LATEST NEWS
ఏపీ పాలటిక్స్ లో వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.   మాజీ సీఎం, వైసీపీ అధినేత నివాసం అయిన తాడేపల్లి ప్యాలెస్ ఎదుట.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి ధర్నాకు దిగడం కలకలం రేపడమే కాకుండా వైసీపీలో సంచలనం సృష్టించింది.  పార్టీ అధినేత  జగన్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన అనిల్.. ఈ సందర్భంగా పార్టీలో నంబర్ 2గా చెలామణి అవుతున్న సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై బాహాటంగా విమర్శలు గుప్పించడమే కాకుండా తీవ్ర ఆరోపణలు చేశారు.   వైఎస్ జగన్ నివాసం వెలుపల ఉన్న  ప్రతి కార్యకర్త కష్టాన్నీ నేను మరిచిపోను అనే ఫ్లెక్సీ ముందే బోరుగడ్డ అనిల్ ధర్నాకు దిగడం విశేషం. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన తనకు అధినేతను కలిసే అవకాశం ఇవ్వకుండా సజ్జల అడ్డుకుంటున్నారని ఆరోపించారు.   తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావొద్దని సజ్జల రామకృష్ణారెడ్డి తన అనుచరులతో చెప్పించారనీ,  తనపై 'రౌడీషీటర్' అనే ముద్ర వేసి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. బోరుగడ్డ అనిల్ ధర్నా ఏదో వ్యక్తిగత వ్యవహారం కాదనీ, సజ్జలకు పార్టీ నుంచి ఎగ్జిట్  చేయడానికి డోర్ ఓపెన్ చేయడంలో భాగంగా పడిన ఫస్ట్ స్టెప్ అనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఉండి, ఆ తరువాత పార్టీ వీడిన విజయసాయి రెడ్డి పార్టీలోకి తిరిగిరానున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ సజ్జలపై విమర్శలు గుప్పిస్తూ.. బోరుగడ్డ ఏకంగా జగన్ నివాసం ఎదుట ధర్నాకు దిగడం కాకతాళీయం ఎంత మాత్రం కాదని అంటున్నారు.   గతంలో విజయసాయి రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి సీనియర్ నేతలు సైతం పార్టీలోని కోటరీ వైఖరి పట్ల, మరీ ముఖ్యంగా సజ్జల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   ఇప్పుడు పార్టీలోకి విజయసారి తిరిగి రానున్నారన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే బోరుగడ్డ ధర్నా ప్రాముఖ్యత సంతరించుకుంది. సజ్జలకు ఉద్వాసన పలికే దిశగా బోరుగడ్డ చేత విమర్శలతో వైసీపీ అగ్రానాయత్వం వ్యూహాత్మకంగా తొలి అడుగు వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    అదలా ఉంటే ఇటీవలి కాలంలో పార్టీ అధినేత జగన్ సజ్జల తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా   ప్రతిపాదించిన  రాజధాని ప్రతిపాదనను   పార్టీ శ్రేణులకు చేరవేయడంలో సజ్జల విఫలమయ్యారనీ, అలాగే సొంత మీడియా కూడా మావిగన్ కు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడానిక సజ్జల సూచనలే కారణమనీ జగన్ ఆగ్రహంతో ఉన్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత తగ్గంచి ఆయనకు ఎగ్జిట్ డోర్ చూపించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారనీ, అందులో భాగంగానే బోరుగడ్డ అనీల్ ను ముందుకు తెచ్చరనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి బోరగడ్డ అనిల్ ధర్నా రానున్న రోజులలో వైసీపీలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో? విజయసాయి రీఎంట్రీ వార్తలు, బోరుగడ్డ ధర్నా అంశాలను వేరువేరుగా చూడలేమనీ, పార్టీలో రానున్న రోజులలో జరగబోయే మార్పులకు ఇవి సంకేతాలనీ చెబుతున్నారు.  Exit door to Sajjala, YSRCP internal differences, Borugadda Anil dharna,  Tadepalli Jagan residence, Vijayasai Reddy Reentry
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిచంద్రబాబు ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది.  మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ)లతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.  ఇదే కనుక నిజమైతే..  స్థానిక రాజకీయాల్లో  ఇదో విప్లవాత్మక మార్పు అని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది. అంటే..  ఓటర్లు వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎన్నుకుంటే.. ఆ ప్రజాప్రతినిధులు తమ నాయకులను ఎన్నుకుంటారు.  ఈ పరోక్ష ఎన్నికల విధానంపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి  నేపథ్యంలో..  అన్ని స్థాయిల్లోనూ ప్రజలే నేరుగా నాయకులను ఎన్నుకునేలా చట్ట సవరణ తీసుకువచ్చేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.   ఈ కొత్త విధానం కనుక అమల్లోకి వస్తే..   మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో  ప్రజలు వార్డు కౌన్సిలర్,  కార్పొరేటర్‌తో పాటు మున్సిపల్ ఛైర్మన్,  మేయర్ లను కూడా నేరుగా   ఓటు వేసి ఎన్నుకుంటారు.  అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది.  దీనివల్ల స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది.    పరోక్ష ఎన్నికల సమయంలో క్యాంపు రాజకీయాలు, బేరసారాలు, ఒత్తిళ్లు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలకు ఈ విధానం పూర్తిగా చెక్ పెడుతుంది. అంతే కాకుండా,  మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ, బలవంతపు క్యాంపులు,  ఇతర రాజకీయ  వ్యూహాల వల్ల ఎన్నికల ప్రక్రియలో జాప్యం, వివాదాలకు తావు లేకుండా పోతుంది.   