LATEST NEWS
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్   కలిసి పోటీ చేయడం ఖాయమైంది. ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు జరిగింది. దీంతో పొత్తులో భాగంగా  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌  28 స్థానాలలో పోటీ చేయనుంది.  సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే కాంగ్రెస్ కు డీఎంకే 28 సీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా ఆఫర్ చేసింది. ఇందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో   కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. మొత్తంగా ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.  అదలా ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుంది. డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు ఆప్ నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపకాలపై ఆప్, డీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తమిళనాడు ఆప్ కన్వీనర్ ఎస్ఏఎన్ వశీగరణ్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే సమన్వయ కమిటీని కలిసామనీ, కొన్ని సీట్లు అడిగామని చెప్పారు. బీజేపీని అడ్డుకోవడానికి బలమైన కూటమి అవసరమన్న ఆయన  గత పర్యాయం పార్లమెంటు ఎన్నికల్లో బలమైన విపక్ష కూటమి ఏర్పడిందని, అందులో ఆప్ కూడా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తుతో  పోటీ చేస్తామన్న ఆయన, ఈ విషయంపై  ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం  కేజ్రీవాల్  డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో  చర్చిస్తారన్నారు.  
తెలంగాణ రాష్ట్ర పరిపాలన, భద్రతా వ్యవస్థ బలోపేతంపై కీలక చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (మార్చి 4) ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో  రాష్ట్ర భద్రతా పరిస్థి తులు, పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, మావోయిస్టుల లొంగుబాట్లు, పునరావాసం వంటి అంశాలపై చర్చ జరిగింది.  ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెంటన తెలంగాణ డీజీపీ  బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీ బి. సుమతి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణలో అమలు చేస్తున్న వ్యూహాలను సీఎం ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి వివరించారు.  హైదరాబాద్ మహానగర విస్తరణతోపాటు డిజిటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ కీలకమైందని సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న చర్యలు, అంతర్రాష్ట్ర మోసగాళ్లపై జరుగుతున్న ఆపరేషన్ల వివరాలను రేవంత్ అమిత్ షాకు పూసగుచ్చినట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శిక్షణ పొందిన అధికారుల అవసరం పెరుగుతోందన్నారు.    ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా  ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.   రాష్ట్రంలో ఇటీవల అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నాయకుల అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. గత రెండేళ్లలో మొత్తం 591 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి   జీవన స్రవంతిలో కలిశారు.   లొంగిపోయిన  మావోయిస్టులకు  ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్యాకేజీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల గురించి సీఎం ఈ భేటీలో అమిత్ షాకు వివరించారు.  మిగిలిన మావోయిస్టు నేతల లొంగుబాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కేంద్రం, రాష్ట్రం సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర  మరింత సహకారం అందించాలని కోరారు. ఈసమావేశంలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూ లంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ క్యాడర్ పెంపు, భద్రతా బలోపేతానికి అవసరమైన మద్దతు అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ భేటీతో రాష్ట్ర భద్రతా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖలో ఒకే వర లో రెండు కత్తులు అన్న రీతిన కూటమి నాయకుల వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ సౌత్ లో తెలుగుదేశం, జనసేన నాయకులు మధ్య పొత్తు సక్రమంగా లేదన్న మాట  బహిరంగంగా వినినిపిస్తున్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఈ దశలో జీవీఎంసీ కి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి