LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 
సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8)న తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://www.youtube.com/watch?v=dD8qZdp3WHU
రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.   
  ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీఎంసీ రెండో వార్డు కార్పోరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన  గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.   
ALSO ON TELUGUONE N E W S
      -తీవ్ర నిరాశలో విజయ్ ఫ్యాన్స్  -కోర్టు తీర్పు అనుకూలమా!ప్రతికూలమా  -తమిళ మీడియా వర్గాలు ఏమంటున్నాయి     నాలుగు దశాబ్దాల సినీ ఛరిష్మాకి గుడ్ బై చెప్తు ఇళయదళపతి 'విజయ్' సిల్వర్ స్క్రీన్ పై చేస్తున్న చివరి మూవీ 'జననాయగన్'. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఎంతో భావోద్వేగ వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల 9 న రిలీజ్ డేట్ కాగా ఈ రోజు నైట్ నుంచే బెనిఫిట్ షో చూడటం కోసం అభిమానులు భారీ ఎత్తున జరిగాయి. ప్రీ బుకింగ్స్ కూడా తమిళనాడు తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో క్లోజ్ అయ్యాయి.  కానీ ఇప్పుడు వాళ్ల ఆశలకి బ్రేక్ వచ్చింది.     జన నాయగన్ సెన్సార్ సభ్యులు ఇంకా సెన్సార్ ని ఇవ్వలేదన్న వార్తలు రెండు రోజుల నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో  చిత్ర బృందం చెన్నై హైకోర్టు ని ఆశ్రయించగా ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు తమ తీర్పుని జనవరి 9 నే వెల్లడి చేయనుంది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు మా నియంత్రణకి మించిన అనివార్య పరిస్థితులు కారణంగా జన నాయగన్ రిలీజ్ ని  వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్ ని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం’ అని   ఎక్స్ వేదికగా తెలియచేసింది. దీంతో  విజయ్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోవడమే కాకుండా రేపు వచ్చే కోర్టు తీర్పు పై ఉత్కంఠతతో ఎదురుచూస్తూ ఉన్నారు.     Also read:  ఆ డైరెక్టర్ మన శంకరవరప్రసాద్ గారుకి ప్రతిపక్షమేనా!.. అసలేం జరుగుతుంది       ఇక రిలీజ్ వాయిదా తో సినీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు జన నాయగన్ లో రాజకీయపరమైన సంభాషణలు చాలా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని, సదరు డైలాగ్స్ ని  తొలగించమని సెన్సార్  చెప్పినా కూడా చిత్ర యూనిట్ ఒప్పుకోలేదనే  విషయాన్నీ వెల్లడి చేస్తున్నాయి.  
Yash, with KGF franchise, became one of the biggest stars of Indian Cinema. He took 4 years to complete his next film, Toxic. The movie is gearing up for a big release on 19th March. Now, the makers have released the special birthday teaser for the film, on the occasion of Yash's birthday.  The teaser showcases him taking on a mob boss family when he is cremating his son's body. While this is a simple situation, the teaser takes a different turn when we see Yash, as Raya, completing a sexual encounter in his car and then proceeding to bomb entire cemetary, with a cigar in his hand.  With such a hyper action representation, the movie makers have given a strong statement about it is going to be a fever dream for all Grown-ups. And it also proves the title, Toxic, as the representation is completely opposite to true heroship that we normally read about.  Nayanthara, Tara Sutaria, Rukmini Vasanth, Kiara Advani, Huma Qureshi are playing leading lady roles in this movie directed by Geethu Mohandas. The movie shoot is completed and post production works are going on at a full pace for the determined release date.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  త్రివిక్రమ్ కు బిగ్ షాక్ 'గాడ్ ఆఫ్ వార్' కథతో మరో భారీ ప్రాజెక్ట్ కుమారస్వామి పాత్రలో ఆ స్టార్ హీరో?  ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఏం చేయనున్నారు?   'గాడ్ ఆఫ్ వార్' కుమారస్వామి కథ ఆధారంగా దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కుమారస్వామిగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తాడా? అల్లు అర్జున్ నటిస్తాడా? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే వీరికంటే ముందు కుమారస్వామిగా మరో హీరో నటించే అవకాశం కనిపిస్తోంది. (God of War)   కుమారస్వామి కథతో తానొక భారీ ప్రాజెక్ట్ ని చేయనున్న విషయాన్ని తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల రివీల్ చేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చారు కిషోర్ తిరుమల.   నాలుగేళ్ళ క్రితమే కుమారస్వామి కథ ఆధారంగా 'గౌరీ తనయ' పేరుతో మైథలాజికల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశానని, అన్నీ కుదిరితే త్వరలోనే భారీస్థాయిలో తెరపైకి తీసుకొస్తానని కిషోర్ తిరుమల తెలిపారు.   'గౌరీ తనయ' కథను కిషోర్ ఇప్పటికే హీరో నానికి వినిపించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి నాని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం 'ది ప్యారడైజ్'తో బిజీగా ఉన్న నాని.. ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఇదేననే మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే.. త్రివిక్రమ్ కి ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు.   టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. ఆయనకు పురాణాలపై ఎంతో పట్టుంది. అందుకే తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పెద్దగా ఎవరూ టచ్ చేయని కుమారస్వామి కథతో భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఊహించనివిధంగా ఇదే కథతో బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉందని, త్వరలోనే సినిమా చేస్తానని కిషోర్ తిరుమల ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్నా ముందు కిషోర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కినా ఆశ్చర్యంలేదు.    
