LATEST NEWS
హైదరాబాద్ నాంపల్లిలోని  గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 40 లక్షలకు పైగా ఉన్న యాదవ కురుమలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి గాంధీ భవన్ ను పోమవారం (జూన్ 23) ముట్టడించింది.  గాంధీ భవన్ లోని గొర్రెలను పంపి వినూత్న రీతిలో నిరసన తెలిపింది.  ఈ నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడమే కాకుండా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు.  
తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక  ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధ నౌకను  ప్రాజెక్ట్ 17A స్టెల్త్ ఫ్రిగేట్ శ్రేణిలో నిర్మించారు. ఈ పద్ధతిలో నిర్మించిన తొలి నౌక ఇది. ఈ నౌకలో వినియోగించిన  స్టెల్త్ టెక్నాలజీ  కారణంగా ఐఎన్ఎస్ నీలగిరి శత్రువు రాడార్‌లలో కనిపించదు. ఈ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఇప్పటికే విశాఖపట్నం తూర్పు తీర నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ నీలగిరి రాక విశాఖ నగర రక్షణకు అదనపు అలంబనగా ఉంటుంది.  సంప్రదాయ పద్ధతిలో ఐఎన్ఎస్ నీలగిరికి తూర్పు నౌకాదళం ఘనంగా స్వాగతం పలికింది. 
నవంబర్ 15 నుంచి పది రోజుల పాటు సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సాయిబాబా పోస్టల్ స్టాంపు, రూ.100 నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అఖిల భారత సత్యసాయిబాబా సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సత్యసాయిబాబా శత జయంతా వేడులకలో 185 దేశాలకు చెందిన వారు పాల్గొంటారని పేర్కొన్నారు.  సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా  జరపాలని ఇప్పటికే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.  
ALSO ON TELUGUONE N E W S
మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన 'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)తెలుగులో పలు చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకుంది. గత సంవత్సరం 'టిల్లుస్క్వేర్, డ్రాగన్ తో వరుస విజయాల్ని అందుకున్న అనుపమ, ప్రస్తుతం మలయాళంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన 'జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ'(Janaki Versus State of Kerala)చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. టైటిల్ రోల్ 'జానకి  క్యారక్టర్ లో ఒక బాధితురాలితో పాటు, న్యాయం కోసం పోరాడే పాత్రని అనుపమ పరమేశ్వరన్ పోషించింది. అగ్ర హీరో సురేష్ గోపి(Suresh Gopi)లాయర్ గా కనిపిస్తున్నాడు. జూన్ 27 న రిలీజ్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.  కానీ సెన్సార్ బోర్డు ఈ మూవీపై స్పందిస్తు 'సీతాదేవి మరో పేరైన జానకి ని దాడికి గురైన మహిళకి నిర్ణయించకూడదు. మూవీలో జానకి అనే పేరుని ఉపయోగించవద్దు. సినిమా టైటిల్ తో పాటు క్యారక్టర్ పేరు మార్చాలని, సెన్సార్ బోర్డు 'జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ'కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. మలయాళ ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించింది. గతంలో కూడా ఒక సినిమా విషయంలో జానకి అనే పేరుని పెడితే సెన్సార్ సూచనతో ఆ పేరుని జయంతిగా మార్చారు.  కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న 'జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ' కి ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించగా ఫణింద్ర కుమార్, సేతురామన్ నాయర్ నిర్మించారు. మాధవ్ సురేష్, దిలీప్, శృతి రామచంద్రన్, దివ్య పిళ్ళై తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బిసన్, లాక్ డౌన్, పరదా, పెట్ డిటెక్టివ్ అనే సినిమాలు కూడా చేస్తుంది.       