జనసేన, తెలుగుదేశంకు మద్దతుగా నిలిచారు  వీరంతా విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక  సమయంలో ఒక రకంగా పార్టీని ఫిరాయించారు అయితే ఈ కార్పొరేటర్లు అనుకున్న రీతిన కూటమి ధర్మాన్ని పాటించడం లేదు  దీనికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అధినాయకులు కారణం. నిజానికి ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన సీతం  రాజు సుధాకర్ ఉన్నారు ఈయన వెంట వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో తోపాటు టిడిపి కార్పొరేటర్లు కొందరు ఉన్నారు అదే సమయంలో  వైసీపీ నుంచి  జనసేనకు వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట కూడా కొందరు కార్పొరేటర్లు ఉంటున్నారు వీరందరూ కూడా తమతమ నాయకులకు అనుకూలంగా అడుగులు వేస్తున్నారు.   ఈ తరహాలో పార్టీ సభ్యత్వం నుంచి ఇతర వ్యవహారాల్లో కూడా తలో దిక్కు అడుగులు వేయడంతో కూటమి మధ్య సయోధ్య కరవైంది.    సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ  కొనసాగుతున్నది.  సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు.  ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కార్పొరేటర్ల పదవీకాలం మరొక రెండు వారాల్లో ముగుస్తోంది.  వీరిలో కొందరు నేరుగా తెలుగుదేశం నుంచి పోటీ చేసి కూటమిలో కొనసాగుతుంటే... మరి కొందరు ఇండిపెండెంట్ లు వైసీపీ నుంచి వచ్చి కూటమికి మద్దతుగా నిలిచారు.  అయితే తమ పదవీకాలం ముగిసిన తర్వాత వార్డుల్లో ఏ తీరున వ్యవహరిస్తారన్న విషయం అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థులు తిరిగి పార్టీ సింబల్ పై తమకు సీట్లు కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు అయితే మేయర్ సీటు కోసం పార్టీ వీడి వచ్చిన తమకు కార్పొరేటర్ అభ్యర్థిగా సీటు కావాలని ఇతరులు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో  నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో తమ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో అని త్వరలో మాజీలు కాబోతున్న కార్పొరేటర్లు కలవర పడుతున్నారు. ముఖ్యంగా సీతం రాజు సుధాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య సయోధ్య లేకపోవడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కూటమి కార్పొరేటర్లు కలవర పడుతున్నారు మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ  పాలకమండలి విషయంలో కూడా నాయకులకు అన్యాయం జరిగినట్టు  లో లోపల మధనపడుతున్నారు.   కూటమి ధర్మానికి భిన్నంగా ఈ నాయకుల వ్యవహారం ఉండటం కొందరికి లాభం, మరికొందరికి నష్టం జరుగుతోంది.  ఈ పరిస్థితుల మధ్య ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక రకంగా ఒక ఒరలో రెండు కత్తుల సమెతలా తయారైంది.   నిజానికి వైసీపీ నుంచి సీటు ఆశించిన సీతారామరాజు సుధాకర్,   వైసిపి  ఎమ్మెల్యే  అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ను ఓడించడంలో కీలకంగా వ్యవహ రించారు. అంతమాత్రాన అతనికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి కార్పొరేటర్లకు అన్యాయం చేయలేమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన అనుచరుల వద్ద చెబుతున్నారు. అదే సమయంలో సుధాకర్ కూడా అసలు తన ప్రమేయం లేకపోతే జనసేనకు ఇక్కడ అవకాశం ఉండదని అంటున్నారు. నాయకులు వాదన ఏ రకంగా ఉన్నా తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉందని కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు మదన పడుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
ప్రస్తుతం తెలుగు సినీ లోకంలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతోంది... అదే 'పెద్ది'(Peddi). గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సన, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా "రయ్ రయ్ రా రా" పాట విడుదలైన తర్వాత, ఈ సినిమా సృష్టించబోయే ప్రభంజనం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. 'రయ్ రయ్ రా రా' సాంగ్ కి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో తాజాగా అనంత శ్రీరామ్(Anantha Sriram) 'తెలుగువన్'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కథలోని లోతు - అనంత శ్రీరామ్ నమ్మకం:  గీత రచయిత అనంత శ్రీరామ్ ఈ సినిమా గురించి చెబుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు. "పెద్ది సినిమా చూసిన తర్వాత ఆ కథ ప్రేక్షకులను పది రోజుల పాటు వెంటాడుతూనే ఉంటుంది" అని ధీమా వ్యక్తం చేశారు. అనంత శ్రీరామ్ నమ్మకాన్ని బట్టి చూస్తే.. దర్శకుడు బుచ్చిబాబు పెద్ది కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారని అర్థమవుతోంది.   