మందు చేసే మాయ మీకు తెలుసా?
"అవును! ఇంతకీ పార్టీ ఎప్పుడు?" ఎవరు ఏ శుభవార్త చెప్పినా ఎదుటి వ్యక్తి నుండి వచ్చే మొదటి ప్రశ్న ఇది. 'పార్టీ' అనే దానికి ఇప్పుడు అర్ధం చాలా వరకు మారిపోయింది. 'డ్రింక్స్' లేని పార్టీ పార్టీయే కాదు అనే మిత్రులూ మన మధ్య ఉన్నారు. ఇలా ఏదో సరదాకి ప్రారంభమై ఈ మధ్యపానానికి బానిసలై పీడింపబడుతున్న వాళ్లు, ప్రాణాల్ని కూడా కోల్పోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. 'బాధల్ని మరచిపోవడానికి ఇదే మంచి మందు' అంటూ మందు కొట్టడాన్ని ప్రారంభించి మరిన్ని బాధల్లో కూరుకుపోయిన వాళ్లూ కోకొల్లలు ఉంటారు. ఏవో కొన్ని కథల్లో చదివో, కొన్ని సినిమాల్లో చూసో ప్రేమ విఫలమైనా, కష్టాలు వచ్చినా ఇలా మందు ఒక్కటే మార్గమని భావించే అమాయకులూ మనలో లేకపోలేదు.. కారణమేదైనా పర్యవసానమే 'ముందు'కి బానిస కావడం! సరదాకి ప్రారంభించి సమస్యయి కూర్చుంటుంది. విశ్రాంతి కలిగిస్తుందని తీసుకుంటున్నది కాస్తా ఆరోగ్యాన్ని చెడగొట్టి, అవిశ్రాంతిని పెంచుతుంది!!! బాధల్ని మరచిపోవాలని మొదలు పెట్టింది. మరింత బాధాకరంగా తయారవుతుంది!!! మనిషిలో ఒంటరితనాన్ని, హింసా ప్రవృత్తిని పెంచుతుంది!!! అన్ని రకాల మద్య పానాలలోను ఉండేది ఇథైల్ ఆల్కహాల్. ఇది పులియబెట్టడం వలన వస్తుంది. త్రాగడం ప్రారంభించిన ప్రతి పదిమందిలోను ఒకళ్లు తప్పక దానికి బానిసలైపోతున్నారు. ఆల్కహాలు మనసుని ఉత్తేజపరచదు. కేంద్రనాడీ మండలాన్ని నిరుత్సాహ పరచి మెదడు, వెన్నెముకల పని తీరుని తగ్గిస్తుంది. మద్యాన్ని సేవిస్తే అది మిగతా పదార్థాలలా జీర్ణమై రక్తంలో కలువదు. సరాసరి రక్తంలో కలుస్తుంది. అందుకని త్రాగిన క్షణాల్లోనే శరీరంలోని అన్ని భాగాలకు చివరకు మెదడుకు కూడా ఇది ప్రవహిస్తుంది. మెదడుని మొద్దుబారేట్లు చేస్తుంది. దాంతో త్రాగిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తికి, అతని తాలూకు వాళ్లకి ఎన్నో నష్టాలు కలుగవచ్చు. ఒక డ్రింక్ త్రాగిన 45 నిమిషాల తరువాత మాత్రమే ఆ ఆల్కహాల్ని లివర్ బ్రధ్ధలు కొట్టగలదు. అందుకనే నిర్దేశించిన కాలంలో ఇంతకన్నా ఎక్కువ ఆల్కహాల్ త్రాగితే లివర్ దెబ్బతింటుంది. అందరూ అనుకున్నట్టు చన్నీటి స్నానం, మజ్జిగ, కాఫీ, భోజనం మొదలైనవేవీ ఆ వ్యక్తిని మామూలు స్థితిలోకి తీసుకురాలేవు. కేవలం త్రాగిన పరిమాణానికి తగ్గ సమయము తర్వాతే మామూలు స్థితికి రాగల్గుతాడు. రెండు పెగ్గులు తాగితే అది తగిన గంటలోపు చెమటలు పట్టడం, విచక్షణ కొద్దికొద్దిగా తగ్గడం మొదలవుతుంది. మూడు పెగ్గులకి తల తిరగడంతో పాటు విచక్షణ బాగా దెబ్బతింటుంది. అయిదారు పెగ్గులకి సరిగ్గా కనిపించకపోవడం, మాటలు తడబడడం, రికలక్షన్స్ బాగా నెమ్మదైపోవడం జరుగుతుంది. ఎనిమిది, తొమ్మిది పెగ్గులైతే బాలన్స్ పూర్తిగా తప్పుతుంది. ఒకళ్ళు ఇద్దరుగా కనిపిస్తారు, స్పృహ తప్పిపోవచ్చు. అంతకు మించితే ప్రాణమూ పోవచ్చు. తన అలవాటుమీద ఎప్పుడైతే తన అదుపు తప్పిందో అప్పుడే ఆ వ్యక్తి కష్టాలలో పడ్డట్లు. ఈ మద్యపాన అలవాటుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 1956లోనే ఒక జబ్బుగా గుర్తించాయి. మానాలనే ధ్యాస ఉండాలే గాని ఈ 'జబ్బు'ని నయం చేయడం అసాధ్యమేమీకాదు. త్రాగుడు అలవాటే ఓ జబ్బు. అంతేగాని ఇది ఏ జబ్బుకీ లక్షణం కాదు. అందుకని దీని ద్వారా వచ్చే జబ్బుల్ని వేటిని నయం చేయాలన్నా మొదట ఈ అలవాటుని మానిపించాలి. ఈ జబ్బుని నయం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే రోజురోజుకి పెరిగిపోతుంది. రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటున్న చాలా కాలమయ్యే సరికి దాని ప్రభావం ఆరోగ్యం మీద ఉండి తీరుతుంది. మొదట్లో కొద్ది పరిమాణమే ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ శరీరం త్వరలోనే దానికి అలవాటు పడడంతో అంతకన్నా ఎక్కువ తీసుకుంటేగాని 'కిక్' ఫీలవ్వరు. ఇలా క్రమక్రమంగా ఈ అలవాటు పెరిగిపోతుంది. ఆల్కహాల్లో ఉండేవి 'ఎంప్టీ కాలరీస్' అందుకని సరైన ఆహారం తీసుకోకపోతే శరీరం ఇంకా త్వరగా దెబ్బతింటుంది. ఇదీ మందు చేసే మాయ.. ◆నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు చేస్తే జాంబీలుగా మారిపోతారు!
