ఆయుర్వేదం ఆటో ఇమ్యూన్ వ్యాధులను తొలగిస్తుందా?

ఆయుర్వేదం ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఒక గొప్ప వరం. ఆయుర్వేదంలో జబ్బును మూలాల నుండి నయం చేయడం జరుగుతుంది.  ముఖ్యంగా ప్రస్తుత కాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధులు ఏంటి అంటే.. ఆటో ఇమ్యూన్ వ్యాధులు.  ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణాలపై దాడి చేసే వ్యాధులు . ఆధునిక వైద్య శాస్త్రం ఈ పరిస్థితులకు దీర్ఘకాలిక మందులు,  నియంత్రణ చికిత్సను సిఫార్సు చేస్తుంది. దీర్ఘకాలం మందులు వాడిన తర్వాత కూడా వ్యాధులు నయం కాని పరిస్థితులు కూడా ఉండవచ్చు. అయితే వైద్య శాస్త్రానికి మెరుగైన ఎంపికగా నిలిచే ఆయుర్వేదం   ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులకు  శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందా ? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.  సెప్టెంబర్ 23వ తేదీ ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఆయుర్వేదం నయం చేయగలదా లేదా అనే విషయం తెలుసుకుంటే.. ఆయుర్వేద దృక్పథం.. ఆయుర్వేదం కేవలం లక్షణాలకు చికిత్స చేయడమే కాకుండా, వ్యాధి మూలానికి వెళ్లి సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు శరీర రోగనిరోధక వ్యవస్థలో అసమతుల్యతను కలిగిస్తాయి . అయితే ఆయుర్వేదం వాటిని పూర్తిగా తొలగిస్తుందని చెప్పుకోదు. పంచకర్మ చికిత్స,  డీటాక్స్.. ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స ఆటో ఇమ్యూన్ వ్యాధుల నిర్వహణలో ప్రభావవంతంగా పరిగణించబడుతుంది . ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. రక్త శుద్ధి,  జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో పనిచేస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధులను ప్రేరేపిస్తుంది. మందులు మరియు మూలికా నివారణలు.. ఆటో ఇమ్యూన్ వ్యాధులకు సహాయపడే కొన్ని ప్రధాన ఆయుర్వేద మందులు  ఉన్నాయి. తిప్పతీగ : రోగనిరోధక శక్తిని సమతుల్యం చేస్తుంది . అశ్వగంధ : వాపును తగ్గించడానికి,  శక్తిని పెంచడానికి సహాయపడుతుంది . పసుపు : సహజ శోథ నిరోధకంగా పరిగణించబడుతుంది . వేప, త్రిఫల : శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది . ఆహారం, జీవనశైలి మార్పులు..  ఔషధం మాత్రమే కాదు, ఆహారం, జీవనశైలి కూడా  ఆటో ఇమ్యూన్ వ్యాధులలో అంతే ముఖ్యమైనవని. నూనె,  జంక్ ఫుడ్ మానుకోవాలి. తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు,  తృణధాన్యాలు తినాలి. యోగా,  ధ్యానాన్ని  దినచర్యలో భాగంగా చేసుకోవాలి . ఆధునిక వైద్య శాస్త్రం ఇంకా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు శాశ్వత నివారణను కనుగొనలేదు. ఆయుర్వేదం వాటిని పూర్తిగా నిర్మూలిస్తుందని  పేర్కొనలేదు. కానీ అది శరీర రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడంలోనూ, వ్యాధి లక్షణాలను తగ్గించడంలో,  జీవితాన్ని  ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
నానబెట్టిన వాల్నట్స్ తినడానికి ఏ సమయం ఉత్తమం తెలుసా?

  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
జామకాయలు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఈ సమస్యలున్న వారికి డేంజర్..!

  జామకాయ విటమిన్ సి, ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉండే రుచికరమైన,  పోషకమైన పండు. ఇది మంచి జీర్ణక్రియను నిర్వహించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి,  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే బోలెడు  పోషక విలువ ఉన్నప్పటికీ ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చునని అంటున్నారు పోషకాహార నిపుణులు. జామ కాయ తినడం వల్ల కొందరికి దుష్ప్రభావాలు ఉంటాయని,  దీన్ని కొందరు తినకూడదని అంటున్నారు.  ఇంతకీ జామకాయలు ఎవరు తినకూడదు? దీనికి గల కారణం ఏమిటి? తెలుసుకుంటే.. జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు.. జామపండు ఫైబర్ కు అద్భుతమైన మూలం. ఇది సాధారణంగా జీర్ణక్రియకు మంచిది. అయితే జీర్ణక్రియ  బలహీనంగా ఉన్నా   లేదా గ్యాస్, ఆమ్లత్వం లేదా ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వంటి సమస్యలతో బాధపడుతున్నా జామపండు ఎక్కువగా తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. జామపండు  విత్తనాలు జీర్ణం కావడం కష్టం. ఇది కడుపు నొప్పి, తిమ్మిరి లేదా అజీర్ణానికి కారణమవుతుంది. అలాంటి సందర్భాలలో విత్తనాలను తొలగించడం లేదా తక్కువ పరిమాణంలో జామపండు తినడం మంచిది. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు.. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు.. ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు పొటాషియం తీసుకోవడం ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. జామకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దెబ్బతిన్న మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను తొలగించలేవు. దీని వలన రక్తంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితిని హైపర్‌కలేమియా అంటారు. ఇది గుండెకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. డయాబెటిస్ రోగులు.. జామపండు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.   రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది  . అయినప్పటికీ ఇందులో సహజ చక్కెర ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని మితంగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ జామపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల తగిన మొత్తంలో జామపండ్లు తీసుకోవాలి.  ముఖ్యంగా  ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినకూడదు. అలాగే బాగా పండిన పండ్ల కంటే కాస్త పచ్చిగా ఉన్న జామ పండ్లను తీసుకోవడం వల్ల కొంచెం బెటర్ గా ఉంటుంది. జలుబు, దగ్గు లేదా గొంతు నొప్పి ఉన్నవారు.. జామపండు చల్లదనాన్ని కలిగి ఉంటుందని భావిస్తారు. అందువల్ల జలుబు, ఫ్లూ, దగ్గు లేదా గొంతు నొప్పి ఉంటే జామపండు తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట  జామపండు తినకుండా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని మందులు తీసుకునే వ్యక్తులు.. రక్తం పలుచబడటానికి మందులు తీసుకునే వ్యక్తులు జామపండు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జామపండ్లలో  రక్తం గడ్డకట్టడానికి కారణమయ్యే విటమిన్ K మంచి మొత్తంలో ఉంటుంది . అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో జామపండ్లు తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
పైనాపిల్ తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందా?  

