LATEST NEWS
అభివృద్ధి జ‌ర‌గాలంటే ఆయుధం ఓటు.. ప్ర‌జా పాల‌న సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్ర‌భుత్వాల‌ను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. క‌క్ష‌పూరిత పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వం మెడ‌లు వంచాల‌న్నా ఆయుధం ఓటే.. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మ‌న చేతుల్లోనే ఉంది. మన‌ది ఒక్క ఓటే క‌దా వెయ్య‌క‌పోతే ఏమ‌వుతుందిలే అనుకుంటే అది పొర‌పాటే. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఓట‌ర్లు చేసిన ఆ పొర‌పాటే ఇప్పుడు వారి జీవితాల‌కు శాపంగా మారింది. రాజ‌ధాని లేని రాష్ట్రంగా చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకోవ‌డంతోపాటు.. గంజాయికి నిల‌యంగా మారింది. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఏపీ మారింది, అభివృద్ధి లేని రాష్ట్రంగా, ఉద్యోగాలు లేని రాష్ట్రంగా, ఉన్న కంపెనీల‌ను త‌రిమేసిన రాష్ట్రంగా.. మొత్తంగా మ‌రో శ్రీ‌ల‌కం దేశంగా మారేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం సిద్ధంగా ఉంది. అందుకు కార‌ణం ఏపీ ఓట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే. ఏపీలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింది. అభివృద్ధి లేదు, రోడ్లు వేయ‌లేదు, ఉద్యోగాలు క‌ల్పించ‌లేదు, క‌నీస సౌక‌ర్యాలు లేవు.. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు మాత్రం పెద్దెత్తున జ‌రిగాయి. గొంతెత్తి అడిగిన వారు  జైళ్ల‌కు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నిక‌ల్లో 79.64 శాతం పోలింగ్‌ న‌మోదైంది. దాదాపు 20శాతం మంది ఓట‌ర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. వీరిలో 10శాతం మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ముందుకు వ‌చ్చినా ఏపీ ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం ఇన్ని ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుండేవారు కాక‌పోవ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డం, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాలకే ప‌రిమితం కావ‌డంతో   రాష్ట్రంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారి జీవ‌నోపాధి కోసం   చిన్న‌ాచితికా ప‌నులు కూడా దొర‌క‌క పోవ‌డంతో హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు రాష్ట్రాల‌కు పెద్ద సంఖ్య‌లో   వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల్లో జీవ‌నం సాగిస్తున్న ఏపీ ఓట‌ర్లు.. సొంత రాష్ట్రం వెళ్లి ఓటువేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. ఫ‌లితంగా ఓటింగ్ శాతం త‌గ్గింది. దాదాపు 60 నుంచి 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో వెయ్యి నుంచి 10వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్ధులు ఓడిపోయిన ప‌రిస్థితి. ఇత‌ర ప్రాంతాల‌కు ఉపాధికోసం వెళ్లిన‌ ఏపీ ఓట‌ర్లు ఆశించిన స్థాయిలో త‌మ రాష్ట్రంకు వెళ్లి ఓటు వేయ‌క‌పోవ‌డంవ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గ‌త ఐదేళ్ల‌లో పీక‌ల్లోతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.   గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 151 సీట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ స‌గానికి పైగా స్వ‌ల్ప ఓట్ల మెజార్టీతో గెలిచిన సీట్లే. 20శాతం మంది ఓట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వైసీపీ అధికారంలోకి రావ‌డం.. ఏపీ ప్ర‌జ‌లు ఉపాధి కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల‌కే పేద‌ల‌కు అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిలో వేగంగా జ‌రుగుతున్న ప‌నుల‌ను నిలిపివేశారు.   ఏపీ సీఎంగా చంద్ర‌బాబు కొన‌సాగిన‌ స‌మ‌యంలో అమ‌రావ‌తి, దాని ప‌రిస‌ర ప్రాంతాల్లో వేలాది మందికి ఉపాధి దొరికింది. రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో కుల‌వృత్తుల వారికి పుష్క‌లంగా ప‌నులు దొర‌క‌డంతో ఆర్థికంగా వారికి వెసులుబాటు ఏర్ప‌డింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌క్ర‌బుద్ధితో వారి జీవ‌నోపాధిపై దెబ్బ‌కొట్టారు. అంతేకాదు.. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ఏపీ అభివృద్ధిలో పూర్తిగా వెనుక‌బ‌డి పోయింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు పెద్దెత్తున పెట్టుబ‌డులు పెట్టాయి. జ‌గ‌న్ సీఎం హోదాలో వాట‌న్నింటిని ఏపీ నుంచి త‌రిమేశారు. అలాఅని కొత్త కంపెనీల‌నుకూడా ఏపీకి తీసుకురాలేదు. దీంతో యువ‌త ఉద్యోగాలు చేసుకునేందుకు అవ‌కాశం లేకుండా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేశారు. మ‌ట్టి, ఇసుక దోపిడీతో జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు జేబులు నింపుకున్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, అక్ర‌మ కేసులు బ‌నాయించి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. వైసీపీ నేత‌ల ఆగ‌డాలు త‌ట్టుకోలేక పోయిన చాలా మంది ఏపీని వ‌దిలి జీవ‌నోపాధికోసం ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్లిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనంత‌టికీ కార‌ణం.. ఇత‌ర రాష్ట్రాల్లోని ఏపీ ఓట్లు పోలింగ్ స‌మ‌యంలో ఓటు హ‌క్కు వినియోగించుకోక పోవ‌టం వ‌ల్ల‌నేని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.  2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా క‌లిసి పోటీచేసి అధికారంలోకి వ‌చ్చాయి. 