జాంబీ అనే పదం సినిమాలలో వినే ఉంటారు. కేవలం సినిమాలలో వినడమే కాదు, జాంబీలు ఎలా ఉంటారో కూడా చూసి ఉంటారు. కళ్లు బాగా ఉబ్బిపోయి, కళ్లకింద నల్లటి వలయాలు, మచ్చలు ఉంటాయి. వారి నడక నుండి ప్రవర్తన వరకు అంతా భయంకరంగా ఉంటుంది. నిజానికి రాత్రి పడుకునే ముందు కొన్ని పొరపాట్లు చేయడం వల్ల సాధారణ మనుషులు కూడా ఇలా జోంబీలుగా మారిపోతారట. అసలు రాత్రి పడుకునే ముందు చాలామంది చేస్తున్న తప్పేంటి? దీనివల్ల అంత పెద్ద ప్రమాదం ఎందుకు కలుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. చాలామంది రాత్రి సమయంలో ఆహారం తీసుకునే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కొందరు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు భోజనం చేస్తే.. మరికొందరు అలా తినగానే ఇలా నిద్రపోతారు. కానీ ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా అధిక బరువుకు కారణం అవుతుంది. మరికొంతమంది ఇలాంటి విషయాల మీద అవగాహన ఉన్న కారణంగా రాత్రి సమయంలో పడుకోవడానికి ముందు ఆహారం ఆలస్యమైతే ఇక రాత్రి భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకమరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి సమయంలో తినగానే నిద్రపోవడం ఎంత ప్రమాదకరమో.. అస్సలు తినకుండా ఖాళీ కడుపుతో నిద్రపోవడం కూడా అంతే ప్రమాదం. పైపెచ్చు రాత్రి సమయంలో ఆహారం ఎగ్గొట్టడం వల్ల శరీరంలో విటమిన్-బి12, విటమిన్-డి, కాల్షియం, ప్రోటీన్ మొదలైనవి లోపిస్తాయి. వీటి లోపం కారణంగా శరీరం చాలా నష్టపోతుంది. కొన్ని అనుకోని పరిస్థితులలో ఖాళీ కడుపుతో నిద్రపోవడం ఎప్పుడో ఒకసారి జరిగితే అదేమీ అంత ప్రమాదం చూపించదు. కానీ ఇది ప్రతిరోజూ అలవాటు అయితే మాత్రం క్రమంగా శరీరం జోంబీలాగా మార్పు చెందుతుందట. కడుపుకు సరైన ఆహారం లేకపోతే రాత్రి సమయంలో నిద్రపట్టడం కూడా కష్టమే. మరొక విషయం ఏమిటంటే రాత్రి సమయంలో ఆహారం తీసుకోకపోతే శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి పొట్ట, పిరుదులు వంటి భాగాల్లో పేరుకుప్రమాదం ఉంటుందట. అందుకే ప్రతి ఒక్కరూ రాత్రి పడుకోవడానికి కనీసం రెండు నుండి 3 గంటలలోపు ఆహారం తీసుకోవడం ముగించాలని చెబుతున్నారు. దీనివల్ల పడుకునే సమయానికి ఆహారం దాదాపుగా జీర్ణమై జీర్ణాశయం కూడా విశ్రాంతి దశలోకి వెళుతుంది. ఇవన్నీ జరగటం వల్ల జోంబీలుగా మారటం ఏంటి పిచ్చికాకపోతే అని చాలామందికి అనుమానం వస్తుంది. కానీ ఇవన్నీ ధీర్ఘకాలం కొనసాగితే ఎదురయ్యే పరిస్థితి మాత్రం అదే అని పరిశోధకులు చెబుతున్నారు. *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమునగాకుతో ఇన్ని లాభాలా...
మునగాకు మొరింగా ఓలేఫెరా దీని అసలు పేరు. దీనిని డ్రమ్స్టిక్స్ అంటే తెలుగులో చెప్పాలంటే మునగ ఆకు. దీనుండి అనేక ఔషడ లాభాలు ఉన్నాయి అని అంటున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాలుగా మునగ చెట్టు భారత్ లోని హిమాలయ ప్రాంతాలలో ఆసియాలో పుట్టిందని అంటారు మునగ చెట్టు ద్వారా ఆరోగ్య కరమైన యాంటీ యాక్సిడెంట్స్ లభిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.దీనిని బయో ఆక్టివ్ ప్లాంట్ కొమ్పౌండ్స్ మునగాకు ట్రో ఫిక్స్, ప్రాంతాలలో పెరుగు తాయి. మునగ ఆకు ఆకులు,మునగ కాయలు పచ్చగా బలంగా ఉంటాయి. దీనుండి వచ్చే రూట్స్ తో వైద్యానికి మందుగా వాడతారని నిపుణులు పేర్కొన్నారు. మునగ ఆకు పప్పులో వాడడం మరో విశేషం. మునగ ఆకు రక్త హీనతకు, ఆర్థరైటిస్,ఇతర కీళ్ల నొప్పులు.ముఖ్యంగా రొమటిస్మ్ ,ఆస్తమా,కాన్సర్, మాల బద్దకం,డయబెటిస్ ,డయేరియా,పొట్ట,ఇతర ఇంటర్ స్టైనల్ లో వచ్చే ఆల్సర్ర్స్ స్పశమ్,తల నొప్పిహై బ్లడ్ ప్రెషర్,హృద్రోగ సమస్యలు.కిడ్నీలో రాళ్ళు.ఫ్లూయిడ్ తిరిగి రావడం. తైరోయిడ్ సమస్యలు. పరాస్టిక్ ఇన్ఫెక్షన్ ,ఇమ్యూన్ బూస్టర్ గా మునగ పని చేస్తుంది.స్త్రీలలో వక్షోజాలలో పాల ఉత్పత్తి పెరుగు తుంది.దీనిని కొందరు న్యూట్రిష్నల్ సుప్లి మెంట్స్ గా వాడతారు. లేదా టోనిక్ గా వాడడం విశేషం.ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహారం గా వాడుతున్నారు.మునగ ఆకు లో చాలా రకాల మినరల్స్లభిస్తాయి.మునగని భా రత్ ఆఫ్రికా లో పోషక విలువలు తక్కువ ఉన్నచోట దీనిని వినియోగించడం ఒక ఉద్య్మంగా పేర్కొన్నారు .మునగ కాయలు బీన్స్ వండిన మాదిరిగా వాడతారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మునగ కాయతో పచ్చడి చేస్తున్నారు.మునగ ఆకులను పాలకూర మాదిరిగానే వండు కోవచ్చు అని లేదా మునగ ఆకు పొడి గా కూడా వాడవచ్చు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఆలివ్ ఆయిల్ వల్ల లాభాలు..
