మంగళవారం ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభవం నుంచి ఉపశమనం.!

సనాతన ధర్మంలో మంగళవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఈ రోజున ఆంజనేయస్వామిని పూజిస్తారు. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల అంగారక గ్రహ దోషాలు నయమవుతాయని నమ్ముతారు. అంతేకాదు అసంపూర్తిగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మంగళవారం నాడు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని చెబుతారు. మీ జీవితం సంతోషంగా ఉండాలంటే మంగళవారం నాడు ఈ పరిహారాలు తప్పకుండా చేయండి.

మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, మంగళవారం స్నానం చేసిన తర్వాత హనుమంతునికి గులాబీ పూల దండను సమర్పించండి. వరుసగా 7 మంగళవారాలు ఈ పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని నమ్మకం.మంగళవారం నాడు మట్టి కుండలో తేనె వేసి మూత పెట్టి హనుమంతుని ముందు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, మంగళవారం, హనుమంతుని విగ్రహం ముందు ఒక పాత్రలో నీటిని ఉంచి హనుమాన్ చాలీసాను పఠించండి. తర్వాత ఆ నీటిని తీసేయండి. మరుసటి రోజూ కూడా ఇలానే చేయండి. ఈ పరిహారాన్ని వరుసగా 21 రోజులు చేస్తే శారీరక, మానసిక రుగ్మతలు నయం అవుతాయని మత విశ్వాసం. అంతేకాదు మంగళవారం నాడు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి.

మంగళవారం నాడు ఇక్కడ పేర్కొన్న పరిహారాలను పాటిస్తే, మీరు సంతోషం,  సంపదలతో నిండిన జీవితాన్ని పొందుతారు.మీరు ప్రతికూల శక్తిని దూరం చేయాలనుకుంటే, మంగళవారం నాడు బార్లీ పిండిని నూనె, నల్ల నువ్వులను కలిపి రోటీ చేయండి. ఈ రోటీని బెల్లం, నూనెతో 7 లేదా 21 వారాలు  గేదెకు తినిపించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయని చాలా మంది నమ్ముతారు.


 


More Hanuman