బుచ్చిబాబు పనితీరు:  దర్శకుడు బుచ్చిబాబు గత నాలుగు ఏళ్లుగా ఈ ఒక్క కథ మీదనే ప్రాణం పెట్టి పని చేస్తున్నారని, 24 శాఖలను సమన్వయం చేసుకుంటూ ఒత్తిడిలోనూ చిరునవ్వుతో పని చేస్తున్నారని కొనియాడారు. రామ్ చరణ్ డాన్స్:  'రయ్ రయ్ రా రా' పాట విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్ సాధించిందని, అందులో రామ్ చరణ్ గారి డాన్స్ అద్భుతంగా ఉండటం వల్ల అందరి కళ్ళు పాటపై పడ్డాయని చెప్పారు. పాటల సంఖ్య:  ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉండవచ్చని, ప్రస్తుతానికి 4 పాటలు అద్భుతంగా వచ్చాయని ఆయన తెలిపారు. తెలుగు భాషా మాధుర్యం - ఒక సవాలు:  నేటి కాలంలో పాటల్లో తెలుగు తగ్గిపోయి ఆంగ్ల పదాల వాడకం పెరిగిపోతోందనే విమర్శ ఉంది. కానీ 'పెద్ది' సినిమాలో ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఇంత పెద్ద గ్లోబల్ స్టార్ సినిమాలో, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకుడి పర్యవేక్షణలో వచ్చిన పాటలో ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా రాయడం ఒక గొప్ప సవాలుగా నిలిచింది. ఈ సినిమా 1990ల నేపథ్యంలో సాగడం వల్ల, స్వచ్ఛమైన తెలుగు పదాలతో పాటలు రాయడానికి అవకాశం దక్కిందని, ఇది ప్రేక్షకులను తప్పకుండా కదిలిస్తుందని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. సినిమా మరియు సమాజం:  సమాజంలో మనం ఎలా మాట్లాడుతున్నామో సినిమాల్లో కూడా అదే ప్రతిబింబిస్తుందని, అందుకే మన భాషను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "సినిమాకి సమాజం అద్దం లాంటిది, సమాజానికి సినిమా భూతద్దం లాంటిది" అని ఆయన పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా "పెద్ది" సినిమా 90ల కాలం నాటి నేపథ్యంలో సాగుతుందని మరియు భాషా పరంగా చాలా స్వచ్ఛంగా ఉంటుందని అర్థమవుతోంది. అనంత శ్రీరామ్ పూర్తి ఇంటర్వ్యూను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ లో వీక్షించండి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం, సినిమా ప్రపంచంలోని ఇలాంటి ఎన్నో విశేషాలు, ఇంటర్వ్యూలు మరియు తాజా వార్తల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.  
  -షాకింగ్ న్యూస్ వెల్లడి చేసిన మైత్రి  -ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి  -మార్చి నెల ఏం జరగబోతుంది ప్రెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. కోట్లు ఇచ్చినా ఆ ఆనందాన్ని కొనలేం. దీంతో మార్చి నెల పవన్, పవన్ ఫ్యాన్స్ మంత్ గా మారే అవకాశం ఉంది. అందుకు వేదికగా నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఆ ఆనందకర వార్త ఏంటో చూసేద్దాం.  ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh)ఈ నెల 26 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  కానీ పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. ఏంటి నిజమేనా అని అనుకుంటున్నారా! అవును నిజమే.. అనుకున్న డేట్ కంటే ముందే మార్చి 19 న వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనుంది. ఈ మేరకు  తాజాగా ఉస్తాద్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్  వీకెండ్స్, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ వరకు వచ్చి మళ్ళీ వాయిదా పడి కొంచం వెనక్కి జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. పవన్ ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఒక ఉదాహరణ. ఇలాంటి టైంలో ఉస్తాద్ ఇంకొంచం ముందుకు జరగడం అంటే అభిమానుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక 'గబ్బర్ సింగ్' తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్(Harish Shankar)కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతు భారీ బజ్ సృష్టించాయి. దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్’సాంగ్స్ అయితే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.  also read:  ప్రముఖ హీరోయిన్ కి అత్యాచార బెదిరింపులు.. ధురంధర్ గుర్తుంది కదా   సిల్వర్ స్క్రీన్ కూడా భారీ ఆశలతో ఎదురుచూస్తున్న ఉస్తాద్ లో శ్రీలీల(Sreeleela),రాశి ఖన్నా(Raashii Khanna)హీరోయిన్స్  కాగా భారీ కాస్టింగ్ నే స్క్రీన్ పై మెరవనుంది. రీసెంట్ గా నేపథ్య సంగీతం బాధ్యతలని థమన్ కి అప్పగించారు. దేవిశ్రీ ప్రసాద్(Devi Sriprasad)బిజీగా ఉండటమే అందుకు కారణం.         