గుండె సంబంధిత అనారోగ్యం, మరణం నుండి తపోపించు కోవాలంటే ఆలివ్ ఆయిల్ ఉపయోగ పడుతుంది.మనం అన్నం వండడానికి నూనెను వాడడం సహజం. అయితే కొన్ని రకాల నూనెలు లాభ దాయకంగా ఉంటాయి.అలాగే హాని కారకం కూడా నేడు మీముందుకు తీసుకువస్తున్న అంశం ఆలివ్ నూనె వల్ల లాభాలు.ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల మీరు సమయానికి ముందే మరణం నుంచి తప్పించుకోవచ్చ.అన్నది ప్రశ్న?ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఒక పరిశోదనలో తేలిన విషయం ఏమిటి అంటే గుండె సంబంధిత అనారోగ్యం మరణం నుండి తప్పించు కోవాలంటే ఒక్కో సారి ప్రాణాలతో చలగాటం ఆడడమే.అయితే ఆలివ్ ఆయిల్ కు గుండెకు సంబంధం ఉందని అంటున్నారు నిపుణులు.హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో జరిగిన పరిశోదనలో ఎవరైతే 28 ఏళ్ల పాటు ఆలివ్ ఆయిల్ ను అర చంచా 1 /2 చంచా లేదా 7 గ్రాములు కంటే ఎక్కువ ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటె ఇతరులతో పోలిస్తే వారిలో 19% మరణాలు తగ్గాయని తేలింది.ఎవరైతే ఆలివ్ ఆయిల్ తీసుకోలేదో వారిలో కొన్ని సమస్యలు తలెత్తినట్టు పరిశోదనలో తేలింది. ఆలివ్ ఆయిల్ అంటే ఏమిటి?... పేరులోనే ఉంది కదా ఆలివ్ నుండి వచ్చే నూనె సహజంగా ఈ నూనెను అన్నం వండేటప్పుడు,లేదా సలాడ్ లోసర్దేటప్పుడు.ఆలివ్ ఆయిల్ ను వాడతారు. ఆలివ్ ఆయిల్ లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎగస్ట్రా వర్జీన్ ఆలివ్ ఆయిల్,లేదా శుద్ది చేసిన ఆలివ్ ఆయిల్,లేదా రీ ఫైండ్ చేసిన ఆలివ్ ఆయిల్ కేవలం ఆలివ్ ఆయిల్ మాత్రం అందుబాటులో ఉంటుంది.వీటి అన్నిటిలో ఎగస్ట్రా వర్జీన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే నాణ్యత ఉంటుందని రీ ఫైండ్ చేసిన,లేదా కేవలం ఆలివ్ ఆయిల్ లో కూడా నాణ్యత లేని నాసిరకం నూనెలు ఉన్నట్లు చెపుతున్నారు కాగా మిగిలి పోయిన ఆయిల్ ను మరీ నొక్కి తీసి మార్కెట్ కు తరలించడం కీలకం. ఆలివ్ ఆయిల్ నూనె ఆరోగ్యంగా ఉంచుతుందా?... ఆలివ్ ఆయిల్ నూనెలో చాలా రకాల ప్రమాదాలు తగ్గించేందుకు సహాయ పడుతుంది. వీటన్నిటి వెనక ఒకటే తత్వం వోనో అన స్యాచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్ వంటివి సంపూర్ణంగా ఉంటాయి. శరీరం లో ఉన్న పాడై పోయిన కొలస్ట్రాల్ శాతం తగ్గించడం.లో ఆలివ్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక కొలస్ట్రాల్ లేదా మంచి కొలస్ట్రాల్ స్థాయి లో ఉన్నందున చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అని వివరించారు ఒక అధ్యయనం లో తేలిన విషయం ఏమిటి అంటే యాంటీ ఆక్సిడే టివ్ పై ప్రామాదం ఏర్పడ వచ్చు.అధ్య యనం లో ఎవరైతే ఎక్కువగా ఆయిల్ ను వినియోగించారో వారిలో గుండె సంబంధిత అనారోగ్యం మరణాలు19% ఉండగా. తీవ్రత తక్కువ స్థాయిలో 17% మాత్రమే ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు. ముఖ్యంగా న్యూరో జనరేటివ్ వ్యాధులు అంటే పా ర్కిన్ సన్స్, అల్జీమర్స్ మరణించే వారి సంఖ్య 18% ప్రమాదాల నుంచి తప్పించుకోగలిగారు. ఆలివ్ ఆయిల్ బరువు తగ్గిస్తుందా ?... బరువు పెరగడం అన్నది ఒక అంశం పై ఆధార పది ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం ఎన్నిక్యాలరీలు ఉంటుందో దాని ఆధారంగా బరువు పెరుగుతారని మీ ఆహారంలో క్యాలరీల శాతం పెరిగిందో బరువు పెరగడం సహజం. అలాగే బరువు తగ్గించేందుకు తక్కువ శాతం క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలాని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆలివ్ ఆయిల్ ను తక్కువ స్థాయిలో వినియోగించడం ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపింక్ టీ.. దీని ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు..!
ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటాము. వంటగది నుండి తోట వరకు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించే చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో రోజా కూడా ఒకటి. ఈ పువ్వు అందానికి చిహ్నం మాత్రమే కాదు, దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కావాలంటే గులాబీని పచ్చిగా నమలవచ్చు లేదా గులాబీ ఆకులతో తయారు చేసిన టీ తాగవచ్చు. ఇది అన్ని విధాలుగా ప్రయోజనం చేకూర్చడంలో సహాయపడుతుంది. రోజ్ టీని పింక్ టీ అని కూడా పిలుస్తారు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి, మనసుకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, సహజ లక్షణాలు దీనిని ప్రత్యేకమైన హెర్బల్ టీగా చేస్తాయి. రోజ్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుంటే.. బరువు తగ్గడంలో ప్రయోజనకరమైనది.. రోజ్ టీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల జీవక్రియ కూడా పెరుగుతుంది. రోజ్ టీ తాగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గడం సులభం అవుతుంది. దీనితో పాటు రోజ్ టీలో కేలరీల కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. రోజ్ టీ తయారీలో ఏలకులు, దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. ఇవన్నీ కలిసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మానికి మేలు చేస్తుంది.. రోజ్ టీలో మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇది చర్మాన్ని శుభ్రంగా, ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.. గులాబీల సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో గులాబీ టీ తాగితే , ఒత్తిడి, ఆందోళన, చిరాకు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది సహజ మూడ్ బూస్టర్గా పనిచేస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. రోజ్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. గులాబీలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారించడానికి రోజ్ టీ తాగవచ్చు. రోజ్ టీ ఎలా తయారు చేయాలి? ముందుగా నీటిని మరిగించాలి. అందులో ఎండిన గులాబీ ఆకులను వేసి 5-7 నిమిషాలు మూతపెట్టి ఉంచండి. దీన్ని వడకట్టి ఒక కప్పులో పోయాలి, మీకు కావాలంటే ఇందులో ఏలకులు, దాల్చిన చెక్క కూడా వేసి ఉడికించుకోవచ్చు. మరింత రుచి కోసం దానికి తేనె వేసి త్రాగచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపిత్తాశయంలో రాళ్లు ఎందుకు వస్తాయో తెలుసా?
ఇంతకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనే విషయాన్ని ఎక్కువగా వినేవాళ్లం. కానీ ఇప్పట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎక్కువ వింటూ ఉన్నాం. దీన్నే పిత్తాశయంలో రాళ్లు అని అంటారు. చాలా మంది ఈ మధ్య కాలంలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా కారణాల వల్ల జరగవచ్చు. కానీ ముఖ్యంగదా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం. చెడు జీవనశైలి వల్ల పిత్తాశయంలో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని చెబుతారు. అయితే అసలు పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి తెలుసుకుంటే.. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి కారణం పిత్తంలో ఉండే బిలిరుబిలిన్, లవణాలు, మూలకాల అసమతుల్యత. ఇవి అసమతుల్యతగా ఉన్నట్టైతే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం అనేది సాధారణంగా ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఊబకాయం ఉన్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయంలో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మహిళలలో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే అది హార్మన్లలో మార్పులు, ముఖ్యంగా అధిక ఈస్ట్రోజెన్ స్థాయిల వల్ల జరుగుతుందని అంటున్నారు. వీటి వల్లే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడతాయట. ఆహారంలో ఫైబర్ లేకపోవడం, జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది పిత్త అసమతుల్యతకు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తుంది. అందుకే ఆహారంలో ఫైబర్ ను తీసుకోవాలి. అలాగే జీర్ణ సమస్యలు ఏవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీర్ణసమస్యలు వస్తే వెంటనే పరిష్కారం అయ్యేలా చూసుకోవాలి.పోషకాలు అధికంగా ఉన్న, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఒత్తిడి హార్మోన్ ఏది..ఇది ఎలా పనిచేస్తుంది?