      -ఎవరు ఆ డైరెక్టర్  -ప్రతిపక్షంగా మారడానికి కారణం ఏంటి -పూర్తి వివరాలు ఇవే      మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అభిమానుల కేరింతలతో థియేటర్లు కళకళలాడటానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. డై హార్ట్ ఫ్యాన్స్ అయితే బాస్ సిల్వర్ స్క్రీన్ పై వేసే మొదటి అడుగుని చూడటం కోసం లక్షల రూపాయిలు పెట్టి టికెట్స్ ని కొంటున్నారు. అత్యధిక టికెట్ రేట్ ఇప్పటి వరకు ఆరు లక్షల రూపాయల దాకా అంటే మన శంకర వరప్రసాద్ గారు క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు.ప్రేక్షకులు, మూవీ లవర్స్ కూడా మన శంకర వర ప్రసాద్ గారు రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.     ఇక నిన్న హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళావేదికగా మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో అనిల్ రావిపూడి గురించి చిరంజీవి మాట్లాడుతు అనిల్ తో సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ . షూటింగ్ లో అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేసాడు. ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదాగా జరిగింది. షూటింగ్ ఆఖరి రోజున చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను.ఇక అనిల్  సినిమాని ఎంతగానో ప్రేమిస్తాడు.    Also read:  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ పై రెస్పాన్స్ ఇదే      షూటింగ్  కంప్లీట్ అయ్యాక సినిమా మొత్తాన్ని చూసుకొని,  పలానా  సీన్ ఎందుకు ఉండాలి. దీని వల్ల ఉపయోగం ఏంటి అని తన సినిమాకి తానే ప్రతిపక్షంగా మారిపోయి అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తొలగించేస్తాడని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.        
      -చిరంజీవి స్పీచ్ పై అభిమానులు, ప్రేక్షకులు ఏమంటున్నారు -సదరు స్పీచ్ లోని హైలెట్స్ ఏంటి -పూర్తి డీటెయిల్స్ ఇవే        నిన్న హైదరాబాద్ వేదికగా మెగా విక్టరీ గ్రాండ్ ఈవెంట్ మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సదరు  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)మాట్లాడుతు మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి కేవలం శంకర వరప్రసాద్ దే కాదు.. మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభాస్(Prabhas)రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ(Raviteja)సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి,  నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా..అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తెలుగు చిత్రం పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నాను.అలంటి విజయాలు ప్రేక్షకులు ఇచ్చి తీరుతారనే ప్రగాఢ నమ్మకం నాకు ఉన్నది. 2026 సంక్రాంతి తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్ కి వెళ్లి చూడండి. థియేటర్స్ లోనే ఆస్వాదించండి, ఆశీర్వదించండి.      రాఘవేంద్రరావు గారు, అనిల్(Anil Ravipudi)తో నేను సినిమా చేస్తే అది అదిరిపోతుందని చాలా సంవత్సరాల క్రితం అన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ సినిమా క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఘరానా మొగుడు ఎంత పెద్ద విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలని ఆయన నాతో ఎన్నోసార్లు చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ..  ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి .ఈ సినిమాని  వైవిధ్యంగా చేస్తామని తనతో చెప్తే...' ఎలాంటి వైవిధ్యం వద్దండి.. దొంగ మొగుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు అన్నయ్య, చంటబ్బాయి... ఈ సినిమాలన్నీ ఎలా ఉన్నాయో నాకు అలా ఉంటే చాలు అన్నారు. అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూశారు. వాళ్లంతా పెద్దవాళ్ళు అయిపోయారు.అవి  తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ కి అవి మీరు ఎలా చేస్తారు కూడా తెలియకపోవచ్చు .అదంతా ఈ జనరేషన్ తెలియజేసే నా ప్రయత్నం అన్నారు. అప్పుడు నేను సరే అన్నాను. అలా చేయడం నాకు కేక్ వాక్. చాలా చక్కటి హోం వర్క్ చేసుకుని నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అద్భుతంగా సీన్స్ ని డిజైన్ చేస్తూ వచ్చారు.    Also read:  మన శంకర వర ప్రసాద్ గారులోని సాంగ్స్ కి అన్యాయం జరిగిందా!     తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా సరదా సరదాగా జరిగింది.అనిల్ రావిపూడి అంత మంచి పాజిటివ్ ఎట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ఇలాంటి డైరెక్టర్ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చాలా కేక్ వాక్ లాగా చేయగలరు. సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్‌ విషయంలోనూ అనిల్‌ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడు. నా తమ్ముడు వెంకటేష్ తో సినిమా చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. వెంకటేష్ చాలా పాజిటివ్ పర్సన్. తనతో కూర్చుంటే చాలా ఫిలాసఫికల్ గా  అనిపిస్తుంది. మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మేము చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిల్ ఫోటో దిగడం జరిగింది. మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. అనిల్ ద్వారా  ఇన్ని సంవత్సరాలకి కుదిరింది. మూవీలో చేసిన మిగతా ఆర్టిస్టులకి కూడా   పేరు పేరున నా ధన్యవాదాలని  చిరంజీవి చెప్పడం జరిగింది.ఇక  చిరంజీవి స్పీచ్ పై  సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను మంచి రెస్పాన్స్ వస్తుంది.  