  'బాహుబలి'తో పాన్ ఇండియా మార్కెట్ కి గేట్లు ఓపెన్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి.. దానికి ముందు తీసిన 'ఈగ'తో పాన్ ఇండియా వైడ్ గా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. వారాహి చలన చిత్రం నిర్మించిన ఈ మూవీ 2012 లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈగ వచ్చిన 13 ఏళ్ళ తర్వాత.. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఓ మలయాళ మూవీ టీమ్ కి నోటీసులు పంపడం సంచలనంగా మారింది.   ఇటీవల మలయాళంలో 'లవ్లీ' అనే సినిమా వచ్చింది. ఇది ఈగకు, ఓ యువకుడికి మధ్య జరిగిన కథగా తెరకెక్కింది. అయితే ఇది తమ కాన్సెప్ట్ అంటూ ఈగ మేకర్స్ 'లవ్లీ' టీమ్ లీగల్ నోటీసులు పంపించారు. ఈగ పాత్రను, దాని రూపాన్ని, కదలికలను కాపీ చేశారని ఈగ నిర్మాతలు చెబుతున్నారు. ప్రచార చిత్రాలతో పాటు సినిమాలోనూ ఈగ పాత్రను ఉపయోగించడం ఆపాలని డిమాండ్ చేశారు. అయితే ఈగ నిర్మాతల ఆరోపణలను 'లవ్లీ' టీమ్ ఖండించింది. తాము సొంతంగా డిజైన్ చేశామని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి మునుముందు ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.  
  విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్ నిర్మించిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం 2018 జూన్ 29న విడుదలై యువతను మెప్పించింది. ఈ తరం యూత్ ఎంతగానో ఇష్టపడే సినిమాల్లో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ మీమ్స్ గా ఈ సినిమా డైలాగ్స్ తెగ ఉపయోగిస్తుంటారు. అందుకే 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టీం కూడా సీక్వెల్ ఉందంటూ ఊరిస్తూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.   విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం చేతులు కలపబోతున్నారు. స్క్రిప్ట్ పూర్తయినట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా హింట్ ఇచ్చాడు తరుణ్. ఇక ఇప్పుడు అనౌన్స్ మెంట్ డేట్ లాక్ అయినట్లు సమాచారం. ఈ జూన్ 29 కి 'ఈ నగరానికి ఏమైంది' విడుదలై ఏడేళ్లు పూర్తవుతుంది. అందుకే అదే రోజు సీక్వెల్ ను ప్రకటించబోతున్నట్లు వినికిడి. మరి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.  
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథలాజికల్ ఫిల్మ్ చేయాల్సి ఉండగా.. అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిపోయింది. దీంతో అట్లీ తర్వాత బన్నీ ఏ దర్శకుడితో చేతులు కలుపుతాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు తెరపైకి వచ్చింది.    బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ 'శక్తిమాన్' మూవీ ప్రకటన వచ్చింది. అయితే అదే ప్రాజెక్ట్ ని రణ్ వీర్ కి బదులుగా బన్నీతో బాసిల్ జోసెఫ్ ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. తమ హీరోని శక్తిమాన్ రోల్ లో చూడబోతున్నామని సంబరపడ్డారు. అయితే అల్లు అర్జున్ అభిమానులకు నిరాశ కలిగించే విషయాన్ని తాజాగా జోసెఫ్ చెప్పాడు. అల్లు అర్జున్ తో 'శక్తిమాన్' చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. 'శక్తిమాన్' సినిమా రణ్ వీర్ తోనే ఉంటుందని, అందులో ఎటువంటి మార్పు లేదని పేర్కొన్నాడు.  
  నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న కుబేర.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.   కుబేర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టగా, రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ దాదాపు రూ.23 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా సుమారు రూ.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.25 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది అనడంలో సందేహం లేదు.   అయితే తెలుగుతో పోలిస్తే తమిళ కలెక్షన్స్ డిజప్పాయింట్ గా ఉన్నాయి. తమిళ హీరో ధనుష్ నటించినప్పటికీ.. అక్కడి ప్రేక్షకులు తమ సినిమాలా దానిని పూర్తిగా ఓన్ చేసుకోవట్లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే రూ.24 కోట్లు రాబడితే.. తమిళనాట రూ.9 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. అంటే తెలుగు వసూళ్ళలో కనీసం సగం కూడా లేవు.  
  హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయనపై చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయంటూ గిరిజన సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాయదుర్గం పోలీసులు విజయ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.   సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'రెట్రో'. ఏప్రిల్ 26న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించాడు. అయితే ఆయన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు ఫిర్యాదు చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ విజయ్ గతంలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ విజయ్ పై కేసు నమోదైంది.  