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  అయితే కొన్ని రకాల పండ్లు కొన్ని రకాల సమస్యలకు ఔషధంలా పనిచేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ, నేరేడు డయాబెటిస్ సమస్య నియంత్రణలో ఉంచడంలో ఎలా సహాయపడుతుందో.. బీట్రూట్, క్యారెట్, ఖర్జూరం, దానిమ్మ మొదలైనవి రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఎలా సహాయపడతాయో.. అలాగే కొన్ని రకాల పండ్లు కొన్ని సమస్యలకు ప్రత్యేకంగా హెల్ప్ అవుతాయి. అలాంటి పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ సాధారణంగా పసుపు రంగులో,  అద్బుతమైన సువాసనతో పుల్లగా,  తియ్యగా చాలా బాగుంటుంది.  పైనాపిల్ లో ఆల్కహాల్ కంటెంట్ కూడా ఉంటుంది. అయితే పైనాపిల్ పురుషులలో స్పెర్మ్ కౌంట్ ను మెరుగుపరుస్తుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే పైనాపిల్ తింటే పురుషులలో స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుందా? తెలుసుకుంటే.. పైనాపిల్ నేరుగా స్పెర్మ్ కౌంట్ ను పెంచదు.. కానీ ఇది పురుషుల సంతానోత్పత్తికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. పైనాపిల్ లో విటమిన్-సి, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.  ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.  ఆక్సీకరణ ఒత్తిడి ఉంటే శరీరంలో స్పెర్మ్ కణాలు దెబ్బతింటాయి.  అంటే పైనాపిల్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా స్పెర్మ్ కణాలను రక్షిస్తుంది. విటమిన్-సి స్పెర్మ్ కౌంట్ ను, స్పెర్మ్ చలనంతో పాటు మొత్తం స్పెర్మ్ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి.  ముఖ్యంగా పైనాపిల్ లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది.  ఇది స్పెర్మ్ చలనాన్ని మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే ఫలదీకరణ ప్రక్రియలో కూడా ఇది సహాయపడుతుంది. పైనాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల స్పెర్మ్ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడే మగవారికి మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అయితే స్పెర్మ్ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి వైద్య చికిత్సలకు మించిన ప్రత్యామ్నాయంగా పైనాపిల్ ను ఎంపిక చేసుకోవడం అయితే సరైనది కాదని కూడా వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఈ సమస్యలున్న వ్యక్తులు  పెసరపప్పు తింటే డేంజర్..!

    పప్పుధాన్యాలు  ప్రోటీన్ కు మంచి మూలం. చాలా మంది  ప్రోటీన్ కోసం పెసలు,  బొబ్బర్లు,  ఉలవలు వంటివి  ఆహారంలో చేర్చుకుంటారు. పెసరపప్పు కూడా వాటిలో ఒకటి. పెసరపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండటం కోసం మొలకెత్తిన పెసలు తినడమే కాకుండా పెసరపప్పును చాలా రకాల వంటకాలు, స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తారు. సాధారణంగా పెసరపప్పు  అన్ని పప్పు ధాన్యాలలోకి  ఆరోగ్యకరమైనవి,  సురక్షితమైనవి.  కానీ  పోషకాలు అధికంగా ఉండే పెసరపప్పు  కూడా  కొందరికి హాని చేస్తుంది. ఏ వ్యక్తులకు పెసరపప్పు హానికరం,  ఎందుకు ? అనే విషయాలు తెలుసుకుంటే.. షుగర్ తక్కువ ఉన్నవారు.. చాలామంది షుగర్ లెవల్ ఎక్కువ అంటుంటారు కానీ.. షుగర్ లెవల్ తక్కువ అని కంప్లైంట్ చేసేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు  పెసరపప్పు  తినకుండా ఉండాలి. ఈ పప్పులో  రక్తంలో చక్కెరను తగ్గించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ ఉండేవారు పెసరపప్పు తింటే చక్కెర స్థాయి మరింత తగ్గి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అధిక యూరిక్ యాసిడ్ ఉన్న వ్యక్తులు..  అధిక యూరిక్ యాసిడ్ స్థాయితో ఇబ్బంది పడేవారు ఉంటారు. ఇలాంటి వారు పెసరపప్పు తినకుండా ఉండాలి. ఈ పప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది  అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారికి హానికరం . కాబట్టి, అలాంటి వ్యక్తులు పెసరపప్పును పరిమిత పరిమాణంలో తినడం మంచిది. కిడ్నీలో రాళ్లు.. మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే పెసరపప్పు  తినడం  మానుకోవాలి . పెసరపప్పులో  ఆక్సలేట్‌లు ఉంటాయి.  ఇవి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. కాబట్టి, మీకు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉంటే పెసరపప్పు  తినడం మానుకోవాలి. గ్యాస్,  ఉబ్బరం సమస్యలు.. పెసరపప్పు  ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో గ్యాస్,  ఉబ్బరం వస్తుంది. ఇంకా, పచ్చి  పెసరపప్పు తింటే వాంతులు, విరేచనాలు,  కడుపు నొప్పికి కారణమవుతాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే  వాటిని సరిగ్గా నమలడం చాలా అవసరం. *రూపశ్రీ.                             గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే పోషకాలేంటో తెలుసా?