కాగా ఈ నిర్ణయం పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమౌతోంది.  ఓటర్లు నేరుగా తమ నాయకుడిని ఎన్నుకోవడం వల్ల  పాలనలో పారదర్శకత వస్తుందని, జవాబుదారీ తనం పెరుగుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో త్వరలో   స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటి లోగా సంబంధిత   బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం పొంది  చట్టరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.    Revolutionary refoems in local body elections,  AP Local Body Elections 2026, AP Direct Elections Reform, Andhra Pradesh Local Body Reforms,  municipal chairman,  Mayor Direct Elections 
కేంద్ర ప్రభుత్వం వాహనాల పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని పెంచుతూ తీసుకుంటున్న నిర్ణయాలపై  దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలకు ఆజ్యం పోశారు  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.   నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు. విమానాల ఇంధనంలోనూ ఇథనాల్ మిశ్రమం చేస్తే..   విమానాల ప్రయాణ భద్రతపై తీవ్రమైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ ఆరోపణ చేశారు.   తనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విమాన రవాణా రంగానికి సరఫరా చేసే ఇంధనంలో ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసిందని పేర్కొన్న కేజ్రీవాల్..  విమానయాన రంగానికి చెందిన నిపుణులు,  టెక్నాలజీ ఎక్స్ పర్ట్ ల అభిప్రాయం ప్రకారం విమాన ఇంధనంలో ఇథనాల్ వంటి పదార్థాలను మిశ్రమం చేయడం వల్ల ఇంజన్ల పనితీరు దెబ్బతినడమే కాకుండా..  గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఉందన్నారు కేజ్రీవాల్. దీనివల్ల వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు  ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా నేలపై నడిచే వాహనాలకు వాడే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడానికీ, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే విమాన ఇంధనంలో కలపడానికీ చాలా వ్యత్యాసం ఉంటుందన్న కేజ్రీవాల్.. విమానాలు   ప్రతికూల వాతావరణ పరిస్థితులలో,  అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ప్రయాణిస్తాయనీ,  ఇలాంటి పరిస్థితులలో ఇంధనంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నా అది ఇంజన్ స్తంభించిపోవడానికి లేదా ఇతర సమస్యలకూ దారితీసే అవకాశం ఉంటుందన్నారు.  నిపుణులు ఈ తరహా ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కేజ్రీవాల్ తన పోస్టులో పేర్కొన్నారు.  ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న ఈ-20 విధానంపై ఇప్పటికే వాహనదారుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల ఇంజన్లు త్వరగా పాడైపోతున్నాయని, మైలేజ్ తగ్గిపోతోందని వినియోగదారులు ఆరోపించడమే కాదు..  నిపుణులు కూడా ఈ 20 వినియోగం వల్ల ఇంజన్లు పాడైపోతాయనీ, మైలేజీ తగ్గుతుందనీ ధృవీకరిస్తున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా పార్లమెంటు వేదికగా మైలేజీ తగ్గుతుందని అంగీకరించారు కూడా. ఆ సమస్య పరిష్కరించకుండానే.. ఇప్పుడు ఎన్డీయే సర్కార్.. ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని విమానాలకు కూడా వర్తింప చేయడానికి కసరత్తు చేస్తోందంటూ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.  శాస్త్రీయ అధ్యయనం లేకుండా మోడీ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సిద్ధపడుతోందన్నవిమర్శలు వ్యక్తమౌతున్నాయి. ముందుకు సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్   స్వచ్ఛమైనదిగా ఉండాలని, అందులో ఎలాంటి మార్పులు చేసినా విమానయాన సంస్థలకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.  అదలా ఉండగా.. కేజ్రీవాల్   ఆరోపణలపై   కేంద్రం నుంచి కానీ,  పౌర విమానయాన మంత్రిత్వ శాఖనుంచి కానీ ఎటువంటి స్పందనా ఇప్పటి వరకూ రాలేదు. దీంతో విమానాల ఇంధనంలో కూడా ఇథనైల్ మిశ్రమం అన్న ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పరిశీలకులు అంటున్నారు.   Arvind Kejriwal lleges E20 in flights,   Ethanol Blending, Aviation Turbine Fuel ATF,  Modi Government, Flight Safety
