంగా అలంకరణ కోసం, పూజ కోసం మాత్రమే వాడుతుంటారు. కొందరు వంటకాలలో వాడినప్పటికి అవన్నీ కేవలం సువాసన కోసమే ఉపయోగిస్తారు. గులాబీ కడుపు సంబంధ సమస్యలనే కాకుండా మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. పొట్టలో యాసిడ్ లు ఎక్కువ ఉత్పత్తి అయ్యే సమస్యకు ఇది చెక్ పెడుతుంది. గులాబీ రేకలతో గుల్కండ్ తయారు చేసి తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గుతుంది. గుల్కండ్ ను ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. గుల్కంద్ తయారీకి కావలసిన పదార్థాలు.. నాటీ గులాబీ రేకలు.. చక్కెర.. తేనె.. నల్ల మిరియాలు.. పచ్చి ఏలకులు.. తయారీ విధానం.. గులాబీ రేకులను ఒక రోటిలో వేసి బాగా నూరాలి. ఇందులోనే పంచదార, తర్వాత తేనె కూడా కలపాలి. రుచి కోసం కాస్త నల్ల మిరియాలు వేసి బాగా రుబ్బుకోవాలి. ఇందులో కాస్త యాలకులు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి ఎండలో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. కానీ మలబద్దకం ఉన్నవారికి, ప్రేగు శోథ సమస్యలు ఉన్నవారికి ఇది గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది కడుపు సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. మరొక విషయం ఏమిటంటే.. ఈ గుల్కండ్ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవేసవికాలంలో శరీరం చల్లగా శక్తివంతంగా ఉండాలని అందరూ అనుకుంటారు.
వేసవికాలంలో శరీరం చల్లగా శక్తివంతంగా ఉండాలని అందరూ అనుకుంటారు. అయితే వేసవి వేడి దెబ్బకు చాలా తొందరగా నీరసం వస్తుంది. అదే విధంగా ఎంత చల్లగా ఉన్న పానీయాలు తాగితే కొద్దిసేపు మాత్రమే శరీరానికి ఊరట లభిస్తుంది. అదే శరీరానికి రోజంతా మంచి శక్తిని ఇస్తూ మరొకవైపు శరీరాన్ని చల్లగా ఉంచే పానీయం తాగితే భలే ఉంటుంది. ఇలాంటి పానీయాల కోవకు చెందినదే సత్తు పానీయం. ఇది ప్రధానంగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఫేమస్ పానీయం. అయినా సరే దీని శక్తి, దీని ప్రయోజనాలు తెలిసి దేశ వ్యాప్తంగా విస్తృతంగా తాగుతారు. బయట మార్కెట్లో కూడా సత్తు పొడి లభిస్తుంది. కానీ ఇందులో కల్తీ ఉండవచ్చు. అందుకే ఇంట్లోనే సత్తు పొడిని ఈజీగా చేసుకుని తాగవచ్చు. అదెలాగో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. వేయించిన శనగపప్పు( లేదా సాధారణ శనగపప్పు).. 500గ్రాములు. బార్లీ.. 500 గ్రాములు. వాము.. 1 టీస్పూన్ నల్ల ఉప్పు.. 1 టీస్పూన్. తయారు విధానం.. సాధారణ శనగపప్పును తీసుకుని బాగా కడగాలి. కడిగిన శనగపప్పును 2 గంటల సేపు నీటిలో నానబెట్టాలి. తరువాత నీటి నుండి తీసివేసి శుభ్రమైన గుడ్డ మీద తడి పోయేవరకు ఆరబెట్టాలి. తేమ పోయిన తరువాత ఈ శనగలను ఒక పాన్ లో వేసి సన్నని మంట మీద బాగా వేయించాలి. ఇవి మాడిపోకుండా జాగ్రత్త పడాలి. వేయించిన శనగలను చల్లారిన తరువాత మిక్సీ లో పిండి పట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా వద్దు చేయలేము అనుకుంటే మార్కెట్ లో దొరికే వేయించిన శనగపప్పు ను తీసుకుని పిండి చేసుకోవచ్చు. ఈ పిండిలోనే వాము, నల్ల ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బార్లీ గింజలను కూడా బాగా వేయించి వాటిని పొడి చేసుకుని సత్తు పొడిలో మిక్స్ చేసుకోవాలి. ఈ సత్తు పొడిని ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకునే ఈ సత్తు పొడి 2-3 నెలలు సులభంగా ఉపయోగించవచ్చు. దీన్ని కేవలం సత్తు పానీయంలోకి మాత్రమే కాకుండా.. సత్తు షర్బత్, పరాఠాలు, సమోసా వంటి వాటిలో స్ఠఫింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ వేసవి కాలంలో సత్తు పానీయాన్ని తాగి బయటకు వెళితే శరీరానికి వడదెబ్బ తగలకుండా రక్షణగా ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవెరికోస్ వెయిన్స్.. ఇలా చేస్తే నరాల సమస్యలు రావు..!
