ప్రతి రోజు ఒక కప్పు దానిమ్మ రసం తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
కిడ్నీలను డేంజర్ లో పడేసే క్రియేటినిన్..!

  సాధారణంగా ఏదైనా అనారోగ్యం వల్ల డాక్టర్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామంది కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకుంటారు.  ఈ సందర్భంలో కొందరిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు బయటపడుతుంటుంది.  క్రియేటినిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అసలు కియేటినిన్ అంటే ఏంటి? ఇది ఎక్కువ స్థాయిలో ఉంటే కిడ్నీలు ఎందుకు డేంజర్ లో పడతాయి.  దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే.. క్రియాటినిన్ అంటే.. క్రియాటినిన్ అనేది కండరాలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. ఈ క్రియాటినిన్ ను మూత్రపిండాలు సులువుగానే ఫిల్టర్ చేస్తాయి. అయితే దీనికి కూడా ఒక పరిమితి ఉంది.  ఈ పరిమితికి మించి క్రియాటినిన్ అనేది ఉత్పత్తి అయితే మూత్రపిండాల పనితీరు మీద ప్రబావం చూపిస్తుంది. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రపిండాలలో విష పదార్థాలు పేరుకుపోయి మూత్రపిండాల మీద ఒత్తిడి పెరుగుతుంది. క్రియాటినిన్ ఎలా పెరుగుతుంది? మానవ శరీరంలో క్రియేటిన్ అనే సమ్మేళనం విచ్చిన్నం కావడం ద్వారా క్రియేటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది కండరాలకు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఉన్నప్పుడు మూత్రపిండాలు దీన్ని సులువుగా ఫిల్డర్ చేసి, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. అయితే గాయం, ఇన్పెక్షన్, మధుమేహం, అదిక రక్తపోటు, మందుల దుష్ప్రభావాల వల్ల మూత్రపిండాలు ప్రభావితం అయినప్పుడు రక్తంలో క్రియేటినిన్ స్థాయిలు పెరుగుతాయి. కొన్నిసార్లు శరీరం డీహైడ్రేషన్ కు లోను కాపడం,  అధికంగా ప్రోటీన్ తీసుకోవడం, కఠినమైన వ్యాయామాలు చేయడం లేదా కొన్ని మందులు.. మొదలైనవి క్రియేటినిన్ ను పెంచుతాయి. క్రియేటినిన్ స్థాయి.. సాధారణంగా క్రియేటినిన్ స్థాయి 0.6-1.3m/dl వరకు ఉంటుంది.  ఇది మగవారిలో కొంచెం ఎక్కువ ఉంటుంది.  స్త్రీలలో కండర ద్రవ్యరాశిని బట్టి కొంచెం తక్కువగా ఉంటుంది. క్రియేటినిన్ పెరిగితే కనిపించే లక్షణాలు.. రక్తంలో క్రియేటినిన్ పెరిగితే ఎప్పుడూ అలసటగా ఉండటం, కాళ్లలో వాపు, ఊపిరి ఆడకపోవడం,  మూత్ర విసర్జనలో మార్పులు, తలనొప్పి,  కంటి చూపు మసకబారటం, నడుము దిగువ భాగంలో నొప్పి మొదలైన లక్షణాలు శరీరంలో క్రియేటినిన్ స్థాయిలు పెరిగాయనడానికి సంకేతాలు. మూత్రపిండాల మీద ఒత్తిడి పెరిగితే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. క్రియేటినిన్ స్థాయిలను మొదట్లోనే గుర్తించగలిగితే కిడ్నీల  ఆరోగ్యం కాపాడుకోవడానికి వీలవుతుంది. క్రియేటినిన్ ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది.. శరీరంలో క్రియేటినిన్ స్థాయిలను ముందుగానే గుర్తించి, వైద్యం తీసుకోగలిగితే మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ క్రియేటినిన్ ను గుర్తించకుండా అలాగే ఎక్కువ రోజులు కొనసాగితే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, మూత్రపిండాల వైఫల్యం,  గుండె సమస్యలు,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి తీవ్రమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. క్రియేటినిన్ పెరకకూడదంటే ఏం చేయాలి? క్రియేటినిన్ పెరగకూడన్నా, క్రియేటినిన్ ను మూత్రపిండాలు సమర్థవంతంగా ఫిల్టర్ చేయాలన్నా నీరు పుష్కలంగా తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ప్రోటీన్, ఉప్పు నియంత్రణలో తీసుకోవాలని, మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉంటే వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని కూడా వైద్యులు చెబుతున్నారు.  అదే విధంగా వైద్యుల సలహా లేకుండా మందులు, ముఖ్యంగా మూత్రపిండాలను ప్రభావితం చేసే మందులు అస్సలు వాడకూడదు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా తెలుసా?

  చాలా మంది  సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా  ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. గతంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు,  ఫ్లూ లాంటి అనారోగ్యాలు వచ్చేవి. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల  డెంగ్యూ, చికున్‌గున్యా, విరేచనాలు, హెపటైటిస్ వంటి  ఇతర వైరల్ వ్యాధులు సీజన్‌తో సంబంధం లేకుండా వేగంగా వ్యాపిస్తున్నాయి. భారతదేశంలో వైరల్ ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని నివేదికలు కూడా చెబుతున్నాయి. భారతదేశంలోని ప్రతి 9మందిలో ఎవరో ఒకరు ఏదో ఒక అంటు వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇన్ఫెక్షన్లు రెండు విధాలుగా ఉన్నాయి.  ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్, రెండవది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.  ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుంటే..  వైరల్ ఇన్ఫెక్షన్,  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. ఇవి రెండూ శరీరంలో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. కానీ వాటి కారణాలు, లక్షణాలు,  చికిత్సలు భిన్నంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్.. వైరల్ ఇన్ఫెక్షన్ తుమ్మడం, దగ్గడం లేదా అప్పటికే ఇన్పెక్షన్ సోకిన ప్రాంతాలను తాకడం వంటి పనులు చేయడం ద్వారా   వైరస్ శరీర కణాల లోపల వ్యాప్తి చెందుతుంది. ఇది సాధారణంగా జ్వరం, అలసట, గొంతు నొప్పి, శరీర నొప్పులు, తేలికపాటి దగ్గుకు కారణమవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే సాధారణంగా  5-7 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను తగ్గించడానికి మాత్రమే మందులు ఇవ్వబడతాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.. బాక్టీరియల్  ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారం, నీరు లేదా గాయాల  ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ శరీరం వెలుపల జీవించగల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లో  సాధారణంగా అధిక జ్వరం, దగ్గు, గొంతు లేదా చర్మ ఇన్ఫెక్షన్,  వాపుకు కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి  యాంటీబయాటిక్స్ ఇస్తారు.  ఈ యాంటీ బయాటిక్స్   బ్యాక్టీరియాను చంపుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ.. వైరల్ ఇన్ఫె7న్ ఎవరికైనా రావచ్చు. కానీ కొందరికి మాత్రం సాధారణ వ్యక్తుల కంటే మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు,  వృద్ధులలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది.  వీరికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.  అలాగే  గర్భిణీ స్త్రీలకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా అనుభవించేవారు,  నిద్ర సరిగా లేని వ్యక్తులకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ధూమపానం,  మద్యపానం చేసే వ్యక్తులు,  ఎక్కువ మందితో ఎక్కువగా,  ఎప్పుడూ కలుస్తూ ఉండే వ్యక్తులకు,  కలుషితమైన లేదా మురికి ప్రాంతాలలో నివసించే ప్రజలు. కలుషిత ఆహారం వంటివి తీసుకునేవారికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కుగా ఉంటుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
నకిలీ పనీర్  కనిపెట్టడానికి సూపర్ టిప్స్ ఇవి..!