      -మెగా సాంగ్స్ కి నిజంగానే అన్యాయం జరిగిందా! -అసలు జరిగిందని ఎందుకు అంటున్నారు -అంటుంది ఎవరు        మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),విక్టరీ వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anil Ravipudi),నయనతార(Nayanthara)ల మ్యాజిక్ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara varaprasad Garu)తో ఈ నెల 13 న  సిల్వర్ స్క్రీన్ పై మెరవడానికి సిద్దమవుతున్నవిషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి, వెంకటేష్ ఒకే స్టేజ్ పై కనపడి ఇద్దరి అభిమానుల్లో 2026  సంక్రాంతి జోష్ ని మరింతగా పెంచారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి స్పీచ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.     also read:   మన శంకర వరప్రసాద్ గారి నుంచి వెంకీ క్యారక్టర్ రివీల్.. కర్ణాటక గౌడ్ ఎవరు!     నిన్న మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా 'హుక్ స్టెప్'(Hook Step)సాంగ్  రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో 'యూట్యూబ్' లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది. దూసుకెళ్లడమే కాదు అద్భుతమైన ట్యూన్, లిరిక్స్, డాన్స్ కంపోజింగ్ తో  అభిమానులని, సంగీత ప్రియులని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ రాకతో సోషల్ మీడియాలో సరికొత్త వాదన తెరపైకి వస్తుంది. సాంగ్ గురించి అభిమానులు, మ్యూజిక్ లవర్స్  మాట్లాడుతు హుక్ సాంగ్ వచ్చి మన శంకర వరప్రసాద్ గారు లోని  మిగతా సాంగ్స్ ని వెనక్కి నెట్టింది. అంతలా  హుక్ సాంగ్ మెస్మరైజ్ చేస్తుంది. అసలు ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఇదే విధంగా ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి.     ఇపుడు ఆ ప్లేస్ హుక్ సాంగ్ ఆక్రమించి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే సామెతకి ఎంత పవర్ ఉందో చెప్పింది. దీంతో మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా వచ్చిన అద్భుతమైన సాంగ్స్ కి , ఆ చిత్రంలోని సాంగ్స్ నే అన్యాయం చేసుకున్నాయని సరదా చర్చని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మ్యూజిక్ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు.  
    -అనిల్ రావిపూడి ఎందుకు ఎలా చెప్పాడు -వెంకీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి  -జనవరి 12 మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా ఏం జరగబోతుంది       మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా, విక్టరీ ఈవెంట్ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu)ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న శిల్ప కళా వేదికగా అత్యంత ఘనంగా జరుగుతూ ఉంది.అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు భారీగా హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన అతిరధ మహారధులు కూడా హాజరైన ఈ వేడుకకి మన శంకర వర ప్రసాద్ గారు త్రయం చిరంజీవి(chiranjeevi),విక్టరీ వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anilravipudi)లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   also read:   ఈ సారి సంక్రాంతి  పందెం డైనోసార్ పై వెయ్యండి.. ఓజి  గుర్తుందిగా     ఈ ఈవెంట్ లో వెంకటేష్ క్యారక్టర్ గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతు వెంకటేష్ గారు మూవీలో వెంకీ గౌడ గా కనిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తారు. అయన క్యారక్టర్ శంకర వర ప్రసాద్ గారు తో కలిసాక చేసే అల్లరి మాములుగా ఉండదు. థియేటర్స్ లో ప్రేక్షకులని చక్కిలి గిలిగింతలు కలిగించడం పక్కా అని చెప్పుకొచ్చాడు.       
    -అనిల్ రావిపూడి ఎందుకు ఎలా చెప్పాడు -వెంకీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి  -జనవరి 12 మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా ఏం జరగబోతుంది       మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా, విక్టరీ ఈవెంట్ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu)ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న శిల్ప కళా వేదికగా అత్యంత ఘనంగా జరుగుతూ ఉంది.అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు భారీగా హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన అతిరధ మహారధులు కూడా హాజరైన ఈ వేడుకకి మన శంకర వర ప్రసాద్ గారు త్రయం చిరంజీవి(chiranjeevi),విక్టరీ వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anilravipudi)లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.   also read:   ఈ సారి సంక్రాంతి  పందెం డైనోసార్ పై వెయ్యండి.. ఓజి  గుర్తుందిగా     ఈ ఈవెంట్ లో వెంకటేష్ క్యారక్టర్ గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతు వెంకటేష్ గారు మూవీలో వెంకీ గౌడ గా కనిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తారు. అయన క్యారక్టర్ శంకర వర ప్రసాద్ గారు తో కలిసాక చేసే అల్లరి మాములుగా ఉండదు. థియేటర్స్ లో ప్రేక్షకులని చక్కిలి గిలిగింతలు కలిగించడం పక్కా అని చెప్పుకొచ్చాడు.       