నరాల ఉబ్బరం అనేది ప్రతిరోజూ ఎవరో ఒకరు బాధపడే ఒక సాధారణ సమస్య. నరాల ఉబ్బరం నరాల సమస్య కాదు కానీ కండరాల తిమ్మిరి వల్ల వస్తుందట. ఈ సమస్య క్రమంగా నయమవుతుంది. చాలా మంది రాత్రిపూట ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. దీనిలో కండరాలు అకస్మాత్తుగా బిగుతుగా మారడం లేదా సాగదీయడం జరుగుతుంది. దీనివల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సమస్య తరచుగా కాళ్ళు, చేతులు లేదా వీపులో సంభవిస్తుంది. కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. సాధారణంగా ఇది తీవ్రమైన సమస్య కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే, అది దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వెరికోస్ వెయిన్స్ కు చికిత్స ఏమిటి? కొంచెం శ్రద్ధ, సరైన జీవనశైలి, సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. వెరికోస్ వెయిన్స్ కారణాలు, దానిని నివారించే మార్గాలను తెలుసుకుంటే.. నీటి కొరత.. నీరు లేకపోవడం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ సమస్య వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. రోజుకు రెండు నుండి మూడు లీటర్ల నీరు తాగకపోతే రాత్రిపూట ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుందట. గర్భధారణ సమయంలో.. గర్భధారణ సమయంలో కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. దీనితో పాటు డయాలసిస్ రోగులకు కండరాల తిమ్మిరి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందట. డయాలసిస్ రోగులలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అధిక హెచ్చుతగ్గుల కారణంగా ఈ సమస్య సంభవిస్తుందట. విటమిన్లు లేకపోవడం.. విటమిన్ లోపాలు ఉన్నవారు.. ముఖ్యంగా విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లోపాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. ఉపశమనం ఎలా.. ఎవరికైనా ఈ సమస్య ఎక్కువగా ఉంటే, ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్య ఎక్కువగా బాధపెడితే, పైన పేర్కొన్న కారణాలపై శ్రద్ధ వహించాలని డాక్టర్లు చెబుతున్నారు. వీటిలో ఏవైనా ఉంటే, పరీక్షించుకోవాలి. శరీరంలో విటమిన్ల లోపం ఉంటే, దానిని ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీర్చుకోవాలి. శరీరంలో విటమిన్ల లోపం ఉంటే ఆహారంపై శ్రద్ధ వహించాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆహారంలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి. ఇది కాకుండా రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనాణ్యమైన నిద్రకు ఆటంకం కలిగించే నాలుగు తప్పులు ఇవి ..!
శరీరం, మెదడు తో పాటు మిగిలిన భాగాలకు నిద్ర అవసరమని చాలా మందికి తెలుసు. కానీ నిద్ర బరువును, ఆలోచనా శక్తి, రోగనిరోధక శక్తితో పాటు అనేక రకాల హార్మోన్లు మొదలైన వాటిని కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు. తక్కువ నిద్రపోతే లేదా నాణ్యత లేని నిద్ర వస్తే, అది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వీటిలో మధుమేహం, ఊబకాయం, నిరాశ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయి. నిద్రలేమికి అనేక కారణాలు ఉండవచ్చు. మంచి నిద్రకు ఆటంకం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని అధిగమిస్తే.. నాణ్యమైన నిద్రను పొందడం సాధ్యమవుతుంది. టీ, కాఫీలు తాగే సమయం.. భారతదేశంలో ప్రతి వీధిలో టీ ప్రియులు, కాఫీ ప్రియులు బోలెడు కనిపిస్తారు. ఇంట్లో కూడా రోజుకు కప్పుల కొద్ది కాఫీ, టీ తాగే వారు ఉంటారు. కానీ ఈ రెండు పానీయాల వినియోగ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత కాఫీ, సాయంత్రం 5 గంటల తర్వాత టీ తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇది నిద్ర మీద చాలా దారుణ ప్రభావం చూపిస్తుందట. మద్యం.. మద్యం తాగడం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. మద్యం తాగడం వల్ల బాగా నిద్రపడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ మద్యం తాగడం వల్ల త్వరగా నిద్ర వదిలిపోతుందట. నిద్ర నాణ్యత తగ్గిపోతుందట. నిద్ర.. తరచుగా ఉదయం చాలా త్వరగా నిద్రలేవడం వల్ల మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో నిద్ర పోవడం కొందరి అలవాటు. దీని కారణంగా చాలా మంది 1 లేదా 1.5 గంటలు నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి మద్యాహ్నం పడుకుంటే కేవలం అరగంట లోపే ఈ సమయాన్ని పరిమితం చేయాలట. 7-9 గంటల నిద్ర.. నిద్ర అవసరం వయస్సు మీద ఆధారపడి ఉన్నప్పటికీ ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి 7-9 గంటలు నిద్రపోవడం మంచిదట. 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతే అది చిరాకును పెంచుతుందని అంటున్నారు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరోజూ గుప్పెడు వేయించిన శనగలు బెల్లం కలిపి తింటే ఏమవుతుందంటే..!
