LATEST NEWS
  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత విడతలో జరిగిన పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో మే 2వ తేదీన (శనివారం) రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై ఈ ప్రభావం పడింది. మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లోనూ తిరిగి ఓటింగ్ జరగనుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లేఖ రాసింది. గత నెల 29న జరిగిన రెండో దశ ఎన్నికల సమయంలో పలు చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఓటర్లను అడ్డుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా డైమండ్ హార్బర్ పరిధిలోని కొన్ని బూత్‌లలో బీజేపీ గుర్తుపై టేపులు అంటించి, ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. దీనిని 'డైమండ్ హార్బర్ మోడల్' అక్రమంగా ఆయన అభివర్ణించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీ-పోలింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు వేదికవుతుంటాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం రీ-పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజలకు చాటింపు ద్వారా ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలని కూడా ఈసీ సూచించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ అక్రమాల ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడటమే తమ బాధ్యతని ఎన్నికల యంత్రాంగం పేర్కొంటోంది. మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ లోపు ఈ 15 కేంద్రాల్లో జరిగే రీ-పోలింగ్ ఫలితాల సరళిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తుది ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. మరి ఈ రీ-పోలింగ్ ప్రక్రియ ఎంతవరకు ప్రశాంతంగా ముగుస్తుందో వేచి చూడాలి.
ఇకపై  ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా..  ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారు పద్దతి మార్చుకోవాలి... లేకపోతే వారికి ఇంకో ఛాన్స్ ఉండదు. ఇదీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్త్రాంగ్ వార్నింగ్.  పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకుచంద్రబాబు శుక్రవారం (మే 1)  కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించారు.  వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.   మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  శుక్రవారం (మే1) నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంతర్గత సర్వేల ద్వారా టీడీపీ అధినేత నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు సరిగా లేని వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలను కూడా నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు.  ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజలను అడుగుతా. ప్రజలు అనుకూలంగా చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను కానీ.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న తరుణంలో కోల్‌కతాలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం (ఏప్రిల్ 30) రాత్రి కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న ఆమె..  అక్కడ సుమారు మూడు గంటల పాటు ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ..  అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ..  ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.  ఇది తమకు చావో రేవో తేల్చుకునే పోరాటంటూ ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారు.  అంతకుముందు, తృణమూల్ కాంగ్రెస్ ( నాయకులు కునాల్ ఘోష్, శశి పంజా ఖుదీరామ్ అనుశీలన్  స్ట్రాంగ్ రూం వెలుపల   వెలుపల ధర్నాకు దిగారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే బాలెట్ బాక్సులను తెరుస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పార్టీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు..  కేంద్ర దళాలు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి లేదా ఏజెంట్ స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లే అధికారం ఉంటుందన్నారు. తమ పార్టీ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని   విమర్శించారు. ఫలితాలు వెలువడే మే 4వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా ఈ  ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం..  మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయంది. . సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్నది కేవలం పోస్టల్ బ్యాలెట్ల విభజన ప్రక్రియే తప్ప..  ఈవీఎంలను తాకడం లేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి బెంగాల్‌లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో..  ప్రతి ఓటును కాపాడుకోవాలన్న  పట్టుదలతో టీఎంసీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని మమతా బెనర్జీ తమ పార్టీ  అభ్యర్థులను ఆదేశించారు.  