2014 నుంచి ఐదేళ్లు ఏపీలో ఎటుచూసినా అభివృద్ధి ఆన‌వాళ్లు క‌నిపించాయి. సీఎంగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ప‌ట్టుద‌ల‌తో ఏపీని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న ప్ర‌ముఖ కంపెనీల‌ను ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేలా చేయ‌డం, పాత రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు, కొత్త రోడ్లు వేయ‌డం, యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న‌, ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని అద్భుతంగా నిర్మించేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. చంద్ర‌బాబు హ‌యాలో ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఆర్థికంగా అన్ని వ‌న‌రులుఉన్న‌ తెలంగాణ రాష్ట్రంతో పోటీప‌డింది. కానీ, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అబివృద్ధి అనే ప‌దాన్ని మ‌ర్చిపోయి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగించి ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైకో పాల‌న‌తో ఐదేళ్లు న‌ర‌క‌యాత‌నకుగురైన ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం ఆ బారినుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం వ‌చ్చింది. ఓటు ద్వారా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బుద్దిచెప్పి మ‌ళ్లీ ప్ర‌జాపాల‌నను తెచ్చుకొనే అవ‌కాశం ఏపీ ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింది. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రాష్ట్రంలోఉన్న ఓట‌ర్లు, ఇత‌ర రాష్ట్రాల్లోఉన్న ఏపీ ఓట‌ర్లు  పోలింగ్ రోజు ఏపీలోని వారి స్వంత ప్రాంతాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని. ఐదేళ్ల జగన్ దుర్మార్గ‌  పాల‌నకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది.   జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఓటు   ఆయుధంతో బుద్ధి చెప్పాలి.   నిర్ల‌క్ష్యం వీడి మేలుకో ఏపీ ఓటరా.. మ‌ళ్లీ ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు ఓటును ఆయుధంగా వినియోగించుకో.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో ఎన్టీయే కూటమి పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజుల్లో ప్రచార గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీలన్నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారంలో దుమ్ము దులిపేస్తూ, జగనన్న మీద దుమ్మెత్తి పోస్తున్నారు.  ప్రతిపక్షాలు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేస్తుంటే, అధికార పార్టీ నాయకుడు, అంగబలం, అర్థబలం వున్న నాయకుడు జగన్ మాత్రం తాడేపల్లి కోటను దాటికి బయటకి రావడం లేదు. చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే, ఓటమి చెందబోతున్నానని అర్థం చేసుకున్న జగన్ ఇక ప్రచారం చేయడం ఎందుకులే అని చేతులెత్తేశాడని, ఎన్నికలు ముగిసిన తర్వాత లండన్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని... అయితే తాడేపల్లి కోటకు సంబంధించిన వర్గాలు చెబుతున్నది వేరేలాగా వుంది. జగన్ ఇప్పుడు పూర్తిస్థాయి డిప్రెషన్లో కూరుకుపోయి వున్నారట. ఓటమి తప్పదని తెలిసిన తర్వాత ఆ డిప్రెషన్ మరింతగా పెరిగిపోయిందట. మొన్న మచిలీపట్నం సభలో గొంతు వణికేలా ప్రసంగించిన జగన్, కేవలం ఫిజికల్‌గా ఏడవలేదంతే, దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఆ మీటింగ్ తర్వాత జగన్ మానసిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందట. తాను ఇన్ని బటన్లు నొక్కినా, జనం ఎన్నికలలో తన ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కడానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకున్న ఆయన భారీ స్థాయిలో హర్టయ్యారట. ఐదేళ్ళ నుంచి తాను వేసిన ప్లాన్ ఇలా అట్లర్ ఫ్లాప్ కావడం, ఓటమి తర్వాత తాను జైలుకు వెళ్ళడం తప్ప మరొక మార్గం లేకపోవడంతో జగన్ భారీ స్థాయిలో డిప్రెషన్లో కూరుకుపోయాడని తెలుస్తోంది. గత ఎన్నికలలో ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల, ఇంకోవైపు విజయమ్మ, మరోవైపు అంతర్లీనంగా బ్రదర్ అనిల్ కుమార్... ఇలా చాలామంది జగన్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు తాను పూర్తిగా ఒంటరి అయిపోవడం, పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా మారడం, జనం మూడ్ పూర్తిగా అవతగం కావడంతో జగన్ డిప్రెషన్ లోయలోకి పడిపోయారని తెలుస్తోంది. ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటకి తీసుకురావడానికి ప్రస్తుతం ఆయనకు సైకాలజిస్టుల చేత సైకో థెరఫీ జరుగుతోందని చెబుతున్నారు. డిప్రెషన్ తగ్గడానికి పవర్ ఫుల్ మందులు కూడా వాడుతున్నారని సమాచారం. ఆ ‘సైకో’ థెరపీ, డిప్రెషన్ మందుల సహకారంతో ప్రస్తుతం జగన్ బండి నడుస్తున్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్  ప్రజలు రెండు ప్రభుత్వాలను చూశారు. విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.  ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేళ్లూ రాష్ట్రంలో పాలన సాగించింది. ఇక ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మూడో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో తేల్చనున్నారు. ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో అంటే మే 13న జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి తమ తమ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు.  వైసీపీ,  తెలుగుదేశం కూటమిలలో  ఈసారి విజయం ఎవరిదన్న విషయాన్ని ఇప్పటికే ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఎన్నో సర్వేలు తేల్చి చెప్పేశాయి.  వైసీపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని పరిశీలకులు సైతం సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీపై   ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది? ఐదేళ్ల పాలనలో జగన్ పట్ల అంతటి విముఖత ఎందుకు కలిగింది? అన్న ప్రశ్నకు సమాధానంగా ఐదేళ్ల చంద్రబాబు పాలన, ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూస్తే చాలు.   