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలే ఉంటాయి కానీ అనారోగ్యానికి కారణమయ్యేది ఏదీ ఉండదు.అందుకే అనారోగ్యం చేసినప్పుడు పండ్లను ఆహారంగా తీసుకుంటే శరీరం చాలా వరకు కోలుకుంటుంది.  ఇకపోతే స్థానిక దేశీ పండ్లు మాత్రమే కాకుండా  ఇప్పట్లో విదేశీ పండ్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మార్కెట్లలో కూడా అన్ని రకాల పండ్లు లభ్యమవుతాయి. వీటిలో డ్రాగన్ ప్రూట్ చాలా ముఖ్యమైనది. తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండే ఈ డ్రాగన్ ప్రూట్ పోషకాలలో కూడా మేటి అని అంటున్నారు ఆహార నిపుణులు.  అవేంటో తెలుసుకుంటే.. డ్రాగన్ ఫ్రూన్ ను పిటాయా అని కూడా పిలుస్తారు.  ఈ రుచికరమైన, పోషకమైన పండు రంగు చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఇక దీని షేప్ కూడా దీనికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇతర పండ్లతో పోలిస్తే పోషకాలలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఏం తీసిపోదు. డ్రాగన్ ఫ్రూట్ లో అనేక విటమిన్లు, ఖనిజాలు,  పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి.. డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్-సి చాలా సమృద్దిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం లో సహాయపడుతుంది. సీజనల్ సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్-ఎ.. కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్-ఎ కూడా డ్రాగన్ ప్రూట్ లో సమృద్దిగా ఉంచుంది. విటమిన్-ఎ  కంటి చూపును కాపాడుకోవడానికే కాకుండా రేచీకటి వంటి సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. బి-కాంప్లెక్స్ విటమిన్లు.. డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్లు-బి1,  బి2, బి3 వంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఈ విటమిన్లు శరీరంలో శక్తి ఉత్పత్తికి ముఖ్యమైనవి.  ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. కాల్షియం, మెగ్నీషియం.. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, మెగ్నీషియం చాలా ముఖ్యం.  అలాగే మెగ్నీషియం కండరాల ఆరోగ్యానికి కూడా అవసరం.  ఈ కాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు రెండూ డ్రాగన్ ప్రూట్ లో సమృద్దిగా ఉంటాయి.                               *రూపశ్రీ.

read more
ఈ వ్యక్తులకు  అల్జీమర్స్ వచ్చే ప్రమాదం  ఎక్కువ..!

జ్ఞాపకశక్తిని,  ఆలోచనా సామర్థ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసే వ్యాధి  అల్జీమర్స్.  ఈ వ్యాధి నేటి ప్రపంచంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చాలా సంక్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి  కారణాలను అర్థం చేసుకుంటే దాని ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అల్జీమర్స్ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న 'ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం' జరుపుకుంటారు.  ఏ వ్యక్తులు అల్జీమర్స్ ప్రమాదంలో ఎక్కువగా ఉన్నారో.. దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. వయసు.. అల్జీమర్స్ వ్యాధికి అతి పెద్ద ప్రమాద కారకం వయస్సు. ఈ వ్యాధి 65 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని అర్థం  వృద్ధులందరిలో ఈ వ్యాధి వస్తుందని కాదు. వయస్సుతో పాటు మెదడులో సంభవించే సహజ మార్పులు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి. కుటుంబ చరిత్ర,  జన్యుశాస్త్రం.. కుటుంబంలో ఎవరికైనా అల్జీమర్స్ వ్యాధి ఉంటే, కుటుంబంలోని వారు  కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉండవచ్చు. APOE4 వంటి కొన్ని జన్యువులు ఈ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. జన్యువులు మాత్రమే కారకం కానప్పటికీ, కుటుంబ చరిత్ర ఉంటే క్రమం తప్పకుండా చెకప్ లు చేయించుకోవడం, జాగ్రత్తగా ఉండటం  ముఖ్యం. డౌన్ సిండ్రోమ్.. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్రోమోజోమ్ 21 లోని ఒక నిర్దిష్ట జన్యువు వారి మెదడుల్లో అమిలాయిడ్-బీటా ప్రోటీన్‌ను ముందుగానే సేకరించడం ప్రారంభిస్తుంది. ఇది అల్జీమర్స్‌కు ప్రధాన కారణం. తల గాయం.. తలకు తీవ్రమైన గాయం అయిన వ్యక్తులకు తరువాత అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మెదడు గాయం వాపు,  కణాల నష్టానికి కారణమవుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. జీవనశైలి,  గుండె ఆరోగ్యం.. అల్జీమర్ రావడానికి కారణమయ్యే హానికరమైన వాటిలో  జీవనశైలి  సరిగా లేకపోవడం కూడా ఒకటి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,  మధుమేహం వంటివి  మెదడుకు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. ఇవి  అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆరోగ్యకరమైన గుండెకు సమతుల్య ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యమైనవి. నిద్రలేమి, మద్యం సేవించడం.. తగినంతగా,  బాగా నిద్రపోకపోవడం కూడా ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. నిద్రలో మెదడు నుండి టాక్సిన్లు  తొలగించబడతాయి. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే, మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. దీనితో పాటు అధిక మద్యం సేవించడం వల్ల మెదడు కణాలు కూడా దెబ్బతింటాయి.  ఇవి  అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.                            రూపశ్రీ.

read more
ఈ చిట్కాలతో  చాలా ఈజీగా గట్ ను శుభ్రం చేసుకోవచ్చు..!