నీట్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఆందోళనల కారణంగా విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  కాక్రోచ్ ల ఉద్యమం విజయం సాధిండంతో.. కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచే దిశగా హస్తినలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాకుడు రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు.   ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయకుండా కేవలం ఒక్క మంత్రి రాజీనామాతో సరిపెట్టడంఏమిటని నిలదీస్తున్నారు. దీని  వెనుక ఉన్న అసలు సూత్రధారులు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  జూలై 20న ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు  బలప్రయోగం చేయడాన్ని లోక్ సభ వేదికగా రాహుల్  ఖండించారు.   పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ నేరుగా హోంమంత్రి అమిత్ షాను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అమిత్ షా  ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై దాడికి దిగారని ఆరోపించారు. భారత భవిష్యత్తు  యువతపై పెల్లెట్లు ప్రయోగించడం దారుణమని, ఈ హింసాత్మక ఘటనలకు అమిత్ షా బాధ్యత వహించి   తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ వేదికగా రాహుల్ చేసిన ఈ డిమాండ్ దుమారం రేపింది.  కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ వ్యాఖ్యలపై  అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ  డిమాండ్ చేశారు.  మరోవైపు జూలై 21న ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగిన రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియం డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చెప్పులు లేకుండా మెట్లపై కూర్చుని రికార్డు చేసిన 2 నిమిషాల 15 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.  విద్యార్థులకు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యక్ష సందేశం పేరిట విడుదల చేసిన ఆ వీడియోలో.. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం  ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు. నాణ్యమైన విద్య సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతోందని, తరచూ ప్రశ్నపత్రాలు లీక్ కావడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారమౌతోందని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం జూలై 25న   ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్   జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో సహా పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ 10 జనపథ్ నివాసంలో సమావేశమయ్యారు. విద్యార్థులు కోరుతున్నది ఉచిత, నాణ్యమైన, పారదర్శకమైన విద్యావ్యవస్థ అనీ, కానీ   ప్రభుత్వం విద్యాసంస్థలను నాశనం చేస్తోందని విమర్శించారు.  విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ల నియమకాల నుంచి పరీక్షల నిర్వహణ వరకు వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయంటూ రాహుల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ  విద్యార్థుల తరఫున పోరాటాన్ని  లోక్ సభలోనూ, వీధుల్లోనూ కూడా మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.   Rahul Gandhi demand , Amit Shah resignation,  Dharmendra Pradhan Resignation, Student Protests Delhi, Paper Leak Controversy, Lok Sabha Debate 2026
ప్రపంచ వాణిజ్య రవాణాకు గుండెకాయ వంటి  హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రత,  ప్రయాణం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  కీలకమైన  ఈ  సముద్ర మార్గంలో  కొత్త  వాణిజ్య నౌకాయాన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్,  ఒమన్ దేశాల మధ్య  అంగీకారం కుదిరింది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నడుమ, గల్ఫ్ లో గ్లోబల్  సరఫరా గొలుసు పునరుద్ధరించేందుకు ఈ ద్వైపాక్షిక దోహదపడనుంది. గత కొన్ని  నెలలుగా ఇరాన్,  ఒమన్ మధ్య   ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా  కొత్త    రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది.  సాంకేతిక, చట్ట, భద్రతా  కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు  సంబంధించి  ఇరు దేశాలు  ఓ అవగాహనకు వచ్చాయి. హర్మూజ్ జలసంధిలో సురక్షితమైన వాణిజ్య నౌకాయానానికి వీలు కల్పించే దిశగా ఒమన్‌తో జరిపిన సంప్రదింపుల్లో   పురోగతి సాధించామని  రాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మీడియాకు వెల్లడించారు.    ఎటువంటి  అంతరాయాలు,  ఒత్తిళ్లు లేకపోతే.. అంగీకరించిన ప్రధాన మార్గదర్శకాలతో త్వరలోనే  ఈ విషయంపై ఇరాన్, ఒమన్ లు ఉమ్మడి   ప్రకటనను  విడుదల చేస్తాయి. గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల కదలికలకు భద్రత  కల్పించేందుకు దాదాపు రెండు నెలలు  సాగిన  చర్చలు దాదాపు ఫలవంతమయ్యాయి.   ద్వైపాక్షిక అంగీకారం కుదిరినప్పటికీ, జలసంధిలో ప్రస్తుతానికి నూటికి నూరు శాతం   భద్రత ఏర్పడినట్లు భావించలేం.   అమెరికా వైఖరిలో మార్పు రానంత వరకు,  సముద్ర దిగ్బంధనాలు తొలగనంత వరకు జలసంధిలో నౌకల రవాణా  సురక్షితం కాదనే చెప్పాలి.  మరోవైపు..  ప్రాంతీయ ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు,  చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇరాన్   దౌత్య మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే రెండు మూడు రోజులలో   ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ,  పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ పాకిస్థాన్,  ఖతార్ లలో పర్యటించనున్నారు.  Strait of Hormuz, Iran Oman shipping route, commercial maritime security, Esmaeil Baghaei statement, Middle East shipping tension, Gulf trade route