లోకంలో అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదు. ఆ అమృత సమానమైన ప్రేమకు దూరమైన బిడ్డలు పడే వేదన వర్ణనాతీతం. కళ్ళ ముందు కదలాడే రూపం లేకపోయినా, ఎక్కడో దేవుడి దగ్గర ఉన్న తన తల్లి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశపడే ఒక పసివాడి అమాయకత్వం, ఆ పసివాడి జీవితంతో ఆడుకునేందుకు జరిగే కుట్రలు.. ఇవన్నీ వింటుంటేనే మన కళ్లు చెమర్చుతాయి. ఈ రోజు మనం అటువంటి ఒక హృదయ విదారకమైన సన్నివేశం గురించి, అందులోని లోతైన భావోద్వేగాల గురించి తెలుసుకుందాం. వెంకటేష్, మీనా జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘అబ్బాయిగారు’ చిత్రంలోనిదీ సన్నివేశం. శ్రీకాంత్, జయచిత్ర, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నూతన్‌ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్కని ఫ్యామిలీ సెంటిమెంట్‌తోపాటు కడుపుబ్బా నవ్వించే హాస్య సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా 1993లో విడుదలై ఘనవిజయం సాధించింది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే సినిమాల్లో ‘అబ్బాయిగారు’ ఒకటి.  చిన్నతనంలోనే దొరబాబు తల్లి చనిపోతుంది. చనిపోయిన విషయం ఆ పసివాడికి తెలీక అమ్మ తప్పకుండా వస్తుందని ఎదురుచూస్తుంటాడు. ఒకరోజు అమ్మతో మాట్లాడాలనుకొని టెలిఫోన్ ఆపరేటర్‌కి ఫోన్ చేసి అమ్మకి లైన్ కలపమంటాడు. బాబు పరిస్థితి అర్థం చేసుకున్న ఆ ఆపరేటర్ అక్కడే పనిచేసే ఒక తల్లికి ఆ విషయం చెప్పి ఆ బాబుకి అమ్మలా కాసేపు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాడు. వెంటనే ఆ బాబుకి ఫోన్‌లో తల్లి మాటలు వినిపిస్తాయి. ఆనందంతో ఆ బాబు ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఎంతో ఉద్వేగంగా తల్లితో మాట్లాడతాడు. తనకు పరిచయం లేకపోయినా ఆ బాబు మాటలకు ఆ ఆపరేటర్ కూడా ఎంతో ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టుకుంటుంది. ఎంతో ఎమోషనల్‌గా సాగే ఈ సన్నివేశం ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తుంది.  ఆ తండ్రి రెండో పెళ్లి చేసుకొని కొడుకు కోసం తల్లిని తీసుకొస్తాడు. ఆస్తి కోసమే రెండో భార్యగా వచ్చిన ఆమె.. ఆస్తంతా దొరబాబుకే చెందుతుందని తెలుసుకొని ఒక పథకం ప్రకారం బాబుతో చదువు మాన్పించి పొలం పనులకే పరిమితం చేస్తుంది. భర్తను కూడా ఒక ప్లాన్ ప్రకారం వీల్ చైర్‌కి పరిమితం చేసి, పిచ్చివాడు అనే ముద్ర వేస్తుంది. దొరబాబుని తన గుప్పిట్లో పెట్టుకొని ఆస్తి, వ్యాపార వ్యవహారాలన్నీ తనే చూసుకుంటూ ఉంటుంది. జీవితంలో తల్లి లేని వెలితిని ఏ ఆస్తి, ఏ డబ్బు భర్తీ చేయలేదు. ఆ పసివాడి అమాయకత్వం, వాడు పడే వేదన మనల్ని ఆలోచింపజేస్తాయి. ‘అబ్బాయిగారు’ చిత్రంలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంలోని అంత్యంత కీలకమైన సన్నివేశాలతో కూడిన‌ ఈ వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే మా Teluguone youtube channelను Subscribe చెయ్యండి. 