ఆయుర్వేదం నుండి ఆధునిక శాస్త్రం వరకు పేగు ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మనిషి శరీరంలో వచ్చే చాలా వ్యాధులకు మార్గం ఇక్కడే మొదలవుతుంది. పేగు మురికిగా ఉంటే.. క్రమంగా కొవ్వు, చక్కెర, విషపదార్థాలు పెరుగుతాయి. ఇది వందలాది వ్యాధులకు కారణమవుతుంది. పేగు ఆరోగ్యానికి ఉత్తమమైన 10 ఆహారాలు ఉన్నాయి. వీటిని స్నాక్‌గా తినవచ్చు. ఇవి కడుపు,  ప్రేగులను సరిగ్గా శుభ్రపరచడంలో, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే ఏమవుతుంది..  ఆరోగ్యం క్షీణించడానికి అతిపెద్ద కారణం అనారోగ్యకరమైన చిరుతిళ్లు.  ఆకలిని తీర్చుకోవడానికి  వాటిని తింటాము . ప్యాక్డ్ ఫుడ్,  మార్కెట్ స్నాక్స్‌లో  కేలరీలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి పోషకాహార పరంగా సున్నా. అవి జీర్ణక్రియను,  ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను  తగ్గిస్తాయి. పేగు ఆరోగ్యాన్నిమెరుగుపరిచే స్నాక్స్ గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు..  గ్రీకు పెరుగు + బెర్రీలు.. వేయించిన మఖానా.. ఆపిల్ + పీనట్ బటర్ .. మిక్స్డ్ సీడ్స్ + గుమ్మడికాయ గింజలు కూరగాయలు.. ఉండికించినవి.. పచ్చిగా తినదగినవి. డార్క్ చాక్లెట్ (70%+).. మొలకెత్తిన పెసలు. మజ్జిగ.. ముఖ్యంగా మూడు ఆహారాలు పేగు ఆరోగ్యానికి చాలా దృఢంగా ఉంచుతాయి. మజ్జిగ.. పెరుగు నుండి వెన్నను తొలగించడం ద్వారా మజ్జిగ తయారు చేస్తారు. ఇది జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది.  ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రతి రోజూ తాజా మజ్జిగను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుతుంది. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. చాలా పరిశోధనలు దీనిని తినడం వల్ల  మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  పోషకాలు గ్రహించబడతాయి. వేయించిన శనగలు.. వేయించిన శనగలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి . అన్నింటిలో మొదటిది..  ప్రోటీన్, ఫైబర్,  ఐరన్ లభిస్తాయి. ఫైబర్ గట్ బాక్టీరియాను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.                               *రూపశ్రీ.

read more
ఏ వయసులో ఏ సమయంలో నిద్రపోవాలి?  నిద్ర గురించి షాకింగ్ నిజాలు..!

కొంతమంది త్వరగా నిద్రపోయినా కూడా ఉత్సాహంగా ఉండటం, మరికొందరు అర్థరాత్రి వరకు మేల్కున్నా సరే  ఉదయాన్నే లేవడం   బాగా పని చేయడం చేస్తారు. ఇలాంటివాళ్లను  ఎప్పుడైనా గమనించారా? నిద్ర సమయం కేవలం విశ్రాంతి కోసమే కాదు, అది  ఆరోగ్యానికి  సంబంధించినది.  ఒక అధ్యయనం ప్రకారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య  నిద్రకు ఉపక్రమించే వారికి  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది.  శరీరం  సహజ లయ ప్రకారం నిద్రపోవడం గుండె,  ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఇది ప్రూవ్ చేస్తుంది. నిద్రించడానికి సరైన సమయం వయస్సును బట్టి మారుతుంది. పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం, టీనేజర్లు అర్ధరాత్రి వరకు  మేల్కొని ఉంటారు, ఆలస్యంగా నిద్రపోతారు. పెద్దలకు పని,  విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం.  వృద్ధులు త్వరగా నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం? పిల్లలు (5–12 సంవత్సరాలు) ఉన్నవారికి  రాత్రి 7:30–9:00 మధ్య నిద్రపోవడం మంచిది. వీరికి 9–12 గంటలు నిద్ర అవసరం. పిల్లలు బాగా పెరగడానికి, చదువులో దృష్టి పెట్టడానికి,  భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడానికి తగినంత నిద్ర అవసరం. త్వరగా,  క్రమం తప్పకుండా నిద్రపోవడం వారిని మంచి మానసిక స్థితిలో ఉంచడానికి, ఏకాగ్రత పెరగడానికి,  రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. కౌమారదశ (13–18 సంవత్సరాలు)లో ఉన్నవారు  రాత్రి 10:30–11:30 మధ్య తప్పనిసరిగా నిద్రపోవాలి. వీరికి  8–10 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు చదువు పేరుతో వీరిని నిద్రకు దూరం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. టీనేజర్ల క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల  మెదడు అభివృద్ధి, మానసిక స్థితి,  విద్యా పనితీరుకు సహాయపడుతుంది. నిద్రపోయే ముందు  ఫోన్ లేదా టీవీ వాడకాన్ని పరిమితం చేయాలి.రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి.  యువత,  మధ్య వయసు.. (18–64 సంవత్సరాలు)ల మధ్య ఉండేవారందరూ ఒకే నిద్ర సమయాన్ని అనుసరించాలి.  రాత్రి 10:00–11:00 మధ్య నిద్రపోవాలి.  ప్రతిరోజూ తప్పనిసరిగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ వయసు వారు శరీర సహజ లయ ప్రకారం నిద్రపోవాలి. ఈ సమయంలో బయట పనుల కారణంగా   అలసట, శరీరంలో శక్తి తగ్గడం,  మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రిపూట కెఫిన్,  భారీ భోజనం మానుకోవాలి.   క్రమం తప్పకుండా ఒక సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు) రాత్రి 9:00–10:00 గంటల మధ్య నిద్రపోవాలి. వీరికి కూడా తప్పకుండా  7–8 గంటలు నిద్ర ఉండాలి. వృద్ధులు త్వరగా మేల్కుంటూ ఉంటారు.   తక్కువ నిద్రపోతారు. త్వరగా నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి, మెదడు పదునుగా ఉండటానికి,  మొత్తం ఆరోగ్యానికి మంచిది. నిద్రవేళకు ముందు కాస్త వాకింగ్, హెర్బల్ టీ లేదా ధ్యానం చేయడం వల్ల  నిద్ర  మెరుగుపడుతుంది. ఎన్ని గంటలకు నిద్రపోతారు అనేదే కాదు.. ఎన్ని గంటలు నిద్రపోతారనేది కూడా ముఖ్యం. వయస్సు ప్రకారం సరైన సమయంలో నిద్రపోవడం మానసిక స్థితి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర హార్మోన్లు, రోగనిరోధక శక్తి, జీవక్రియను సమతుల్యంగా ఉంచుతుంది.  మధుమేహం,  డిప్రెషన్  వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
బంగాళదుంపలు,  ఉల్లిపాయలు.. కలిపి స్టోర్ చేస్తున్నారా? దిమ్మతిరిగే నిజాలివి..!

బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  దీంతో ఫ్రై చేసినా,  మసాలా కూర వండినా, చిప్స్ చేసినా లేదా వేరే స్నాక్స్ ఏమైనా చేసినా చాలా ఇష్టంగా తింటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే సాధారణ సంఘటన ఏంటంటే.. బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఒక బుట్టలో నిల్వ చేయడం. ఇలా బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేయడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? అనే విషయం చాలా మందికి తెలియదు.  కేవలం నిల్వ చేయడం గురించే కదా అనే అనుమానం చాలా మందికి రావచ్చు.  దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. బంగాళదుంపలు,  ఉల్లిపాయలు ఒకే బుట్టలో లేదా కంటైనర్ లో నిల్వ చేయడం గురించి చాలా షాకింగ్ నిజాలు వెలువడ్డాయి.  ముఖ్యంగా బంగాళదుంపలలో పెద్ద మొత్తంలో సెలీనిన్,  అల్లెన్ సల్పైడ్ లు ఉంటాయి.  ఇక ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఉల్లిపాయలను, బంగాళదుంపలను కలిపి ఉంచడం వల్ల రెండింటినలో ఉండే రసాయనాల చర్య వల్ల బంగాళదుంపలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్, చాకోనిన్,   క్లోరోఫిల్ ఏర్పడతాయి. ఈ రసాయనాలు ఉన్న బంగాళదుంపలు తింటే అవి శరీరంలో విషాన్ని కలిగిస్తాయి.  ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా పిల్లలపై ఉంటుందట. పై కారణంగా  ఉల్లిపాయలు, బంగాళదుంపలను ఒకే కంటైనర్ లో నిల్వ చేస్తే అది కాస్తా ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది.  అందుకే మార్కెట్ నుండి ఉల్లిపాయలు,  బంగాళదుంపలు తెచ్చినా.. వాటిని విడివిడిగా నిల్వచేయాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా?

రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా? ఆహారంలో ఉప్పు వేయడం తప్పనిసరి.  ఉప్పు లేని వంట తినడం సాధ్యమే కాదు.. అయితే ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో రాతి ఉప్పును  ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. ముఖ్యంగా  సాధారణ ఉప్పును తినకూడని సమయంలో రాతి ఉప్పును ఎక్కువగా వాడతారు. కొందరు  ఉపవాస సమయంలో ఉప్పు తినకూడదు అనే నియమం ఉన్నప్పుడు సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు ఆహారంలో వినియోగిస్తారు. కొందరు రాతి ఉప్పును రెగ్యులర్ గా వినియోగిస్తారు.  రాతి ఉప్పుతో తయారు చేసిన ఆహారం   జీర్ణక్రియకు మంచిదని చెబుతారు. కానీ రాతి ఉప్పు అందరికీ ప్రయోజనకరంగా ఉండదని చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా కొందరు ఈ రాతి ఉప్పును అస్సలు తినకపోవడం మంచిది. ఇంతకీ రాతి ఉప్పు ఎవరు తినకూడదు? తెలుసుకుంటే.. బిపి పేషెంట్లు.. రాతి ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు దీనిని తక్కువగా తీసుకోవాలి లేదా అస్సలు తీసుకోకపోవడం మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు.. సోడియం అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. రాతి ఉప్పు రక్తపోటు, శరీరంలో  ద్రవాల  నిలుపుదల పెంచడం ద్వారా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు.. లేదా కుటుంబంలో గుండె సంబంధం సమస్యల చరిత్ర ఉన్నవారు రాతి ఉప్పు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ రోగులు.. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరం నుండి అదనపు సోడియం తొలగించబడదు. ఇలా మూత్ర పిండాల సమస్య ఉన్నవారు రాతి ఉప్పు తింటే మూత్రపిండాల పరిస్థితిని మరింత దిగజారుతుంది. షుగర్ పేషెంట్లు..  రాతి ఉప్పు ఎక్కువగా వినియోగించడం మధుమేహ రోగులకు హానికరం. ఇది రక్తపోటు,  చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ రోగులు.. థైరాయిడ్ రోగులకు అయోడిన్ అవసరం. అయితే రాతి ఉప్పులో అయోడిన్ ఉండదు. దీని కారణంగా, థైరాయిడ్ అసమతుల్యత  పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో మహిళలు సోడియం,  అయోడిన్ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.  రాతి ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంపై  చెడు ప్రభావం పడుతుంది. వృద్ధులు.. వృద్ధులకు తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండె సంబంధిత సమస్యలు ఉంటాయి.  రాతి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
అరటిపండును పాలతో కలిపి తింటే ఈ నష్టాలు తప్పవట..!