  In what is being hailed as a landmark cinematic moment, the makers of Jana Nayakudu have unveiled the much-anticipated First Roar — a commanding first glimpse of Thalapathy Vijay from what will be his final film. Dropped on the occasion of the superstar’s birthday, the video is already creating waves across the internet, setting the tone for what promises to be a legendary swansong.   The 65-second teaser opens with Vijay’s voice saying, “You guys will live in my heart”, followed by a striking visual of him walking in a police uniform, lathi in hand, through what resembles a war-torn battlefield. It’s a shot that blends power, calm, and consequence — a signal that this farewell will be anything but ordinary.   Complementing the video is a newly released birthday poster that features Thalapathy Vijay seated regally on a leather throne, gripping a sword against a smoky, intense backdrop. The imagery speaks volumes — a king, a warrior, a leader — all rolled into one commanding presence.   Jana Nayakudu carries immense emotional significance as Vijay’s final on-screen appearance. More than just a film, it marks the culmination of a career that redefined stardom — a tribute to the man who became a movement.   Directed by H. Vinoth, known for his compelling narratives and nuanced storytelling, the film also boasts music by Anirudh Ravichander, whose association with Vijay has consistently delivered blockbuster tracks.   Backed by Venkat K. Narayana under KVN Productions, Jana Nayakudu is set for a grand worldwide release on January 9, 2026, perfectly timed for the festive Pongal weekend. With anticipation already at fever pitch, the film promises to be a spectacular send-off — a cinematic celebration of a legacy three decades in the making.   As the First Roar echoes across platforms, fans are uniting for one final journey with their beloved Thalapathy — a farewell soaked in power, pride, and unparalleled emotion.  
ఈమధ్యకాలంలో కంటెంట్‌ ఉన్న సినిమాలు ఏ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అలాంటి కోవలోకే వెళ్తుంది అని చెప్పచ్చు. ఫ్యామిలీ మ్యాన్‌ అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీనీ హేట్‌ చేస్తూ కనిపించిన ఈ టీజర్‌తో కథ తాలూకు కొత్తదనం చెప్పకనే చెప్పారు దర్శక రచయిత ఉదయ్‌శర్మ. మణిశర్మ సంగీతం అందించిన ఈ సరికొత్త కుటుంబ కథా చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, రామ్‌కిరణ్‌, మేఘా ఆకాష్‌, బ్రహ్మానందం, సత్య, గిరి, భద్రం ముఖ్య తారాగణంగా.. ప్రేక్షకులని అలరించబోతున్నారు.  ఈ చిత్ర టీజర్‌ విషయానికి వస్తే ఒక పక్క నుండి అర్జున్‌ రెడ్డి లాంటి వైబ్స్‌ కనిపిస్తూనే మరోపక్క కుటుంబ సమేతంగా చూసే చిత్రం అని అర్థమవుతుంది. టీజర్‌ లోని ప్రతి డైలాగ్‌, విజువల్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అలాగే సత్య, బ్రహ్మానందం హాస్యం చిత్రంలో బాగా పండుతుందని అనిపిస్తుంది. మేఘా ఆకాష్‌ మంచి క్యారెక్టర్‌ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. రామ్‌ కిరణ్‌ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ఒక మార్క్‌ సృష్టిస్తారు అనిపించేలా తన ప్రజెన్స్‌, పెర్‌ఫార్మెన్స్‌ కనిపిస్తుంది. కుటుంబం విషయాలలో హీరో ఉద్దేశం అందరిలా సహజంగా ప్రేమగా కాకుండా కాస్త కొత్తగా ఉంటుందని ఈ చిత్ర టీజర్‌ చూస్తే అనిపిస్తుంది. టీజర్‌లోని సంగీతం చాలా బాగుంది. త్వరలోనే విడుదల అవనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి తెలుగింటి భోజనం అందించనుంది. రామ్‌కిరణ్‌, మేఘా ఆకాష్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్‌, రాజశ్రీ నాయర్‌, రచ్చ రవి, గిరిధర్‌, తాగుబోతు రమేష్‌, భద్రం తదితరులు నటించిన ఈ సినిమాకి రచన, దర్శకత్వం: ఉదయ్‌శర్మ, నిర్మాత: హెచ్‌.మహదేవగౌడ్‌, సంగీతం: మణిశర్మ, డిఓపి: మధు దాసరి, ఎడిటర్‌: శశాంక్‌ మలి, కొరియోగ్రాఫర్‌: చిన్ని ప్రకాష్‌, భాను, విజయ్‌ పొలాకి, సాహిత్యం: అనంత శ్రీరామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: పి.ఎస్‌.వర్మ, ఫైట్స్‌: అంజి, కార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : రోహిత్‌ కుమార్‌ పద్మనాభ. 