ALSO ON TELUGUONE N E W S
  ఒక సినిమా హిట్ అని చెప్పుకోవడానికి ఎన్ని ఊర మాస్ పదాలని అభిమానుల నోటి నుంచి వింటామో అలాంటి  అన్ని రకాల హిట్స్ ని చూసేసిన దర్శకుడు వివి వినాయక్(VV Vinayak).మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్' ఆది'తో దర్శకుడిగా ఆరంగ్రేటమ్ చేసి  'మాస్' అనే అసలు సిసలు  పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వినాయక్ దర్శకత్వ శైలికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వినాయక్ నుంచి సినిమా ప్రకటన వచ్చి దాదాపు 2 సంవత్సరాలకు పైగా అవుతోంది. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఒకటే చర్చ వినాయక్ ఇక సినిమాలు తీయరా? ఆయన దర్శకత్వ ప్రయాణానికి ముగింపు పడినట్లేనా? అనే సందేహాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. నేటి తరం సినిమాలు పూర్తిగా మారిపోయాయి. కమర్షియల్ మాస్ ఫార్ములా స్థానంలో కొత్త తరహా కాన్సెప్టులు, రియలిస్టిక్ కథనాలు, టెక్నికల్ వండర్స్ చోటు చేసుకుంటున్నాయి. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలను ఎంచుకోవడంలో వినాయక్ కొంత వెనుకబడ్డారనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. అయితే వినాయక్ కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటే అవుతుంది. ఎందుకంటే, వినాయక్ వంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడికి సరైన ఒక్క పవర్‌ఫుల్ స్క్రిప్ట్ పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆయన సరైన కథా బలం ఉన్న స్క్రిప్ట్ తయారీలో ఉన్నారని, సరైన సమయం చూసి రీఎంట్రీ ఇస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో  వినాయక్ మళ్లీ తన మార్క్ మాస్ ఎంటర్‌టైనర్‌తో విరుచుకుపడి, బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. Also read: పేపర్ లీకేజీకి అసలు కారణం ఇదే.. #విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు  మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకి  పైగా షేర్ తో ఘనవిజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత వినాయక్  దర్శకత్వం వహించిన 'ఇంటెలిజెంట్' కేవలం 20 శాతం రికవరీ కూడా సాధించలేక డిజాస్టర్‌గా నిలవడం ఆయన మార్కెట్‌పై పెద్ద దెబ్బకొట్టింది. ప్రభాస్  'ఛత్రపతి'ని హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో రీమేక్ చేసినప్పటికీ, ఆ చిత్రం కూడా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ వరుస పరాజయాలు ఆయన కెరీర్ వేగానికి పెద్ద బ్రేకులు వేశాయి. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ 'కథ నచ్చితే నల్లమలపు బుజ్జి నిర్మాతగా సినిమా ఉంటుందని చెప్పాడు. బుజ్జి కూడా ఒక ఇంటర్వ్యూ లో అదే చెప్పాడు. ఆదికి బెల్లంకొండ సురేష్ తో పాటు బుజ్జి కూడా నిర్మాత అనే విషయం తెలిసిందే.   Vv Vinayak, Ntr, Chiranjeevi, Prabhas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న #AA23 సినిమా గురించి ఒక బిగ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబో కావడంతో 'AA23'పై అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన గత చిత్రం 'కూలీ'తో అంచనాలను అందుకోలేకపోయిన లోకేష్.. ఈసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి, తన పవరేంటో చూపించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే 'AA23' విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. 'AA23'లో కథకు కీలకమైన ఓ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నారట. లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో ప్రతి పాత్రను ఎంత పవర్‌ఫుల్ గా డిజైన్ చేస్తారో తెలిసిందే. దీంతో ఇప్పుడు షాహిద్ కపూర్‌ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' సినిమా చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఆ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.     Allu Arjun, Lokesh Kanagaraj, AA23, Shahid Kapoor  