శరీరం సరిగ్గా పనిచేయడంలో 'బ్యాలెన్స్' ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది ఆహార సమతుల్యత అయినా లేదా హార్మోన్ల సమతుల్యత అయినా, రెండూ ముఖ్యమైనవే. హార్మోన్లు మన శరీరంలో దూతలుగా పనిచేసే రసాయనాలు. శారీరక పెరుగుదల, అభివృద్ధి, జీవక్రియ, జీర్ణక్రియ, వ్యాధులతో పోరాడటం, వ్యక్తులను సంతోషంగా లేదా విచారంగా ఉంచడంలో హార్మోన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కార్టిసాల్ అటువంటి హార్మోన్లలో ఒకటి, దీని గురించి తెలుసుకుంటే.. చాలామంది ఒత్తిడిగా ఉంది అంటూ ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా ఒత్తిడికి గురి కావడం వెనుక కార్టిసాల్ అనే హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ ను ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. కార్టిసాల్ అనేది అడ్రినల్ గ్రంథులు తయారుచేసే స్టెరాయిడ్ హార్మోన్. ఇది ప్రాథమికంగా ఒత్తిడి హార్మోన్ అని పిలుస్తారు, ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితులకు శరీరం ప్రతిస్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. కార్టిసాల్ విధులు దీనికి మాత్రమే పరిమితం కాదు, ఇది శరీరంలో అనేక ఇతర పాత్రలను కలిగి ఉంది. ఒత్తిడి హార్మోన్.. ఆరోగ్య నిపుణులు కార్టిసాల్ను ఒత్తిడి హార్మోన్ అని పిలుస్తారు. కానీ ఇది శరీరంలోని దాదాపు ప్రతి అవయవం, కణజాలాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన హార్మోన్ అని అంటున్నారు. శరీరం శక్తి కోసం గ్లూకోజ్ ను ఎలా ఉపయోగిస్తుంది, వాపు, రక్తపోటును నియంత్రించడం, నిద్ర-మేల్కొలుపు చక్రాన్ని నియంత్రించడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో కార్టిసాల్ అధికంగా ఉన్న వ్యక్తులు కాలక్రమేణా అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. కార్టిసాల్ పనిచేసే తీరు.. శరీరం ఒత్తిడి ప్రతిస్పందనను నిర్వహించడంలో కార్టిసాల్ కీలక పాత్ర పోషిస్తుంది. కొద్దిసేపు ఒత్తిడికి గురైనా, శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. ఒత్తిడి సమయాల్లో, మిమ్మల్ని అధిక అప్రమత్తంగా ఉంచడానికి శరీరం కార్టిసాల్ను విడుదల చేస్తుంది. భయం, భావోద్వేగ ఉద్దీపనలు వంటి భావోద్వేగాలను నియంత్రించే మెదడులోని భాగం అమిగ్డాలా. ఒత్తిడితో కూడిన పరిస్థితులలో, ఇది మెదడులోని ఒక భాగమైన హైపోథాలమస్కు ఒత్తిడి సంకేతాలను పంపుతుంది. ప్రతిగా హైపోథాలమస్ పిట్యూటరీ-అడ్రినల్ గ్రంథిని కార్టిసాల్ ఉత్పత్తి చేయమని సంకేతాన్ని ఇస్తుంది. కార్టిసాల్ పెరిగితే వచ్చే సమస్యలు.. కార్టిసాల్ సాధారణ స్థాయిలో ఉంటే పర్వాలేదు కానీ కార్టిసాల్ స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. బరువు పెరగడం, అధిక రక్తపోటు, మధుమేహం, వెడల్పు ఊదా రంగు బొడ్డు మచ్చలు, ఆస్టియోపోరోసిస్కు దారితీస్తుంది. పెరిగిన హార్మోన్ స్థాయిలు కాలేయం, కండరాలతో సహా అనేక ఇతర భాగాలను ప్రభావితం చేస్తాయి. కార్టిసాల్ ను తగ్గించాలంటే.. కార్టిసాల్ స్థాయి తరచుగా ఎక్కువగా ఉంటే దాని గురించి వైద్యుడిని సంప్రదించాలి. దినచర్యలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కార్టిసాల్ను నియంత్రించవచ్చు. నిద్రలేమితో బాధపడేవారిలో లేదా రాత్రి షిఫ్టులలో పనిచేసేవారిలో కార్టిసాల్ స్థాయిలు పెరగవచ్చు. కాబట్టి, రాత్రి బాగా నిద్రపోవాలి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. శ్వాస వ్యాయామాలు, ధ్యానం కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. నవ్వుతూ సంతోషంగా ఉండటం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావం పెరిగి కార్టిసాల్ తగ్గుతుంది. కాబట్టి సరదా కార్యకలాపాల్లో పాల్గొనాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఎండ ఎక్కువగా ఉందని చెరకు రసం తాగుతున్నారా? ఈ నిజాలు తెలుసా?
వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని, శక్తిని అందించడానికి చెరకు రసం చాలా మంచి పానీయం. చెరకు రసం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ సీజన్లో భారతదేశంలోని కూడళ్లలో, వీధి మూలల్లో చెరకు రసం సులభంగా లభిస్తుంది. మండే వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలామంది చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. నీటికి బదులుగా చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, దాహం కూడా తీరుతుందని నమ్ముతారు. కానీ బలమైన సూర్యకాంతిలో చెరకు రసం తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుందట. దీన్ని త్రాగే సమయం, పద్ధతి సరిగ్గా లేకపోతే అది ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. బలమైన ఎండలో చెరకు రసం తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? దానిని త్రాగడానికి సరైన సమయం, మార్గం ఏమిటో తెలుసుకుంటే.. బలమైన ఎండలో చెరకు రసం తాగితే.. మండే ఎండకు శరీరం ఇప్పటికే వేడిగా మారి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో చల్లని చెరకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం లేదా కడుపు తిమ్మిరి వంటి సమస్యలను కలిగిస్తుంది. చెరకు రసం సహజంగా చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో చెమటతో కూడిన శరీరం అకస్మాత్తుగా ఏదైనా చల్లని పదార్థాన్ని తీసుకున్నప్పుడు అది గొంతు నొప్పి లేదా జలుబు, దగ్గుకు దారితీస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో విక్రయించే చెరకు రసంలో పరిశుభ్రత లోపించి ఉండవచ్చు. బలమైన సూర్యకాంతిలో చెరకును బహిరంగ ప్రదేశంలో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ లేదా కడుపు ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. చెరకులో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఎండకు అలసిపోయిన శరీరానికి వెంటనే దీన్ని తాగడం వల్ల చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది తలతిరగడం లేదా అలసటకు దారితీస్తుంది. చెరకు రసం తాగడానికి సరైన సమయం ఉదయం లేదా మధ్యాహ్నం చెరకు రసం తాగవచ్చు. కానీ ఎండలోంచి వచ్చిన వెంటనే దానిని తాగకూడదు. నీడలో లేదా చల్లని ప్రదేశంలో కూర్చుని జ్యూస్ తాగాలి. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణమవుతుంది. ఖాళీ కడుపుతో చెరకు రసం తాగకూడదు. తేలికపాటి అల్పాహారం తిన్న తర్వాత మాత్రమే తాగాలి. చెరకు రసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందాలనుకుంటే దానిని పరిశుభ్రమైన జ్యూస్ సెంటర్ నుండి కొని త్రాగాలి. లేదా ఇంట్లో తయారు చేసుకుని త్రాగాలి. చెరకు రసం త్రాగడానికి సరైన మార్గం ఏమిటంటే.. చెరకు రసాన్ని నిమ్మకాయ, నల్ల ఉప్పుతో కలిపి త్రాగాలి. ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎల్లప్పుడూ తాజా చెరకుతో తయారు చేసిన రసాన్ని త్రాగాలి. రసం తాగిన తర్వాత నేరుగా ఎండలో వెళ్లకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. చల్లని రసం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ చాలా చల్లటి చెరకు రసం గొంతు నొప్పి, జలుబుకు కారణమవుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి చెరకు రసం చాలా చల్లగా ఉండకూడదు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreECG పరీక్ష గురించి వాస్తవాలు తెలుసా?
ఆరోగ్యం పాడైనప్పుడు ఆసుపత్రికి వెళ్లినప్పుడు వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు. వాటిల ECG పరీక్ష కూడా ఒకటి. ఈ పరీక్షను చేయించుకునేవారే కానీ చాలామందికి ఈ పరీక్ష గురించి వివరాలు సరిగా తెలియవు. ECG పరీక్షను ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పరీక్ష అని అంటారు. ఈ పరీక్ష ఎందుకు చేస్తారు? ఈ పరీక్ష ఎందుకు అవసరం? ఈ పరీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తెలుసుకుంటే.. ECG లేదా ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పరీక్ష గుండె సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది గుండె విద్యుత్ కార్యకలాపాలను కొలవడానికి ఉపయోగించే రోగనిర్ధారణ ప్రక్రియ. ఈ సంకేతాలు హృదయ స్పందన, లయ గురించి సమాచారాన్ని ఇస్తాయి, దీని సహాయంతో వైద్యులు గుండెలో ప్రతిదీ సరిగ్గా ఉందో లేదో కనుగొంటారు. ECG పరీక్ష ఎవరికి అవసరం? మన గుండె కొట్టుకున్నప్పుడు అది కండరాలను సంకోచించమని సూచించే చిన్న విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది. ECG యంత్రం ఈ సంకేతాలను రికార్డ్ చేసి గ్రాఫ్గా ప్రదర్శిస్తుంది. ECG అనేది వైద్యుడి సలహా మేరకు చేసే పరీక్ష. ఛాతీ నొప్పి లేదా బిగుతు, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన, శ్వాస ఆడకపోవడం, మూర్ఛ లేదా తలతిరగడం, తీవ్ర అలసట వంటి పరిస్థితులకు కారణాన్ని నిర్ధారించడానికి వైద్యులు ECG పరీక్షను సిఫారసు చేయవచ్చు. గుండె జబ్బులను గుర్తించడంలో సహాయపడుతుంది.. ప్రారంభ దశలో గుండె సమస్యలను గుర్తించడంలో ECG చాలా ఉపయోగకరమైన పరీక్ష. సకాలంలో ECG స్క్రీనింగ్ గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదాన్ని 30% తగ్గించవచ్చని పరిశోధకులు నివేదించారు. అదేవిధంగా హై-రిస్క్ కార్డియాక్ రోగులకు ప్రారంభ స్క్రీనింగ్లో ECG తప్పనిసరి. ECG చేయించుకునే వారు ఇవి గుర్తుంచుకోవాలి.. ECG చేయించుకునే ముందు సాధారణంగా తినవచ్చు, త్రాగవచ్చు. వైద్యులు మీకు వద్దు అని చెబితే తప్ప. ECG చేయించుకునే ముందు ఏ మందులు తీసుకుంటున్నారో ఎల్లప్పుడూ వైద్యుడికి చెప్పాలి. చర్మం శుభ్రంగా, పొడిగా ఉండి, నూనెలు, లోషన్లు లేకుండా ఉన్నప్పుడు ECG ఉత్తమంగా పనిచేస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమైండ్ పవర్ పెంచే మూడు సూపర్ డ్రింక్స్..!
వేసవిలో మండే ఎండ అయినా, ఆఫీసులో బిజీ జీవితం అయినా, మానసిక అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఒక సమస్యగా మారాయి. పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి వృద్ధుల వరకు, ప్రతి ఒక్కరూ పదునైన మెదడు, మంచి ఏకాగ్రతను కోరుకుంటారు. అయితే మెదడుకు పదును పెట్టే మరియు జ్ఞాపకశక్తిని బలోపేతం చేసే 3 సూపర్ డ్రింక్స్ను న్యూరాలజిస్ట్ లు సిఫార్సు చేస్తున్నారు. ఇవి చాలా నేచురల్ డ్రింక్స్. అలాగే వీటిని పెద్ద కష్టపడక్కర్లేకుండానే తయారు చేసి తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. మనం తినేవి మరియు త్రాగేవి మన మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఉదయం తీసుకునే కొన్ని పానీయాలు మీ మెదడు శక్తిని, దృష్టిని మరియు జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుతాయి. సూపర్ డ్రింక్స్ ఇవే.. గ్రీన్ టీ.. గ్రీన్ టీలో లభించే అమైనో ఆమ్లం 'ఎల్-థియనిన్' మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు న్యూరాన్లను దెబ్బతినకుండా కాపాడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సు అప్రమత్తంగా ఉంటుంది. ఆర్గానిక్ కాఫీ + MCT ఆయిల్.. ఆర్గానిక్ కాఫీకి MCT ఆయిల్ (మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్) కలిపితే, అది మెదడుకు ఇంధనంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ మిశ్రమం మెదడు మొద్దుబారినట్టు ఉండటాన్ని తొలగిస్తుంది. చురుకుదనాన్ని నిలిపి ఉంచుతుంది. ఈ పానీయం 'కీటోజెనిక్ డైట్'లో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. మానసిక అలసట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మెగ్నీషియం అధికంగా ఉండే నీరు.. మెగ్నీషియం మన మెదడు పనితీరుకు చాలా ముఖ్యమైన ఖనిజం. ఇది న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతను కాపాడుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు కణాలు మెరుగ్గా పనిచేయడానికి రోజుకు కనీసం ఒక బాటిల్ మెగ్నీషియం అధికంగా ఉండే మినరల్ వాటర్ తాగాలట. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreకాలేయాన్ని క్లీన్ చేయడంలో సహాయపడే ఈ ఆహారాల గురించి తెలుసా?
కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయం. ఇది ఊపిరితిత్తులకు కొంచెం దిగువన ఉంటుంది. మనం తినే ప్రతి ఆహారం కాలేయం మీద ప్రభావం చూపిస్తుంది. కొన్నిఆహారాల వల్ల కాలేయం విషపూరితం అవుతుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే కాలేయం కొవ్వుతో నిండిపోతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య కూడా వస్తుంది. విషపూరితంగా మారిన కాలేయాన్ని, కాలేయం కొవ్వును తగ్గించడంలో సహాయపడే ఆహారాల గురించి తెలుసుకుంటే.. బీట్రూట్.. బీట్రూట్ రసంలో బీటైన్, నైట్రేట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి. కాలేయంలో మంచి రక్త ప్రసరణను సృష్టిస్తుంది. దీనితో పాటు, జామ, వాల్నట్, జీడిపప్పు వంటి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E ని కలిగి ఉంటాయి. ఇవి కాలేయాన్ని వాపు, రసాయన గాయం నుండి రక్షిస్తాయి. క్రూసిఫెరస్ కూరగాయలు.. బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు కాలేయం డీటాక్స్ ఎంజైమ్లను సక్రియం చేస్తాయి. అవి ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు రెండింటిని సమృద్ధిగా కలిగి ఉంటాయి. ద్రాక్ష ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. వాపును తగ్గిస్తుంది. కాలేయం దెబ్బతినడాన్ని, గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. క్రాన్బెర్రీ క్రాన్బెర్రీ కాలేయ వాపును తగ్గిస్తుంది. ఇది కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. కాలేయం దెబ్బతినకుండా ఎక్కువ కాలం కాపాడుతుంది. బ్లూబెర్రీ బ్లూబెర్రీస్లో ఆంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయంలో ఫైబ్రోసిస్ (అదనపు కొవ్వు, గడ్డలు ఏర్పడటం) నెమ్మదిస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి వెల్లుల్లి కాలేయంలో ఉండే ప్రత్యేక ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. ఇది విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది సల్ఫర్ కలిగిన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది కాలేయాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవామ్మో.. కుంకుమ పువ్వు టీ తాగితే ఇన్ని లాభాలా?
కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంద ద్రవ్యం. దీన్ని సాధారణంగా ఖరీదైన వంటకాలలోనూ, తీపి పదార్థాల తయారీ లోనూ, గర్భవతులు, బిర్యానీ వంటి వంటకాలలోనూ ఉపయోగిస్తారు. అయితే కుంకుమ పువ్వుతో టీ తయారు చేసుకుని తాగుతారని మీకు తెలుసా? కుంకుమ పువ్వు చాలా ఖరీదైనదే అయినా దాని ఖరీదుకు తగినట్టు ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణక్రియ.. కుంకుమ పువ్వు టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల ఆహారం సజావుగా జీర్ణమవుతుంది. నెలసరి.. నెలసరి సమస్యలు ఉన్నవారికి కుంకుమ పువ్వు టీ అద్భుతం అని చెప్పవచ్చు. కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల కడుపు కండరాల తిమ్మిరి, కడుపు ఉబ్బరం, అలసట, నెలసరికి ముందు, తరువాత వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర.. కుంకుమ పువ్వులో సఫ్రానల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనసుకు, మెదడుకు ప్రశాంతతను ఇస్తాయి. పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల మనసు, శరీరం రెండూ విశ్రాంతి పొందుతాయి. నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడేవారు, పదే పదే నిద్రలో మెలకువ వచ్చే వారు పడుకునే ముందు కుంకుమ పువ్వు టీ తాగితే చాలా మంచిది. రోగనిరోధక శక్తి.. కుంకుమ పువ్వులో విటమిన్-సి, విటమిన్-బి, రిబోప్లేవిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్.. కుంకుమ పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి రక్తపోటును, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు.. ఖాళీ కడుపుతో కుంకుమ పువ్వు టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎందుకంటే కుంకుమ పువ్వు టీ ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా కేలరీలు ఎక్కువ తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే కొద్దిపాటి ఫైబర్ చాలా శక్తివంతమైనది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాన్సర్.. కుంకుమ పువ్వులో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో కాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే సామర్థ్యం కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యం.. చర్మ ఆరోగ్యానికి కుంకుమ పువ్వు దివ్యౌషధం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పలు బ్యూటీ ఉత్పత్తులలో కూడా కుంకుమ పువ్వు ను వినియోగిస్తారు. కుంకుమ పువ్వు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమునక్కాయలు.. కిడ్నీలో రాళ్లు.. ఈ రెండింటికి సంబంధం తెలుసా?
మునక్కాయలు వేసవి కాలంలో విరగకాస్తాయి. చాలామందికి మునగ కాయలతో చేసే వంటకాలు అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యకు మునక్కాయ మంచి పరిష్కారం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో పూర్తీగా తెలుసుకుంటే.. మునగకాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు విచ్చిన్నమవుతాయట. అవి బయటకు వచ్చేస్తాయట. ఈ విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మునక్కాయలను ఎడాపెడా తింటున్నారు. మునక్కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మునక్కాయలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెరుగుపరుస్తుంది. ఇవన్నీ నిజమే కానీ.. మూత్రపిండాలలో రాళ్లను విచ్చిన్నం చేసి వాటిని బయటకు రావడంలో మునక్కాయలు సహాయపడతాయి అనే మాట మాత్రం అస్సలు నిజం కాదని వైద్యులు అంటున్నారు. మునక్కాయలు మాత్రమే కాదు.. ఏ కూరగాయ కూడా కిడ్నీలో రాళ్లు పోగొట్టడంలో నేరుగా సహాయపడదు అని వైద్యులు అంటున్నారు. మునక్కాయలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే అపోహతో వాటిని ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. మునగతో లాభం.. మునగ తినడం వల్ల ఖనిజాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. ఇది కొత్త రాళ్ళు ఏర్పడే ప్రక్రియను ఖచ్చితంగా ఆపుతుంది. ఈ కూరగాయలోని యాంటీఆక్సిడెంట్లు, నిర్విషీకరణ లక్షణాలు మూత్రపిండాల నిర్విషీకరణకు, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. మునగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ మునగను తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు పోతాయనే మాట మాత్రం వాస్తవం కాదు. కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా వైద్యులను సంప్రదించడమే మంచిది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreమలేరియా గురించి అపోహలు, వాస్తవాలు.. మలేరియా నివారణకు చేయవలసిన పనులు ఇవే..!