వేసవి కాలం సాధారణ కాలం కంటే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఎండల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, ఎలక్ట్రోలైట్లు కోల్పోవడం, నీరసం, అలసట వంటివి ఎదురవుతూ ఉంటాయి. వీటి కారణంగా శరీరం బాగా బలహీనంగా అనిపిస్తుంది. అలా కాకుండా రోజంతా శరీరం శక్తితో ఉండాలంటే గుప్పెడు వేయించిన శనగలు, బెల్లం తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు. అసలు రోజూ ఒక గుప్పెడు శనగలు బెల్లంతో కలిపి తింటే ఏం జరుగుతుంది తెలుసుకుంటే.. బెల్లం, వేయించిన శనగల కలయిక పోషకాలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలు కలిసి శరీరానికి ఐరన్, ఫైబర్, ప్రోటీన్ తో పాటు అనేక ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి. ఇవి శక్తిని అందించడమే కాకుండా జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి. ఎటువంటి భారీ ఆహారం తీసుకోకుండా శరీరం ఫిట్గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతిరోజూ ఒక గుప్పెడు బెల్లం, వేయించిన శనగలు తినాలి. బెల్లం శరీరానికి ఐరన్, యాంటీఆక్సిడెంట్లను అందించే సహజ స్వీటెనర్. శనగలలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ కలిస్తే రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా గొప్పగా సహాయపడే స్నాక్ అవుతుంది. బెల్లంలో ఉండే పొటాషియం, శనగలలో ఉండే ఫైబర్ కలిసి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి . ఇది గుండెపై భారాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. పగటిపూట త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తే లేదా శక్తి లేకపోయినట్టు అనిపిస్తే, బెల్లం, వేయించిన శనగలు దివ్యౌషధం గా పనిచేస్తాయి. బెల్లం శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది, శనగలు కండరాలను బలపరుస్తుంది. శనగపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది, బరువును నిర్వహించడం సులభం చేస్తుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నెలసరి సమయంలో బలహీనత, అలసటతో పోరాడటానికి సహాయపడుతుంది. శనగపప్పు హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreడయాబెటిస్ ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా..!
వేసవి కాలం వచ్చిందంటే పండ్ల రసాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. శరీరాన్ని చల్లబరిచి శరీరానికి శక్తిని ఇవ్వడం పండ్ల రసాల ప్రత్యేకత. అయితే బయటకు వెళ్లినప్పుడు చాలా మంది ఎంచుకునే వాటిలో కొబ్బరి నీరు.. దాని తరువాత చెరకు రసం మొదటి వరుసలో ఉంటాయి. చెరకు రసం శరీరానికి చలువ చేస్తుంది. శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తుంది. వేసవి వేడి ప్రభావానికి గురి కాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. అయితే చెరకు రసం తియ్యగా ఉంటుంది కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దాన్ని తాగవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. డయాబెటిస్ లో రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండాలి. ఇలా నియంత్రణలో ఉంచగలిగే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాంటి పానీయాలనే తాగాలి అని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు. చెరకు రసం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఈ కారణంగానే చాలామంది బయటకు వెళ్లినప్పుడు అలసటగా అనిపించగానే చెరకు రసం తాగుతూ ఉంటారు. దీని వల్ల శరీరం వేగంగా రీచార్జ్ కావడమే కాకుండా శరీరం హైడ్రేట్ గా కూడా ఉంటుంది. అందుకే చెరకు రసం ఆరోగ్యానికి మంచిదిగా పరిగణిస్తారు. చెరకు రసంలో ప్రధానంగా సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి కూడా చాలా ఎక్కువ మోతాదులోనే ఉంటాయి. చెరకు రసాన్ని తాగినప్పుడు ఇందులోని సహజ చెక్కరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ప్రతి ఆహార పదార్థంలో ఉన్న చక్కెర శాతాన్ని గ్లైసెమిక్ సూచిక ద్వారా కొలుస్తారు. చెరకు రసంలో ఉన్న గ్లైసెమిక్ సూచిక కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలా గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉన్న పదార్థాలు రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. మధుమేహం ఉన్నవారు చెరకు రసాన్ని తాగాలి అంటే మొదట వారి రక్తంలో చక్కెర స్థాయిల పరిమాణాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చక్కెర స్థాయిలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంటే పర్వాలేదు. కానీ చక్కెర స్థాయిలు అప్పటికే ఎక్కువగా ఉన్నవారు పొరపాటున కూడా చెరకు రసం తాగకూడదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వేగంగా పెంచుతుంది. దీని వల్ల ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. వైద్యుల సిఫారసు లేకుండా చెరకు రసం తాగడం మంచిది కాదు. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreసగ్గుబియ్యం ఉపయోగాలు తెలుసా?