ఇంకొంచం వివరంగా చెప్పాలంటే.. రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు చెరొక అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల పాలన ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు, జగన్ ల పనితీరును కళ్లారా చూశారు. దీంతో ఈసారి అధికారం ఎవరికి ఇవ్వాలి..  మరోసారి సీఎంగా ఎవరిని చూడాలనేది ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చేసింది. సర్వేలు చూసినా, విశ్లేషకుల అభిప్రాయాలను గమనించినా.. ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతుంది. ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన జనం  ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలో  మే 13న తమ ఓటు ద్వారా చెప్పేస్తారు.   అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటి వ్యయం,  సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొని మరీ జనం తమ తీర్పు చెప్పడానికి రెడీ అయిపోయారు. అయితే, చంద్రబాబు, జగన్ పాలనలను పోల్చి లెక్కలేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే అనిపిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే.. జగన్ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు హయంలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తె జగన్ అసలు ఆ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నిధులు, అప్పుల విషయంలో జగన్ ఆర్ధిక  అరాచకత్వాన్ని ప్రదర్శించి.. పన్నుల రూపంలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపారు. చంద్రబాబు ఇతర దేశాలలో ఉన్న వారిని కూడా రాష్ట్రానికి రప్పించి ఉపాధి పెంచేందుకు కృషి చేస్తే.. జగన్ హయంలో ఏపీలో ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి. నేరాలు-ఘోరాలలో జగన్ సర్కార్ దేశంలోనే ముందు వరుసకు చేరింది.  ఏకంగా దళితుడిని చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంటపెట్టుకొని తిరగడంతో  జగన్ నేరాలకు కొమ్ముకాస్తున్నారన్న భావన ప్రజలలో ఏర్పడింది.  విద్యా, వైద్యంలో హంగు, ఆర్భాటాలు తప్ప జగన్ సాధించేదేమీ లేదు. ఇలా ఎలా చూసినా చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు మేలు అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనం కూడా చంద్రబాబు, జగన్ పాలనల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించారు. అందుకే  చంద్రబాబు పాలనకే మొగ్గు చూపుతున్నారు.  అందుకు ఇప్పటికే వెలువడినడజనుకు పైగా సర్వేలు చంద్రబాబే సీఎం అని తేల్చేశాయి. వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశాయి. అలాగే  ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపిస్తున్న ప్రజాదరణ, ప్రజా స్పందనలను చూసినా ఆ విషయం అర్ధమైపోతుంది.   తెలుగుదేశం కూటమి సభలకు జనం పోటెత్తుతుంటే.. వైసీపీ సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. చివరాఖరికి పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రచారానికి కూడా జనం ముఖం చాటేస్తున్నాయి. డబ్బులు ఇచ్చి, మందు పోసి సమీకరించిన వారు కూడా ఇలా కనిపించి అలా మాయమైపోతున్నారు. దీంతో ఐదేళ్ల జగన్ పాలనను అంతుకు ముందు ఐదేళ్ల చంద్రబాబు పాలనతో పోల్చి చూసుకుని రాష్ట్ర ప్రగతి, పురోగతి, నిజమైన ప్రజా సంక్షేమం కావాలంటే చంద్రబాబు మఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టా ల్సిందేనన్నదే జనాభిప్రాయమనీ, అదే సర్వేలలో ప్రతిఫలిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
తెలుగువన్ రూపొందించిన పొలిటికల్ స్పూఫ్ షార్ట్ ఫిలిమ్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వుంది. గగన్ అనే దుర్మార్గపు పాలకుడు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జైలుపాలవుతాడు. జైల్లో అతనితోపాటు అతని తోకలు కూడా కొంతమంది వుంటారు. వాళ్ళని పరామర్శించడానికి అతని పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది వస్తారు. మొదటగా వచ్చిన ‘గుట్కా బాబీ’తో జరిగిన సంభాషణ, వారు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ నవ్వుల విందు వడ్డిస్తున్నాయి. మీరూ చూడండి.. ఎంజాయ్ చేయండి.. నవ్వుల విందులో ఇది ఫస్ట్ ఎపిసోడ్..   
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధంలో ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చి అస్త్ర సన్యాసం చేసేశారా? ఎన్నికలు నాలుగు రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. పోటీలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడూ.. ఈ నాలుగు రోజులూ విశ్రాంతి గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సాధ్యమైనంత మందిని కలిసి ఓటు అభ్యర్థించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇతరత్రా విషయాలను అసలు పట్టించుకోరు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం మధ్యలో విరామం తీసుకుంటున్నారు. ఎవరినీ కలవకుండా, పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయకుండా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమౌతున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ప్రచారం జోలికి వెళ్లకుండా ప్యాలెస్ కు పరిమితమైపోయారు. ఔను ఈ నెల 2, 3, 8 తేదీలలో జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. పోనీ ఎండల్లో తిరగడం వల్ల వచ్చిన అస్వస్థతతో విశ్రాంతి తీసుకున్నారా అంటే అలాంటి సంకేతాలేమీ లేవు. ఎన్నికల ప్రచారం కంటే ముఖ్యమైన పనులేవో ఆయన చక్కబెట్టుకుంటున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.  