ALSO ON TELUGUONE N E W S
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి 'శరణమన్న శరణం' సాంగ్ రిలీజ్ చేశారు. శ్రామిక శక్తికి నమస్కరిస్తూ 'శరణమన్న శరణం' పాటను రూపొందించారు. ఈ పాటకు  హాయ్ కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు. ఈ పాట గురించి "భగవంతుడు" మేకర్స్ స్పందిస్తూ - మన మట్టిలో ప్రతి పని ఒక అమ్మ దేవత సాక్షిగానే మొదలవుతుంది. పొలం గట్టున నాగలి సాగేముందు 'పోలేరమ్మ'ను, చెరువు కట్టపై అలుగులు పోసేటప్పుడు 'గంగమ్మ'ను, కష్ట, సుఖాల్లో  'ఎల్లమ్మ'ను స్మరించుకోవడం మన శ్రామిక సంస్కృతిలో భాగం. ఈ అమ్మ దేవతలు శ్రామికుల చెమట చుక్కల్లో తోడుండే ధైర్య రూపాలు. మన సంస్కృతిలో అమ్మ దేవతల శరణుజొచ్చంది ఏ పనీ మొదలు కాదు. పూర్తి కాదు. అమ్మలకు, సబ్బండ వర్గాలకు ఘనమైన ట్రిబ్యూటే మా ఈ "శరణమన్న శరణం". ఇది నాగలి పట్టిన రైతు, సుత్తి పట్టిన కమ్మరి, చక్రం తిప్పిన కుమ్మరి... ఇలా సకల సబ్బండ కులాల శ్రమజీవుల గుండె చప్పుడు. రక్తాన్ని చెమటగా మార్చి, ఉత్పత్తి చేసే మట్టి చేతులకు, మట్టి చేతులు మోసే పనిముట్లకు నివాళి ఈ గీతం. ఇది ఈ దేశపు సబ్బండ కులాల పతాక గీతం. శ్రమను, తల్లిని ప్రేమించే, పూజించే వారి బతుకు గీతం. మట్టి మనుషులకి వారిని కంటికి రెప్పలా కాపాడే అమ్మ దేవతలకీ మే డే సందర్భంగా మా వందనం. అంటూ కార్మిక లోకానికి సెల్యూట్ చేశారు.
బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్న నటుడు గెటప్ శ్రీను (Getup Srinu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గెటప్ శ్రీను ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ఒక సరికొత్త వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు 'మేము కాపులం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, యాంకర్ ఈ టైటిల్ గురించి ప్రస్తావిస్తూ.. "సినిమా కోసం కులాన్ని వాడుకోవడం నాకు నచ్చలేదు. ఇలాంటి టైటిల్స్ విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కదా?" అని ప్రశ్నించారు.  ఈ వ్యాఖ్యలతో గెటప్ శ్రీను అసహనానికి లోనయ్యారు. "ఆ టైటిల్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. కథకు తగ్గట్టుగానే ఆ పేరు పెట్టాం తప్ప, కేవలం వివాదం కోసం కులాన్ని వాడుకోలేదు" అని వివరించారు. అయినప్పటికీ యాంకర్  తన వాదనను కొనసాగిస్తూ, గతంలో రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు కూడా ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. దీనికి శ్రీను సీరియస్ అవుతూ.. "తొక్కలో ఇంటర్వ్యూ" అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  
'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేయగా, ఇప్పుడు సెకండ్ సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రేమ పాటకు ముహూర్తం: ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన "ఆయా షేర్.." అనే పాట మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు క్లాస్, యూత్‌ను ఆకట్టుకునేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. మే రెండో వారంలో ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక మెలోడియస్ లవ్ ట్రాక్ అని సమాచారం. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు కట్టిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 'దసరా' మ్యాజిక్‌ను మించి ఈ ప్యారడైజ్ ఉంటుందని, నాని నటనలో మరో కోణాన్ని ఈ చిత్రం చూపిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.   
  మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers).. అగ్ర నిర్మాణ సంస్థగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బ్రాండ్ ని సంపాదించుకుంది. నిర్మాణ రంగంలోనే కాకుండాపంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన  వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వివాదం ఈ రోజు మైత్రి సమర్పణలో తెరకెక్కిన  'జెట్లీ' పంపిణీ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. దిల్ రాజు, ఏషియన్, సురేష్, గీతా డిస్ట్రిబ్యూటర్స్ ఆధీనంలోని సింగిల్ థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్‌లలో (AMB, AAA)లో జెట్లీ  ప్రదర్శించబడలేదు. ఈ విషయంపై మైత్రి భాగస్వామి కేతిరెడ్డి శశిధర్ స్పందిస్తు సింగిల్ స్క్రీన్ కి మాకు మధ్య సమస్యలు ఉన్న మాట నిజమే. కానీ మల్టిప్లెక్స్ రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి గొడవలు లేవు. కానీ కొన్నిమల్టిప్లెక్స్ లలో జెట్లీ  రిలీజ్ చెయ్యలేదని ఒక నోట్ రిలీజ్ చేసాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిలిం చాంబర్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలైనప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఒప్పందాలు జరుగుతుంటాయి. కానీ 'జెట్లీ'కి సంబంధించి మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థకు, కొంతమంది థియేటర్ల యజమానులకి మధ్య విబేధాలు వచ్చాయి. ఎగ్జిబిటర్ల వాదన ప్రకారం, సినిమా ప్రదర్శన సమయంలో తాము చెల్లించిన అడ్వాన్సులు లేదా సెటిల్‌మెంట్ నిధుల విషయంలో మైత్రీ సంస్థ నుంచి సరైన స్పందన రావడం లేదు. దీనివల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పంపిణీ సంస్థ నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని మైత్రీ వర్గాలు అంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది. Also read: Peddi: పెద్ది రిలీజ్ డేట్ వచ్చేసింది..  జూన్ 24 కంటే ఇంకా ముందే   తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేస్తుండగా  గిల్డ్ నిర్మాతలు రెంటల్ సిస్టమ్‌లోనే రిలీజ్ కావాలని పట్టుబడుతున్నారు. ఏదైనా వివాదం తలెత్తినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సినిమా పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది. 'జెట్ లీ' సినిమా విషయంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్లు ఒకే తాటిపైకి వచ్చి, ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా ముగించుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     
తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Kompany - LIK) ఇప్పుడు తన డిజిటల్ ప్రయాణానికి సిద్ధమైంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై అధికారిక స్పష్టత వచ్చేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. సుమారు 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి, ప్రదీప్ రంగనాథన్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ, అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు మూడు వారాల థియేట్రికల్ రన్ తర్వాత, ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు: ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 6, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కి రానుంది. టెక్నాలజీతో ముడిపడిన ప్రేమకథ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.   https://x.com/PrimeVideoIN/status/2050134607681703960
The Telangana film exhibition sector is currently witnessing a heavy power struggle between distributors and theater owners, with the new release Jet Lee caught in the crossfire. A long-standing dispute over revenue sharing and weekly rentals in single-screen theaters has unexpectedly spilled over into the multiplex arena. Mythri Movie Distributors LLP has publicly accused certain exhibitors of using unfair pressure tactics by halting the screening of Jetlee in their multiplex properties. According to Mythri's designated partner Kethireddy Sasidhar, the distributor and the exhibitors have no active disagreements regarding multiplex terms. However, the exhibitors appear to be leveraging their control over multiplex screens to force a favorable agreement in the ongoing single-screen deadlock. This move essentially holds a major release hostage to settle an unrelated score.  This situation highlights the growing tensions within the local film business, where a disagreement in one sector can easily be used to paralyze operations in another. While the distributor is calling for a separation of the two issues and a return to fair negotiations, the blockade of Jetlee points to a deeper systemic issue regarding exhibition control and distribution leverage. How this standoff resolves could set a lasting precedent for future business dealings between distributors and theater chains in the region.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో  'పెద్ది'(Peddi)రిలీజ్ డేట్ జూన్ 24 అని కొన్ని రోజుల క్రితం మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ డేట్ కూడా మారుతుందనే వ్యాఖ్యలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అవును డేట్ మారింది. కాకపోతే ఇంకొంచం ముందు వస్తుంది. దీంతో సోషల్ మీడియాకి పెద్ది కొత్త చిరునవ్వులు తెచ్చాడు. మరి ఆ డేట్ చూద్దాం.  జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. నిశ్చయమే అతని ఆయుధం అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ వచ్చినట్లయింది. రికార్డులే లక్ష్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పెద్ది తన సునామీ స్టార్ట్ చేయడానికి జూన్ 4 ని ఎంపిక చేసుకుందని అనుకోవాలి. also read: Aamir Khan: చనిపోతాననే భయంతోనే ఆ పని చేస్తున్నా.. అమీర్ ఖాన్ సీక్రెట్ నోట్ బయటపడింది     