  రచయితకి స్టార్ డమ్ తెచ్చిన విజయేంద్ర ప్రసాద్ దాదాపు నాలుగున్నర దశాబ్దాలపై నుంచే రచయితగా కొనసాగుతూ వస్తున్నారు. తన కొడుకు దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  మొదటి సినిమా 'స్టూడెంట్ నెంబర్ వన్' తప్ప మిగతా అన్నిచిత్రాలకి కథని అందిస్తూ పాన్ ఇండియా లెవల్లో తెలుగోడి సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం 'వారణాసి'తో బిజీగా ఉన్న విజయేంద్ర ప్రసాద్   రీసెంట్ గా ప్రశ్న పత్రాల లీకేజ్ కాకుండా ఉండటానికి కొన్ని మార్గాలని సూచించారు. ఆయన మాట్లాడుతు ప్రశ్నాపత్రాల తయారీకి, పరీక్ష నిర్వహణకు మధ్య ఉండే సుదీర్ఘమైన సమయ వ్యత్యాసమే  లీకేజీల దందాకి  ప్రధాన మూలకారణంగా మారుతోంది. ప్రశ్నపత్రం రూపొందించడం దగ్గర నుండి అది ప్రింటింగ్ అవ్వడం, బైండింగ్, స్టోరేజ్, చివరికి పరీక్షా కేంద్రాలకు చేరే వరకు అనేక దశలు ఉంటాయి. ఈ ప్రక్రియల మధ్య చాలా సమయం ఉండటం వల్ల, ఏ స్థాయిలోనైనా కేటుగాళ్లు చొరబడి లీకేజీలకు పాల్పడే అవకాశం లభిస్తోం ది.విద్యార్థులు పరీక్ష హాలులోకి వెళ్లే వరకు అసలు ఫైనల్ ప్రశ్నాపత్రం రూపుదిద్దుకోకుండా ఉండే సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీనికి ఏకైక పరిష్కారం. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి వేలాది ప్రశ్నలతో కూడిన ఒక భారీ క్వశ్చన్ బ్యాంక్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు నీట్ పరీక్షలోనే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ఒక్కో దాంట్లో 45 ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ నుండి కంప్యూటర్ ద్వారా రాండమ్‌గా ప్రశ్నలను ఎంపిక చేసే విధానం తీసుకురావాలి. ఉదయం 8:00 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకుని, తమ వద్ద ఉన్న ఫోన్లు, స్టడీ మెటీరియల్స్ అన్నింటినీ దాచేసి సీట్లలో కూర్చున్న తర్వాత, సరిగ్గా  8:10 గంటలకు కంప్యూటర్ సహాయంతో ఆటోమేటిక్‌గా క్వశ్చన్ పేపర్ జనరేట్ అవ్వాలి.  ఆ తర్వాత 8:55 గంటల సమయంలో ఎన్‌క్రిప్ట్ చేసిన ఆ ఫైల్‌ను టైమ్ లాక్ సాంకేతికతతో పరీక్షా కేంద్రాల్లోని సిస్టమ్‌లకు పంపిస్తే, సరిగ్గా 9:00 గంటలకు అభ్యర్థుల స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.   Also read: అంతా ఆ మహానుభావుడి దయ వల్లనే.. సినిమాలు లేకపోవడంపై #సురేష్ కీలక వ్యాఖ్యలు    ఈ విధానం ద్వారా పేపర్ ప్రింట్ చేయడం, దాచడం వంటి మానవ ప్రమేయం పూర్తిగా తగ్గిపోయి, పేపర్ లీకేజీకి 0% అవకాశం  ఉంటుందని వివరించారు. సోషల్ మీడియాలో ఆ మాటలు వైరల్ కావడంతో 'పార్లమెంట్ వేదికగా  మీరు చెప్పిన అంశాన్ని గట్టిగా లేవనెత్తి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు నెటిజన్లు, విశ్లేషకులు కోరుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ బిజెపి తరుపున రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. vijayendra prasad, Rajamouli  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి బాధ్యతలు స్వీకరిస్తున్నారంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై తాజాగా మెగాస్టార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దయచేసి ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎవరికీ షేర్ చేయవద్దని చిరు టీమ్ కోరింది. 'ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి' అంటూ ఇటీవల టాలీవుడ్ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక వార్త హల్‌చల్ చేసింది. గుజరాత్ టూరిజం కోసం బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసినట్లే.. ఏపీ టూరిజం, ఇన్వెస్ట్‌మెంట్లను ప్రమోట్ చేయడానికి చిరంజీవిని రంగంలోకి దించుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. అందుకే మెగాస్టార్ టీమ్ రంగంలోకి దిగి, ఈ వార్తలకు చెక్ పెట్టింది. తాజా ప్రకటనతో ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.     Chiranjeevi, AP Brand Ambassador, Fake News  
  అగ్ర హీరో సినిమా థియేటర్స్ లో ఉన్నప్పుడు సురేష్ సినిమా కూడా రిలీజై సూపర్ హిట్ అయ్యేది. అలాంటి ఎన్నో చిత్రాలు సురేష్ కెరీర్ లో ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో మెప్పించినా ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో కనపడలేదు.  దాదాపు 200 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన, ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉండటంతో టాలీవుడ్‌లో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. సురేష్ అయిపోయాడు, ఇక సినిమాల్లోకి రాడు, అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు, ఆయనకు నడుము విరిగింది లేదా మద్రాస్‌లోనే ఉండిపోయాడు అంటూ వ్యాపించిన అనేక వదంతులను ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించారు.సురేష్ మాట్లాడుతు నేను గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని మోకిలా ప్రాంతంలోనే ఉంటున్నాను. అచ్చమైన తెలుగువాడినైన నాకు మంచి పాత్రలు ఇచ్చేందుకు దర్శకులు, నిర్మాతలు ముందుకు రావాలి. మా నాన్న ముఖ దర్శకుడు, నిర్మాత అయినప్పటికీ 1980ల మధ్య కాలంలో తీసిన 'రాముడు పరశురాముడు' చిత్రం వల్ల మా కుటుంబం  తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. అప్పట్లోనే దాదాపు 34 నుంచి 35 లక్షల రూపాయల భారీ అప్పులు నెత్తిన పడ్డాయి. ఆ అప్పులన్నీ తీర్చడానికి ఆరేళ్ల పాటు రాత్రింబవళ్లు నటుడిగా కష్టపడాల్సి వచ్చింది. కేవలం డబ్బు సంపాదించి అప్పులు తీర్చడం కోసమే తన కెరీర్‌కు ఏమాత్రం సంబంధం లేని తమిళ సినిమాల్లో సంవత్సరానికి ఏకంగా 18 చిత్రాల వరకు నటించాల్సి వచ్చింది. కేవలం