మలేరియా జ్వరంగా పరిగణించబడే సమస్య. మలేరియా వ్యాధి గురించి చాలామందిలో చాలా అపోహలు ఉంటాయి. వాటినే నిజం అనుకుంటూ ఉంటారు. దీని వల్ల మలేరియా కారణంగా కలిగే నష్టమే ఎక్కువ ఉంటుంది. అపోహలు, వాస్తవాల గురించి.. అలాగే మలేరియా వ్యాధి నివారించడానికి చేయవలసిన పనుల గురించి తెలుసుకుంటే.. అపోహ: మలేరియా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే వస్తుంది. వాస్తవం: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మలేరియా సంభవించవచ్చు. నీరు నిలిచి ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలు దోమల వృద్ధికి ఎక్కువగా గురవుతుండగా, ముఖ్యంగా పారిశుధ్యం, నీటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రాంతాలలో దోమలు ఎక్కువ ఉంటే నగరాల్లో కూడా మలేరియా వ్యాప్తి చెందుతుంది. అపోహ: రాత్రిపూట మాత్రమే ఇన్పెక్షన్ దోమ నుండి మలేరియా వస్తుంది. వాస్తవం: మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ దోమలు ప్రధానంగా సంధ్యా సమయంలో, తెల్లవారుజామున చురుకుగా ఉంటాయి. కొన్ని జాతులు రోజంతా కూడా కుట్టగలవు. అన్ని సమయాల్లో.. ముఖ్యంగా మలేరియా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో దోమ కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. అపోహ: మలేరియా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. వాస్తవం: మలేరియా వ్యక్తి నుండి వ్యక్తికి నేరుగా సంక్రమించదు. రక్త మార్పిడి ద్వారా లేదా గర్భధారణ సమయంలో తల్లి నుండి బిడ్డకు వంటి అరుదైన సందర్భాలలో తప్ప. ఇది ప్రధానంగా సోకిన అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. అపోహ: ఒకసారి మలేరియా బారిన పడిన తర్వాత జీవితాంతం దానికి రోగనిరోధక శక్తి ఉంటుంది. వాస్తవం: ఒకసారి మలేరియా బారిన పడటం వల్ల జీవితాంతం రోగనిరోధక శక్తి లభించదు. పదే పదే వ్యాధి బారిన పడటం వలన కాలక్రమేణా పాక్షిక రోగనిరోధక శక్తి ఏర్పడవచ్చు. కానీ అది పూర్తి రక్షణకు హామీ ఇవ్వదు. గతంలో మలేరియా బారిన పడిన వ్యక్తులు కూడా పరాన్నజీవికి గురైతే మళ్ళీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మలేరియా నివారణ కోసం చేయవలసినవి.. మలేరియా నివారణలో దోమల బారిన పడటాన్ని తగ్గించే, పరాన్నజీవి వ్యాప్తి చెందకుండా నిరోధించే పద్ధతుల ఉంటాయి. వీటితో పాటు, ప్రభావవంతమైన నివారణ, చికిత్స కోసం మలేరియాను ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఇవి మలేరియా సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడానికి, ఈ ప్రమాదకరమైన వ్యాధి నుండి తమను తాము మాత్రమే కాకుండా ఇతరులను రక్షించుకోవడానికి సాధారణంగా చేయవలసినవి ఏంటంటే.. కీటక వికర్షకాలను వాడాలి.. దోమలను దూరంగా ఉంచడానికి చర్మంపై DEET, పికారిడిన్ లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనె కలిగిన క్రిమి వికర్షకాన్ని పూయాలి. దోమల తెర.. ముఖ్యంగా రాత్రిపూట దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నిద్రపోయేటప్పుడు దోమతెర ఉపయోగించాలి. రక్షణ.. ముఖ్యంగా సాయంత్రం, తెల్లవారుజామున దోమలు ఎక్కువగా ఉండే సమయంలో పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు ధరించాలి. దోమల తెరలు.. దోమలు ఇంటి లోపలికి రాకుండా నిరోధించడానికి కిటికీలు, తలుపులకు దోమల తెరలు ఉండేలా చూసుకోవాలి. దోమలు పెరిగే ప్రాంతాలు.. ఇంటి చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించాలి. ఎందుకంటే దోమలు ఎక్కువ కాలం నిలిచి ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. బకెట్లు, పూల కుండలు, వర్షపు నీటితో నిండిన పాత టైర్లు వంటివి తొలగించాలి. యాంటీమలేరియల్ మందులు.. మలేరియా వ్యాప్తి చెందుతున్న ప్రాంతానికి ప్రయాణిస్తుంట, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి వైద్యుడు సూచించిన యాంటీమలేరియల్ మందులను తీసుకోవాలి. వైద్య సహాయం.. ముఖ్యంగా మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ప్రయాణించిన తర్వాత జ్వరం, చలి లేదా అలసట వంటి లక్షణాలు ఎదురైతే ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స కోసం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవేసవిలో గసగసాలతో ఇంత లాభమా..!
గసగసాలు స్వీట్లలోనూ, కొన్ని రకాల వంటలలోనూ ఉపయోగిస్తారు. ఆవాల కంటే చిన్న తెలుపు, గోధుమ రంగులో ఉండే గసగసాలు ఖరీదు పరంగా ఎక్కువే ఉంటాయి. కానీ ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. గసగసాలు వేడిని క్షణాల్లోనే తరిమివేస్తాయట. ఆయుర్వేదం కూడా గసగసాల గురించి గొప్పగా చెప్పింది. వేలాది సంవత్సరాల నుండే గసగసాలు ప్రజల ఆహారంలో భాగంగా ఉన్నాయి. చరక సంహితలో దీనిని పిత్త దోషాన్ని శాంతింపజేసే మూలికగా పేర్కొన్నారు. ఇంత అద్బుతమైన గసగసాలు వేసవిలో మనకు చేకూర్చే మేలు ఏంటో తెలుసుకుంటే.. కూలింగ్ ప్రభావం.. చరక సంహితలో గసగసాల గురించి చెప్పబడింది. దీని శీతలీకరణ ప్రభావం శరీర వేడిని తగ్గిస్తుంది. వేసవిలో కడుపు చికాకు, పాదాలలో మంట, చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. గసగసాల పానీయం శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా మనసును కూడా ప్రశాంతపరుస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. "వేసవిలో పిత్తం పెరిగినప్పుడు, గసగసాల పాలు లేదా పానీయం తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందట. శాస్త్రీయ కోణం.. శాస్త్రీయ కోణం నుండి చూస్తే, గసగసాలు పోషకాల నిధి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. గసగసాలలో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వేసవిలో వచ్చే కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గసగసాలలో ఉండే మెగ్నీషియం మంచి నిద్రకు కారణమవుతుందని ఒక పరిశోధన చూపిస్తుంది. ఈ కారణంగానే అమ్మమ్మలు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో గసగసాలు కలిపి పిల్లలకు ఇచ్చేవారు, తద్వారా వారు గాఢమైన, ప్రశాంతమైన నిద్ర పొందేవారు. గసగసాలలోని ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. వేడి నుండి రక్షించడంలో గసగసాల అద్భుత లక్షణాల గురించి మాట్లాడుకుంటే..ఇది సూపర్ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. గసగసాల పానీయం లేదా పాలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. డీహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. గసగసాల నీరు కడుపు pH ని సమతుల్యం చేస్తుంది. ఇది వేసవిలో ఆమ్లతత్వం, కడుపు చికాకు నుండి ఉపశమనం ఇస్తుంది. ఆయుర్వేదంలో గసగసాల వాడకం.. గసగసాల నూనెను ఆయుర్వేదంలో నొప్పి నివారిణిగా కూడా ఉపయోగిస్తారు. ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. గసగసాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. గసగసాలు చర్మానికి కూడా మేలు చేస్తాయి. గసగసాలను పాలతో కలిపి రుబ్బి ముఖానికి రాసుకుంటే చర్మపు చికాకు, మొటిమలు తగ్గుతాయి. గసగసాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి వేసవిలో సూర్య కిరణాల వల్ల కలిగే చర్మ సమస్యలకు కూడా బాగా సహాయపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపండ్లను చూడగానే తియ్యగా ఉన్నాయని ఇలా కనిపెట్టవచ్చు..!