శరీరానికి శక్తిని ఇవ్వడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.  శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు,  ఖనిజాలు,  అమైనో ఆమ్లాలు.. ఇలా అన్ని రకాలు అవసరం అవుతాయి. ఇలా అన్ని కలగలిసిన ఆహారాన్నే సమతుల ఆహారం అని అంటారు. ముఖ్యంగా ప్రోటీన్ మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది.   కానీ శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్, పాలు, కాయ ధాన్యాలు మొదలైన వాటి మీద ఆదారపడతారు.  అయితే మార్కెట్లో ప్రస్తుతం కల్తీ అవుతున్న పదార్థాలలో పనీర్ ఏ ప్రథమ స్థానంలో ఉంది. మరొకవైపు పనీర్ కు ఆధరణ కూడా పెరుగుతోంది.  ఈ క్రమంలో అసలు పనీర్ ఏది? నకిలీ పనీర్ ఏది? దీన్ని కనుక్కోవడానికి సహాయపడే సూపర్ టిప్స్ ఏవి? తెలుసుకుంటే.. శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్ ను ఎక్కువగా తీసుకుంటారు. పనీర్ రుచిగా ఉండటమే కాకుండా శక్తిని, బలాన్ని కూడా సమృద్దిగా అందిస్తుంది. కానీ మార్కెట్లో చాలా రకాల నకీలీ పనీర్ అమ్ముతుంటారు. దీన్ని కనుక్కోవడానికి ముఖ్యమైన నెంబర్ వన్ టిప్.. వాసన.. పనీర్ ను పాల నుండి తయారు చేస్తారు. అందువల్ల పనీర్ పాల వాసన వస్తుంది. అలా కాకుండా పనీర్ ఏదైనా రసాయనాల వాసన వస్తుంటే అది నకిలీ పనీర్ అని గుర్తించాలి. కొన్నిచోట్ల పనీర్ ను అప్పటికప్పుడు పెద్ద పెద్ద కేక్ ల నుండి కొద్ది కొద్దిగా కట్ చేసి వెయిట్ ప్రకారం అమ్ముతారు.  ఇలాంటి చోట పనీర్ ను కొనుగోలు చేస్తుంటే సింపుల్ గా చిన్న ముక్క పనీర్ ను రుచి కోసం అడిగి తీసుకుని తిని చూడాలి. నిజమైన పనీర్ అయితే మృదువుగా, రుచిగా ఉంటుంది. అదే నకిలీ పనీర్ అయితే తిన్నప్పుడు కూడా కాస్త వింత వాసన వస్తుంది నిజమైన పనీర్ ను తురిమినప్పుడు లేదా చేత్తో నలిపినప్పుడు మృదువుగా, సులువుగా మెత్తగా గుజ్జులాగా అవుతుంది.  అయితే నకిలీ పనీర్ అలా ఉండదు.  ఇది రబ్బర్ లాగా, కొంచెం గట్టిగా ఉంటుంది. పనీర్ నకిలీదా,  నిజమైనదా తెలుసుపోవడానికి మరొక సూపర్ టిప్ ఉంది. పనిర్ ను నీటిలో మరిగించి పిండి లేదా సోయా బీన్ పిండిని కలపాలి. ఇలా చేసినప్పుడు పనీర్ ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్ నకిలీదని అర్థం.  ఎందుకంటే నిజమైన పనీర్ ఈ ప్రాసెస్ లో రంగు మారదు. పనీర్ నకిలీదా లేదా నిజమైనదా కనుక్కోవడానికి అయోడిన్ పరీక్ష కూడా నిర్వహించవచ్చు.  పనీర్ ను వేడినీటిలో సుమారు 5 నిమిషాలు ఉడకబెట్టాలి.  ఆ తరువాత కొన్ని చుక్కల అయోడిన్ టింక్చర్ జోడించాలి.  ఇలా జోడించిన తరువాత రంగు నీలంలోకి మారితే ఆ పనీర్ నకిలీదని అర్థం. ప్యాకింగ్ చేసిన పనీర్ ను కొనుగోలు చేసేటప్పుడు దాని ఎక్స్‌పైరీ డేట్ ను చెక్ చేయాలి. అదే విదంగా పనీర్ ప్యాకెట్ పైన పనీర్ తయారీలో ఉపయోగించిన పదార్థాల లిస్ట్ ఉంటుంది.  ఆ లిస్ట్ ను కూడా చెక్ చేయాలి. ఇది పనీర్ నకిలీదా లేదా అసలైనదా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
చలికాలంలో బెల్లం, వేయించిన శనగలు తినడం వల్ల కలిగే లాభాలు తెలుసా!

  శీతాకాలంలో చలి  రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తొందరగా అలసిపోయేలా చేస్తుంది.  ఇన్ఫెక్షన్లు కలిగించడానికి కూడా కారణం అవుతుంది. చలికాలంలో ఏం తింటున్నాం,  ఏ దుస్తులు ధరిస్తున్నాం అనేదికూడా ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది.  చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని ఆహారాలు చాలా బాగా పనిచేస్తాయి.  భారతీయుల సాంప్రదాయ ఆహారాలు సీజనల్ సమస్యలకు ఔషధంగానూ,శరీరానికి సూపర్ పుడ్ గానూ పనిచేస్తాయి. అలాంటి ఆహారాలలో   వేయించిన శనగలు, బెల్లం అద్భుతమైన కాంబినేషన్ గా పిలవబడుతుంది.  అటు ఆరోగ్యాన్ని, ఇటు పోషకాలను కూడా సమృద్దిగా అందించే ఈ బెల్లం, వేయించిన శనగలను చలికాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. గుండె ఆరోగ్యం.. బెల్లం  గుండెకు చాలా అవసరమైన ఐరన్,  పొటాషియంలను అధికంగా కలిగి ఉంటుంది . ఐరన్ రక్త ప్రసరణను బాగా నిర్వహించడానికి సహాయపడుతుంది, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శనగపప్పులో విటమిన్లు, కాల్షియం,  మెగ్నీషియం ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి,  గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయని  ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. ఇది అలసట,  బలహీనతకు కారణమవుతుంది. బెల్లం తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు.  అలాగే ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థకు సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం.. తరచుగా మలబద్ధకం, ఉబ్బరం లేదా గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే  ఆహారంలో బెల్లం,  శనగపప్పులను తీసుకోవడం చాలా మంచిది. బెల్లం,  వేయించిన శనగలు.. రెండింటిలో  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నయం చేయడంలోనూ,  జీర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలోనూ సహాయపడుతుంది. బెల్లం,  శనగల కాంబినేషన్  ప్రేగులను శుభ్రపరచడమే కాకుండా,  శరీరం జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి కూడా సహాయపడుతుంది.  ప్రతి రోజూ ఒక చిన్న బెల్లం ముక్క,  ఒక గుప్పెడు వేయించిన శనగలు తినడం మంచిది. కండరాల ఆరోగ్యం.. శరీరం బలంగా, దృఢంగా ఉండాలని అనుకునేవారికి బెల్లం,  శనగలు చాలా మంచి ఛాయిస్ అంటున్నారు పోషకాహార నిపుణులు. బెల్లంలోని పొటాషియం కండరాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. కండరాల తిమ్మిరి సమస్యను తగ్గిస్తుంది. వేయించిన శనగల్లో ఉండే ప్రోటీన్ కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. మెదడు,  దంతాల ఆరోగ్యం.. వేయించిన శనగలు,  బెల్లం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందట. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని,  కంటిచూపును మెరుగుపరుస్తాయి. బెల్లం,  వేయించిన శనగపప్పు రెండింటిలో భాస్వరం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన దంతాలు,  ఎముకలకు చాలా ముఖ్యం.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

read more
ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-బి12 లోపం ఉన్నట్టే..!

  శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో విటమిన్-బి12 ముఖ్యమైనది. నేటి కాలంలో విటమిన్ బి12 లోపం ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం తినే ఆహారం, తీసుకునే పానీయాల విషయంలో తగిన శ్రద్ద లేకపోవడం. ఈ లోపం మెల్లిగా పెరుగుతుంది.  ఇది శరీరం వివిధ సంకేతాలను కూడా  ఇస్తుంది.  కానీ చాలామంది విటమిన్-బి12 లోపాన్ని ఈ లక్షణాల ద్వారా గుర్తించలేరు.  విటమిన్ బి12 లోపం మొదలైనప్పుడు కనిపించే లక్షణాలేంటి? విటమిన్-బి12 లోపిస్తే శరీరంలో కలిగే మార్పులేంటి? తెలుసుకుంటే.. నాలుక రంగు, ఆకృతి.. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు కనిపించే  మొదటి ల7ణం  నాలుక ఆకృతి, రంగులో మార్పు. నాలుక పాపిల్లే అని పిలువబడే చిన్న గడ్డలతో కప్పబడి ఉంటుంది. కానీ విటమిన్-బి12 లోపంలో పాపిల్లే క్రమంగా తగ్గిపోతుంది. నాలుక నునుపుగా, మెరుస్తూ   కనిపిస్తుంది. నాలుక రంగు.. చాలా మందిలో నాలుక  సాధారణ గులాబీ రంగు నుండి ముదురు ఎరుపు లేదా గొడ్డు మాంసం ఉన్నట్టు  ఎరుపు రంగులోకి మారుతుంది. పాపిల్లే కోల్పోవడం వల్ల నాలుక ఉపరితలం సన్నగా అవుతుంది, దీని వలన లోపలి వాపు బయటపడుతుంది. ఇది కారంగా లేదా వేడిగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు మంట, చురుకు తగలడం లేదా నొప్పి వంటి ఇబ్బందులు కలిగిస్తుంది. నోటి పూతలు, పుండ్లు.. తరచుగా నోటి పూతల లేదా త్వరగా నయం కాని చిన్న పుండ్లు వస్తుంటే అది విటమిన్ బి12 లోపానికి ప్రధాన సంకేతం. శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి విటమిన్ బి12 చాలా ముఖ్యమైనది. ఈ లోపం వల్ల  నోటిలోని సున్నితమైన కణాలు సరిగ్గా ఏర్పడకపోగా, తరచుగా పూతల,  పుండ్లు వస్తాయి. నాలుకలో జలదరింపు, వింత ఫీలింగ్.. నరాల ఆరోగ్యానికి విటమిన్ బి12 చాలా ముఖ్యమైనది. ఈ విటమిన్ లోపం ఏర్పడినప్పుడు అది  నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే కొంతమందికి నాలుకపై వింతైన జలదరింపు, ముళ్ళు గుచ్చుకోవడం లేదా తేలికపాటి మంట వంటి ఫీలింగ్ కలుగుతుంది.  ఇంత జరిగినా   పుండ్లు లేదా వాపు వంటివి మాత్రం నాలుకపై కనిపించవు. సూదులు గుచ్చుకున్న ఫీలింగ్.. చాలా మందికి నాలుకలో పిన్స్,  సూదులు గుచ్చుకున్నట్టు అనిపించడం,  లేదా కొన్నిసార్లు తిమ్మిరి అనిపించడం జరుగుతుంది. దీన్ని వైద్యపరంగా లింగ్యువల్ పరేస్తేసియా అని పిలుస్తారు. దీని అర్థం B12 లోపం నరాలను ప్రభావితం చేస్తుందని, ఇది తరువాత తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని సూచిస్తుంది. విటమిన్-బి-12 లోపాన్ని ఎలా అధిగమించాలి? గుడ్లు, పాలు, పెరుగు, పనీర్, జున్ను వంటి పాల ఉత్పత్తులు విటమిన్ బి12 లోపాన్ని నయం చేయడంలో సహాయపడతాయి. చేపలు,  చికెన్ మాంసాహారాలలో విటమిన్-బి12 చాలా మెరుగ్గా ఉంటుంది. శాఖాహారులు బలవర్థకమైన పాలు, బలవర్థకమైన తృణధాన్యాలు, సోయా పాలు,  ప్లాంట్ బేస్డ్ మిల్క్ వంటివి తీసుకోవాలి. కొన్ని పుట్టగొడుగులలో కూడా తక్కువ మొత్తంలో విటమిన్-బి12 ఉంటుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో విటమిన్-డి వేగంగా లభిస్తుంది?