        -ఎస్ కె ఎన్ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటి -ఎవరి పేర్లు చెప్తాడు -రాజా సాబ్ ఈవెంట్ లో అసలేం జరిగింది        పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)రేపు బెనిఫిట్ షోస్ తో వరల్డ్ వైడ్ గా 'ది రాజాసాబ్'(The Rajasaab)తో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జె విశ్వప్రసాద్ సుమారు 300 కోట్ల రూపాయిల వ్యయంతో నిర్మించిన రాజా సాబ్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ రోజు రాత్రి హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో ప్రీ రిలీజ్ పార్టీ ని నిర్వహించింది. ఈ వేడుకకి  అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు హాజరవ్వడం జరిగింది.      Also read:  మన శంకరవరప్రసాద్ గారు, రాజా సాబ్.. ఏ ఫంక్షన్ దగ్గర ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు         ఈ సందర్భంగా రాజాసాబ్ కి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా  ఉన్న ఎస్ కె ఎన్(Skn)మాట్లాడుతు  విశ్వప్రసాద్ గారు తన 'మిరాయ్'(Mirai)మూవీ మంచి రన్నింగ్ లో ఉన్నప్పడే ఓజి కోసం కొన్ని థియేటర్స్ ని త్యాగం చేసారు. తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో ఎదగడానికి ప్రభాస్ గారు బాహుబలి ద్వారా ఐదేళ్లు కష్టపడ్డారు. అలాంటి ప్రభాస్ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ పెద్దలు థియేటర్స్ విషయంలో కో ఆపరేట్ చెయ్యాలి. అలా కో ఆపరేట్ చేసిన వాళ్ళ పేర్లు పండుగ  తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఆ ప్రెస్ మీట్ లో అందరి పేర్లు ఉండాలని అనుకుంటున్నాను.ఎందుకంటే నాకు ఒక్క థియేటర్ ఇస్తే వంద సార్లు చెప్పుకుంటాను. థియేటర్ ఇవ్వకపోతే రెండు వందల సార్లు చెప్తాను. అది నా నైజం. ఈ పండక్కి వస్తున్న చిరంజీవి, వెంకటేష్ గారి మన శంకర వర ప్రసాద్ గారు తో పాటు మిగతా సినిమాలు కూడా బాగా ఆడాలి. ప్రతి సంక్రాంతికి కోళ్లపై పందెం వేస్తారు . ఈ సారి పందెం డైనోసార్ పై వెయ్యండి అని చెప్పుకొచ్చాడు. ఇప్పడు ఈ మాటలు ప్రభాస్ అభిమానుల్లో జోష్ ని తెప్పిస్తున్నాయి.  
        -సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రెస్పాన్స్ వైరల్ -అసలు ఫ్యాన్స్ ఏమంటున్నారు  -ఎక్కడ జరుగుతున్నాయి        ప్రెజంట్ హైదరాబాద్(Hyderabad)నగరంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ అభిమానుల సందడి వాతావరణం నెలకొని ఉంది. ఒక వైపు మెగా, విక్టరీ ల మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదాపూర్ లో ఉన్న శిల్ప కళా వేదిక లో జరుగుతుండగా, రాజా సాబ్ ప్రీ రిలీజ్ పార్టీ అజీజ్ నగర్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది. ఇక ఈ రెండు ఈవెంట్స్ గురించి సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారడంతో అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా సరికొత్త చర్చ జరుగుతుంది.     also read:   సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట!      వాళ్ళు మాట్లాడుతూ ఎవరి ఈవెంట్ దగ్గర ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని అంటున్నారు. దీంతో మరికొంత మంది అభిమానులు స్పందిస్తూ రెండు ఈవెంట్స్ దగ్గర ఫ్యాన్స్ భారీ ఎత్తున ఉన్నారని చెప్తున్నారు. అదే విధంగా రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.   