తెలుగు రాష్ట్రాలలో చాలామందికి సగ్గు బియ్యం ఒడియాలు పెడతారు అని మాత్రమే తెలుసు. సోషల్ మీడియా కారణంగా సగ్గుబియ్యంతో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తారని కూడా చూసే ఉంటారు. కానీ ఇతర రాష్ట్రాలలో సగ్గుబియ్యాన్ని చాలా ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా ఉపవాసాల సమయంలో సగ్గుబియ్యాన్ని చేర్చుకుంటారు. అయితే సగ్గుబియ్యం ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. సగ్గు బియ్యం కిచిడి, సగ్గుబియ్యం పాయసం, సగ్గు బియ్యం ఒడియాలు.. సగ్గుబియ్యం చాట్.. ఇలా చాలా రకాలుగా ఉపయోగించే సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. సగ్గుబియ్యంలో ఉండే పోషకాలు ఏంటి? సగ్గుబియ్యం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. సగ్గుబియ్యం మంచి ఎనర్జీని ఇస్తుంది. అంతే కాదు.. ఇందులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. సగ్గుబియ్యంలో పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు శరీరాన్ని ఆవరించిన అలసట, బలహీనత మొదలైనవి తొలగిపోతాయి. సగ్గుబియ్యంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. బలహీనమైన పేగు ఆరోగ్యం ఉన్నవారు సగ్గుబియ్యం తింటే పేగు ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రోటీన్ పరంగా చూస్తే సగ్గుబియ్యంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది కండరాల మరమ్మత్తుకు, కండరాలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అందుకే ప్రోటీన్ తీసుకోవాలి అనుకునే వారు ఆహారంలో సగ్గుబియ్యం ను చేర్చుకోవచ్చు. చాలా సన్నగా ఉన్నవారు ఆరోగ్యకరమైన మార్గంలో బరువు పెరగాలని అనుకుంటే అందుకు సగ్గుబియ్యం బాగా సహాయపడతుంది. సగ్గుబియ్యంలో ఉండే ప్రోటీన్, కార్బోహేడ్రేట్స్, పోషకాలు ఆరోగ్యంగా బరువు పెరగడంలో సహాయపడతాయి. సగ్గుబియ్యంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారు సగ్గుబియ్యాన్ని తీసుకుంటే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. సగ్గుబియ్యంలో ఐరన్ కంటెంట్, ఫోలేట్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. గర్భవతులు సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల కడుపులో పిండం అబివృద్ది ఆరోగ్యకరంగా జరుగుతుంది. ఇది రక్తహీనత వంటి రక్తలోపం సమస్య ఉన్నవారికి కూడా మంచిది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరోగనిరోధక శక్తిని పెంచే టాప్ 7 టిప్స్ ఇవే..!
బలమైన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటేనే ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. కానీ నేటి కాలంలో జీవనశైలి, అంటువ్యాధుల ప్రమాదం పెరగడం, తీసుకునే ఆహారంలో నాణ్యత లోపించడం వంటి కారణాల వల్ల చాలామందికి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా కోవిడ్-19 తరువాత చాలా మంది రోగనిరోధక శక్తి బలహీనంగా మారింది. అయితే ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, ఆరోగ్యం దృఢం చేసుకోవాలని ట్రై చేసేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారికోసం ఇమ్యూనిటీని పెంచే టాప్ 7 టిప్స్ ఇక్కడ ఉన్నాయి. తెలుసుకోండి మరి.. పోషకాలు అధికంగా ఉండే ఆహారం.. సమతుల్య ఆహారం రోగనిరోధక ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. విటమిన్ సి: సిట్రస్ పండ్లు, బెల్ పెప్పర్స్, స్ట్రాబెర్రీలలో లభిస్తుంది, ఇది రోగనిరోధక కణాల పనితీరును పెంచుతుంది మరియు వాపును తగ్గిస్తుంది. విటమిన్ డి: విటమిన్ డి లోపం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం పెరుగుతుంది . సూర్యరశ్మికి గురికావడం మరియు కొవ్వు చేపలు మరియు బలవర్థకమైన పాల ఉత్పత్తులు వంటి ఆహారాలు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. జింక్: గింజలు, చిక్కుళ్ళలో లభించే ఈ ఖనిజం రోగనిరోధక కణాల కార్యకలాపాలకు మరియు గాయం నయం కావడానికి మద్దతు ఇస్తుంది. ప్రోబయోటిక్స్: పెరుగు, కిమ్చి, ఇడ్లీ, దోస వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, ఇది రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యమైనది. నాణ్యమైన నిద్ర.. రోగనిరోధక నియంత్రణకు నిద్ర చాలా కీలకం. దీర్ఘకాలిక నిద్ర లేమి వాపును పెంచుతుంది, రక్షిత సైటోకిన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రాత్రికి 7–9 గంటలు నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. శారీరక శ్రమ.. మితమైన వ్యాయామం రోగనిరోధక కణాల ప్రసరణను పెంచుతుంది. శరీరం