అందుకు కారణాలు లేకపోలేదు. కొన్ని రోజుల కిందట.. తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద సీఐడీ సిబ్బంది కీలక ప త్రాలను దగ్ధం చేసిన సంగతి తెలసింది. జగన్ అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరించే సీఐడీ చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకే ఆ పత్రాల దగ్ధం జరిగిందని స్వయంగా సిట్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. నాడు దగ్ధం చేసిన పత్రాలలో హెరిటేజ్ కు చెందిన కీలక పత్రాలు, అలాగే చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పత్రాల దగ్ధం సమయంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొందరిని ఆ వీడియోలు, పొటోలు తమకు ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు ఒత్తిడి చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ను అధికారులు చట్ట విరుద్ధంగా పొందారని, వాటినే  దగ్ధం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినవచ్చాయి. అంటే అప్పటికే రాష్ట్రంలో ప్రజల మూడ్ వైసీపీకి వ్యతిరేకంగా ఉందనీ, ఎన్నికలలో ఓటమి ఖాయమనీ వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చేసి.. ఆ పత్రాల దగ్ధానికి సీఐడీ చీఫ్ ను పురిగొల్పి ఉంటుందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  అంతే కాకుండా ఎన్నికలలో వైసీపీ పరాజయం ఖాయమనీ, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు ఇప్పుడు సర్దుకునే పనిలో పడ్డారనీ అప్పట్లో గట్టిగా వినిపించింది. ఇప్పుడు సిట్ కార్యాలయంలో పత్రాలు దగ్ధం సంఘటన జరిగిన నెల రోజులకు జగన్ ప్రచారంలో తరచూ విరామం తీసుకుంటూ.. ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపైనా అటువంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఓటమి ఎటూ తప్పదు.. కనీసం తప్పులు దొరకకుండా తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై ఆయన ప్యాలెస్ లో మంత్రాంగం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా మే 13న పోలింగ్ జరుగుతుంది. సరిగ్గా నాలుగు రోజుల తరువాత జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారు. భార్య భారతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టును అభ్యర్థిస్తూ  పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్, స్విట్జర్ ల్యాండ్, ఫ్రాన్స్ లో పర్యటించనున్నట్లు తెలిపారు.  ఏపీలో పోలింగ్ పూర్తయిన వెంటనే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ విదేశీ పర్యటన అభ్యర్థనపై సీబీఐ కోర్టు గురువారం (మే9) విచారించనుంది. ఓటమి భయంతో జగన్ కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయనకు స్వయానా సోదరి షర్మిల ఇప్పటికే ఆరోపించారు. అంతే కాకుండా వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారనీ, ఈ ఎన్నికలలో ఓటమి పాలైతే అరెస్టు తథ్యమనే భయంతోనే ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపించారు. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే పీక్ టైంలో ప్రచారాన్ని సైతం వదిలేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తున్న మంత్రాంగంపై అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.   
ALSO ON TELUGUONE N E W S
దివంగత నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు బీజేపీలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎంపీగా, కేంద్రమంత్రిగా సేవలందించారు. ఇప్పుడు కృష్ణంరాజు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఆయన సతీమణి శ్యామలాదేవి తీసుకున్నారు. కృష్ణంరాజు తరపున బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి ఆమె రంగంలోకి దిగారు. నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు మద్దతుగా శ్యామలాదేవి ప్రచారం నిర్వహించారు. మొదట మొగల్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె, అనంతరం నరసాపురంలో మత్స్యకారుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మను గెలిపించాలని పిలుపునిచ్చారు.  ఇటీవల శ్యామలాదేవి వైసీపీలో చేరనున్నారంటూ కొన్ని న్యూస్ చక్కర్లు కొట్టాయి. కూటమి తరపున ప్రచారం చేసి, ఇప్పుడు ఆ ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టారు శ్యామలాదేవి. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి ఎందరో కూటమికి మద్దతు తెలిపారు. ఇప్పుడు శ్యామలాదేవి కూటమి అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించడంతో.. కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులంతా కూటమి వైపు మొగ్గు చూపే అవకాశముంది.
  ది కేరళ స్టోరీ మూవీతో సంచలనం సృష్టించిన నటి అదాశర్మ. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈ భామ.. ' ది కేరళ స్టోరీ' మూవీతో సక్సెస్ ని అందుకుంది. అదాశర్మ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంది‌. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తుంది. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదాశర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదాశర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తోంది. రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు అదాశర్మ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమా ద్వారా వస్తున్నట్లు ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. ‌ఇక ఈ సినిమాలో అదా లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. అయితే ఇప్పుడు అదాశర్మ నటించిన 'బస్తర్ ' ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. సుదీప్తో సేన్, విపుల్ అమృత్ లాల్ తెరకెక్కించిన మూవీ 'బస్తర్'. మార్చి  నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్దంగా ఉంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 లో ఈ నెల 17 నుండి స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు.  మావోయిస్టుల నేపథ్యంలో సాగే ఈ బస్తర్ లో ఐపీఎస్ అధికారిగా అదాశర్మ కన్పించింది. బస్తర్ ప్రాంతంలోని సామాన్యులపై మావోయిస్టుల పెత్తనం.. వారిని అణచివేయడానికి స్పెషల్ ఆఫీసర్ ఇలా కథ మొత్తం.. ‌మావోయిస్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంది. ఇక మిగతా కథేంటో తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే. ఢిఫరెంట్ జానర్ సినిమాలని చేస్తూ అదాశర్మ సత్తా చాటుకుంటోంది.  
  విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు  పంతొమ్మిది సినిమాలు చేసాడు.అందులో పక్కా హీరోగా చేసిన చిత్రాలు పన్నెండు.  హిట్ అయిన సినిమాలు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం,టాక్సీ వాలా  లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ తో   డిజాస్టర్ ని అందుకున్నాడు.  దీంతో ఇప్పుడు తనకి  అర్జెంట్ గా  ఒక హిట్ కావాలి. ఈ నేపథ్యంలో వస్తున్న  రెండు వార్తలు విజయ్ ఫ్యాన్స్ లో పండగ వాతావరణాన్ని తెస్తున్నాయి. పైగా ఈ సారి హిట్ ఖాయమని కూడా అంటున్నారు  విజయ్ ప్రస్తుతం జెర్సీ ఫేమ్  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఏ మూవీ చేస్తాడు అనుకునే తరుణంలో రాజా వారు రాణి వారు ఫేమ్  రవి కిరణ్ కోల మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు దీనికి నిర్మాత. ఈ మేరకు తాజాగా  ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఒక చేయి  ఒక పెద్ద కొడవలని పట్టుకొని ఉంది. విజయ్ లుక్ ని మాత్రం రిలీజ్ చెయ్యలేదు. ఆ చేయి విజయ్ దే అని అనుకోండి. అలాగే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతుందనే సింబాలిక్ గా తెలుగు,హిందీ, తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో కత్తి నేనే, నెత్తురు నాదే,యుద్ధం నాతోనే అనే క్యాప్షన్ ని కూడా యాడ్ చేసారు. ఇప్పుడు ఈ పోస్టర్ ని చూసిన విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు ఇప్పుడు వాళ్లకి డబుల్ ఆనందాన్ని కలిగించేలా ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ  తమ కొత్త చిత్రాన్ని రేపు ప్రకటిస్తామని ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.  మద్రాస్ రెసిడెన్సీ కి చెందిన మ్యాప్ లో రాయలసీమ ప్రాంతాన్ని చూపించారు. ఈ పోస్టర్ కూడా ఎంతో క్యూరియాసిటీ ని కలిగిస్తుంది. ఇది కూడా  విజయ్ దేవరకొండ కొత్త మూవీనే.  టాక్సీవాలా ని  డైరెక్ట్ చేసిన రాహుల్ సంకృత్యాన్‌ దానికి దర్శకుడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే పీరియాడికల్ ఫిల్మ్‌గా  తెరకెక్కుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అధికార ప్రకటన రానుంది. ఇక ఆశ్చర్య కరమైన విషయం ఏంటంటే విజయ్ గత చిత్రాలైన  ఖుషి ,ఫ్యామిలీ మెన్  లు వరుసగా విడుదల అయ్యాయి. ఒక మూవీని మైత్రి నిర్మించగా ఇంకో దాన్ని  దిల్ రాజు నిర్మించాడు. ఆ రెండు  డిజాస్టర్స్ గా నిలిచాయి. మళ్ళీ వాళ్లిద్దరే వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. మరి ఆ రెండిటిలో ఏది త్వరగా కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుందో చూడాలి  
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు ఈ విశ్వంలో మారుమోగిపోతున్నంత కాలం రేణు దేశాయ్ పేరు వినపడుతునే ఉంటుంది. పవన్ మాజీ వైఫ్ గా ఆమెకి ఆ క్రేజ్ ఉంది. సోషల్ మీడియా లో ఫుల్ ఆక్టివ్ గా ఉండే ఆమె  తాజాగా ఒక పోస్ట్ చేసింది. పలానా సినిమా చూడండి అని. ఇంతకీ ఆమె చెప్తున్న మూవీ ఏంటో తను ఎందుకు అలా చెప్తుందో చూద్దాం  ఆర్టికల్ 370 ..యామిని గౌతమ్,ప్రియమణి,రాజ్ అర్జున్  ప్రధాన పాత్రలని పోషించిన ఈ మూవీ మొన్న ఫిబ్రవరి 23, 2024 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా చూసుకున్నా కూడా  మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఇప్పుడు ఈ మూవీని చూడమనే రేణు దేశాయ్ చెప్తుంది. ఇప్పుడే ఈ చిత్రాన్ని చూసాను. దీన్ని చిత్రీకరించిన అద్భుతమైన విధానం మరియు మన దేశంలోని అద్భుతమైన నటులు మరియు వాస్తవికత కోసం ప్రతి ఒక్కరు  చూడాలని తన ట్వీట్ లో పేర్కొంది    ఇప్పుడు ఈ ట్వీట్ ని చూసిన చాలా మంది  ఎలక్షన్స్  టైం లో ఇలాంటి సినిమాలు చూడటం అవసరం అంటు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవాన్ని చూసుకుంటే ఆర్టికల్ 370  లో ప్రధాన మంత్రి మోడీ గొప్పతనం  చాలా స్పష్టంగా కనపడుతుంది. 2019 లో ఫిబ్రవరి 14 వ తేదీన పుల్వామా దాడి జరిగింది. ఆ తర్వాత  జమ్ము కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ను కల్పించే  అంశంలో భాగంగా  ఆర్టికల్ 370 ను రద్దు జరుగుతుంది. ఆ సమయంలో మోడీ ఎంత తెలివిగా వ్యహరించారనేదే ప్రధాన అంశం. కొన్ని రోజుల క్రితం కూడా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి  బిజెపి ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవిలతని పొగుడుతూ ట్వీట్ చేసింది. ఆర్టికల్ 370  జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మాణం జరుపుకుంది.  ఆదిత్య సుహస్ జంభ  దర్శకుడు   
The recent comedy-horror film Aranmanai 4, the fourth film from the highly successful horror comedy series ‘Aranmanai’ starring Sundar C, starring Sundar C, Tamannaah Bhatia, and Raashi Khanna, released on May 3rd. The film failed to impress Telugu audience with its outdated horror content. But, in Tamil which is scarce of a proper hit from January made it a blockbuster. The film grossed more than 50 crores in just 5 days. The film might collect 100 crores as there is no big releases. The film is directed by Sundar C and produced by Khushbu Sundar and ACS Arun Kumar under Avni Cinemax P Ltd. Asian Suresh Entertainment LLP will be releasing the movie in Telugu states. The movie will hit the screens on May 3rd.
Today, the makers announced the release date of "Bhaje Vaayu Vegam," starring hero Kartikeya Gummakonda, under the banner of UV Concepts and presented by the prestigious production company UV Creations. The film, directed by Prashanth Reddy Chandrapu, will have a grand theatrical release worldwide on the 31st of this month. Iswarya Menon stars as the heroine, while Rahul Tyson of "Happy Days" fame plays a pivotal role. Ajay Kumar Raju.P is the acting co-producer. Already, Sudheer Babu's Harom Hara, Anand Deverakonda's Gam Gam Ganesha, Ajay Ghosh and Chandini Chowdary's Music Shop Murthy are releasing on May 31st. This is a huge clash among small films. Another small film might join this clash. "Bhaje Vaayu Vegam" is crafted as an emotional action thriller. With its teaser and lyrical song already released, the film is creating significant interest among audiences. There is a growing curiosity to watch this movie on the big screen. Tomorrow morning at 9:09, the first single from "Bhaje Vaayu Vegam," titled 'Set Ayyindhe,' will be released.