  మనిషి జీవితంలో ఆదాయం రావడానికి ఏదో ఒక ఉపాధి తప్పనిసరిగా ఉండాలి.  కొందరు ఒకరి కింద పనిచేస్తారు. మరికొందరు తమకు తామే ఉపాధి సృష్టించుకుంటారు.  ఇలా తమకు తాము ఉపాధి సృష్టించుకునేవారు వ్యాపారస్తులు అవుతారు. వ్యాపారం బాగా ఎదిగితే వీరే కొందరికి తమ కింద ఉపాధి కల్పిస్తారు.  అయితే వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు. దీనికి కారణం  వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడమే.. చేతిలో డబ్బు ఉంటే చాలు వ్యాపారం చేసేయవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ వ్యాపారం చేయాలన్నా, అందులో విజయం సాధించాలన్నా జ్ఞానం చాలా అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేమిటో తెలుసుకుంటే.. కష్టపడి పనిచేయడం.. వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం ఎప్పుడూ అవసరం.  సోమరితనంతో,  నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు.  తగినంత సమయం ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే అది విజయానికి బదులుగా అపజయాన్ని మిగులుస్తుంది. సానుకూల ఆలోచన.. పాజిటివ్  ఆలోచన,  ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవడం ద్వారా తాము చేసే పనులలో  సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు  మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ఇది  ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సత్సంబంధాలు..  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఇది  వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ  కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  కస్టమర్ల సాటిసిఫ్యాక్షన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్టు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రిస్క్.. కొత్త వ్యాపార అవకాశాలను త్వరగా గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టడానికి భయపడకూడదు.. అయితే, ఏదైనా రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకోవాలి. నిజాయితీ.. వ్యాపారస్తులకు ఉండాల్సిన  ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ.  నిజాయితీగా వ్యవహరించడం వల్ల  ఖ్యాతి,  వ్యాపారం మెరుగుపడుతుంది.  దీని ద్వారా  గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు. కస్టమర్‌లు,  ఉద్యోగుల మధ్య నమ్మకమైన వాతావరణాన్ని నిర్మించాలి. ఇది  వ్యాపారాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పం.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయం సాధిస్తామో అని ఆలోచిస్తారు. విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపికగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి.  వ్యాపారం అంటే  విజయం మాత్రమే కాదు.. అందులో విజయం ఉంటుంది,  వైఫల్యం కూడా ఉంటుంది. కాబట్టి  వైఫల్యాలు ఎదురైతే వాటి  నుండి నేర్చుకుని ముందుకు సాగండి. విజయం సాధిస్తే మళ్లీ కొత్త మార్గాలను జాగ్రత్తగా అన్వేషిస్తూ సాగాలి. లీడర్షిప్ స్కిల్స్.. వ్యాపారం చేయడానికి న్యాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.  వాటిని మెరుగుపరుచుకోవాలి.  ఎందుకంటే తన కింద వారిని నడిపించడానికి అవి సహాయపడతాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పై విషయాలను అన్వయించుకోవడం ద్వారా  వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని  కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.  జీవితంలో కీర్తిని, ప్రతిష్టను కూడా సాధించవచ్చు.                                        *రూపశ్రీ.
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. జనవరిలో జన్మించిన వారి రాశిచక్రం,  పుట్టిన సమయం కూడా వ్యక్తి స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. జనవరిలో జన్మించిన వ్యక్తులు తరచుగా  భిన్నంగా కనిపిస్తారు. వారిలో ఒక వింతైన తీవ్రత ఉంటుంది, చిన్న వయస్సులోనే జీవితాన్ని నేర్చుకోవాలనుకుంటున్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది.  ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుంటే.. జ్యోతిష్యం, మనస్తత్వశాస్త్రం,  ప్రవర్తనా అధ్యయనాల ప్రకారం జనవరిలో జన్మించిన వారు సహజంగా ప్రశాంతంగా, దృఢంగా ఉంటారు.  నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.   పరిణితి.. జనవరిలో జన్మించిన పిల్లలు గంభీరమైన స్వభావం,  ఆలోచనలో పరిణతితో  వారి వయసు  కంటే తెలివైనవారిగా కనిపిస్తారు.  ఎక్కువగా మాట్లాడరు, కానీ వారు మాట్లాడినప్పుడు  జాగ్రత్తగా మాట్లాడతారు. వారి నిర్ణయాలు భావోద్వేగాలపై తక్కువగా,  తర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. చిన్నతనంలో  అందరికీ దూరంగా ఉండటం ఎక్కువ. ఎవరితో ఎక్కువ మాట్లాడరు కూడా..  కానీ కాలక్రమేణా ఈ లక్షణాలు వారికి బలంగా మారతాయి. నిరాడంబరత, ఆదర్మమార్గం.. జనవరిలో జన్మించిన వ్యక్తులలో లీడర్ క్వాలిటీస్ ఎక్కువ. అయినా కూడా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. ఎలాంటి హడావిడి లేకుండా లీడర్స్ గా ఎలా ఉండాలో  వారికి తెలుసు. వారు ఆజ్ఞాపించరు, ఆదర్శంగా ముందుకు సాగుతారు. పాఠశాలలో లేదా ఆఫీసులలో అయినా, అందరూ వీరి పట్ల చాలా నమ్మకంతో ఉంటారు. క్రమశిక్షణ.. క్రమశిక్షణ వారి రక్తంలోనే ఉంటుంది. జనవరిలో పుట్టిన వారికి  బద్దకం అంటే శత్రువట.  