విటమిన్ డి ఉత్పత్తికి సూర్యరశ్మి చాలా ముఖ్యం.  అందుకే  దీనిని  సన్ లైట్ విటమిన్ అని కూడా  పిలుస్తారు. శీతాకాలంలో చాలా మంది  విటమిన్ డి లోపాన్ని ఎదుర్కొంటారు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.  కానీ ప్రధాన కారణం మాత్రం  శీతాకాలంలో సూర్యరశ్మి సూర్యుడి ప్రకాశం తక్కువగా ఉండటం. వాతావరణంలో పొగమంచు,  కాలుష్యం కారణంగా సూర్యకిరణాలు నేలను సరిగ్గా చేరుకోలేవు. ఇది మాత్రమే కాకుండా శీతాకాలంలో చలి కారణంగా వెచ్చని దుస్తులు ధరిస్తుంటాము.   చర్మం సూర్యరశ్మికి గురి కాకుండా ఉండటానికి ఇది కారణం అవుతుంది.  విటమిన్ డి మన శరీరానికి, ముఖ్యంగా ఎముకల బలం,  రోగనిరోధక శక్తికి చాలా అవసరం. ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో సూర్యరశ్మికి గురి కావడం వల్ల విటమిన్-డి బాగా లభిస్తుందో తెలుసుకుంటే.. విటమిన్-డి.. ఏ సమయంలో లభిస్తుంది.. అతినీలలోహిత B సూర్యకాంతి బలంగా ఉన్నప్పుడు మన శరీరాలు విటమిన్ D ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. ఇది సాధారణంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు వాతావరణం ద్వారా అతి తక్కువ దూరం ప్రయాణిస్తాయి. మద్యాహ్న సూర్యకాంతి మంచిదా? శీతాకాలంలో సన్‌స్క్రీన్ లేకుండా శరీరంలోని కొన్ని ప్రాంతాలను.. అంటే.. చేతులు, ముఖం వంటి ప్రాంతాలను  20-30 నిమిషాలు ప్రత్యక్ష సూర్యకాంతికి గురిచేస్తే సరిపోతుందట. ఈ  వ్యవధిలో శరీరం తగినంత మొత్తంలో విటమిన్ డిని వేగంగా సంశ్లేషణ చేస్తుందట. కాలం, భౌగోళిక స్థానం.. విటమిన్ డి సంశ్లేషణ వ్యవధి భౌగోళిక స్థానం అంటే భూమధ్య రేఖ నుండి నివసించే దూరం, సీజన్,  చర్మం రంగుపై ఆధారపడి ఉంటుందట. ముదురు రంగు చర్మం ఉన్నవారికి లేత చర్మం ఉన్నవారి కంటే విటమిన్ డి సంశ్లేషణ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందట. అందువల్ల అవసరాలకు అనుగుణంగా,  జాగ్రత్తగా సూర్యరశ్మిని తీసుకోవడం మంచిది. జాగ్రత్తలు.. మధ్యాహ్న సూర్యరశ్మి  విటమిన్ డి కి ఉత్తమమైనది అయినప్పటికీ, ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. అందువల్ల చర్మవ్యాధి నిపుణులు  చర్మ రకం,  భౌగోళిక స్థానం ఆధారంగా ఎండలో ఎంతసేపు ఉండాలనే విషయాన్ని అవగాహన చేసుకోవాలని చెబుతున్నారు. మధ్యాహ్న  సమయంలో సూర్యరశ్మిలో ఉండేవారు  30 నిమిషాల కంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకుండా ఉండాలట.   చర్మం కొద్దిగా గులాబీ రంగులోకి మారుతున్నట్టు అనిపించగానే వెంటనే నీడలోకి వెళ్లడం సన్ స్క్రీన్ రాసుకోవడం వంటివి చేయాలి.  విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి విటమిన్-డి ఆహారాలు, మంచి పోషకమైన ఆహారాలు తీసుకోవాలి.                                *రూపశ్రీ.

read more
పెరుగులో చియా సీడ్స్ నానబెట్టుకుని ప్రతి రోజూ తింటే ఏం జరుగుతుంది?

ఆరోగ్యం మీద స్పృహ పెరిగిన నేటి కాలంలో ఆహారం విషయంలో చాలా ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి.  సోషల్ మీడియాలో చాలా రకాల ఆహారాల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆరోగ్య స్పృహ కారణంగా కొన్ని ఆహారాలకు ఆదరణ కూడా పెరుగుతోంది. చాలా మంది ఫాలో అవుతున్న అలాంటి ఆహారాలలో పెరుగులో నానబెట్టిన చియా సీడ్స్ తినడం కూడా ఒకటి. అసలు చియా సీడ్స్ ను పెరుగులో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఇది ఆరోగ్యానికి కలిగించే బెనిఫిట్స్ ఏంటి? తెలుసుకుంటే.. పెరుగు.. పెరుగు ప్రోబయోటిక్ అనే విషయం అందరికీ తెలిసిందే. కాల్షియం,  హై క్వాలిటీ ప్రోటీన్లు పెరుగులో చాలా మెరుగ్గా ఉంటాయి.  ఇవి  జీర్ణవ్యవస్థను,  ఎముకలను బలోపేతం చేస్తాయి. చియా గింజలు.. చియా గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.  అవి రోగనిరోధక శక్తిని పెంచి,  ఎముకలను బలోపేతం చేసి,   గుండె ఆరోగ్యానికి సపోర్ట్ చేసే ఔషదంగా పనిచేస్తాయి. పెరుగు, చియా కాంబినేషన్..  కండరాలను బలోపేతం చేసుకోవాలనుకునే వారికి లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారికి పెరుగు, చియా విత్తనాల కాంబినేషన్ ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు, చియా కాంబినేషన్ బెనిఫిట్స్.. పెరుగు ఎముక సాంద్రతను కాపాడుకోవడానికి అవసరమైన కాల్షియం,  విటమిన్ డి కి అద్భుతమైన మూలం. చియా గింజలు మెగ్నీషియం,  భాస్వరంను జోడిస్తాయి. ఈ  పోషకాల కలయిక ఎముక బలానికి చాలా సహాయపడుతుంది. చియా గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు (ముఖ్యంగా ALA) పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో,  రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి,  పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలలోని ఫైబర్ జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. పేగు ఆరోగ్యం బలంగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. పెరుగులోని ప్రోటీన్,  చియా విత్తనాలలోని ఫైబర్  ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. ఆకలి బాధలను నివారిస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్  తీసుకోవడం వల్ల ఎక్కువసేపు, నెమ్మదిగా శక్తి విడుదల అవుతుంది.  ఇది టైప్-2 డయాబెటిస్,  బరువు కంట్రోల్ ఉండటం వంటి వాటికి సహాయపడుతుంది.                                  *రూపశ్రీ.

read more
శీతాకాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

బెల్లం భారతీయ ఆహారంలో చాలా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా సంప్రదాయ వంటకాల్లో బెల్లం వినియోగం ఎక్కువ. అలాగే ఆయుర్వేదం పరంగా కూడా బెల్లానికి ప్రముఖ స్థానం ఉంది. బెల్లం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా మంచిది. బెల్లంలో  శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక ఖనిజాలు,  విటమిన్లు ఉంటాయి. ఇది సహజంగా ఉత్పత్తి చేయబడుతుంది.  ఈ కారణంగా  దాని పోషక విలువలు చాలా వరకు పదిలంగా ఉంటాయి. 3,000 సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యంలో బెల్లం సహజ స్వీటెనర్‌గా ఉపయోగించబడుతోంది. ఇది రక్తహీనత, కామెర్లు, ఉబ్బసం,  అలెర్జీల వంటి సమస్యల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న బెల్లాన్ని శీతాకాలంలో తినడం వల్ల చాలా అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. పోషకాలు.. 100గ్రాముల బెల్లంలో 98గ్రాముల సుక్రోజ్, 89మి.గ్రాల.. కాల్షియం 5.4మి.గ్రాల..  ఐరన్ 31మి.గ్రాల.. పొటాషియం 70మి.గ్రాల.. మెగ్నీషియం 25మి.గ్రాల.. సోడియం 30మి.గ్రాల.. ఫాస్పరస్ ఉంటాయి. శీతాకాలంలో బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు.. శీతాకాలంలో మన జీవక్రియ మందగిస్తుంది.  మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనకు ఎక్కువ శక్తి అవసరం. బెల్లానికి ఉన్న లక్షణాల కారణంగా  అటు  అద్భుతమైన సహజ శక్తిని ఇస్తుంది. ఇటు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బెల్లం థర్మోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే ఇది శరీర ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది.  జలుబు నుండి రక్షిస్తుంది. బెల్లంలోని జింక్, సెలీనియం,  యాంటీఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను నివారించడంలో,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బెల్లంలోని సహజ సమ్మేళనాలు గొంతు నొప్పిని ఉపశమనం చేస్తాయి.  శ్లేష్మాన్ని క్లియర్ చేయడంలో సహాయపడతాయి. బెల్లం  శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, చర్మాన్ని స్పష్టంగా,  సహజంగా ప్రకాశవంతంగా ఉంచుతుంది. బెల్లంలోని కాల్షియం,  భాస్వరం ఎముకలకు మద్దతు ఇస్తాయి. శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి భోజనం తర్వాత చిన్న  బెల్లం  ముక్క తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు సక్రియం అవుతాయి.  మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.                                  *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
రోజూ ఉదయమే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!

  ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం,  క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది.  ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు,  హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.  జీర్ణక్రియ,  పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్  ఎక్కువగా ఉంటుంది.  ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి,  గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం,  ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు,  గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు,  శ్వాసకోశ ఆరోగ్యం,  జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు,  విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా  అన్ని రకాల ఉప్పులు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు.  తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు,  గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు  ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ.  

read more
వేడినీళ్లు తాగడం వల్ల పొట్ట కొవ్వు కరుగుతుందా? అసలు నిజాలేంటంటే..!

మానవ శరీరానికి  నీరు చాలా ముఖ్యం. దాహం తీర్చుకోవడానికి మాత్రమే కాదు..  శరీరం సరిగ్గా పనిచేయడానికి,  వ్యాధులను నివారించడానికి కూడా నీరు  ఇంధనంలా పనిచేస్తుంది.  మానవ శరీరంలో దాదాపు 70 శాతం నీటితో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సరిగ్గా పనిచేయడానికి ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. కొందరు చల్లని నీరు తాగితే.. కొందరు వేడినీరు తాగుతుంటారు. చల్లని,  వేడి నీరు రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం తర్వాత చల్లటి నీరు తాగితే శరీరం చల్లబడుతుంది.  వేడి నీరు శరీరంలో విషాలను  బయటకు పంపడానికి,  జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే వేడి నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు కరగడానికి సహాయపడుతుందని చెబుతుంటారు. ఇది ఎంత వరకు నిజం? దీని గురించి తెలుసుకుంటే.. కొన్ని పరిశోధనలు ఎక్కువ నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడంలో  సహాయపడుతుందని చెబుతున్నాయి.  నీరు తాగడం వల్ల  కడుపు నిండినట్లు అనిపించడం,  తక్కువ తినడం జరుగుతుంది. ఇది శరీరం పోషకాలను బాగా గ్రహించడానికి,  హానికరమైన పదార్థాలను తొలగించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.  భోజనానికి ముందు అర లీటరు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు 30శాతం మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. వేడి నీరు, బరువు.. ఉదయం లేదా రోజంతా ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడానికి మూడు విధాలుగా సహాయపడుతుందట. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి శరీరం అదనపు శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది జీవక్రియను సక్రియం చేస్తుంది. గోరువెచ్చని నీరు శరీర కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి,  చిన్న అణువులుగా మార్చడానికి సహాయపడుతుంది.  జీర్ణవ్యవస్థ వాటిని మరింత సులభంగా బర్న్ చేయడానికి  వీలు కల్పిస్తుంది. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఆకలి తగ్గుతుంది, తద్వారా కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. వేడి నీటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు.. నీరు జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారాలను కరిగించడంలో సహాయపడుతుంది.  గోరువెచ్చని నీరు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా శరీరంలో నొప్పి,  ఒత్తిడి రెండింటినీ తగ్గిస్తుంది. గోరువెచ్చని నీరు ప్రేగుల కదలికను పెంచుతుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. వేడినీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.   చెమట ద్వారా చర్మ రంధ్రాల నుండి విష పదార్థాలు విడుదలవుతాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఈ 5 లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని అర్థం..!

  మూత్రపిండాలు మానవ శరీరంలో ఒక భాగం. ఇవి 24 గంటలు నిశ్శబ్దంగా తమ విధులు నిర్వర్తిస్తాయి.  మూత్రపిండాలు  శరీరం నుండి విషాన్ని,  అదనపు నీటిని తొలగిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.   ఖనిజాల సమతుల్యతను కాపాడుతాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే  శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని పట్టించుకోరు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే అవి తీవ్రమైన అనారోగ్యంగా డవలప్ అవుతాయి.  ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఏదో ఒక రకమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని,  వీటి కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. మూత్రపిండాలు సరిగా పని చేయకపోతే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుంటే.. లక్షణాలు.. కిడ్నీ సమస్యలు తరచుగా చాలా చిన్న లక్షణాలతో మొదలవుతాయి. కానీ వాటిని పట్టించుకోకపోతే చాలా పెద్ద సమస్యగా మారతాయి.   అలసట,బలహీనత.. ఎప్పుడూ అలసట, కాళ్ళలో లేదా కళ్ళ కింద వాపు, మూత్రం రంగు లేదా పరిమాణంలో మార్పులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మం పొడిబారడం, చర్మం దురదగా ఉండటం  మొదలైనవన్నీ మూత్రపిండాలు బలహీనపడుతున్నాయనడానికి సంకేతాలు. ఎప్పుడూ  అలసట లేదా బలహీనత అనేవి శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతున్నాయని,  మూత్రపిండాలు వాటిని సరిగ్గా తొలగించలేకపోతున్నాయని అర్థం. బాగా  నిద్రపోయిన  తర్వాత కూడా  అలసిపోయినట్లు అనిపించడాన్ని , అస్సలు  తేలికగా తీసుకోకూడదు.  శరీరంలో వాపు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రపిండాలు అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు అది శరీరంలోని కొన్ని భాగాలలో పేరుకుపోవడం మొదలుపెడుతుంది. ఇది మొదట పాదాలు, చేతులు లేదా ముఖంలో కనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు. మూత్రంలో మార్పులు.. మూత్రపిండాల సమస్యలకు చాలా స్పష్టమైన సంకేతం. ముదురు రంగు మూత్రం, మూత్రంలో నురుగు లేదా బుడగలు, తరచుగా మూత్రవిసర్జన లేదా మంట వంటివి మూత్రపిండాల సమస్యను సూచిస్తాయి. శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వైఫల్యాలు ఎదుర్కునే చాలామందిలో ఉండే లక్షణం. మూత్రపిండాలు శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు ఆ ద్రవం ఊపిరితిత్తులకు చేరుకుంటుంది.  శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు  గుండె లేదా ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు. కానీ అసలు కారణం మూత్రపిండాల సమస్య. పొడి, దురద చర్మం.. మూత్రపిండాలు రక్తం నుండి అవసరమైన ఖనిజాలు,  వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల పొడి చర్మం,  దురద వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మాన్ని పొడిగా, దురదగా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధి సమస్యలు ముదిరే కొద్ది ఈ సమస్య బయటకు కనిపిస్తుంది. పై లక్షణాలు ఏవైనా  కనిపిస్తే ఆలస్యం చేయకుండా  వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ముందుగా గుర్తించడం వల్ల వ్యాధిని నివారించడమే కాకుండా మూత్రపిండాల పనితీరును కూడా గణనీయంగా కాపాడుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యానికి సమతుల్య,  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం  చాలా ముఖ్యం. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి.  అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది,  మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, కాలీఫ్లవర్, క్యాబేజీ,  క్యాప్సికం వంటి పొటాషియం తక్కువగా ఉన్న పండ్లు,  కూరగాయలు మూత్రపిండాల సమస్యలు రాకుండా చేయడం లేదా, మూత్ర పిండాలను సంరక్షించడం చేస్తాయి. అందుకే వీటిని తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి,  మూత్రపిండాల ఒత్తిడిని తగ్గిస్తాయి.  చేపలు, కాయధాన్యాలు లేదా గుడ్డులోని తెల్లసొన వంటి లీన్ ప్రోటీన్ లను  తీసుకోవాలి. రెడ్ మీట్,  ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి.  వీటిలోని ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలు  ఎక్కువగా పని చేయడానికి కారణం అవుతాయి. ప్రతి చిన్న సమస్యకు అధికంగా  మందులు వాడటం, ముఖ్యంగా నొప్పి నివారణ మందులు, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. వైద్యుల సలహా లేకుండా  పదే పదే పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు.                             *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఈ మందులు ఎక్కువ కాలం వాడితే ఎంత డేంజరో మీకు తెలుసా?