The most awaited film from Tollywood, Ustaad Bhagat Singh, is all set to arrive earlier than expected. The makers have officially preponed the release to March 19, locking a sensational release window filled with back-to-back long weekends and extended holiday advantage for nearly two weeks. Even though Dhurandhar 2 is going to release, the makers are confident that Pawan Kalyan will pull huge number of audiences to theatres.  This massive entertainer marks the blockbuster reunion of Pawan Kalyan and Harish Shankar, a combination that previously created box office history with Gabbar Singh. The duo is now geared up to recreate that magic and deliver a powerful theatrical experience that fans have been eagerly waiting for. Keeping the film's timelines and overall vision in mind, the team has brought Thaman on board for the background score. DSP's songs will make you dance, while Thaman will handle the background score. This decision has been made to ensure smooth progress without any delays. This move comes after mutual discussions and has been taken in the best interest of the film. With a blockbuster combination leading the charge and a dynamic musical duo elevating the experience, Ustaad Bhagat Singh is shaping up to be more than just a film — it promises to be a grand celebration and a lifetime memory for fans. Mark the date: March 19. The celebrations begin early.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
-సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది! -ఎందుకు ఆ హీరోయిన్ ని టార్గెట్ చేసారు  -బెదిరింపులపై తను ఏం చెప్తుంది  ధురంధర్(Dhurandhar)..భారతీయ సినిమా రంగం గొప్పతనాన్నిప్రస్తావించుకునే ప్రతిసారి ధురంధర్ గురించి చెప్పకోవాల్సిందే. దీన్ని బట్టి సదరు చిత్రాల్లోని నటులు ఎంత అదృష్టవంతులో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వారి సరసన చేరిన నటి 'అయేషా ఖాన్'(Ayesha khan). ధురంధర్ లోని  'షరారత్ సాంగ్' లో డాన్సర్ గా కనిపించి మెప్పించింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియా వేదికగా వస్తున్న మెసేజెస్ చూస్తుంటే మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అని కొంచం భయబ్రాంతులకి లోనవుతాం. పూర్తి విషయం చూద్దాం.   అయేషా ఖాన్ ఇన్ స్టాగ్రామ్(Instagram)లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ఆమెకి ఇన్  స్టాగ్రామ్ వేదికగా మెసేజెస్ వస్తున్నాయి. సదరు మెసేజెస్ లో ఆమెని అత్యాచారం చేస్తామంటూ కొంత మంది బెదిరిస్తున్నారు. డైలీ అలాంటి మెసేజెస్ లే చేస్తుండటంతో పాటు   అత్యంత జుగుప్స కలిగించే విధంగా కూడా తమ వికృత రూపాన్ని బయటపెడుతున్నారు.  స్వయంగా  ఆయేషా ఖాన్ నే  ఈ విషయాన్ని వెల్లడి చేసింది. సోషల్ మీడియాలో నేను ఏ ఫోటో షేర్ చేసినా దాని కింద చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. పట్టించుకోకుండా ఉందామనుకుంటే నా వ్యక్తిగత భద్రతకి సంబంధించిన విషయం. కాబట్టి వారి పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చింది. also read: Pushpa 2 vs ustaad baghat singh: అప్పుడు పుష్ప 2 కి జరిగింది.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కి జరుగుతుంది ముంబై కి చెందిన అయేషా ఖాన్ మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్' తో 'ముఖచిత్రం' అనే మూవీలో చెయ్యడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. మొదటి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న అయేషా ఖాన్ సినీ అకౌంట్ లో  'ఓం భీం భూమ్ బుష్', గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి,  మనమే వంటి చిత్రాలు ఉన్నాయి. గోపీచంద్ మలినేని, సన్నీడియోల్ ల 'జాట్' లో కూడా కానిస్టేబుల్ గా కనపడి మెస్మరైజ్ చేసింది.  