  ప్రతి మనిషి జీవితంలో ఏదైనా ముఖ్యమైన మొదటి దశ ఉందంటే అది కెరీర్ కు సంబంధించిన విషయమే అయ్యుంటుంది.కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే  ఉద్యోగం,  ఆనందం,  ఆర్థిక స్థితి, వ్యక్తిగత అభివృద్ది వంటి విషయాలు ఆధారపడి ఉంటాయి. చాలా మంది అవగాహన లేకుండా సమాజంలో దేనికి ఆదరణ ఉందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని దాన్నే తమ కెరీర్ గా ఎంచుకుంటారు. ఇది ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ.. అన్ని వేళలా ఇది పనిచేయదు.  సరైన కెరీర్ ను ఎంచుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ఆసక్తులు, అభిరుచులు.. మీరు ఏ విషయాలలో ఆసక్తి చూపిస్తారు? (ఉదా: సైన్స్, ఆర్ట్స్, బిజినెస్, టెక్నాలజీ, క్రియేటివ్ ఫీల్డ్స్, సర్వీస్?) చిన్నప్పటి నుండి మీరు ఎక్కువగా ఆసక్తి చూపిన విషయాలు ఏవి? ఏ పని చేసేటప్పుడు మీరు టైమ్ గమనించకుండా మునిగిపోతారు? ఉదాహరణ: మీకు problems solve చేయడం ఇష్టం అయితే — సైన్స్, ఇంజినీరింగ్, డేటా సైన్స్, లా వంటివి మంచి ఎంపికలు.  మీ సామర్థ్యాలు, బలాలు.. మీరు ఏ విషయాన్ని బాగా  చేయగలరు? (ఉదా: గణితం, భాషలు, కమ్యూనికేషన్, ఆర్ట్, లీడర్‌షిప్, డిజైన్) ఇతరులు మీలో ఏ బలాలను గుర్తిస్తారు? దీన్ని అర్థం చేసుకోవడానికి Aptitude Tests లేదా Career Assessment Tests (ఉదా: MBTI, Holland Code) చేయవచ్చు.  మార్కెట్ లో అవకాశాలు.. ఎంచుకోవాలి అనుకున్న రంగంలో ఫ్యూచర్ డిమాండ్ ఉందా? ఆ ఫీల్డ్ లో గ్రోత్, జాబ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది? కొత్తగా పెరుగుతున్న రంగాలు ఏమిటి? (ఉదా: AI, డేటా సైన్స్, సస్టైనబిలిటీ, డిజిటల్ మార్కెటింగ్) జీతం,  జీవన ప్రమాణాలు.. మీరు ఎంచుకునే కెరీర్ మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చగలదా? మీరు కోరుకునే జీవన విధానానికి అనువుగా ఉందా? ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.  మెంటార్లు,  ప్రొఫెషనల్స్.. మీరు ఇష్టపడే రంగంలో ఇప్పటికే ఉన్నవారి అనుభవాలను తెలుసుకోవాలి.   వారు ఎదుర్కొనే సవాళ్లు, సంతృప్తి, అవకాశాలు తెలుసుకోవాలి.  సవాళ్లను అధిగమించడానికి కావలసిన నైపుణ్యాలు, సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రాక్టికల్ ఎక్స్పీరిన్స్.. ఇంటర్న్షిప్‌లు, వర్క్‌షాప్‌లు, ప్రాజెక్ట్‌లు, వాలంటీర్ వర్క్ ద్వారా ఫీల్డ్ ను దగ్గరగా చూడడం వల్ల చాలా మంచి అనుభవం లభిస్తుంది. భవిష్యత్తు.. ఈ కెరీర్ లో మీరు 10-20 ఏళ్ళ తరువాత మీరు ఎక్కడ  ఉంటారు, ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు? ఇవన్నీ ఆలోచించాలి.  అది మీ వ్యక్తిత్వం, విలువలకు సరిపోతుందా? చివరగా.. కెరీర్ ఎంపికలో ఎప్పుడూ ఒకే సరైన దారి ఉండదు. మీ అభిరుచి, సామర్థ్యం, మార్కెట్ డిమాండ్, జీవిత లక్ష్యాల కలయికతో సరైన దారి ఏర్పడుతుంది. ముఖ్యంగా.. శాంతిగా ఆలోచించాలి.  రీసెర్చ్ చేయాలి. అవసరమైతే కెరీర్ కౌన్సెలింగ్  సహాయం తీసుకోవాలి. ఇది చాలా మంచి పునాదికి దారి తీస్తుంది.                                       *రూపశ్రీ.