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను అందరూ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో తేలికైన ఆహారం తినడానికి ఇష్టపడతారు. పైగా పండ్లలో నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు అనేది ముఖ్యమైన విషయం. అందువల్ల పండ్లు, పెరుగు, లస్సీ వంటి చల్లని పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచే పండ్లైన పుచ్చకాయ, కర్భూజ వంటి పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది ఈ కాలంలో. కానీ కొంతమంది పండ్లు కొనేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఇంటికి వచ్చి పండు కోసిన తర్వాత, అది పచ్చిగా ఉందని, రుచి తక్కువగా ఉందని, తియ్యగా లేదని నిరాశ పడుతుంటారు. అయితే ఇలా జరగకుండా కొనుగోలు చేసేటప్పుడే పండ్లు తియ్యగా ఉన్నాయని కేవలం చూడటంతోనే తెలుసుకునే టిప్స్ ఉన్నాయి. దీనివల్ల తియ్యని పండ్లను కొని ఆస్వాదించవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. దానిమ్మ.. దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లలో దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది. దానిమ్మపండు కొంటుంటే మొదట దాని నోరు(దానిమ్మ పైన పువ్వు లాంటి ఆకారం) చూడాలి. అది తెరిచి ఉంటే దానిమ్మపండు తియ్యగా ఉంటుందని అర్థం. కానీ దాని నోరు మూసుకుని ఉంటే అది తక్కువ తీపిగా ఉంటుందని అర్థం. పుచ్చకాయ.. కర్భూజ లాగే, పుచ్చకాయ కూడా వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీరంలోని నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది. కానీ పుచ్చకాయ కొనేటప్పుడు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి . పుచ్చకాయకు చారలు ఉండి, అది పొడవుగా ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. ఇది చారలు లేకుంటే కొద్దిగా పచ్చిగా ఉండవచ్చు. నారింజ.. తీపి, పుల్లని నారింజను కొనాలంటే దానిమ్మపండులా దాని ముఖాన్ని చూడాలి. దాన్ని లోపలికి నొక్కితే దాని రంగు ముదురు రంగులో ఉంటే అది తీపిగా, పుల్లగా ఉంటుందని అర్థం. అయితే లేత రంగు, పెద్ద నోరు కలిగిన నారింజలు తక్కువ రుచిని కలిగి ఉంటుందట. డ్రాగన్ ఫ్రూట్.. మార్కెట్లో అధిక ధరకు అమ్ముడవుతున్న డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . కానీ ఖరీదైన ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్ కొనడంలో తప్పు చేస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు దాని ముఖాన్ని చూడండి. అది తాజాగా, ఆకుపచ్చ ఆకులతో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. కానీ అది వాడిపోతే రుచి తక్కువగా ఉంటుందని అర్థం. బొప్పాయి.. చాలా మంది తెలియకుండానే ఇంటికి పచ్చి బొప్పాయిని తెస్తారు. ఇది పండటానికి చాలా సమయం పడుతుంది. వెంటనే దీన్ని తినలేము. తియ్యటి బొప్పాయి కొనాలనుకుంటే దాని రంగు చూడాలి. పూర్తిగా పసుపు రంగులో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం . అయితే పచ్చి బొప్పాయి పచ్చిగా ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreచూయింగ్ గమ్ తినే అలవాటు ఉందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
చూయింగ్ గమ్ చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది. ఏ సమయంలో అయినా సరే చూయింగ్ గమ్ ను అలా నములుతూ ఉంటారు. దీని వల్ల దవడలకు మంచి వ్యాయామం లభిస్తుందని, ముఖానికి కూడా వ్యాయామం లభిస్తుందని అంటుంటారు. క్రీడాకారులు, ఆటగాళ్లు, డాన్స్ చేసేవారు.. ఇలా చాలామంది చూయింగ్ గమ్ ను తమ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుని ఉంటారు. అయితే చూయింగ్ గమ్ తినే అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా అని పరిశోధనలు చేస్తే చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చూయింగ్ గమ్ గురించి, చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే హాని గురించి శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెల్లడించారు. వీటి గురించి తెలుసుకుంటే.. చూయింగ్ గమ్ పరిశోధనలో సగటున ఒక గ్రాము చూయింగ్ గమ్కు వందల నుండి వేల వరకు మైక్రోప్లాస్టిక్లు విడుదలవుతున్నాయని పరిశోధనలలో కనుగొనబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సింథటిక్, సహజ చూయింగ్ గమ్లలో ఒకే మొత్తంలో మైక్రోప్లాస్టిక్లు ఉన్నాయట. అలాగే ఒకే రకమైన పాలిమర్లు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు చూయింగ్ గమ్ ద్వారా మాత్రమే కాకుండా అనేక ఇతర మార్గాల ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్లతో సంబంధంలో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ పరిశోధనలలో మైక్రోప్లాస్టిక్ బయటపడటం తెలుస్తూనే ఉంది. వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా, పర్యావరణంలోకి ప్రవహించే పెయింట్ ముక్కలతో ఇవి సంభవిస్తున్నాయి. ఇవి ఆరోగ్యం పై అనేక ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. శ్వాసకోశ, హృదయనాళ ప్రభావాలు.. వాతావరణంలో మైక్రోప్లాస్టిక్లు ఉండటం వల్ల శ్వాస ద్వారా మైక్రోప్లాస్టిక్లను సంపర్కం చేసుకోవచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది. గాలిలో తక్కువ సాంద్రత కలిగిన మైక్రోప్లాస్టిక్లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల వ్యక్తి యొక్క సున్నితత్వం, కణ లక్షణాలను బట్టి శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయట. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి.. మైక్రోప్లాస్టిక్లు మానవ శరీరంలోని జీర్ణ, రోగనిరోధక వ్యవస్థలతో సహా వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయట. మైక్రోప్లాస్టిక్లు పేగు మైక్రోబయోమ్లో మార్పులకు కారణమవుతాయి. ఫలితంగా ప్రయోజనకరమైన, హానికరమైన బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం, ప్రేగు అలవాట్లలో మార్పులు వంటి వివిధ రకాల జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. పునరుత్పత్తి.. మైక్రోప్లాస్టిక్స్ పునరుత్పత్తిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది అనేక పునరుత్పత్తి లోపాలు, వంధ్యత్వం, గర్భస్రావం, పుట్టుకతో వచ్చే వైకల్యాలకు కారణమవుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read more


.webp)
.webp)








.webp)
.webp)
.webp)
.webp)
.webp)