అరటిపండు.. అందరికి సులువుగా దొరికే పండు. సీజన్ తో సంబంధం లేకుండా అరటిపండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. అరటిపండ్లు చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ సులువుగా తినడానికి అనువుగా ఉంటాయి. చాలామంది అరటిపండును ఉదయాన్నే అల్పాహారంగానో లేదా ఉదయం తీసుకునే ప్రోటీన్ డ్రింక్స్ లోనూ వాడుతుంటారు. ముఖ్యంగా అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం చాలా మంది అలవాటు.  మిల్క్ షేక్ అయితే ఎడాపెడా తాగేస్తారు. అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. జీర్ణసమస్యలు.. అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.  ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు రెండూ బరువుగా ఉండే పదార్థాలు. రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.  ఉబ్బరం,  గ్యాస్ లేదా మలబద్దకానికి కారణం అవుతుంది. కఫం.. అరటిపండు, పాలు రెండింటిని కలిపి తీసుకుంటే కఫం ఏర్పడుతుందట.  ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదని అంటున్నారు. కఫ శరీరం ఉన్నవారు ఈ కాంబినేషన్ ను అస్సలు ట్రై చేయకపోవడమే మంచిది.  కఫం పెరిగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అలెర్జీలు, సైనస్.. అరటిపండు, పాలు కాంబినేషన్ కొంతమందికి అలెర్జీలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. శరీరంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.  ఇది మాత్రమే కాకుండా సైనస్ రద్దీని ఈ కాంబినేషన్ పెంచుతుందట.  ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారికి ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. నీరసం.. పాలు, అరటిపండు రెండూ శక్తివంతమైనవే.. ఇవి రెండూ శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం భారంగా మారుతుందని, ఇది నీరసం ఫీలింగ్ పెంచుతుందని అంటున్నారు. ఒళ్లంతా భారంగా అనిపించడం వల్ల బాగా నీరసంగా అనిపిస్తుందని కొందరు అనుభవాల ద్వారా పంచుకున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. రక్తంలో చక్కెర.. అరటిపండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది.  ఇక పాలలో కూడా గ్లూకోజ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేటికాలంలో  డయాబెటిస్ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా.. ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండటం మంచిది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
విటమిన్-డి మోతాదు మించితే పాయిజన్‌గా మారుతుందా?

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం ద్వారా విటమిన్లు,  ఖనిజాలు క్రమం తప్పకుండా అవసరం. ఆరోగ్యానికి మేలు చేసే  విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ శరీరానికి విటమిన్-డి అందేలా చూసుకోవాలి. ఇది వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా శరీరం తయారు చేసుకునే విటమిన్.  విటమిన్ డి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది ఎముకలకు చాలా అవసరం. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచుతుంది,  పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాలు సరిగ్గా పనిచేస్తాయి,  బలహీనత ఉండదు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటు వ్యాధుల నుండి రక్షించడానికి,  మెదడు పనితీరును మెరుగుపరచడానికి,  ప్రతిరోజూ తగినంత పరిమాణంలో విటమిన్-డి  అవసరం. కానీ విటమిన్ డి  ఎంత ముఖ్యమో, దాని మోతాదు మించితే అంతే హానికరం అని చాలామందికి తెలియదు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. విటమిన్-డి మోతాదు మించితే కలిగే ప్రమాదం.. ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి ప్రతిరోజూ దాదాపు 400–800 IU (10–20 మైక్రోగ్రాములు) విటమిన్ డి సరిపోతుంది.  క్రమం తప్పకుండా ఈ పరిమాణం కంటే ఎక్కువ విటమిన్ డి తీసుకుంటే శరీరం అనేక రకాల నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని విటమిన్ డి టాక్సిసిటీ అంటారు. సాధారణంగా ఒక వ్యక్తి ఎక్కువ కాలం అవసరమైన దానికంటే ఎక్కువ సప్లిమెంట్లను తీసుకున్నప్పుడు విటమిన్ డి టాక్సిసిటీ ప్రమాదం వస్తుంది. ఆహారం ద్వారా ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఫలితంగా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది,  వాంతులు అవుతాయి. అంతేకాకుండా, బలహీనత, తలతిరుగుడు,  మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం పెరుగుతుంది. హైపర్‌కాల్సెమియా వల్ల మూత్రపిండాల నష్టం..  శరీరంలో విటమిన్ డి పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. దీనిని హైపర్‌కాల్సెమియా అంటారు. అధిక కాల్షియం కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాల పనితీరు  తగ్గుతుంది. విటమిన్-డి మోతాదు మించితే జరిగేది ఇదే.. జీర్ణక్రియకు ఆటంకం.. శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల జీర్ణ సమస్యలు  వస్తాయి. విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు  పెరుగుతాయి.   ఇది జీర్ణ సమస్యలు, విరేచనాలు,  అపానవాయువుకు కారణమవుతుంది. విటమిన్ డి సప్లిమెంట్ల అధిక మోతాదు  వికారం,  వాంతికి కారణమవుతుంది. మెదడుపై ప్రభావం.. కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల మెదడు కూడా ప్రభావితమవుతుంది. దీని కారణంగా తరచుగా తల బరువుగా అనిపించడం, తల తిరగడం,  ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. అలాంటి వ్యక్తులు మళ్లీ మళ్లీ ఏదైనా విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. చిరాకు,  విశ్రాంతి లేకపోవడం పెరుగుతుంది. తీవ్రమైన పరిస్థితులలో  గందరగోళానికి గురవడం  లేదా కోమాలోకి  వెళ్ళడం కూడా జరగవచ్చు.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
జాగ్రత్త ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ తింటే డేంజర్..!

  వంకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. వంకాయను ఎలా వండినా టేస్ట్ అద్దిరిపోతుంది. తాజా కూరలలో రాజా ఎవరండీ అని వంకాయ మీద పాట రాశారు.. అలాగే వంకాయ వంటి కూర.. పంకజ ముఖి సీత వంటి భామామణి అంటూ పద్యం కూడా రాశారు.  ఇలా వంకాయ క్రేజ్ చాలా పెద్దదే..  అయితే వంకాయను అందరూ తినడం అంత మంచిది కాదు.. కొన్ని సమస్యలు ఉన్నవారు వంకాయకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.  సరదా పడి తిన్నారంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంతకీ వంకాయకు దూరంగా ఎవరు ఉండాలి? ఎందుకని? పూర్తీగా తెలుసుకుంటే.. వంకాయలో అధికమొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది.  ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.  వంశపారంపర్యంగా కిడ్నీలో రాళ్లు,  కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వంకాయ తింటే కొందికి అలెర్జీ వస్తుంది.  ఇది దురద, వాపు,  శ్వాస సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుంది.  అందుకే వంకాయ తినేముందు ఆరోగ్య సమస్య విషయంలో ఆలోచించుకోవాలి. చాలామందికి తెలియదు కానీ.. వంకాయ తింటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలతో  ఇబ్బంది పడేవారు వంకాయ తినేముందు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా తినాలనుకున్నా సరే.. పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వంకాయను వైద్యుల సలహా మీద మాత్రమే తినడం మంచిది. వంకాయలో పొటాషియం  పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు.. రక్తపోటు సమస్య కోసం మందులు వాడేవారు వంకాయలు ఎక్కువగా తినకూడదు. వంకాయలలో సోలననిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కీళ్లలో నొప్పి, వాపు పెంచడంలో సహాయపడుతుంది.  సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు.. వంకాయలు ఎక్కువ తినకు వాతం పెరుగుుతంది అని. ఇది ఆ కోవకు చెందినదే..  ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు వంకాయను ఎంత తక్కువ తింటే అంత మంచిది. వంకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బ తింటుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మగాళ్లు ఈ ఆహారం తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