వ్యాధికారకాలను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడటానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అధిక వ్యాయామం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. వారానికి 150 నిమిషాల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి.. దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. రోగనిరోధక పనితీరును అణిచివేస్తుంది, వాపుకు దారితీస్తుంది. ఒత్తిడిని నిర్వహించడానికి మైండ్ఫుల్నెస్ ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు, ప్రకృతిలో సమయం గడపడం, అభిరుచులు, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ఉత్తమమైనవి. ఒత్తిడిని తగ్గించడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. హైడ్రేటెడ్.. శరీరం నుండి పోషకాలను రవాణా చేయడానికి, విషాన్ని తొలగించడానికి నీరు చాలా అవసరం. శరీరం అంతటా రోగనిరోధక కణాలను తీసుకువెళ్ళే శోషరస ఉత్పత్తిని ప్రభావితం చేయడం ద్వారా డీహేడ్రేషన్ రోగనిరోధక పనితీరును దెబ్బతీస్తుంది . వాతావరణాన్ని బట్టి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. హెర్బల్ టీలు, పుచ్చకాయ వంటి నీటితో కూడిన పండ్లు కూడా హైడ్రేషన్ను నిర్వహించడానికి సహాయపడతాయి. పరిశుభ్రత, టీకాలు వేయడం.. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సరైన పరిశుభ్రత పాటించడం, టీకాలు వేయించుకోవడం ముఖ్యం. చేతులు కడుక్కోవడం: సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం వల్ల వైరస్లు, బ్యాక్టీరియా వ్యాప్తి తగ్గుతుంది. టీకాలు: టీకాలు శరీరానికి నిర్దిష్ట వ్యాధికారకాలను గుర్తించి పోరాడటానికి శిక్షణ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. ధూమపానం, మద్యం .. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీసి రోగనిరోధక కణాలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యం తగ్గుతుంది. ధూమపానం, మద్యం సేవించడం మానేయడం వల్ల రోగనిరోధక పనితీరు మొత్తం ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఆహారం తినేటప్పుడు ఈ పనులు చేస్తే బలంగా ఉంటారు..!
ఆయుర్వేదం భారతదేశంలోని ఒక పురాతన వైద్య విధానం. దీనిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చాలా మార్గాలు, అన్ని వ్యాధులను వాటి మూలాల నుండి నిర్మూలించడానికి తీసుకునే చర్యలు క్షుణ్ణంగా వివరించబడి ఉన్నాయి. ఆహారం తినడానికి సరైన పద్ధతులు కూడా ఆయుర్వేదంలో వివరించబడ్డాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఆయుర్వేదం 6 నియమాలను పాటించమని చెబుతుంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండా శరీరం చాలా బలంగా కూడా ఉంటుందట. కడుపు నిండుగా తినకూడదు.. పూర్తీగా ఆకలి తీరేలాగా కడుపు నిండుగా ఎప్పుడూ తినకూడదట. 70-80 శాతం ఆకలి తీరి 75శాతం వరకు కడుపు నిండితే చాలట. అలా చేస్తే ఆహారం జీర్ణరసంలో కలిసి బాగా జీర్ణం కావడానికి కడుపు లోపల కొంత స్థలం ఏర్పడుతుందట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం.. తీసుకునే భోజనం ఆ రోజులో అదే ఎక్కువ ఆహారం అయి ఉండాలి. అంటే దీని అర్థం.. రాత్రి భోజనం కంటే మధ్యాహ్నం తీసుకునే భోజనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం సూర్యుడిని అనుసరిస్తుందట. మధ్యాహ్నం సమయంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పోషకాలున్న ఆహారాన్ని తినాలి. సమయం.. రాత్రి ఆలస్యంగా తినకూడదు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఆహార స్థితి.. ఆహారం చల్లగా అయిన తరువాత మళ్లీ వేడి చేయడం తప్పు. పాతబడిన లేదా మళ్లీ వేడిచేసిన ఆహారాన్ని తినకూడదు. పగటిపూట తయారుచేసిన ఆహారాన్ని రాత్రిపూట తినవచ్చు. కానీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రోజుల తర్వాత గ్యాస్ తో వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉపవాసం.. అజీర్ణంతో బాధపడుతుంటే ఆహారం తినకూడదట. దీనికి బదులుగా ఉపవాసం ఉండటం మంచిదట. అజీర్ణం చేసిందంటే అప్పటికే తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం. దీని వల్ల తరచుగా కడుపు ఉబ్బరం వస్తుంటే భోజనం మానేసి ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఉష్ణోగ్రత.. తీసుకునే ఆహారం స్థితి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారం పూర్తిగా ఉడికి, వేడిగా ఉండాలి. ఇది త్వరగా జీర్ణమై పోషకాలను అందిస్తుంది. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపుచ్చకాయను ఇలా తింటే.. పాయిజన్ అవుతుందట..!