సమయానికి మేల్కొనడం, తమ పనిని సరిగ్గా చేయడం,  తమ బాధ్యతలను నెరవేర్చడం వీరికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ క్రమశిక్షణ కొన్నిసార్లు వారిని కఠినంగా లేదా మొండిగా చేస్తుంది. ముఖ్యంగా  తమ ఇష్టానికి తగ్గట్టు ఏదైనా  జరగనప్పుడు మరింత మొండిగా మారతారు. వ్యక్తీకరణ..  వీరి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. కానీ అవి చాలా తక్కువగా వ్యక్తం చేస్తారు. వీరి నుండి  ప్రేమ పూర్తి నిజాయితీతో వస్తుంది,  స్నేహాలు జీవితాంతం ఉంటాయి. అయితే భావోద్వేగాలను వ్యక్తపరచడంలో సంకోచం వారిని సంబంధాలలో అపార్థాలకు గురి చేస్తుంది. భయం.. కష్టపడి పనిచేయడానికి భయపడరు.  కష్టాలకు భయపడి వెనుకంజ వేయడం వంటివి చేయరు. జనవరిలో పుట్టిన పిల్లలు కష్టపడి పని చేయడాన్ని గౌరవిస్తారు. రాత్రికి రాత్రే విజయం సాధించాలనే భ్రమలో  జీవించరు. అందుకే వారు తమ కెరీర్‌లో నెమ్మదిగా ఎదుగుతారు.  కానీ పూర్తీగా పై స్థాయిలో ఉండే విధంగా స్థిరపడతారు.   వారి గొప్ప బలం ఓర్పు. వారి అతిపెద్ద బలహీనత తమతో తాము చాలా కఠినంగా ఉండటం.   బాధ్యత.. ఇంట్లో అయినా లేదా సమాజంలో అయినా జనవరిలో పుట్టిన వారు  చిన్న వయస్సులోనే బాధ్యతలను స్వీకరిస్తారు. వారు తక్కువ ఫిర్యాదు చేస్తారు,  తమ విధులను నెరవేర్చడంలో  నైపుణ్యం కలిగి ఉంటారు. కొన్నిసార్లు ఈ భారం వారిని అంతర్గతంగా అలసిపోయేలా చేస్తుంది. కానీ వారు అలసిపోతున్నట్టు అస్సలు బయటపడనీయరు.                                          *రూపశ్రీ.
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. వెనుకటి కాలంలో పెళ్లి అంటే కేవలం పెద్దల నిర్ణయం. కానీ నేటి తరంలో పెళ్లి చేసుకునే వారిదే మొదటి, చివరి నిర్ణయం కూడా.. పెళ్ళి చేసుకోబోయే జంటలు పెళ్లికి ముందు ఒకరినొకరు కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. దీని వల్ల ఒకరినొకరు తెలుసుకోవడానికి వీలుంటుంది. దీని ఆధారంగా పెళ్లి గురించి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు.  ఇంతకీ పెళ్లికి ముందు కాబోయే జంట ఒకరినొకరు వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. అంచనాలు.. పెళ్ళికి ముందు చాలామంది తమకు వచ్చే భాగస్వామి అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అంచనాలు పెట్టుకుని ఉంటారు. ఈ అంచనాల గురించి ప్రశ్నించుకోవడం చాలా మంచిది. ఇది ఎవరి ఆలోచన ఎలా ఉంది? ఎలాంటి లైప్ కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. పెళ్లి తర్వాత ఉద్యోగం.. భారతదేశంలో ఇంటి బాధ్యత చూసుకునేది మగవారే.. అందుకే వారికి ఉద్యోగం తప్పనిసరి. అయితే  అమ్మాయిలు చదువుకున్నా,  ఉద్యోగం చేస్తున్నాపెళ్లి తర్వాత ఈ పరిస్థితులు మారుతుంటాయి.  అందుకే పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా? అనే విషయాలు ముందుగానే చర్చించుకోవడం మంచిది. వివాహం తర్వాత వీటి గురించి ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది. బాధ్యతలు.. ఇంటి బాధ్యతలు, ఆర్థిక భాద్యతలు,  పిల్లల బాధ్యతలను ఎలా విభజించాలి? వాటిని ఇద్దరూ ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాలు కూడా పెళ్లికి ముందు చర్చించుకోవాలి.  దీని వల్ల ఇద్దరూ తమ బాధ్యత చక్కగా నెరవేర్చుకోగలరు. ఆర్థిక ప్రణాళిక.. బాగస్వామి ఆర్థిక అలవాట్లు,  పొదుపులు, ఖర్చు విధానాలను అడిగి తెలుసుకోవాలి. ఎంత సంపాదన ఉంది, ఎంత ఖర్చు చేస్తున్నారు వంటివి అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల వివాహం తర్వాత ఇద్దరూ ఆర్థికంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇది వివాహం తర్వాత గొడవలను, విబేధాలను రాకుండా ఉండటంలో సహాయపడుతుంది. పిల్లల ప్లానింగ్.. పెళ్లి కాకుండానే పిల్లల గురించి మాట్లాడటం కాస్త విచిత్రం అనుకుంటారు అందరూ. కానీ నేటితరం వారు పిల్లల బాధ్యతను ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అందుకే ఎంత మంది పిల్లలను ప్లానింగ్ చేసుకోవాలి? పిల్లలను ఎప్పుడు కనాలి? పిల్లలను ఎలా పెంచాలి? పిల్లల బాధ్యతల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?  వంటి విషయాలు చర్చించుకోవాలి. ఇది భార్యాభర్తల బందాన్ని బలపరుస్తుంది. వివాదాలు.. ప్రతి ఒక్కరికి కోపం, అసహనం,  చిరాకు, గొడవ,  సమస్య వంటివి ఎదురైనప్పుడు స్పందించే విధానం వేరుగా ఉంటుంది.  ఇలాంటివి ఎదురైనప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు అనేది తెలుసుకోవాలి.  దీని వల్ల వివాహం తర్వాత గొడవలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పిరిష్కరించుకోవాలో ఇద్దరికీ అర్థం అవుతుంది. కుటుంబ సంబంధాలు.. పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడం కాదు.. రెండు కుటుంబాలు ఒక్కటవ్వడం. పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయి తమ అత్తమామలతో ఎలా ఉండాలి? ఎలాంటి అనుబంధం కోరుతున్నారు? వంటివి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇలా చేస్తే వివాహం తర్వాత ఎలాంటి విభేదాలు ఉండవు. ఇష్టాలు, అయిష్టాలు.. కాబోయే భాగస్వామి ఇష్టాలు, అభిరుచులు,  అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు వంటివి పెళ్లికి ముందు తెలుసుకోవాలి.  వైవాహిక బంధం ఎక్కువగా ఒకరి ఇష్టమైనది మరొకరు చేయడం అనే పని ద్వారా బలపడుతుంది.  దీని పల్ల ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థం అవుతుంది.  అందుకే ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోవాలి.                                *రూపశ్రీ.