  మందులు వాడటం నేటి కాలంలో చాలా సహజం అయిపోయింది. చిన్న సమస్య నుండి, పెద్ద ఆరోగ్య సమస్య వరకు ప్రతి సమస్య తగ్గడానికి మందులు వాడుతుంటారు.  ఇందులో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు  ఉంటాయి. కొందరు వైద్యుల సలహాతో మందులు వాడితే.. మరికొందరు సొంతంగా మందులు కొని అడపాదడపా వాడుతూనే ఉంటారు. అయితే మందులను ఎక్కువ కాలం వాడితే ఎవ్వరూ ఊహించనంత డేంజర్ సమస్య ఎదురవుతుందని చాలామందికి తెలియదు. ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు క్రమంగా తగ్గుతాయట.  ఈ లోపం శరీరం లోపల పెరుగుతూనే ఉంటుందని, దీని కారణంగా అలసట,  రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీన పడటం.. వంటి అనేక సమస్యలకు కారణమవుతుందట.  అసలు ఏ మందులు వాడటం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంది? ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. ఆస్ప్రిన్ ఆస్ప్రిన్ శరీరం విటమిన్ సి శోషణను తగ్గిస్తుంది. దీని వలన విటమిన్ సి క్రమంగా క్షీణిస్తుంది. దీర్ఘకాలిక ఆస్ప్రిన్ వాడకం వల్ల ఐరన్ నిల్వలు కూడా తగ్గుతాయి.  రోజుకు 100 mg తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ తీసుకునే 65 ఏళ్లు పైబడిన వారిలో రక్తహీనత ప్రమాదం 20 శాతం పెరిగిందని ఒక అధ్యయనం తేల్చింది. టైలెనాల్, ఎసిటమైనోఫెన్ గ్లూటాతియోన్ శరీరంలోని ప్రధాన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. టైలెనాల్ వంటి మందులు దాని స్థాయిలను తగ్గిస్తాయి, కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. తక్కువ గ్లూటాతియోన్ స్థాయిలు వృద్ధాప్యం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు,  బలహీనమైన రోగనిరోధక పనితీరు వంటి సమస్యలకు కారణం అవుతుంది. గర్భనిరోధక మాత్రలు గర్భనిరోధక మాత్రలను నిరంతరం ఉపయోగించడం వల్ల శరీరంలో ఫోలిక్ యాసిడ్, బి2, బి6, బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం,  జింక్ వంటి అనేక విటమిన్లు,  ఖనిజాలు క్షీణిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ లోపం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా మంది మహిళలు సప్లిమెంట్లను తీసుకోవలసి వస్తుంది. దీనికి గల కారణాలపై స్పష్టత లేదు.. కానీ ఈ మాత్రలలోని ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ శరీర పోషక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. మెట్‌ఫార్మిన్ మధుమేహం ఉన్నవారికి సూచించబడే మెట్‌ఫార్మిన్, పేగులో విటమిన్ బి12 శోషణను తగ్గిస్తుంది. ఎక్కువకాలం  ఉపయోగించడం వల్ల విటమిన్ బి12 లోపానికి దారితీస్తుంది. ఇది నరాల దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. యాంటాసిడ్లు యాంటాసిడ్లు కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తాయి. కానీ ఇదే ఆమ్లం ఆహారం నుండి విటమిన్ బి12 విడుదలకు సహాయపడుతుంది. దీర్ఘకాలిక యాంటాసిడ్ వాడకం వల్ల కాల్షియం, పొటాషియం,  జింక్ లోపాలు కూడా ఏర్పడతాయి, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి,  కండరాల పట్టు తగ్గుతుంది. స్టాటిన్స్ స్టాటిన్ మందులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి,  గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అవి కండరాల శక్తి ఉత్పత్తికి అవసరమైన కోఎంజైమ్ Q10 ను  తగ్గిస్తాయి. ఈ లోపం కండరాల నొప్పి, బలహీనత,  వాపుకు కారణమవుతుంది. యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ హానికరమైన బ్యాక్టీరియాను చంపుతాయి. కానీ అవి మంచి గట్ బాక్టీరియాకు కూడా హాని చేస్తాయి. ఇది గట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఊబకాయం, అలెర్జీలు, జీర్ణ సమస్యలు,   రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. స్టెరాయిడ్స్ స్టెరాయిడ్లు శరీర ఖనిజ సమతుల్యతను అనేక విధాలుగా దెబ్బతీస్తాయి.  కాల్షియం శోషణను తగ్గిస్తాయి, ఎముకలు బలహీనపడటానికి దారితీస్తాయి,  విటమిన్ డి పనితీరును కూడా తగ్గిస్తాయి. ఇది మెగ్నీషియం,  పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది.  బలహీనత, అలసట,  తిమ్మిరికి దారితీస్తుంది. దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం కూడా బి విటమిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త.. ఎక్కువ కాలంగా ఏవైనా మందులు వాడుతుంటే, వాటితో పాటు ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలో  వైద్యుడిని లేదా డైటీషియన్‌ను అడగాలి. ఈ సాధారణ జాగ్రత్తలు అలసట, రక్తహీనత, ఎముకల నష్టం,  హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
బయట తినేటప్పుడు అతిగా తినడాన్ని ఎలా నివారించాలంటే..!