డబ్బు కోసం నటించే రొటీన్ స్టార్‌గా కాకుండా డస్టిన్ హాఫ్‌మన్, రాబర్ట్ డి నీరో, అల్ పచీనో వంటి దిగ్గజ నటుల తరహాలో వైవిధ్యమైన పాత్రలు చేయాలనేది ఆయన నిరంతర ఆకాంక్ష. కేవలం లవ్ స్టోరీలకే పరిమితం కాకుండా యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ కథలు చేయాలని కోరుకున్నప్పుడు నిర్మాతలు దానికి అంగీకరించలేదు. దాంతో తన కళాత్మక విలువలు, నటనపై ఉన్న గౌరవంతో ఆయన ఏకంగా 11 సినిమాలను తిరస్కరించారు. ఆ సమయంలో నిర్మాణంలో ఉన్న తన స్వంత ఇంటిని కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఈ కఠినమైన నిర్ణయాల వల్ల తమిళ చిత్ర పరిశ్రమలో దాదాపు 7 నుండి 8 నెలల పాటు ఎలాంటి పని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. Also read: ఆ విషయంలో డబ్బు సంపాదిస్తే తప్పేంటి.. మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో దిగ్గజ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు గారిని  కలిశాను.  ఆర్థిక సహాయం కాకుండా కేవలం మంచి నటనకు అవకాశమున్న పాత్ర మాత్రమే కావాలని నిజాయితీగా  అడిగాను. దాంతో  నాయుడు గారు కేవలం 15 నుండి 16 రోజుల్లోనే  'పుట్టింటి పట్టుచీర' సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సంచలన విజయం సాధించడమే కాకుండా, పద్మాలయ సంస్థ నుండి 'చిన్నకోడలు', ఉషాకిరణ్ మూవీస్ నుండి 'మామాశ్రీ' చిత్రాల్లో వరుస అవకాశాలు వచ్చాయి . కేవలం 3 నుండి 4 నెలల వ్యవధిలోనే ఆ  మూడు సినిమాలు  బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నా సినీ కెరీర్  సరికొత్త శిఖరాలకు చేరుకుందని చెప్పుకొచ్చాడు. 
  మల్లికా షెరావత్(mallika sherawat)..ఈ పేరుకి ఉన్న చరిష్మాకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండటం జరగని పని. రొమాన్స్ క్వీన్ గా  ముద్రపడిన మల్లికా వల్ల యు ట్యూబ్  కళలాడుతూ ఉంది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మల్లికా వీడియోస్ కి ఉన్న వ్యూస్ ని చెక్ చేసుకోవచ్చు.ఫ్యాన్స్ ఐతే మల్లికా  వీడియోస్ ని చూడని రోజంటూ ఉండదు. ఎప్పుడూ ఓపెన్ మైండెడ్ సమాధానాలు, బోల్డ్ కామెంట్లతో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ముద్దు గుమ్మ  ఇటీవల ఒక రియాలిటీ షో కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే ప్రచారంపై స్పందించారు.   మల్లికా మాట్లాడుతు 'అవును, నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను.  కష్టపడి పని చేసి డబ్బు సంపాదించడంలో ఏమాత్రం తప్పు లేదు.శ్రమకి తగ్గ ప్రతిఫలం అడగడం ప్రతి ఒక్కరి హక్కు. ఈ విషయంలో నేను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు,  సినీ పరిశ్రమలో మహిళలు తమ ప్రతిభకి  తగ్గ పారితోషికం పొందినప్పుడు ఎందుకు విమర్శిస్తారో అర్థం కాదని ఆమె ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు  కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ది ట్రెయిటర్స్ ఇండియా' (The Traitors India) అనే పాపులర్ రియాలిటీ షోలో ఆమె ఒక కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ప్రసారం కానున్న ఈ షో కోసం మల్లికా షెరావత్‌కు భారీ మొత్తం చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. Also read; Pradeep Rawat: ప్రదీప్ రావత్ మరణంపై కొడుకు సంచలన వ్యాఖ్యలు.. ఆ మందు ఇచ్చింది ఎవరు  తన 22 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, వివాదాలు ఎదుర్కొన్న మల్లికా షెరావత్, ఎప్పుడూ తన మనసులోని మాటలను నిర్మోహమాటంగా బయటపెట్టడానికే మొగ్గు చూపుతారు. 'ఖ్వాహిష్', 'మర్డర్' వంటి సినిమాలతో  బోల్డ్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా తన సుదీర్ఘ కెరీర్‌లో కేవలం రెండు హిట్స్ మాత్రమే అందుకుంది. కానీ అభిమానులు మాత్రం ఒప్పుకోరు. ఒక్కో ఐటమ్ సాంగ్‌కి  1.5 కోట్ల వరకు పారితోషికం తీసుకునే నటిగా రికార్డు కూడా మల్లికా పేరుపై ఉంది. Mallika Sherawat, Bollywood
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' షూటింగ్ సెట్స్ నుండి ఊహించని విధంగా కొన్ని యాక్షన్ క్లిప్స్ లీక్ అయ్యాయి. ఇటీవల 'వారణాసి' మూవీ అవుట్‌డోర్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో తీసిన కొన్ని షార్ట్ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ వీడియోల్లో మహేష్ బాబును 'బ్లడ్ బాత్' మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నెత్తుటి మరకలతో ఉన్న మహేష్, నీళ్ళలోకి దిగడం వంటి సీన్స్ చూసి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే లీక్డ్ వీడియోల విషయంలో మూవీ టీమ్ గరంగరంగా ఉంది. ఎవ‌రైనా ఈ లీక్డ్ వీడియోను షేర్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్స్ ను సస్పెండ్ చేయడమే కాకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.  ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. Varanasi, Mahesh Babu, SS Rajamouli  