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు.  సమయాభావం కారణంగా చాలా సార్లు వండుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి సందర్బాలలో బయట ఆహారం తినాలని  అనుకున్నా అవి ఖర్చుతో కూడుకుని ఉండటం తో వాటి వైపు వెళ్లాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని వచ్చినవే ప్యాకేజ్డ్ ఫుడ్స్.. వీటిలో రెడీ టూ యూజ్  ఫుడ్స్ చాలా ఉంటున్నాయి.  సింపుల్ గా వేడి నీరు పోయడం లేదా వేడి చేయడం ద్వారా నిమిషాలలో ఆహారం రెడీ అవుతుంది.  పైగా మంచి మసాలాలతో రుచిగా ఉండటంతో రెడీ టూ యూజ్  పుడ్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.  చిన్న పిల్లలు,  యువత ఎక్కువగా ఈ రెడీ టూ యూజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు.  అయితే ఈ ఫుడ్స్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రెడీ టు యూజ్ ఫుడ్స్ అంత రుచిగా ఎందుకుంటాయి? వీటిని తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే.. రెడీ టూ యూజ్ ఫుడ్స్.. అల్యూమినియం సాల్ట్.. సాధారణంగా రెఢీ టూ యూజ్ ఫుడ్స్ అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ గానే ఉంటాయి. ఈ ప్యాక్స్ లోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిలో హానికర రసాయనాలు కలుపుతారు. మరీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే కారం, పసుపు, మసాలలో అల్యూమినియం సాల్ట్స్ ను కలుపుతున్నారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని,  వీటిని వాడటం వల్ల చిన్నపిల్లలు , వృద్దులు,  అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడీ టు యూజ్ ఫుడ్స్ తో వచ్చే వ్యాధులు.. రెడీ టూ యూజ్ ఫుడ్స్ లో ఆలమ్ స్పైస్ కలుపుతారు.  ఇది కలిపిన మసాలాలు ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు వస్తున్నాయి.  50ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు రావడం ఈ ఆలమ్ స్పైస్ వాడటం వల్లే అని స్పష్టం చేస్తున్నారు. అసలేంటీ ఆలమ్ స్పైస్..   అల్యూమినియం సాల్ట్ నే ఆలమ్ స్పైస్ అని అంటారు. అల్యూమినియం పొటాషియం సల్పేట్ నే అల్యూమినియం సాల్ట్ అని అంటారు.  మసాలా దినుసులు పాడవకుండా దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల మసాలా దినులు ఎక్కువ కాలం పాటూ రుచి,  స్వభావం,  రంగు  మారకుండా పురుగులు పట్టకుండా, అలాగే మసాలాలు ఉండలు కట్టకుండా సహాయపడుతుంది. ప్యాకింగ్ ఫుడ్స్ లో దీన్ని మోతాదుకు మించి వాడుతుండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.  అందుకే వీలైనంత వరకు మసాలా పొడులను కూడా బయటి నుండి తెచ్చుకోవడం కంటే.. ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఆహారంలో సహజంగా ఐరన్  ఉత్పన్నం అవుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి,  రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అయితే ఇనుప పాత్రలలో వండే ప్రతి ఆహారం  ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనుకుంటే పొరపాటే. కొన్ని ఆహార పదార్థాలలో ఉండే  రసాయనాలు ఐరన్ తో  చర్య జరిపి, ఆహారం రుచి,  రంగును మార్చడమే కాకుండా, ఫుడ్ పాయిజనింగ్,  చర్మ వ్యాధుల వంటి తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల ఏ ఆహారాలను ఇనుప పాత్రలో వండకూడదు తెలుసుకోవడం ముఖ్యం. పుల్లని ఆహారాలు.. చింతపండు, టమోటా లేదా నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలు కలిగిన గ్రేవీలను ఎప్పుడూ ఇనుప పాత్రలో ఉడికించకూడదట. ఈ పదార్థాలలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇనుముతో వెంటనే రియాక్ట్ అవుతాయి. ఆహారానికి ఇనుము రుచిని ఇస్తాయి.  జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. పుల్లగా ఉండటం వల్ల ఇనుము ఆహారంలోకి ఎక్కువ మొత్తంలో లీచ్ అవుతుంది, ఇది శరీరంలో పాయిజన్ గా కూడా మారవచ్చు. పాలు, పెరుగుతో తయారు  చేసే పదార్థాలు.. పాలు, పెరుగు జోడించి తయారు చేసే ఆహారాలు,  పాయసం, కస్టర్డ్ వంటి వంటకాలను ఇనుప పాత్రలలో వండటం నిల్వ చేయడం మంచిది కాదు.    