ఆహారమే ఆరోగ్యానికి ఔషదంగా పనిచేస్తుంది.  భారతీయ ఆయుర్వేదం చాలా వరకు ఆరోగ్య సమస్యలకు ఆహారాన్నే ఔషదంగా సూచిస్తుంది. బోలెడు రకాల వంటకాలు,  దేశ విదేశీ రుచులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించే నేటికాలంలో ఆహారం దగ్గర కంట్రోల్ లో ఉండటం కాసింత కష్టమైన పనే.. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునేవారు, డైటింగ్ చేస్తున్నవారు..  బయట ఫంక్షన్లు,  పార్టీలు,  శుభకార్యాలు,  ఫ్రెండ్స్ తో లంచ్, డిన్నర్ వంటివి చేసేవారు ఆహారం దగ్గర కంట్రోల్ ఉండలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు.  అలా బాధపడక్కర్లేకుండా బయట తినేటప్పుడు అతిగా తినడాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటే.. హెల్తీ ఫుడ్స్.. వేయించిన, క్రిస్పీ లేదా క్రీమీ వంటకాలకు బదులుగా గ్రిల్ చేసిన, బేక్ చేసిన, ఆవిరి మీద ఉడికించిన లేదా ఉడికించిన వంటకాలను ఎంచుకోవాలి. వంట చేసిన విధానం మీద ఆ వంటలో ఉండే కేలరీలు డిసైడ్ అవుతాయి. గ్రిల్ చేసిన లేదా ఆవిరి మీద ఉడికించిన ఆహారాలకు తక్కువ నూనె అవసరం అవుతుంది.  వేయించిన లేదా క్రీమీ ఆహారాలలో ఎక్కువ ఫ్యాట్  ఉంటుంది. అందుకే  రెస్టారెంట్లలో వేయించిన ఆహారాల కంటే గ్రిల్ చేసిన లేదా కాల్చిన,  స్టీమ్ చేసిన  ఆహారాన్ని ఎంచుకోవడం మేలు. డ్రింక్స్ వద్దు.. రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా ఉండటానికి డ్రింక్స్ కు  బదులుగా నీటిని మాత్రమే తీసుకోవాలి. బయట భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింక్స్  లేదా జ్యూస్‌లు ఆర్డర్ చేయడం చాలా కామన్. కానీ ఇవి  కేలరీలు పెరగడానికి కారణం అవుతాయి. అందుకే కూల్ డ్రింక్స్, జ్యూస్ ల కంటే నీరు మాత్రమే తీసుకోవడం మేలు. హెల్తీ ఛాయిస్.. రెస్టారెంట్లలో ఫ్రైస్ లేదా చిప్స్ కు బదులుగా కూరగాయలు లేదా సలాడ్ ఎంచుకోవాలి. చాలా వంటకాలు అధిక కేలరీల కలిగిన  సైడ్ డిష్ లతో కాంబినేషన్ గా ఉంటాయి.  ఇలాంటి వాటిని హెల్తీ  ఛాయిస్ గా మార్చుకోవాలి. ప్రోటీన్ ఫుడ్..  బయటకు వెళ్లి ఆహారం తీసుకున్నా.. ఆ ఆహారం ప్రధానంగా ప్రోటీన్ ఆహారమై ఉండేలా చూసుకోవాలి. దీని కోసం చికెన్, టర్కీ లేదా చేప వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవచ్చు. ఈ ఆహారాలు కడుపు నింపడమే కాకుండా ఎక్కువసేపు శక్తిని,  హెల్తీ ఫ్యాట్స్ ను కూడా అందిస్తాయి. పోర్షన్.. చాలావరకు రెస్టారెంట్లలో ఆర్డర్ చేసే ఆహారం పెద్ద మొత్తంలో ఉంటుంది.  బిర్యానీ,  మండీ.. లాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్లేట్ మీల్స్ టైప్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని సింపుల్ గా తక్కువగా తినడం మంచిది. ఒకవేళ పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేయాల్సి వచ్చినా సొంతంగా వడ్డించుకోకుండా ఎవరితోనైనా ఆహారాన్ని వడ్డించమనాలి. దీని వల్ల ఎక్కువ ప్లేట్ లో పెట్టుకోకుండా ఉంటారు.  ఆహారం లిమిట్ లోనే ఉంటుంది. నెమ్మది.. బయట తినేటప్పుడు నెమ్మదిగా తినడం చాలా ఇంపార్టెంట్. ఏవో పనులు ఉన్నాయనో లేదా అందరూ వేగంగా తింటున్నారనో ఆహారాన్ని సరిగా నమలకుండా వేగంగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. నిదానంగా తింటే ఆహారం కూడా ఎక్కువగా కాకుండా సరిపడినంత తినవచ్చు. ఆహారం ఎంత బాగా నమిలితే అంత బాగా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
వరల్డ్ న్యూమోనియా డే.. న్యూమోనియా లక్షణాలేంటి? దీన్ని ఎలా గుర్తించాలంటే..!

న్యూమోనియా ప్రాణాంతక శ్వాసకోశ సమస్య. ఇది ఇన్పెక్షన్ లాగా వ్యాపిస్తుంది.  దీనిగురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా శిలీంధ్రాల వల్ల కలిగే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్పెక్షన్.  ఊపిరితిత్తులలోని అల్వియోలీ అనే చిన్న గాలి సంచులు వాపుకు గురై చీము లేదా ద్రవంతో నిండిపోవడానికి ఇది  కారణమవుతుంది. ఈ ద్రవం ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువ. అయితే న్యుమోనియాను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. చలి, వణుకు.. న్యుమోనియా  ముఖ్య లక్షణం తీవ్రమైన చలి,  వణుకుతో కూడిన అధిక జ్వరం. సాధారణ జ్వరంతో చలి రావడం సహజం. కానీ న్యుమోనియాలో వణుకు చాలా తీవ్రంగా ఉంటుంది. ఎన్ని దుప్పట్లు కప్పినా ఈ సమస్య ఉన్నవారికి వణుకు తగ్గదు. ఇలా వణుకు తగ్గకపోవడం.. శరీరం ఇన్ఫెక్షన్‌తో వేగంగా పోరాడటానికి ప్రయత్నిస్తుందనడానికి సంకేతమని వైద్యులు అంటున్నారు. దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఛాతీ నొప్పి, శ్లేష్మంతో కూడిన దగ్గు.. న్యుమోనియా కేవలం పొడి దగ్గు మాత్రమే కాదు, తరచుగా శ్లేష్మంతో కూడి ఉంటుంది. శ్లేష్మం పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన గోధుమ రంగులో ఉండే అవకాశం ఉంటుంది.  అంతేకాకుండా రోగులు శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు  ఛాతీ నొప్పి ఎక్కువగా అనుభవిస్తారు. ఈ నొప్పి ఊపిరితిత్తుల వాపు వల్ల వస్తుంది. శ్వాస సమస్యలు.. న్యుమోనియా ఊపిరితిత్తులలోని గాలి సంచులు నిండిపోయి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. రోగులు తగినంతగా శ్వాస తీసుకోలేకపోతున్నట్లు ఇబ్బంది పడతారు . శ్వాస వేగంగా మారుతుంది. చిన్న పిల్లలలో శ్వాస తీసుకునేటప్పుడు వారి ముక్కు రంధ్రాలు మంటగా ఉండటం లేదా వారి  ఛాతీ లోపలికి కుచించుకుపోయినట్టు ఉంటుంది. ఇది సమస్య చాలా ఎక్కువ ఉందనడానికి సంకేతం. అలసట, గందరగోళం, పెదవుల రంగు.. న్యుమోనియాతో బాధపడుతున్న వ్యక్తి తీవ్ర అలసట,  బలహీనతకు లోనవుతారు. వృద్ధులలో ఈ ఇన్ఫెక్షన్ మానసిక గందరగోళానికి లేదా అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడానికి కారణమవుతుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల పెదవులు,  గోళ్లు నీలం రంగులోకి మారవచ్చు. ఈ లక్షణాలన్నీ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను సూచిస్తాయి.                            *రూపశ్రీ.