  ఈ రోజు యోగా డే అంటూ చాలా ఆడంబరంగా ఉత్సవాలలా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ప్రధాని మోడీ గారు అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా ఈసారి యోగా డే దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అందులోనూ అన్ని రాష్ట్రాల చూపులు విశాఖపట్నం ఆర్.కె బీచ్ వైపై ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ రోజు యోగా అనేది విదేశీయులను కూడా ఆకర్షించే అంశం అయిపోయింది.  ఇది మనిషి ఆరోగ్యానికి జీవనాడి అయ్యింది.  అయితే ఈ యోగాను భారతీయులకు అందించినది పతంజలి మహర్షి. అందుకే యోగా డే  సందర్బంగా ఆ మహనీయుడిని గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యం. అలాగే..  యోగా కోసం పతంజలి మహర్షి చేసిన కృషి,  ఆయన చరిత్ర తెలుసుకుంటే.. పతంజలి మహర్షి చరిత్ర వృత్తాంతం  భారత సంస్కృతిలో ఒక గంభీరమైన, ఆధ్యాత్మికంగా ప్రేరణాత్మకమైన గాథ. ఇది పురాణ, ఇతిహాస, ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. ఆయన ఒక భగవద్భక్తుడు, తత్త్వవేత్త, గొప్ప పండితుడు. ఆయన్ను మూడు ముఖ్యశాస్త్రాలలో విపులమైన కృషి చేసినవాడిగా గుర్తిస్తారు . ఆ మూడు ఏమిటంటే.. యోగశాస్త్రం, వ్యాకరణం (సంస్కృత వ్యాకరణం),  ఆయుర్వేదం.  ఆయన చరిత్ర వృత్తాంతం..  ఆదిశేషునిగా అవతారం.. పతంజలి మహర్షి, విష్ణుమూర్తికి సేవ చేసే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడతారు. ఒక సందర్భంలో, విష్ణుడు తన హృదయంలో శివుని ఆనందతాండవాన్ని దర్శించుకుంటుండగా, ఆదిశేషునికీ ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలిగిందట. అందుకు అనుగుణంగా  విష్ణుమూర్తి ఆదిశేషునికి భూలోకంలో అవతరించాల్సిందిగా సూచించాడు. గోనికా తపస్సు & పతంజలి అవతారం.. విష్ణుమూర్తి ఆదిశేవును భూలోకంలో అవతరించమని ఆదేశించి  సమయంలో గోనికా అనే పతివ్రత స్త్రీ, సూర్య భగవానుని ప్రార్థిస్తూ  లోకానికి ఉపయోగపడే బిడ్డ కావాలని తపస్సు చేస్తూ, చేతులలో నిండుగా నీటిని తీసుకుని అంజలి ఘటిస్తూ అంటే నమస్కారం చేస్తూ అర్చించుకుంటున్న  సమయంలో పాము రూపంలో ఆదిశేషుడు ఆమె చేతుల్లోకి పడిపోయాడట. అందువల్ల ఆ బాలుని పేరు పతంజలి (పతనము + అంజలి) అని ఉద్భవించింది. నటరాజుని తాండవ దర్శనం.. పతంజలి మహర్షి తన తల్లిదండ్రుల వద్ద పెరిగి, తర్వాత చిదంబరం వచ్చినాడు.  అక్కడ శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తున్నాడని తెలిసి. అతనికి శివుని తాండవాన్ని చూసే అవకాశం లభించింది. నంది, భృంగిలు అతని శరీరాకృతిపై హేళన చేసినా, అతను నోరుతో “నటరాజ నవకం” అనే స్తోత్రాన్ని గానం చేసి శివుని ఆనందింపజేశాడు. ఈ నటరాజ నవకం అనేది పూర్తీగా డమరుక శబ్దంతో ఉంటుంది. నటరాజ నవకం విని సంతోషించిన శివుడు నిన్నునాట్యంలో భాగం చేస్తాను బాధపడకు అని చెప్పి  శివుడు అతనిని తన పాదాల చుట్టూ చుట్టి తాండవంలో భాగస్వామిని చేశాడు.  ఇది పతంజలి మహర్షి  భగవత్‌ ప్రేమకు సంకేతం.  