పుచ్చకాయ వేసవిలో చాలామందికి ఇష్టమైన పండు. ఇందులో అధికశాతం నీరు ఉండటంతో పుచ్చకాయ తింటే వేసవి వేడిని అధిగమించవచ్చు. అయితే పుచ్చకాయను తినడంలో చాలా మంది పొరపాటు చేస్తారు. ఇలా పొరపాటుగా తినడం వల్ల పుచ్చకాయ శరీరానికి మంచి చేయకపోగా చెడు చేస్తుంది అంటున్నారు ఆహార నిపుణులు. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు ఏంటి? పుచ్చకాయను ఎలా తింటే మంచిది? ఎలా తినకూడదు? పూర్తీగా తెలుసుకుంటే.. ఖాళీ కడుపు.. పుచ్చకాయలో అధిక మొత్తంలో సహజ చక్కెర, నీరు ఉంటాయి. ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో గ్యాస్, ఆమ్లతత్వం, జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందుగా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. ఆ తరువాతే పుచ్చకాయ తినాలని ఆహార నిపుణులు అంటున్నారు. భోజనం తరువాత.. చాలా మంది భోజనం తర్వాత పండ్లు తింటూ ఉంటారు. వేసవిలో తియ్యగా, చల్లగా ఉండే పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. భోజనం చేసిన వెంటనే పుచ్చకాయ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. భోజనం చేసిన కనీసం ఒక గంట తర్వాత పుచ్చకాయ తినడం మంచిది. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే.. చల్లటి పుచ్చకాయ రుచిగా ఉంటుంది. కానీ వెంటనే తినడం వల్ల గొంతు నొప్పి, జలుబు వస్తుంది. మొదట గది ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం ఉంచి ఆ తర్వాత తినాలి. ఇది కాకుండా, ఎల్లప్పుడూ తక్కువ పరిమాణంలో పుచ్చకాయ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినకూడదు. శరీరం దానిని సరిగ్గా జీర్ణం చేసుకునేలా చిన్న భాగాలలో తినాలి. ఉప్పుతో.. చాలా మంది పుచ్చకాయలో ఉప్పు వేసి తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇలా తింటే మరింత తీపిగా, జ్యుసిగా ఉంటుంది. కానీ అది ఆరోగ్యానికి హానికరం అని చాలా మందికి తెలియదు. ఇది శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతుంది. అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పటికే అధిక రక్తపోటు సమస్య ఉంటే పుచ్చకాయతో ఉప్పు తినడం పూర్తిగా మానేయాలి. ఎలా తినాలి.. ఎల్లప్పుడూ తాజాగా ఉన్న పుచ్చకాయను, ఇంట్లో నిల్వ చేయకుండా అప్పటికప్పుడు కట్ చేసుకున్న పుచ్చకాయను తినాలి. చెడిపోయిన పుచ్చకాయ తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది, దీనిని ఎక్కువగా తినడం వల్ల తరచుగా మూత్రవిసర్జన, కడుపులో భారంగా అనిపించవచ్చు. ఎల్లప్పుడూ పుచ్చకాయను ఒకదాన్నే తినాలి. ఇతర పండ్లతో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపండ్లు ఇలా తింటే శరీరంలో టాక్సిన్లన్నీ తొలగిపోతాయ్..!
పండ్లను ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పరిగణిస్తారు. అయితే చాలామంది పండ్లు తినడం అంటే.. అదేదో అనారోగ్యం ఉన్నవాళ్లకు మాత్రమే అనే ఆలోచనతో ఉంటారు. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నేటి కాలం యోగా గురువులు, వైద్యులు, ఆహార నిపుణులు కూడా పండ్లు ఆహారంగా తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. కానీ పండ్లను ఎప్పుడంటే అప్పుడు, ఎలాగంటే అలా తినడం అస్సలు మంచిది కాదు. పండ్లను సరైన పద్దతిలో తింటే శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. ఇంతకీ పండ్లను తినడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుంటే.. మన రోజువారీ ఆహారంలో 30% తాజా పండ్లను చేర్చుకుంటే అది మన ఆరోగ్యంపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్లలో సహజ చక్కెర, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎటువంటి ఒత్తిడి లేకుండా పోషణను అందిస్తాయి. సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణం కావడానికి ఎక్కువ శ్రమ అవసరమయ్యే బరువైన, ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే, పండ్లు మనల్ని తేలికగా, శక్తివంతంగా ఉంచుతాయి. పండ్లు తినడం వల్ల శరీరం శుభ్రపడి, విషపూరిత పదార్థాలు తొలగిపోతాయి. ఇది కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పండ్లు తినడం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. భారీ ఆహారం తినడం వల్ల శరీరం నీరసంగా అనిపిస్తుంది. కానీ పండ్లు తినడం వల్ల శరీరానికి నిరంతర శక్తి అందుతూనే ఉంటుంది. పండ్లలో ఉండే సహజ చక్కెర శరీరంలో నెమ్మదిగా కరిగిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు. దీనివల్ల శరీరం రోజంతా చురుగ్గా ఉంటుంది. ఉదయాన్నే ఒక గిన్నె తాజా పండ్లు తీసుకోవాలి. స్నాక్స్ కు బదులుగా పండ్లు తినవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా ఆపిల్, అరటిపండు, నారింజ వంటి పండ్లను తినాలి. వివిధ పండ్లను కలిపి స్మూతీలు లేదా సలాడ్లు సిద్ధం చేసుకోవచ్చు. పండ్లను తాజాగా, సీజన్ వారిగా లో తినడం మంచిది. మనం శరీరంలోకి వెళ్లే ఇంధనం అది ఎంత బాగా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది. దీని అర్థం మనం ఆరోగ్యకరమైన, సహజమైన ఆహారాన్ని తింటే.. మన శరీరం కూడా సరిగ్గా పనిచేస్తుంది. మన ఆహారంలో 30% పండ్లను చేర్చుకుంటే మన ఆరోగ్యం బాగుండటమే కాకుండా, రోజంతా చురుకుగా, శక్తివంతంగా ఉంటాము. ఈ చిన్న మార్పు చేసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్లు అన్నీ మెల్లగా బయటకు వెళ్లిపోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమామిడి పండ్లను ఎవరు తినకూడదు?