Icon Star Allu Arjun, celebrated the 20th anniversary of 'Arya' in Hyderabad, alongside director Sukumar, producer Dilraju, and the entire team. During the event, Allu Arjun highlighted 'Arya' as the most transformative film of his career and extended his gratitude to Sukumar for the pivotal role he played. Allu Arjun reflected on his journey, stating, "To describe what 'Arya' means to me, I'd say it was the most significant leap in my life. I didn’t start from a neutral stance; I was at -100. Although 'Gangotri' was successful, I failed to leave a lasting impression, which was my fault. But with 'Arya,' I rocketed from -100 to +100—a 200 percent increase. No other success has surpassed this, nor do I believe any will." He praised Sukumar for the profound impact he had on his life. As they currently collaborate on 'Pushpa: The Rule,' Allu Arjun shared, "I cannot think of anyone who even comes close to the impact Sukumar has had on me. My life took a new direction with him. Before 'Arya,' I was like a directionless train engine, but this film laid down the tracks for my journey, shaping my path forward." Allu Arjun also commended producer Dilraju for his role in making 'Arya' a reality, which subsequently changed many lives. He highlighted, "Twelve assistant directors from 'Arya' have since become directors themselves." Both Sukumar and Dilraju shared intriguing anecdotes about the set and the inception of the project.
Arya is a cult classic love story in Telugu cinema and the team celebrated 20 years of the film last night in a grand manner. Sukumar and Dil Raju shared many interesting things about how this project took off and their experiences. Sukumar told “Dil Raju promised a film if Dil becomes a hit. He called me and confirmed the project after the release of Dil. We narrated the script to Ravi Teja and Prabhas. When I went to narrate this story for Prabhas, I said "This story doesn't suit you, I'm here because of Dil Raju garu." He added, "One evening, we were screening Dil for actor Tarun and then came Allu Arjun. My friend said, there is your Nachiketha. I decided that Allu Arjun is the hero of Arya. Soon we narrated the script to Allu Arjun and then to his father Allu Aravind." After months of hard work and script changes, the film materialized. At one point of time, I decided to go back to my hometown and do my Lecturer job as I was frustrated narrating the same script again and again. Dil Raju convinced me and I waited for the opportunity” told Sukumar.
Yesterday, Disney+ Hotstar unveiled the world of upcoming animated series – Baahubali: Crown of Blood at AMB Cinemas, Hyderabad with the team of Baahubali: Crown of Blood. The upcoming animated series takes you back in time on an epic journey of the clash of the empires where Baahubali and Bhallaladeva join hands to protect the great kingdom of Mahishmati and the throne against their greatest threat.  Produced by Graphic India and Arka Mediaworks Production Pvt Ltd and the visionary filmmaker S.S. Rajamouli, Sharad Devarajan & Shobu Yarlagadda, directed and produced by Jeevan J. Kang & Navin John the series is set to stream on Disney+ Hotstar starting 17th May, 2024 onwards Present at the event, Gaurav Banerjee, Head – Content, Disney+ Hotstar & HSM Entertainment Network, Disney Star said, “We at Disney+ Hotstar always believe in telling stories that transcend to people across the country and with Baahubali: Crown of Blood, we aim to take animation to new heights. Collaborating with S.S. Rajamouli, a legendary filmmaker along with our long standing partnership with Graphic India is a step in that direction. Baahubali: Crown of Blood is a show for all whether you are fans of the Baahubali franchise or experiencing the show for the first time. It’s an appetite for all.” Present at the event, Creator of the world of Baahubali, S.S. Rajamouli said, “Hyderabad holds a special place in my heart, as it is the city where the Baahubali franchise was created. It feels wonderful to be here unveiling a new chapter in the Baahubali saga with ‘Baahubali: Crown of Blood.’ Collaborating with Graphic India, Arka Mediaworks and Disney+ Hotstar has been an incredible experience, as their passion and dedication to create older animation in India has been truly inspiring. Together, we have crafted a story that not only expands the Baahubali universe but also promises to captivate audiences with its epic animation, emotional depth, and complex characters. Witness the clash of empires as the legendary warriors of Mahishmati unite to save their motherland in Baahubali: Crown of Blood on Disney+ Hotstar.” Sharad Kelkar, Actor and the man behind the voice of Baahubali said, “I have lent my voices to a lot of characters but Baahubali: Crown of Blood holds a special place in my heart due to my long association with this franchise. Baahubali:Crown of Blood takes this franchise to a whole new level – for fans and new audiences alike. Breathing life into this character yet again is a surreal feeling – like I am stepping into a whole new world unlike anyone has ever seen before and I can’t wait for audiences to see this on Disney+ Hotstar this May."
It is known that Tollywood Megastar Chiranjeevi is currently doing a movie Vishwambhara under the direction of young director Mallidi Vassishta. This movie, which is being shot at a fast pace, will be released on Sankranti 2025. It is known that megastar Chiranjeevi, who has shown his great heart and has been doing many social service programs, was awarded the title of Padma Bhushan in 2006 by the Government of India. Recently government announced Padma Vibhushan for him. He received this award not only for his special services to the film industry, but also for his social service during the Covid pandemic. Megastar chiranjeevi to receive his padma vibhushan tomorrow. Ram charan & family to attend the event in Delhi. Megastar already left for Raj Bhavan, Delhi in a chartered flight to receive the award.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ
ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే.. కెపాసిటర్.. సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.   బ్లేడ్.. కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. బాల్ బేరింగ్ ఫెయిల్యూర్.. సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు. స్క్రూలు.. ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరళత. సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.                                                *రూపశ్రీ.