త్రికరణ శుద్ధి లక్ష్యంగా విద్యాబోధన.. శివుని ఆశీర్వాదంతో పతంజలి, భూలోకానికి త్రికరణ శుద్ధి  అంటే మనస్సు, వాక్కు, కర్మ అనేవి  సాధించేందుకు మూడు శాస్త్రాలను అందించాడు. యోగశాస్త్రం – మనస్సు శుద్ధి కోసం వ్యాకరణం – వాక్కు శుద్ధి కోసం ఆయుర్వేదం – శరీర శుద్ధి కోసం శిష్యులకు బోధన.. పతంజలి 1000 మందికి బోధన ఇవ్వాలనుకున్నాడు. అందరి అర్హతలు భిన్నంగా ఉండటంతో, ఓ తెర వెనుక ఆదిశేషురూపంలో బోధించాడు. తెర ఎత్తవద్దని చెప్పినా ఒక శిష్యుడు అతని నియమాన్ని ఉల్లంఘించి తెర తీసేశాడు. దీంతో 999 మంది విద్యార్థులు కాలిపోయారు. మిగిలిన శిష్యుడికి పతంజలి మొత్తం విద్యను బోధించాడు, కాని అతను శాపగ్రస్తుడై బ్రహ్మ రాక్షసుడయ్యాడు. శిష్యుడిని శాప విముక్తుడిని చేసిన ఘట్టం.. ఆ బ్రహ్మ రాక్షసుడు జ్ఞానాన్ని బోధించగల అర్హుడిని వెతుకుతూ, సరైన జవాబు చెప్పని వారిని మింగేవాడు. చివరికి పతంజలి మహర్షి స్వయంగా శిష్యుడి రూపంలో (చంద్రశర్మగా) వచ్చి, సరైన సమాధానం ఇచ్చి, జ్ఞానం తీసుకొని శిష్యుడిని శాపం నుండి విముక్తుణ్ని చేశాడు. ఆ రాక్షసుడు తరువాత గౌడపాదాచార్యుడుగా అవతరించాడు. ఆయన రచనలు.. యోగ సూత్రాలు (196 సూత్రాలు) – యోగ దార్శనికశాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. మహాభాష్యం – పాణినీ వ్యాకరణంపై వ్యాఖ్యాన గ్రంథం. ఆయుర్వేదానికి సంబంధించిన రచనలకూ ఆయనకు ఆపాదించబడింది, కానీ ఆధారాల పరంగా స్పష్టత లేదు.  జీవసమాధి స్థలం.. పతంజలి మహర్షి జీవసమాధి స్థలం తమిళనాడు, తిరుపత్తూరు (త్రిచీ దగ్గర)లోని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ఉంది.  ప్రార్థన శ్లోకం.. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన। యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోఽస్మి॥ మనస్సు, వాక్కు, శరీరం శుద్ధి కోసం పతంజలిని ప్రణమిస్తాను అని ఈ ప్రార్థన అర్థం.                                     *రూపశ్రీ
    ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం అనేది సహజమైన భావోద్వేగ ప్రక్రియ. కానీ ఈ ప్రేమ "అతిగా", "అనుదినం అతి ఆసక్తితో", లేదా "అత్యంత అనుభూతులతో" కొనసాగితే, కొన్ని సానుకూలతలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని భావోద్వేగ, మానసిక, సంబంధ నైపుణ్యాలు, జీవిత నిర్వాహణ దృష్టికోణాల్లో విపులంగా విశ్లేషిస్తే ఇలా ఎవరినైననా ఎక్కువగా ప్రేమించడం ఎంత వరకు మంచిది అనే విషయం అర్థమవుతుంది.  ఇందులో సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉంటాయి కాబట్టి ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. సానుకూల ప్రభావాలు. బంధం బలపడుతుంది.. ఇతరుల మీద  చూపే ప్రేమతో ఎదుటి వ్యక్తికి భద్రత, ఆదరణ, విలువ అనే భావనలు కలుగుతాయి. ఎక్కువ ప్రేమ చూపించడం వల్ల ఇద్దరి మధ్య అవగాహన, విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. ఇద్దరూ ఒకరిపట్ల మరొకరు ప్రేమగా ఉండే వాతావరణం పెరుగుతుంది. సహనశీలత పెరుగుతుంది..  