నేటి మారుతున్న జీవనశైలిలో, పురుషులలో వంధ్యత్వ సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ తగ్గడం. ఈ సమస్య దంపతుల తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేరకుండా చేయడమే కాకుండా, పురుషుల ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తరచుగా ఇది నయం చేయలేని సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ సరైన ఆహారం, జీవనశైలిని మార్చడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  ఆహారంలో కొన్ని  చేర్చుకోవడం  ద్వారా స్పెర్మ్ కౌంట్ ను,  దాని నాణ్యతను మెరుగుపరచవచ్చు అని అంటున్నారు. ఇంతకీ మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, స్పెర్మ్ నాణ్యత పెరగడానికి  సహాయపడే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. శతావరి,  అశ్వగంధ.. ఆయుర్వేదంలో శతావరి, అశ్వగంధకు చాలా ప్రాధాన్యత ఉంది.  శతావరి,  అశ్వగంధ రెండూ ఆయుర్వేద మూలికలు. ఇవి పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి,  టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్,  స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. శతావరి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెండింటి పొడిని ప్రతిరోజూ పాలు లేదా నీటితో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు.. నిమ్మకాయ నీటిని ఒక సాధారణ పానీయంగా భావిస్తే పప్పులో కాలేసినట్టే..  ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ నాణ్యతకు చాలా ముఖ్యమైనది. విటమిన్ సి అనేది స్పెర్మ్‌ను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ప్రతి ఉదయం నిమ్మరసం కలిపిన ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్లను  తొలగించడమే కాకుండా, స్పెర్మ్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాల్నట్స్, బాదం.. వాల్‌నట్స్,  బాదం పప్పులలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్పెర్మ్ నిర్మాణం,  కార్యాచరణను మెరుగుపరుస్తాయి. అయితే యాంటీఆక్సిడెంట్లు వాటిని దెబ్బతినకుండా కాపాడతాయి. రోజూ గుప్పెడు వాల్‌నట్స్,  బాదం పప్పులు తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అరటిపండు.. అరటిపండ్లలో బ్రోమెలైన్,  విటమిన్ బి అనే అరుదైన ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను, స్పెర్మ్ కౌంట్ను   రెండింటినీ మెరుగుపరుస్తుంది. దీనితో పాటు అరటిపండు శక్తికి అద్భుతమైన మూలం.  ఇది అలసటను కూడా తొలగిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
కంటి శుక్లం గురించి ఈ అపోహలు తొలగించుకోండి..!

కంటిశుక్లం అనేది కంటికి ఉండే సహజ లెన్స్ మీద ఏర్పడే తెల్లని పొర. ఇది కనుపాప వెనుక ఉంటుంది. ఇది సాధారణంగా వయస్సుతో పెరిగి వృద్దులలో వస్తుంది. కాంతిని సరిగ్గా చూడలేకపోవడం,  రంగుల విషయంలో గందరగోళం,  రాత్రి సమయంలో చూడటంలో ఇబ్బంది వంటివి కంటిశుక్లం వల్ల ఎదురయ్యే సమస్యలు.  కంటిశుక్లం దృష్టి లోపానికి గల ప్రధాన కారణాలలో ఒకటి.  ముఖ్యంగా వృద్దాప్యం వచ్చాక కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈ కంటిశుక్లం గురించి చాలామంది చాలా అపోహల్లో ఉన్నారు.  ఈ అపోహల కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కంటిశుక్లం గురించి అందరూ నమ్మే అపోహల గురించి తెలుసుకుంటే.. శస్త్రచికిత్సకు ముందు కంటిశుక్లం ముదిరిపోయి ఉండాలా? నేటికాలంలో కంటిశుక్లం శస్త్రచికిత్సకు కంటిశుక్లం ముదిరిపోయే దశకు చేరుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఆలస్యం చేసేకొద్ది ఆపరేషన్ ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది. రోజువారీ జీవితం  ప్రభావితం అవుతుంది. పైగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే కంటిశుక్లం ఇంకా ముదరకముందే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య అంతగా ఉండదని వైద్యుల మాట.  శస్త్రచికిత్స తర్వాత కంటిశుక్లం తిరిగి పెరుగుతుందా? తెల్లని పొరగా మారిన లెన్స్ తొలగించి  దాని స్థానంలో కృత్రిమ లెన్స్ (ఐఓఎల్) అమర్చిన తర్వాత, కంటిశుక్లం తిరిగి రాదు. అయినప్పటికీ, పృష్ఠ క్యాప్సూల్ ఒపాసిఫికేషన్ (పిసిఒ) అని పిలువబడే పరిస్థితి నెలలు లేదా సంవత్సరాల తరువాత రావచ్చు. దీనిని  లేజర్ విధానంతో సులభంగా చికిత్స చేయవచ్చు. వృద్ధులకు మాత్రమే కంటిశుక్లం వస్తుందా? వృద్ధాప్యంతో కంటిశుక్లం సర్వసాధారణం అయినప్పటికీ, డయాబెటిస్, గాయం, దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం, ధూమపానం,  జన్యు కారణాలు  వంటి కారకాల వల్ల  యువతలో కూడా  వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టుకతో  కంటిశుక్లంతో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయట.  కంటి చుక్కలు లేదా ఆహారంతో కంటిశుక్లం నయం చేయవచ్చా? కంటి చుక్కలు, హెర్బల్ నివారణలు లేదా ఆహార మార్పులతో కంటిశుక్లం తిప్పికొట్టవచ్చు లేదా నయం చేయవచ్చనే వాదనకు క్లినికల్ ఆధారాలు లేవట.  కంటిశుక్లం రోగులలో దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స మాత్రమే సరైనది అని వైద్యుల మాట.  కంటిశుక్లం శస్త్రచికిత్స ప్రమాదకరం లేదా బాధాకరంగా ఉంటుందా? కంటిశుక్లం శస్త్రచికిత్స అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా నిర్వహించే సురక్షితమైన విధానాలలో ఒకటి. ఇది సాధారణంగా త్వరగా అయిపోతుంది.  అనస్థీషియా కింద జరుగుతుంది.  అసౌకర్యం కూడా తక్కువ.   కొద్ది రోజుల్లోనే  దృష్టి మెరుగుపడుతుంది. రెండు కళ్ళకు ఒకేసారి శస్త్రచికిత్స చేయాలా? కంటిశుక్లం శస్త్రచికిత్సలు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల విరామంతో ఒకేసారి ఒక కంటికి చేస్తారు. మొదటి శస్త్రచికిత్స ఫలితాల ఆధారంగా మరొక కంటికి చికిత్సను చేయడానికి వైద్యులకు క్లారిటీ వస్తుంది. కంటిశుక్లం ముదిరి దృష్టి పూర్తిగా కోల్పోయే వరకు ఆపరేషన్ చేయించుకోకూడదా? కంటిశుక్లం ముదిరే వరకు ఉంటే అది లైఫ్ స్టైల్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే సర్జరీ చేయించుకుంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.  కోలుకోవడానికి నెలలు పడుతుందా? నేటి కాలంలో జరిగే కంటిశుక్లం చికిత్స నుండి కోలుకోవడానికి నెలల సమయం అవసరం లేదు.  తరచుగా ఒకటి లేదా రెండు వారాలలో సాధారణ జీవనశైలికి వచ్చేస్తారు.  ఇది వ్యక్తిని బట్టి మారే అవకాశం ఉంటుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మీ ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత? ఇంట్లోనే ఇలా టెస్ట్ చేసుకోండి..!