ఆఫీసులో పనిచేస్తున్న వారిలో పనిపట్ల శ్రద్ధలేకపోయినా, పని చేయడంలో విసుగు చిరాకు ప్రదర్శిస్తున్నా వారి సమస్య ఒత్తిడికాదు... పని ఒత్తిడి ఎక్కువైందని...! పనితో అలసిపోతున్నామని చెప్పేవారి సమస్య ఏమిటంటే వారికి ఆ పనిపట్ల ఇష్టం లేకపోవడం. అందువల్ల పనిమీద శ్రద్ధ చూపించలేకపోయారు. దాని వలన వారు పని ఒత్తిడి ఎక్కువైందని భావిస్తారు. అయిష్టంతో పనిని చేయడం వలన ఏ వ్యక్తి అయినా, ఆ పనిని రెండుసార్లు చేస్తారు. ఎన్నిసార్లు చేసినా ఆ పనిలో వారు చురుకుదనంగా ఉండరు. ఆ పనిని అంత సమర్థవంతంగా చేయలేరు. ఆ పనిపట్ల అయిష్టతకు కారణం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేక వేరే ఇంకేమైనా కావచ్చు. అందువల్ల ఆవ్యక్తి ఆ పని పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.  ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినపుడు, మనం మన  వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలి. ఆ ఫీల్డ్కి మనం ఇష్టంతో అంకితమవ్వాలి. అప్పుడు ఆ ఫీల్డ్కి మనం న్యాయం చేసినవారం అవుతాము. వ్యక్తిగత జీవితంలో ఎవరు హుషారుగా ఆనందంగా గడుపుతారో అటువంటివారే ఎంత ఒత్తిడినైనా తట్టుకుని, ఎంత పనైనా చేయగలుగుతారు. జీవితంలో తృప్తిగలవారికే పనిలోనూ తృప్తి లభిస్తుంది. జీవితాన్ని ఆనందించలేనివారు చిన్నచిన్న పనుల్లో కూడా చాలావరకు తప్పులనే చేస్తూ వుంటారు. "పనులు నువ్వు చేయడంలేదు. జరుగుతున్నాయ" అనే మాటను  గ్రహించి నిరహంకారంగా ఎవరి  కర్తవ్యం వారు నిర్వర్తించాలి. ఈ పని తర్వాత ఇంకేం చెయ్యాలి అని ఆలోచించకూడదు కేవలం చరిస్తూ వెళ్ళాలి. అలా ఆచరిస్తూంటే, ఒకదానివెంట మరొకటి అవే వస్తుంటాయి. మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తయితే ఆ పనిపట్ల నీవు ఇష్టతను చూపించావు అని అర్థం. మొదలుపెట్టినపని అవలేదంటే నీవు ఆ పనిపట్ల అయిష్టతను చూపించావు అని అర్థం. కొంతమంది ఇష్టంతో చేసినా ఆ పని ఆపలేదంటే దానికి కారణం ఆ పనిని వాయిదా వేయడం. ఇలా వాయిదా వేయడం వలన క్రమేపీ ఆ పనిపట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. దీని వలన ఆ పనులు పూర్తికావు. అందువలన ఎప్పుడూ పనులను వాయిదా వేయకూడదు. కాబట్టి మనం ఏదైనా పనిని మొదలు పెట్టినపుడు ఆ పనిని ఇష్టంతో వాయిదా వేయకుండా ఆ పనిని త్వరగా పూర్తిచేసుకోవాలి. ఎప్పుడైన ఒక పనిని ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమనిపించదు ఆ పనిలో విజయాన్ని పొందుతారు. ఎప్పుడైనా ఒక పనిని కష్టపడి చేస్తే మనకి ఆ పని కష్టంగా వుంటుంది. ఆ పని విజయవంతం కాదు. ఓటమి, విఘ్నం, అనేవి బయటెక్కడో లేవు. నీలోనే వున్నాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు కొందరు, ఇంకేదో విషయంపై ఉత్సాహంతోనే పనులు మానేస్తారు మరికొందరు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనిని తలపెడితే ఆ పని అయ్యేవరకూ ఆ పనిపట్ల ఇష్టాన్ని చూపించాలి. అప్పుడే ఆ పనిలో ఆనందాన్ని పొందగలం. అలా చేస్తే ఇక విజయం మన  సొంతమవుతుంది. ఒక సాకర్ ఆటలో ఆటగాళ్ళను మారుస్తూ, ఒకరు సరిగ్గా ఆడకపోతే వారికి బదులు ఇంకొకరిని అడటానికి పంపవచ్చు. కానీ - జీవితం అలాకాదు. ఒకసారి ఏదైనా తప్పుచేస్తే, దాన్ని వెనక్కి తీసుకుని, దానిస్థానే ఇంకోపని చెయ్యటం కుదరదు. మీ జీవితంలో సంభవించిన విషాద సంఘటనలని వెనక్కి తిప్పి సరిచూసుకోడానికి మీకు రెండో అవకాశం దొరకదు.                                      ◆నిశ్శబ్ద.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఖర్జూరాలను రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. తేనె, ఖర్జూరం కాంబినేషన్ కేవలం ఒకటని కాదు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.  రాత్రి పడుకునే ముందు తేనె,  ఖర్జూరం లో ఉండే పోషకాలేంటో.. వాటిని కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. తేనె పోషకాలు.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో - కేలరీలు: 64, కొవ్వు: 0 గ్రా, సోడియం: 0 mg, పిండిపదార్థాలు: 17 గ్రా, ఫైబర్: 0 గ్రా, చక్కెరలు: 17 గ్రా, ప్రోటీన్: 0.1 గ్రా, పొటాషియం: 10.9 mg, ఇనుము: 0.1 mg, కాల్షియం: 1.3 mg ఉంటాయి. ఖర్జూరం పోషకాలు.. ఎండు ఖర్జూరంలో  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు, ఖనిజాలు (కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ మొదలైనవి),  విటమిన్లు (B1, B2, C, మొదలైనవి) వంటి పోషకాలు ఉంటాయి. ఇది టానిన్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ మొదలైన వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఖర్జూరాన్ని తేనెతో కలిపి తింటే.. రాత్రి పడుకునే ముందు ఈ రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. తేనె, ఖర్జూరం రెండు తీసుకుంటే   శరీరంలో ఎలాంటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి తింటే ఆకలి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తేనె, ఖర్జూరం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ రెండూ వేడిగా ఉంటాయి కాబట్టి వేసవి కాలంలో వీటి వినియోగాన్ని తగ్గించాలి.                                                       *రూపశ్రీ.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల  జీర్ణక్రియ  ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో  ఎక్కువగా పండ్లు,  కూరగాయల రసాలను తాగుతారు. ఇది  మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని  ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి.  ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు..  సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా  ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును  పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం  శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో  జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు  దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు  ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.                                                  *రూపశ్రీ.