ఎవరినైనా బాగా ప్రేమిస్తే వారి లోపాలను సహించగలగడం, వారిని మార్చుకునే అవకాశం ఇవ్వడం సులభమవుతుంది.  దీని వల్ల బంధాలు నిలబడతాయి.  ఇలాగే మనుషులలో మార్పు సాధ్యమవుతుంది.  నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా వారి కోసం మారితే తప్పేంటి అనే ఆలోచన పుడుతుంది. అలాగే వారికోసం త్యాగాలు చేయడంలో తృప్తి కలుగుతుంది.  ఆ వ్యక్తి కోసం  చేసే త్యాగాలు బాధించవు. ప్రేమించే వ్యక్తి ఆనందంగా ఉండటం చూసి  సంతోషపడటంలో తన సంతోషం చూసుకుంటారు.  ప్రతికూల పరిణామాలు. ఎక్కువగా ప్రేమించడం వల్ల సానుకూల పరిణామాలే కాకుండా ప్రతికూల పరిణామాలు కూడా ఉంటాయి.  స్వీయ గౌరవం తగ్గిపోవడం..  పూర్తిగా ఎదుటివారిని ప్రేమిస్తూ, ఎదుటి వారి కోసం జీవిస్తూ, వారిని సంతుష్టిపరిచే ప్రయత్నంలో  తమ  వ్యక్తిత్వం మరిచిపోవడం జరుగుతుంది. ఇలా తమను తాము పట్టించుకోకుండా ఎదుటివారికే ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల  ఎదుటివారి దృష్టిలో తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. తాము ఎదుటివారి కంటే ఎప్పుడూ తక్కువే అనే ఫీలింగ్ ప్రేమించే వ్యక్తులలో కూడా ఏర్పడుతుంది.  అధిక ఆసక్తి.. ప్రేమ అనే భావన క్రమంగా అధిక ఆకర్షణగా మారి, తట్టుకోలేని అసహనంగా, నియంత్రణ కోల్పోయే స్థితికి చేరవచ్చు. ఇది ఎదుటివారికి అసౌకర్యంగా, బంధంలో ఒత్తిడిగా భావించడానికి దారి తీస్తుంది. ఆత్మనిబ్బరత కోల్పోవడం.. తమ నిర్ణయాలు, సంతోషాలు, భావోద్వేగాలు అన్నింటినీ ఒకే వ్యక్తిపై ఆధారపడి చూసే విధంగా మారిపోతారు.  వారు  లేకుండా జీవించలేని స్థితి ఏర్పడుతుంది. ఇది మానసికంగా ప్రమాదకరం. వైఫల్యం.. ఎక్కువగా చూపించే ప్రేమకు తగినట్టు అవతలి వ్యక్తులు  సమానంగా స్పందించకపోతే, తీవ్రమైన హృదయవేదన, నిరాశ, కోపం, డిప్రెషన్ వంటి భావాలు రావచ్చు. కొందరికి ఈ జీవితం వద్దు అని ఆత్మహత్య ఆలోచనలు ఏర్పడే స్థితికి దారితీయవచ్చు. సంబంధంలో అసమతుల్యత.. ఒకరు ఎక్కువగా ప్రేమిస్తే, మరొకరు తక్కువగా స్పందిస్తే, ఈ అసమతుల్యత బంధం అసంతృప్తికరంగా మార్చుతుంది. సమతుల్యంగా ప్రేమించడం ఎలా? స్వీయ గౌరవాన్ని నిలుపుకోవాలి.. ప్రేమించడమే కాదు, తానేంటో గుర్తుంచుకోవాలి. వ్యక్తిగత  విలువను మరువకూడు. ప్రేమించిన వారి కోసం  జీవితవిధానాలను పక్కన పెట్టవద్దు.  కెరీర్, కుటుంబం, ఇతర హక్కులు, అభిరుచుల్ని కొనసాగించాలి. ఎక్కువ మందితో  ప్రేమ చెలామణీ కాకుండా, అవగాహనతో ప్రేమించాలి.  వారి స్వేచ్ఛకు అడ్డుపడకుండా ప్రేమ చూపించాలి. స్పష్టమైన కమ్యూనికేషన్ అవసరం.  మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పారు, అలాగే ఎదుటివారి భావనలకూ గౌరవం ఇవ్వాలి. సంతృప్తితో ప్రేమించాలి. సమాధానాల కోసం కాదు. ఎదుటివారు  ప్రేమను తిరిగి ఇవ్వకపోయినా  ప్రేమలో అంతరంగిక తృప్తి ఉండాలి.                     *రూపశ్రీ.