read more
రక్తాన్ని శుభ్రం చేసే ఈ ఆహారాల గురించి తెలుసా?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని అవయవాలు పర్పెక్ట్ గా  పనిచేయాలి. ఇలా అన్ని అవయవాలు సరిగా పని చేయాలంటే దీనికి తగినంత స్వచ్ఛమైన రక్తం సరఫరా అవసరం. మన శరీరమంతా ఆక్సిజన్, హార్మోన్లు,  అవసరమైన పోషకాలను రవాణా చేయడానికి రక్తం చాలా అవసరం, కానీ  రక్తం స్వచ్ఛంగా,  శుభ్రంగా లేకపోతే ఈ ప్రక్రియ కష్టంగా జరుగుతుంది. అసలు రక్తం ఎలా మలినం అవుతుంది? రక్తం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు  ఏమిటి? తెలుసుకుంటే.. రక్తం ఎలా కలుషితం అవుతుంది? సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల  కాలక్రమేణా రక్తంలో అనేక విష పదార్థాలు పేరుకుపోతాయి. ఇది శరీరంలోని అనేక అవయవాలలో విషప్రక్రియకు దారితీస్తుంది. సాధారణంగా, మూత్రపిండాలు,  కాలేయం వంటి జీర్ణవ్యవస్థ అవయవాలు సహజంగానే రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. అయితే రక్తం ఎక్కువ కలుషితం కావడం   ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడం,  రక్తంలో విష పదార్థాలు తొలగించి రక్తాన్ని శుభ్రం  చేసే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రక్తం కలుషితం అయితే ఎదురయ్యే సమస్యలు.. ఆహారంలో మలినాలు ఎక్కువ ఉంటే..  రక్తంలో మలినాలు కూడా  పెరుగుతాయి. ఇది మన చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. రక్తంలో మలినాలు ఉంటే కాలేయం సరిగా పనిచేయదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది.  చర్మ ఇన్ఫెక్షన్లు, పదే పదే ఒకదాని తరువాత ఒకటి  మొటిమలు వస్తూ ఉండటం, దద్దుర్లు,  చికాకు, తరచుగా అలసట,  ముఖంపై మెరుపు లేకపోవడం మొదలైనవి రక్తం శుభ్రంగా లేదనే సంకేతాన్ని ఇస్తాయి. రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు.. గోరువెచ్చని నీరు, నిమ్మరసం.. నిమ్మరసం  రక్తాన్ని, జీర్ణవ్యవస్థను రెండింటినీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఆమ్లంగా ఉంటుంది. ఇది pH స్థాయిలను తగ్గించడానికి,  రక్తం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి మలినాలను తొలగించుకోవడానికి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో  తాజా నిమ్మరసం కలిపి  త్రాగాలి. ఇది  రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి  చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నీరు.. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు  తొలగడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలోని మలినాలను తగ్గిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం,  మూత్రపిండాల పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది. ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి,  మలినాలను తొలగించడానికి  సహాయపడతాయి. నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం రోజుకు సుమారు 6 కప్పుల మూత్రం ఉత్పత్తి అయ్యేంత నీరు త్రాగాలి. పసుపు.. పసుపు  రక్తాన్ని శుద్ధి చేయడానికి,  వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. పసుపులో కనిపించే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపు,  ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పసుపు పాలు  తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.   శరీరం నుండి విషాన్ని తగ్గిస్తుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

 ఇళ్ళు,  ఆఫీసులు మంచి వాసన రావడానికి  తరచుగా రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సువాసనగల ధూపం లేదా సువాసనగల కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. ఇది ఒక సాధారణ అలవాటులా అనిపిస్తుంది. కానీ ఈ "సువాసన" నెమ్మదిగా  ఆరోగ్యానికి "సైలెంట్ కిల్లర్"గా మారుతుందని తెలుసా.. చాలామంది ఇలాంటి సువాసన వల్ల ఇల్లు వాతావరణం బాగుంటుందని,  ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు.  కానీ ఈ రూమ్ ఫ్రెషనర్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. రూమ్ ఫ్రెషనర్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు.. రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్‌లు, సౌందర్య సాధనాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు,  సువాసనగల కొవ్వొత్తులు వంటి ఉత్పత్తులలో ఆరోగ్యానికి హానికరమైన వేలాది రసాయనాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా ద్రావకాలు, స్టెబిలైజర్లు, UV-అబ్జార్బర్‌లు, ప్రిజర్వేటివ్‌లు,  రంగులు ఉంటాయి. ఇవి ఇండోర్ వాయు కాలుష్యానికి కారణం అవుతాయి. ఈ రసాయనాలు ఎక్కువ కాలం పీల్చడం వల్ల అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్,  న్యూరోటాక్సిసిటీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రూమ్ ఫ్రెషనర్లు ఎక్కువకాలం వాడితే కలిగే సమస్యలు.. రూమ్ ఫ్రెషనర్లలో ఉండే రసాయనాలు కళ్ళు, గొంతు,  ఊపిరితిత్తులను కప్పే సున్నితమైన పొరలను చికాకుపరుస్తాయి. ఇది చికాకు, దగ్గు,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా తరచుగా మైగ్రేన్లు లేదా తలనొప్పుల సమస్య ఉంటే అది రూమ్ ఫ్రెషనర్ల వల్ల ఏర్పడే సమస్య కావచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు, ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్లు,  లాండ్రీ క్రిస్టల్స్, పెర్ఫ్యూమ్‌లు, కొలోన్‌లు వంటి ఉత్పత్తులు మెదడులో సున్నితమైన నరాల ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. తలనొప్పిని పెంచుతాయి. చాలా మందికి  రూమ్ ఫ్రెషనర్లు అంటే అలెర్జీ ఉంటుంది. రసాయనాల వాసన రియాక్షన్ కు తొందరగా గురయ్యేవారిలో  దగ్గు, తుమ్ము, కళ్ళు దురద,  వాయుమార్గాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఉబ్బసం,  శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. థాలేట్లు,  కొన్ని సింథటిక్ రసాయనాలు శరీరం  హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఇది సంతానోత్పత్తి,  జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా వీటికి గురికావడం వల్ల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.  పురుషులు,  స్త్రీలలో సంతానోత్పత్తి ప్రమాదాలు పెరుగుతాయి. ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ రూమ్ ఫ్రెషనర్లు ఊపిరితిత్తులను చికాకుపరుస్తాయి. దగ్గు, గురక లేదా శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయి. తక్కువ స్థాయిలో ఎక్స్‌పోజర్ కూడా పిల్లలు,  పెద్దలలో ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. రూమ్ ఫ్రెషనర్  పదార్థాలలో ఉండే ఫార్మాల్డిహైడ్,  కొన్ని అస్థిర సేంద్రియ సమ్మేళనాలు క్యాన్సర్ కలిగించే ప్రధాన సమ్మేళనాలుగా గుర్తించబడ్డాయి. ఈ సమ్మేళనాలను ఎక్కువ కాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం,  చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ ఉత్పత్తులను ఎక్కువ కాలం పీల్చడం  వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కాలేయ పనితీరు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్లు,  జీవక్రియ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తాయి.                                     *రూపశ్రీ.

read more