వేసవికాలం అంటే అందరికి మామిడి పండ్లు గుర్తు వస్తాయి. మామిడి పండ్ల వాసన నుండి రుచి వరకు ప్రతిదీ ఆకర్షిస్తుంది. పసుపు రంగులో బాగా పండిన మామిడి పండ్లను తినకపోతే వేసవికాలానికి న్యాయం చేసినట్టే అనిపించదు. అయితే మామిడి పండ్లు ఎంత రుచిగా ఉంటాయో.. కొందరికి అంతే చేటు చేస్తాయి. మామిడి పండ్లు మిగతా పండ్ల లాగా ఆరోగ్యానికి చాలా మంచివే అయినా.. కొందరు మామిడిపండ్లు తినడం ఎంత మాత్రం మంచిది కాదు. పండ్లలో రాజైన మామిడి పండులో ఉండే పోషకాలు ఏంటి? మామిడి పండును ఎవరు తినాలి? ఎవరు తినకూడదు అనే విషయం తెలుసుకుంటే.. పోషకాలు.. మామిడి పండ్లలో విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-బి9, విటమిన్-ఇ, ఫైబర్, పొటాషియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు శరీరానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే మామిడి పండ్లను అందరూ తినడం మంచిది కాదు. మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఈ సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు, కుటుంబంలో మధుమేహం సమస్య ఇప్పటికే ఉన్నవారు మామిడి పండ్లను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు అయితే అసలు తినకూడదు. ఇటీవల కాలంలో పొట్ట సంబంధ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వాటిలో గ్యాస్, అసిడిటీ, మలబద్దకం మొదలైనవి ముఖ్యమైనవి. ఇవి పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి వస్తున్నాయి. ఈ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లు తినకపోవడమే మంచిది. మామిడిపండ్లను తింటే పై సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇప్పట్లో చాలా పెరుగుతున్నాయి. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారు, చర్మ సంబంధ సమస్యలు ఉన్నవారు, జీవక్రియ చాలా బలహీనంగా ఉన్నవారు. అంటే తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లను తినకపోవడం మంచిది. ఎందుకంటే మామిడి పండ్లు పై సమస్యలను ఎక్కువ చేస్తాయి. లేటెక్స్ కు అలెర్జీ ఉన్నవారు మామిడి పండ్లను తినకూడదు. ఎందుకంటే మామిడి పండ్లలో ఉండే పోషకాలు, ప్రోటీన్లు.. లేటెక్స్ లో ఉండే ప్రోటీన్ల మాదిరిగానే ఉంటాయి. అందుకే మామిడి పండ్లను తింటే ఈ అలర్జీ వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు మామిడి పండ్లు తినే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మామిడి పండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కరెలు ఉంటాయి. కేలరీలు ఎక్కువ ఉంటాయి. మామిడి పండ్లను ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreశ్రీరామనవమి నాడు పానకం ఎందుకు!
హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు. బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట! ..నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమండే వేసవిలో తాజాగా ఉండాలంటే.. ఈ మూడు జ్యూసులు బెస్ట్..!