  -వైరల్ గా నిల్చిన పుష్ప 2 , ఉస్తాద్  -ఈ రెండు సినిమాలకే ఎందుకు  -పూర్తి డీటెయిల్స్ చూద్దాం 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్' అని అక్కినేని(Akkineni)వారు 'దేవదాస్'(Devadas)లో పాడిన విషయం తెలిసిందే. అక్కినేని వారు భావోద్వేగంతో పాడటంతో ఒక మనిషి మైండ్ సెట్ నుంచి వచ్చిన సాడ్ సాంగ్ అని చాలా కాలం పాటు చాలా మంది భావించారు. కానీ ఆ తర్వా తి  రోజుల్లో పరిపూర్ణత చెందిన సినీ లెజండ్స్ 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ కి సరైన అర్ధం చెప్పారు. ఆ వర్డ్ కి అర్ధం ఏంటంటే నీ ప్రయత్నం నువ్వు త్రికరణ సిద్దిగా చేసావు. కుడి ఎడమ రెండు గొప్పవే. ఏదో పొరపాటు జరిగి అటుది ఇటు అయ్యింది. నువ్వు మాత్రం ఓడిపోలేదు అనేది సదరు వర్డ్ లో దాగి ఉన్నపెద్ద ఫిలాసఫీ. ఇప్పుడు ఈ అక్షర సత్యాన్నిఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat SIngh)..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)పవర్ ప్యాకేజీ నుంచి వస్తున్న మూవీ. ఈ నెల 24 రిలీజ్ డేట్ కావడంతో సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే థమన్(Thaman)నేతృత్వంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు జరగబోతున్నాయి. ఇదేంటి మ్యూజిక్ దేవి శ్రీప్రసాద్(Devi sriprasad)కదా!. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. బిజిఎం కూడా దేవినే కదా ఇవ్వాల్సింది. పైగా బిజిఎం లో మాస్టర్. కానీ థమన్ అంటారేంటని   అనుకుంటున్నారా!  మీరు అనుకునేది నిజమే. కానీ  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెయ్యాల్సిన రీల్స్ ని దేవికి పంపడంలో జాప్యం జరిగింది. మరో వైపు దేవి ఇప్పటికే ఒప్పుకున్న వేరే ప్రాజెక్ట్స్ కి డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో పరస్పర అంగీకారంతో థమన్ కి బిజిఎం బాధ్యతలని అప్పగించారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ అధికారకంగా వెల్లడి చేసింది. కానీ సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని కాంట్రవర్సీ ని సృష్టించే వార్తల కోసం అపర మేధావుల్లా కాచుకొని కూర్చున్న వాళ్ళు రంగంలోకి దిగి ఉస్తాద్ మ్యూజిక్ విషయంతో పాటు సినిమా విషయంలో కూడా అందరు నమ్మే టైపులో రూమర్స్ ని సృష్టిస్తున్నారు.  also read: kvn productions: మీకే  ఎందుకిలా.. ఎలా తట్టుకుంటారో ఏమో    కానీ మూవీ లవర్స్ ఆ మేధావుల రూమర్స్ కి పైన మనం చెప్పుకున్నట్టుగా దేవదాస్ లోని అక్కినేని వారు పాడిన 'కుడి ఎడమైతే పొరపాటు  లేదోయ్ పాటని ఉదహరిస్తూ 'దేవిశ్రీప్రసాద్, థమన్ ఇద్దరు సంగీత రంగంలో తిరుగులేని సవ్యసాచులు. ఒకర్ని తక్కువ, ఒకర్ని ఎక్కువ చేసే ఉద్దేశ్యం మేకర్స్ కి లేదు.  డేట్స్ కుదరకే ఆ విధంగా చెయ్యవలసి వస్తుంది. పుష్ప 2 కి  కూడా ఇదే విధంగా మ్యూజిక్ ని దేవి శ్రీప్రసాద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం నుంచి వచ్చిందనే విషయం మర్చిపోకండి అంటూ సినీ అభిమానులు రూమర్స్ వీరులని ఒక ఆట ఆడుకుంటున్నారు.    