కిడ్నీ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటె దీనిని రినాల్ సెల్ కార్సి నోమా గా పిలుస్తారు.. కిడ్నీ సైజ్ 4 సెం గా ఉంటుంది. ఇందుకోసం హీటింగ్ లేదా ఫ్రీజింగ్ పద్దతిద్వారా ట్యూమర్ కు సాధారణంగా తెరఫీ మాత్రమే ప్రత్యామ్నాయం.తెరఫీ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ గా అందరికీ తెలుసు. దీనివల్ల చాలామంది జీవితాలు కాపాడ వచ్చు.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.క్లినికల్ స్టేజి లోనే టి వి ఏ అవసరం లేకుండా కిడ్నీ సర్జరీ చేయవచ్చు.పెన్సిల్వేనియా లో నిర్వహించిన ప్రాధమిక పరిశోదనలో యురాలజీఅసోసియేషన్  అమెరిక అధికారిక జర్నల్ లో ప్రాధమిక స్థాయిలో ఉన్న రినాల్ కార్సినోమా ను గుర్తించారు.ఆర్ సి సి ద్వారా ౩ నుండి 4 సెమి క్రియో అబ్ లేషన్ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.కిడ్నీ క్యాన్సర్ సంబందిత మరణాలు తక్కువే అయిన అబ్లేషణ్ ప్రభావం తక్కువే అని హీట్ పద్ధతికన్న  ధర్మల్ ఎబిలేషణ్ పద్ధతి  ఎబిలేషణ్ ఉత్తమమని నిర్ధారించారు.రెండిటిని పోల్చినప్పుడు ౩ సెమి లు తక్కువ ఉన్నప్పుడు చల్లటి పద్దతిలో హీట్ పద్దతిలో తెరఫీ ద్వారా క్యాన్సర్ నివారించ వచ్చు.రచయిత గాబ్రియల్ ఐ ఆర్ సి సి ఎస్ ఎం డి సైంటిఫిక్ ఇన్స్టిట్యుట్ మిలాన్ చేసిన పరిశోదన లో ఎబిలేషణ్ ఎలా వినియోగించాలి.అన్న అంశాల పై రోగులకు చిన్న ఆర్ సి సి ఎస్ పద్ధతి పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.హీటింగ్ కన్నా క్రియో ఎబిలేషన్ వల్ల ప్రభావం తక్కువే. కిడ్నీ క్యాన్సర్ ను రినాల్ కార్సినోమా గా ప్పిలుస్తారు.రోగులలో అర సి సి 4 సెమీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో ఫ్ర్రీజింగ్ పడ్డతి హీటింగ్ విధానాల ద్వారా ట్యూమర్ ను సహజంగా ఇచ్చే థెరపీ లానే ఉంటుంది.ఇది క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ అంటారు ఎబ్లేషణ్ కూడా క్యాన్సర్ స్టేజ్ ను బట్టి  ఇవాల్సి ఉంటుంది.కిడ్నీ సర్జర్రీ లేకుండా నే  ఎబ్లేషణ్ పద్దతి అమలు చేయవచ్చు.ఏది ఏమైనా ఎబ్లేషణ్ వల్ల తక్కువ లాభాలే వ్యక్తిగతంగా వివిధ స్తేజిలలో టి ఎల్ క్యు అర్ సి సి ఎస్ ట్యూమర్ లు ౩ నుండి 4 సెమీ కణి తలు ఉంటె యురోపియన్ గైడ్ లైన్స్ ప్రాకారం చికిత్చ ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వినియోగించవచ్చు. అంతార్జాతీయ పరిశోదనా సంస్థ బృందం వివిధ స్తేజిలలో ఉన్న వారిని పరీక్షించి ఆర్ సి సి ని ఫ్రీజింగ్ హీటింగ్ పద్దతిని 2౦౦ 4-2౦18 లో కేసులు సర్వ్ లెన్స్ ఎపిడ మాలజీ ద్వారా ఫలితం నషనల్  క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ట్యూమర్ లు ౩,4 సెమీ ఉంది రెండు మూడు గ్రూపు లతో సరిపోయాయి. ఇందులో 75 7 మందికి క్రియో బిలేషణ్ చికిత్చ చేయాగా ౩ 88 మందికి హీట్ ధర్మల్ ఎబ్లేషణ్ చికిత్చ్చ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.72 సం వచ్చరాలు పై బడిన 4 22 మందికి హీట్ పద్ధతి ద్వారా 2౩8 మందికి ఫ్రీజింగ్ పద్ధతి ని అందించారు.కిడ్నీ క్యాన్సర్ కాక ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారే ఎక్కువ.౩ నుండి 4 సెమీ ఉన్న వారికి క్రియోబిలేషణ్ 8.5 % క్రియో బిలేషణ్ ద్వారా 18.9 హీట్ పద్ధతి ద్వారా ఎబిలేషణ్ రెన్దొఇ కొన్ని కేసులలో వినియోగించినట్లు తెలిపారు.కిడ్నీ త్యుమర్లను నివారించేందుకు స్మాల్ ఎబిలేషణ్ చికిత్చ చేయవచ్చు అన్నది పరిశోదన సారాంశం.