1. 'జెట్లీ' మూవీ రివ్యూ సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబినేషన్‌లో వచ్చిన 'జెట్లీ' (Jetlee) మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సత్య తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా.. సినిమాలో బలమైన కథ లేకపోవడం, సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సన్నివేశాలు మైనస్ గా మారాయి. సత్య కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు. 2. 'గాయపడ్డ సింహం' మూవీ రివ్యూ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషించిన 'గాయపడ్డ సింహం' కూడా డివైడ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. అమెరికా నుండి డిపోర్ట్ అయిన యువకుడు.. డోనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం అనే సిల్లీ పాయింట్‌తో సాగుతుంది. దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంచుకున్న కథాంశం సిలీగా ఉండటమే కాకుండా.. సినిమా అంతా పాతకాలపు కామెడీతో బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా మాత్రమే నవ్విస్తుంది. 3. బాలయ్య-కొరటాల మూవీ ప్రకటన నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK112'ను అధికారికంగా ప్రకటించారు. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొరటాల శివ తనదైన శైలిలో సామాజిక సందేశంతో కూడిన ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను బాలయ్య కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.   4. మారిన పెద్ది రిలీజ్ డేట్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాను వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. మొదట జూన్ 25న విడుదల చేయాలనుకున్నా.. 'టాక్సిక్' వాయిదాతో జూన్ 4 స్లాట్ ఖాళీ అవ్వడంతో ఈ డేట్ పై కర్చీఫ్ వేసింది 'పెద్ది' టీమ్.  5. 'డ్రాగన్'పై 'వార్ 2' ఎఫెక్ట్  ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ ఆలస్యంపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి శశి స్పందించారు. ఎన్టీఆర్ గత చిత్రం 'వార్ 2' ఫలితాన్ని విశ్లేషించుకున్న తర్వాత.. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లోని కీలక అంశాలను మరింత మెరుగుపరిచేందుకు కొంత సమయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు స్క్రిప్ట్  అద్భుతంగా వచ్చిందని, ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని శశి వెల్లడించారు. 6. నారా ఇంట పండుగ వాతావరణం టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రోహిత్ భార్య శిరీష లెళ్ళ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 7. అషురెడ్డి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రసారం చేయకూడదని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై స్పందించిన అషురెడ్డి.. తన ప్రైవసీని గౌరవించాలని, అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 8. మల్లారెడ్డి బయోపిక్ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో తన జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ఒకవేళ తన బయోపిక్ తీస్తే దానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని, అలాగే ఆ సినిమాలో ఒక పాత్రలో కూడా నటిస్తానని ఆయన పేర్కొన్నారు. గతంలో విలన్ పాత్రలు ఆఫర్ వచ్చినప్పటికీ, తన గౌరవానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో వాటిని తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.  9. టాలీవుడ్ మేకర్స్ పై రవిబాబు ఫైర్ టాలీవుడ్ సినిమా నిర్మాణ శైలిపై నటుడు, దర్శకుడు రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "అప్పుడు సినిమాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాళ్ళు.. ఇప్పుడు కొందరు ఒళ్ళు బలిసి చేస్తున్నారు." అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలు అనవసరంగా ఆలస్యం అవుతున్నాయని.. రచయితలు, దర్శకులు హీరోల ఇమేజ్ కోసం రాజీ పడటం వల్ల నాణ్యత దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. సినీ పరిశ్రమలో మారుతున్న ఈ పోకడలు ఆరోగ్యకరమైనవి కావని.. నిర్మాతల సమయం, డబ్బు వృథా కాకుండా ఉండాలంటే మార్పు అవసరమని రవిబాబు పేర్కొన్నారు. 10. సూపర్‌హీరో సినిమాలో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పాపులర్ డైరెక్టర్ల ద్వయం రాజ్-డీకే కాంబినేషన్‌లో ఒక భారీ సూపర్‌హీరో మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2026 అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక పూర్తిస్థాయి సూపర్‌హీరో పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.  
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.