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇరు కుటుంబాల సంప్రదాయం ప్రకారం జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ వివాహ రిసెప్షన్‌కు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.   మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రామ్‌చరణ్, అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, నవీన్ పొలిశెట్టి, నాని, రవితేజ, శ్రీకాంత్, కార్తీ, నాగచైతన్య, నమ్రత శిరోద్కర్, సితార, హీరోయిన్లు అశికా రంగనాథ్, వర్ష బొల్లమ్మ, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, అశ్వినీదత్, దిల్‌రాజు, నవీన్ ఎర్నేని, కరణ్ జోహర్, దర్శకులు సుకుమార్, నాగ్ అశ్విన్, బాబీ, బోయపాటి శ్రీను తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. 
Pawan Kalyan starrer Ustaad Bhagat Singh is gearing up for huge release on 26th March and with Toxic out of the picture, it might prepone to 19th March, too. The new movie by producers Mythri Movie Makers has fuelled these gossips further, almost confirming it. While acknowledging the blockbuster response to the released songs, the production house stated that Devi Sri Prasad will no longer be handling the background score. According to their official note, "Due to our delay in finalizing & sending reels for background score to DSP, we are unable to match his timeline that he dedicated to this film." Consequently, Thaman has been brought on board to handle the score under "mutual consent." While the producers emphasize that this decision was taken "in the best interest of the film," this development feels remarkably familiar. Well, Devi Sri Prasad is not known highly for his BGM but he does deliver on-time. Whereas S Thaman is known for quick turnup and solid score. Looks like this change confirms preponement.    On the other hand, last year, Mythri Movie Makers navigated an identical situation with the massive blockbuster Pushpa 2: The Rule and Ajith Kumar’s Good Bad Ugly, where DSP was similarly replaced. In Pushpa 2 case, Sam CS and Ajaneesh Lokanath, Thaman worked on first half but DSP BG was used for second hour. Only Sam CS work was used.  In December, they replaced DSP with GV Prakash Kumar, for GBU to finish film on-time and bring it to Pongal. But it had to be pushed to April due to Vidaamuyarchi and Lyca Productions intervention. This "hat-trick" of replacements within the same banner raises uncomfortable questions.  It is difficult to believe that a top production house would fail to manage reel deadlines for three consecutive major projects. This pattern suggests the issue might be less about "timelines" and more about clashing egos or strained relations between the producers and the composer.  Looks like Sukumar preferring Devi Sri Prasad and even Harish Shankar looking to repeat Gabbar Singh trio, seems to have forced them rather unwillingly to continue with the composer. When the same excuse is used three times in a row, the industry is left wondering if "scheduling conflicts" are merely a convenient cover for a deeper fallout. Only Devi Sri Prasad and Mythri Movie Makers can confirm about the issues brewing between them.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సంబంధాలు చూసేటప్పుడు, వారి మనసులోని మాటను గమనించకుండా తొందరపడుతుంటారు. దీనివల్ల పెళ్లి కుదరకపోవడమే కాకుండా, పిల్లల మనసుపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు, చేయకూడని పొరపాట్ల గురించి  కాకతీయ మ్యారేజ్ డైరెక్టర్ నవీనా యలమంచి గారు చెప్పిన విషయాలను ఈ Video Link లింక్ క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (Why Should We?) పెళ్లి సంబంధం చూసే ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, అది కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఎదుటి కుటుంబం యొక్క శ్రమను, ఆశలను కూడా నీరుగారుస్తుంది. పిల్లలు సిద్ధంగా లేనప్పుడు వారిపై ఒత్తిడి తెస్తే, వారు ఎదుటి