  సెల్యులాయిడ్ పై ఎన్నో చిత్రాల ద్వారా  తన విలనిజంతో అభిమానులని, ప్రేక్షకులని  భయపెట్టిన ప్రదీప్ రావత్ మొన్న నాలగవ తారీఖున అందర్నీ బాధకి గురి చేస్తూ క్యాన్సర్   తో చనిపోయిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓషివారా శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి మరణంపై విక్రమాదిత్య మాట్లాడుతు 'ఈ విషాదం కేవలం  నెలన్నర వ్యవధిలోనే  జరిగిపోయింది.  అంతకంటే ముందు అసలు ఏ సమస్య లేదు. సరిగ్గా 2 నెలల క్రితమే నాన్నకి  అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాం. ఆ నివేదికల్లో  ఆరోగ్యం 100 శాతం  పూర్తి ఆరోగ్యంగా ఉన్న్టట్లు వచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితం సాధారణ కడుపు నొప్పితో బాధపడుతుంటే, ప్రాథమికంగా వైద్యులు చిన్న స్టమక్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని భావించి కొన్ని మందులు ఇచ్చారు. కానీ ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గకపోగా, ఆయన ఆరోగ్యం మరింత  క్షీణించింది. వెంటనే రక్తం పరీక్షలు చేయించగా, రక్తంలో తెల్ల రక్తకణాల (వైట్ బ్లడ్ సెల్స్ - WBC) సంఖ్య ఊహించని రీతిలో అత్యధికంగా పెరిగిపోయినట్లు తేలింది. దీంతో వెంటనే ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం 99 శాతం నాన్నకి  బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ మరుసటి రోజే  వేగంగా వ్యాపించే 'అగ్రెసివ్ బ్లడ్ క్యాన్సర్' ఉందనే ఘోరమైన నిజాన్ని వైద్యులు చెప్పారు. . కేవలం రెండు నెలల క్రితం వరకు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న మనిషి, నెలన్నర రోజుల్లోనే క్యాన్సర్ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతారని తాము కలతైనా ఊహించలేదు.  Also read: Salman Khan: చీటింగ్ కేసులో సల్మాన్ ఖాన్, సోదరి అల్విరా.. ఆ బిజినెస్ మాన్ ఏం చెప్పాడంటే!   మేము ఐసీయూ గది బయట ఆందోళనగా వేచి చూస్తున్నాము. డాక్టర్లు లోపలికి పరుగులు తీశారు. నేను గది తలుపు తెరచి చూడగా, వైద్యులు నాన్న గుండెను పునరుద్ధరించేందుకు సీపీఆర్ (CPR) అందిస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే నాన్న మనల్ని వదిలి వెళ్లిపోతున్నారనే చేదు నిజాన్ని అర్థం చేసుకున్నాను అని భావోద్వేగానికి లోనయ్యారు.  దాదాపుగా పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేసిన ప్రదీప్ రావత్  సై’, ఛత్రపతి’, ‘దేశముదురు’, ‘గజిని’, ‘స్టాలిన్ వంటి చిత్రాల్లో చేసిన సినిమాలు బాగా పేరు తీసుకొచ్చాయి. చివరిగా మే 1 న విడుదలైన గాయపడ్డ సింహం మూవీలో కనిపించాడు.   వయసు  74 ఏళ్ళు.  Pradeep Rawat, Vikramaditya Rawat
టాలీవుడ్‌లో ప్రమోషన్ వేదికలపై ఎన్నో ఆసక్తికర సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, ఇటీవల జరిగిన ఓ చిత్ర ప్రెస్‌మీట్‌లో ఒక నటుడు వేదికపైనే కన్నీటి పర్యంతమై, భావోద్వేగాన్ని ఆపుకోలేక తన చెంపలు తానే కొట్టుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యూత్‌ఫుల్ మూవీ 'హుషార్ పిట్టలు'. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ ఇటీవలే ఓ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో నటుడు పుట్టా భాను మైక్ అందుకుని మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మాటల మధ్యలోనే తనను తాను నియంత్రించుకోలేక పుట్టా భాను తన చెంపలపై గట్టిగా వాయించుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో స్టేజ్ పై ఉన్న మిగతా నటీనటులు, మైక్ ముందే ఉన్న మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత తను అలా చేయడానికి గల బలమైన కారణాన్ని వెల్లడిస్తూ భాను కంటనీరు పెట్టుకున్నారు. "చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఎంతో పిచ్చి. వెండితెరపై నటులను చూసి నవ్వుకునేవాడిని. ఈ రోజు అదే వెండితెరపై నన్ను నేను చూసుకుని, ప్రేక్షకులు నవ్వుతుంటే ఇది కలా లేక నిజమా అని నమ్మలేకపోయాను. అందుకే నన్ను నేను గిల్లుకోవడానికి బదులుగా ఇలా కొట్టుకున్నాను" అంటూ భాను ఎమోషనల్ అయ్యారు. గడిచిన ఎనిమిదేళ్లుగా సినీ అవకాశాల కోసం ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక 'హుషార్ పిట్టలు' విషయానికి వస్తే, భిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో అన్ష్, వాసవి గణేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. గోవర్ధన్, సునీత మనోహర్, రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు, భాను పడ్డ కష్టాన్ని, ఆయన ఆవేదనను చూసి చిత్రబృందం వెంటనే ఆయనను ఓదార్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో చూసిన నెటిజన్లు "సినిమా అంటే ఎంత పిచ్చి ఉంటే అంతలా ఎమోషనల్ అవుతారు", "కష్టపడే ప్రతీ నటుడికి తగిన గుర్తింపు దక్కాలి" అంటూ భానుకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న థియేటర్లలోకి రానున్న ఈ 'హుషార్ పిట్టలు' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి, పుట్టా భాను లాంటి యంగ్ టాలెంట్‌కు టాలీవుడ్‌లో మరిన్ని మంచి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో వేచి చూడాలి!
విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన మూవీ ‘అనకాపల్లి’. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మించిన ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ఆగస్టు 7న విడుదల కావాల్సి ఉంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. అయితే విడుదలకు కొద్దిగంటల ముందు మూవీ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘అనకాపల్లి’ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి గల కారణాలను కూడా వెల్లడించింది. ఇటీవల ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ షోకు అద్భుతమైన స్పందన లభించింది. సినిమా కంటెంట్ చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కేవలం తెలుగు వరకే పరిమితం చేయకుండా, ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అదే సమయంలో చిత్రంపై OTT ప్లాట్‌ఫామ్స్ నుంచి కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, తొందరపడి విడుదల చేయడం కంటే సినిమాకు లభిస్తున్న అవకాశాలను పూర్తిగా పరిశీలించి, సరైన ప్రణాళికతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఓ వైపు సినిమా విడుదల వాయిదా వేస్తూనే, మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ‘అనకాపల్లి’ టీమ్. “ముందు ప్రజల తీర్పు… ఆ తర్వాత రిలీజ్” అనే నిర్ణయంతో టీమ్ ముందుకు వెళ్తోంది. "ఈ సినిమా పేరు ‘అనకాపల్లి’. ఈ సినిమా కథకు, షూటింగ్‌కు వేదిక అనకాపల్లి. ఈ చిత్ర నిర్మాత కూడా అనకాపల్లి బిడ్డే. అందుకే ఈ సినిమా మీద మాకున్న నమ్మకంతో, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అనకాపల్లి పట్టణంలో 4 నుంచి 5 ప్రత్యేక పబ్లిక్ షోలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం." అని తెలిపింది. "డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, OTT ప్లాట్‌ఫామ్స్ చూపిస్తున్న ఆసక్తి, ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలు, అన్నింటికంటే ముఖ్యంగా అనకాపల్లి ప్రజల నుంచి వచ్చే తొలి తీర్పు — వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొత్త విడుదల తేదీని నిర్ణయించనున్నాం. కొత్త విడుదల తేదీని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం." అని అనకాపల్లి మూవీ టీమ్ పేర్కొంది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
మన శరీరం అనేది ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన జీవ వ్యవస్థ. మనకు కనిపించని స్థాయిలో శరీరంలో సుమారు 36 లక్షల కోట్ల కణాలు (36 Trillion Cells) ప్రతి క్షణం పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ కణాలన్నీ సమన్వయంతో పనిచేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఒక్క కణం పనితీరులో లోపం వచ్చినా, అది క్రమంగా ఇతర కణాలపై ప్రభావం చూపి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిజంగానే "ఉన్నది ఒకటే జబ్బు... అది సెల్ అనారోగ్యం" అనే భావన వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి? ప్రతి వ్యాధి కణాల స్థాయిలోనే మొదలవుతుందా? కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు లభిస్తాయి. ఈ వీడియోలో Cell Health Clinics Founder డా. రవి కుమార్ చింత సెల్ హెల్త్ (Cell Health) యొక్క ప్రాముఖ్యతను సులభమైన ఉదాహరణలతో వివరిస్తున్నారు. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసిక ఒత్తిడి, కాలుష్యం, జీవనశైలి వంటి అంశాలు కణాల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. అంతేకాదు, చాలా మంది ఎదుర్కొనే మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యల వెనుక కణాల ఆరోగ్యం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కూడా ఈ చర్చలో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడటం సరిపోదని, కణాల స్థాయిలో శరీరాన్ని బలపరిచే జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని డా. రవి కుమార్ చింత సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మీ శరీరాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచే సెల్ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి. రోజూ అలసట, ఒత్తిడి, ఆందోళన, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి భస్త్రిక ప్రాణాయామం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లోతుగా, వేగంగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సహజంగా బయటకు పంపే శరీర ప్రక్రియలకు కూడా ఇది తోడ్పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్ స్రవంతి రఘు భస్త్రిక ప్రాణాయామాన్ని సరైన విధంగా ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశాలను సులభంగా వివరించారు. మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి, నిపుణుల సూచనల ప్రకారం భస్త్రిక ప్రాణాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కొత్త యోగా సాధన ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)