మానవ శరీరంలో ఊపిరితిత్తులు  చాలా ముఖ్యమైనవి.  మనం పీల్చే గాలిని శుభ్రపరచడంలో ఊపిరితిత్తులదే కీలకమైన పాత్ర. ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయకపోతే శ్వాస క్రియకు ఇబ్బంది కలుగుతుంది. అయితే.. నేటికాలపు రద్దీ జీవితంలో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. కలుషిత వాతావరణం కూడా దీనికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా  ఊపిరితిత్తులు ఎక్కువగా సఫర్ అవుతుంటాయి. గతంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వృద్ధులలో కనిపించేవి. కానీ  ఇప్పుడు చిన్నవారు,  పిల్లలు కూడా దీనికి బలైపోతున్నారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంతో సహా అనేక దేశాలలో ఉబ్బసం, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD),  ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యానికి సంబంధించిన వ్యాధుల కారణంగా 7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తుల పనితీరును  ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యలను పెద్దవి కాకుండా చూసుకోవచ్చు.  BOLT అనే విధానం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంట్లోనే చెక్ చేసుకునేందుకు సహాయపడుతుంది. దీన్నెలా చేసుకోవాలో తెలుసుకుంటే.. BOLT అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవల్ టెస్ట్ స్కోర్.  దీని సహాయంతో ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో,  వాటికి ఏదైనా ప్రమాదం ఉందా అని తెలుసుకోవచ్చు. BOLT (బాడీ ఆక్సిజన్ లెవల్ టెస్ట్) అనేది  కార్బన్ డయాక్సైడ్ టాలరెన్స్‌ను కొలిచే ఒక సులభమైన, సెల్ఫ్ టెస్ట్.  శ్వాసను ఎంతసేపు హాయిగా పట్టుకోగలరో ఇది తెలియజేస్తుంది. శ్వాసను పట్టుకోగల సమయం  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుపుతుంది. 10 కంటే తక్కువ BOLT స్కోరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అని వైద్యులు అంటున్నారు. బోల్ట్ పరీక్ష ఎలా చేయాలి? ఈ పరీక్ష చేయడానికి ముందుగా ఎటువంటి ఆటంకాలు లేని నిశ్శబ్దమైన,  సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తరువాత శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉండే భంగిమలో కూర్చోవాలి. సాధారణంగా  దీర్ఘంగా  శ్వాస తీసుకొని హాయిగా గాలిని వదిలివేయాలి. తరువాత ఇప్పుడు గాలి  ఊపిరితిత్తులలోకి ప్రవేశించకుండా మీ వేళ్ళతో మీ ముక్కును మూసివేసి  టైమర్‌ను ప్రారంభించాలి.  ఊపిరి పీల్చుకోవాలనే తపన ప్రారంభమైనప్పుడు,  ఛాతీ బిగుసుకుపోవడం ప్రారంభించినప్పుడు, టైమర్‌ను ఆపివేయాలి.  శ్వాసను పట్టుకున్న సెకన్ల సంఖ్య  బోల్ట్ స్కోరు అవుతుంది. ఈ పరీక్షను తక్కువ వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు రిపీట్  చేసి, మూడు స్కోర్‌ల సగటును తీసుకోవాలి. బోల్ట్ స్కోర్ ఎంత ఉండాలి? ఎంత ఉండకూడదు?  ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి ఈ స్కోరు ఏమి చెబుతుందంటే..  బోల్ట్ స్కోరు 20 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని సూచిస్తుంది. 10-20 సెకన్ల స్కోరు అంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం సాధారణంగానే ఉంది కానీ మెరుగుదల అవసరం. 10 సెకన్ల కన్నా తక్కువ స్కోరు ఉంటే శ్వాస సామర్థ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. ఇలాంటి వారు వైద్యుడిని సంప్రదించి  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more