  చపాతీలు  ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా గోధుమ పిండితో తయారు చేసే చపాతీలు చాలామంది డైట్ లో ఉంటాయి.  అధిక శాతం  మంది రాత్రి ఆహారంలో అన్నానికి బదులు చపాతీలు తింటారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద స్పృహతో నూనె వేయకుండా చపాతీలు చేసే చపాతీలకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. ఇలా నూనె వేయకుండా చేసే చపాతీలను కొన్ని సెకెండ్లు పెనం మీద వేయించి ఆ తరువాత నేరుగా గ్యాస్ స్టవ్ మంట పైన పెడుతుంటారు. ఈ మంటకు చపాతీలు పొంగుతాయి.  ఇవి బాగా మెత్తగా, నూనె లేకుండా ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యం అనుకుంటారు. అయితే ఇలా చేసే చపాతీలు ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..   అధిక ఉష్ణోగ్రతల వద్ద చపాతీని వండటం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే HCA (హెటెరోసైక్లిక్ అమైన్స్),  PAH (పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్) వంటి కొన్ని హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. సహజ వాయువు పొయ్యిలు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్,  WHO ప్రమాణాలను మించిన సూక్ష్మ కణాలు వంటి ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు,  క్యాన్సర్ వంటి సమస్యలతో ముడిపడి ఉండవచ్చని వైద్యులు, పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్ ప్రమాదం.. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడం వల్ల క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి చపాతీలను నేరుగా గ్యాస్ మంట మీద వండటం కూడా ప్రమాదకరం అనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణుల మాట.. నేరుగా మంట మీద వంట చేయడం వల్ల క్యాన్సర్‌కు నేరుగా సంబంధం ఉండదని కొందరు అంటున్నారు. అయితే ఇలా వంట చేయడం, నేరుగా చపాతీలు గ్యాస్ స్టవ్ పైన కాల్చడం వల్ల ఖచ్చితంగా కొన్ని రసాయనాలు  దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరంలో DNA దెబ్బ తింటుంది. కానీ శరీరం తనను తాను నయం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఎవరైనా అలాంటి ఆహారాన్ని అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కానీ.. ఎక్కువగా అదే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మంచి మార్గం ఏదంటే.. పోషకాహార నిపుణురాలు, డైటీషియన్ల ప్రకారం.. 'HCA, PAH,  అక్రిలామైడ్ వంటి రసాయనాలు ముఖ్యంగా స్టార్చ్,  మాంసం వండినప్పుడు ఏర్పడతాయి. అవి క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి ఉండవు. కానీ ముందుజాగ్రత్తగా  బొగ్గు లేదా ఓపెన్ స్టవ్‌పై వండకుండా ఉండటం మంచిదట. గతంలో చపాతీని  ఒక గుడ్డ సహాయంతో పాన్‌పై నొక్కుతూ  తక్కువ మంటపై నూనె వేయకుండా వండేవారు, తద్వారా అది అన్ని వైపుల నుండి సరిగ్గా ఉడికిపోతుంది.  గ్యాస్ మంట మీద నేరుగా కాలదు కూడా. కానీ ఇప్పుడు చపాతీలను  నేరుగా మంటపై కాల్చే అలవాటు చాలా చోట్ల పెరిగింది.  దీని వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు కానీ ఇది ఆరోగ్యానికి హానికరం.  అందుకే చపాతీలను ఎల్లప్పుడూ పాన్ మీద కాల్చడమే మంచిదట.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి.  యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు  శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే.. శక్తివంతమైన యోగాసనాలు.. వీరభద్రాసనాలు..   వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి.   ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది.  నౌకాసన (Boat Pose).. నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది. బకాసన (Crow Pose).. బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల  ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది.  ధైర్యాన్ని పెంచుతుంది.  ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose).. ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది  శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది. పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose ) పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility),  బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్  చేయడంలో సహాయం చేస్తుంది.  అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog).. అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది.  ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చతురంగ దండాసన (Low Plank).. చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాణాయామం తో కలిపితే.. శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది. సూచనలు: ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి. శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...