వేసవి కాలం వచ్చేసరికి శరీరంలో నీటి లోపం, డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. మండే ఎండలు, తేమతో కూడిన వేడి కారణంగా అలసట, నీరసం, చిరాకుగా అనిపించడం సర్వసాధారణం. చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు ఎనర్జీగా వెళతారు. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాడిపోయిన తోటకూర కాడలా కనిపిస్తారు. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం కేవలం నీళ్లు తాగితే సరిపోదు. ఆరోగ్యకరమైన జ్యూస్లు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వేసవిలో తీసుకునే జ్యూస్లు శరీరాన్ని చల్లబరచడమే కాకుండా శక్తిని కూడా ఇస్తాయి. ఈ మండే ఎండలో శరీరాన్ని తాజాగా ఉంచే మూడు జ్యూస్ల గురించి తెలుసుకుంటే.. పుచ్చకాయ నీటి కొరతను తొలగిస్తుంది.. పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో ఉత్తమమైన హైడ్రేటింగ్ పండుగా మారుతుంది. దీనిలో ఉండే ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని శుద్ది చేయడమే కాకుండా హైడ్రేషన్ స్థాయిని కూడా బ్యాలెన్స్ గా ఉంచుతాయి. ఇది శరీరంలో నీటి కొరతను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆమ్లత్వం నుండి ఉపశమనం ఇస్తుంది. చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. పుచ్చకాయ ముక్కలను మిక్సర్లో వేసి, కొంత నిమ్మరసం, పుదీనా ఆకులు వేసి బ్లెండ్ చేయాలి. కావాలంటే దానికి నల్ల ఉప్పు, కొద్దిగా తేనె కూడా జోడించవచ్చు. కొబ్బరి నీరు సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి.. వేసవిలో కొబ్బరి నీళ్లు అత్యంత సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలలో ఒకటి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసంతో కలిపి తాగినప్పుడు ఇది అద్భుతమైన శక్తిని పెంచే పానీయంగా మారుతుంది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వేడి, వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో నిమ్మకాయ, నల్ల ఉప్పు కలిపి తాగవచ్చు. దోసకాయ తాజాదనాన్ని కాపాడుతుంది.. దోసకాయలో 96 శాతం నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి చల్లదనాన్ని అందిస్తుంది. అదే సమయంలో పుదీనా సహజ శీతలీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. దోసకాయ శరీరంలో తాజాదనాన్ని కాపాడుతుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. దోసకాయ తొక్క తీసి ముక్కలుగా కోసి, పుదీనా ఆకులు, నిమ్మరసం, కొద్దిగా నల్ల ఉప్పు వేసి బాగా బ్లెండ్ చేయాలి. దాన్ని ఫిల్టర్ చేసి చల్లబరిచి త్రాగాలి. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనీరు దాహం మాత్రమే తీరుస్తుందా? ఈ 5 నిజాలు తెలిస్తే..!
నీరు మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక వనరులలో ముఖ్యమైనది. దాహం వేసినప్పుడు నీరు తాగుతాం. ఏదైనా ఆహార పదార్థం తిన్నప్పుడు నీరు తీసుకుంటూ ఉంటాం. ఇది తప్ప నీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. బయటకు వెళ్ళినప్పుడు అలసట వస్తే తాగడానికి కావాలి అని ఒక నీళ్ల బాటిల్ వెంట తీసుకువెళతాము. అంతే తప్ప నీటి గురించి మరింత సీరియస్ గా ఆలోచించాల్సిన పని ఏముంది అనుకుంటారు చాలా మంది. వేసవిలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం. ఎందుకంటే మన శరీరంలో 60 శాతం నీటితో తయారవుతుంది. శరీరంలో నీటి కొరత ఉంటే, డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. శరీరంలోని అనేక భాగాల పనితీరు ప్రభావితమవుతుంది. శరీరంలోని అన్ని కణాలు, అవయవాలు సరిగ్గా పనిచేయడానికి నీరు అవసరం. దీనితో పాటు శరీరమంతా ఆక్సిజన్ సరైన సరఫరాకు, శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి, చర్మాన్ని మృదువుగా ఉంచడానికి నీరు కూడా చాలా ముఖ్యమైనది. నీరు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా అని అనిపిస్తుందేమో.. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. మెదడు పనితీరు.. రోజువారీ కొన్ని గ్లాసుల నీటిని జోడించడం వల్ల మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని, భావోద్వేగాలను స్థిరీకరించవచ్చని, ఆందోళన వంటి ఎమోషన్స్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు.. నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడానికి, మీ బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. నిజానికి నీరు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఇది అదనపు కేలరీలు తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. ఇది జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది, బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. కీళ్ల నొప్పులు.. కీళ్ల మృదులాస్థి దాదాపు 80 శాతం నీటితో కూడి ఉంటుంది. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల కీళ్ళు బాగా లూబ్రికేట్ గా ఉంటాయి. ఇది ఎముకల మధ్య మరింత పరిపుష్టిని సృష్టించడం ద్వారా ఘర్షణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉష్ణోగ్రత.. శరీరం డీహైడ్రేట్ కు గురైనప్పుడు శరీరం ఎక్కువ వేడిని నిల్వ చేస్తుంది. ఇది వేడి ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో పుష్కలంగా నీరు త్రాగినప్పుడు ఏదైనా రకమైన కార్యాచరణ సమయంలో శరీరం వేడెక్కినప్పుడు చెమట పట్టడానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. గుండె ఆరోగ్యం.. గుండె ఆరోగ్యానికి హైడ్రేటెడ్ గా ఉండటం కూడా చాలా ముఖ్యం. నిజానికి, రక్తం ప్రధానంగా ఆక్సిజన్ తో కూడి ఉంటుంది. తగినంత నీరు త్రాగనప్పుడు అది గాఢంగా మారుతుంది. ఇది ఖనిజాల (ఎలక్ట్రోలైట్స్) అసమతుల్యతకు దారితీస్తుంది. పొటాషియం, సోడియం వంటి ఈ ఖనిజాలు గుండె సరిగ్గా పనిచేయడానికి ముఖ్యమైనవి. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read more


.webp)
.webp)







.webp)

.webp)




.webp)



.webp)