ఇనుప పాత్రలు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి, దీని వలన పెరుగు లేదా పాలు విరుగుతాయి. ఇనుము పాత్ర  ఈ తెల్లగా కనిపించే వంటకాలను నల్లగా లేదా నిస్తేజంగా మారుస్తాయి. దీని వలన వాటి రుచి,  పోషక విలువలు రెండూ ప్రభావితం అవుతాయి. రాజ్మా,  శనగలు..  తరచుగా ఇనుప పాత్రలో రాజ్మా  బీన్స్, శనగపప్పు వండుతుంటారు. ఇనుప పాత్రలు అన్ని వైపులా సమానంగా వేడెక్కవు, ఈ భారీ ధాన్యాలు కొన్ని ప్రాంతాలలో ఉడికిపోతాయి,  మరికొన్ని  తక్కువగా ఉడుకుతాయి. సరిగా ఉడకని బీన్స్ లేదా శనగపప్పు తినడం వల్ల తీవ్రమైన ఉబ్బరం,  గ్యాస్ వస్తుంది. వాటిని ప్రెజర్ కుక్కర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కుండలో ఉడికించడం ఉత్తమం. వెనిగర్ తో చైనీస్ ఫుడ్స్.. ఈ రోజుల్లో వెనిగర్‌ను చౌ మెయిన్,  పాస్తా వంటి వంటకాల్లో  విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వెనిగర్ అనేది బలమైన ఆమ్లం.  ఇది నిమ్మకాయ, చింతపండు లాగా ఐరన్ తో చాలా తొందరగా రియాక్ట్  అవుతుంది.  ఇలా వండే ఆహారం సేఫ్ కాదు. వెనిగర్ ఉన్న ఏదైనా వంటలకు ఐరన్  కంటే నాన్-స్టిక్ లేదా స్టీల్ పాత్రలను ఎంచుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బయట చైనీస్ ఫుడ్స్ తినేటప్పుడు వెనిగర్ వాడుతున్నారా,  ఏ పాత్రలు వాడుతున్నారు  తెలుసుకోకుండా పొరపాటున కూడా తినకండి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్ లాంటివి కొనడం చేస్తుంటారు. అయితే తిప్పతీగను సరైన విధానంలో వాడటం ద్వారా చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అసలు తిప్పతీగలో ఉండే పోషకాలు ఏంటి? ఇది ఏ వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది?తెలుసుకుంటే.. తిప్పతీగలో ఉండే పోషకాలు.. తిప్పతీగలో కాల్షియం,  భాస్వరం,  ఐరన్,  రాగి, మాంగనీస్,  జింక్, విటమిన్-సి,  బీటా-కెరోటిన్, ప్రోటీన్,  ఫైబర్,  కార్బోహేడ్రేట్లు, కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు అన్నీ ఉంటాయి. తిప్పతీగ ప్రయోజనాలు.. రక్తహీనత.. మహిళలలో రక్త హీనత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తిప్పతీగను తీసుకుంటే చాలా మంచి బెనిపిట్స్ ఉంటాయి.   తిప్పతీగలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  ఇది రక్త  నష్టాన్ని భర్తీ చేయడంలో సహాయపడుతుంది.   రోగనిరోధక శక్తి.. శీతాకాలంలో రోగనిరోధక శక్తి బాగా బలహీనం అవుతుంది. రోగనిరోధక శక్తి తిరిగి బలంగా మారడానికి, శీతాకాలపు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి రోజూ తిప్పతీగ తీసుకుంటే చాలా మంచిది.  తిప్పతీగ లోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడుతుంది. పొట్ట సమస్యలు.. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తిప్పతీగ వాడితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తిప్పతీగలో ఫైబర్ కంటెంట్ మెరుగ్గా ఉంటుంది.  ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.  రోజూ తిప్ప తీగ తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులోనే స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఎముకలు.. తిప్పతీగలో కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.  అందుకే ప్రతి రోజూ తిప్పతీగ తీసుకుంటే కాల్షియం మెరుగ్గా అందుతుంది.  ఎముకలు బలంగా మారతాయి. తిప్పతీగతో జాగ్రత్త.. తిప్పతీగ తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది.  అలాగే తిప్పతీగ కూడా పరిమితంగా తీసుకోవాలి. ఎక్కువ తిప్ప తీగ తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలకు బదులు ఆరోగ్యానికి హాని ఎదురవుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...