వారితో "నాకు ఇష్టం లేదు" అని చెప్పడం వల్ల రెండు కుటుంబాల మధ్య అనవసరమైన మనస్పర్థలు ఏర్పడతాయి. సరైన అవగాహన లేకుండా సంబంధాలు చూస్తే, భవిష్యత్తులో పిల్లలు మరే సంబంధాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు: బలవంతం చేయడం: పిల్లలు పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వారిని బలవంతంగా సంబంధాలు చూడమని ఫోర్స్ చేయకూడదు. ముందస్తు చర్చ లేకపోవడం: ఇంట్లో పిల్లలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా బయట సంబంధాలు వెతకడం వల్ల ఫలితం ఉండదు. భయాలను విస్మరించడం: "నా ఫ్రెండ్స్ ఎవరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరు" లేదా "అపరిచిత వ్యక్తితో జీవితం ఎలా ఉంటుంది?" అనే పిల్లల భయాలను కొట్టిపారేయకండి. వారి భయాలు చాలా జెన్యూన్ అయి ఉండవచ్చు. పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు పిల్లలను పెళ్లికి సిద్ధం చేయడానికి ఈ పద్ధతులు పాటించండి: కౌన్సెలింగ్ మరియు మాటామంతి: పిల్లలు మీతో ఓపెన్ అవ్వనప్పుడు, వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఓపికగా ప్రయత్నించండి లేదా నిపుణుల సహాయం తీసుకోండి. అవకాశం ఇవ్వండి: పిల్లలు ఎదుటి వారితో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, కనీసం ఒకరిద్దరిని కలిసేలా ప్రోత్సహించండి. సరైన వ్యక్తి (Right Person) తారసపడినప్పుడు వారిలోని భయాలు సహజంగానే తొలగిపోతాయి. ఇంటి గుట్టు ముఖ్యం: ముందుగా మీ ఇంట్లో చర్చలు జరిపి, పిల్లలను ఒప్పించిన తర్వాతే పబ్లిక్‌గా సంబంధాలు చూస్తున్నామని చెప్పడం గౌరవప్రదంగా ఉంటుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: పిల్లలు సంబంధం చూడటానికి వచ్చినప్పుడు 'ఐ యామ్ నాట్ రెడీ' అని ఎందుకు అంటారు?  జవాబు: దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వారు కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకోవచ్చు లేదా అపరిచిత వ్యక్తులతో ప్రేమను ఎలా పంచుకోవాలో తెలియక భయపడవచ్చు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కూడా వారు ఇలాంటి సమాధానాలు ఇస్తుంటారు. ప్రశ్న: పిల్లల భయాలు ఎప్పుడు తొలగిపోతాయి?  జవాబు: అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, మరేదైనా సరే.. ఒక సరైన వ్యక్తిని కలిసినప్పుడు, వారితో మాటలు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి సందేహాలు, భయాలు క్లియర్ అవుతాయి. అంతవరకు మనం ఎన్ని చెప్పినా వారి భయం తగ్గదు. ప్రశ్న: ఒక సంబంధం తప్పిపోతే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?  జవాబు: ఒకసారి చేదు అనుభవం ఎదురైతే, తర్వాత వచ్చే మంచి సంబంధాలను కూడా పిల్లలు వద్దని తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో పరిస్థితిని సెట్ చేసుకున్నాకే బయట సంబంధాలు చూడాలి. పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారి భయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే అరేంజ్డ్ మ్యారేజ్ విజయవంతం అవుతుంది. వారిని బలవంతం చేయడం కంటే, వారికి నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు రిలేషన్‌షిప్ సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సందర్శించండి! 👉మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [www.youtube.com/@Naveenacolumn ] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.
మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలలో చెవి అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది. మనం ప్రపంచంతో మమేకమవ్వడానికి, ఇతరుల మాటలు వినడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినికిడి శక్తి ఎంతో అవసరం. కానీ నేటి కాలంలో మనం మన చెవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ నిర్లక్ష్యం చివరకు మనల్ని శాశ్వత చెవుడు వైపు ఎలా నెడుతుందో, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి గారు పంచుకున్న కొన్ని కీలక విషయాలను ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం చెవుల ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? (Why Should We?) మన చెవి లోపల వినికిడికి సహాయపడే 'హెయిర్ సెల్స్' (Hair Cells) అనేవి ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే: శాశ్వత నష్టం: ఒకసారి ఈ హెయిర్ సెల్స్ దెబ్బతింటే, అవి మళ్ళీ తిరిగి రావు. మన శరీరంలోని ఇతర కణాలలాగా ఇవి మళ్ళీ పుట్టవు (Regeneration ఉండదు). వృత్తిపరమైన జీవితం: వినికిడి లోపం ఉంటే మీటింగ్‌లలో ఇతరులు చెప్పేది అర్థం కాదు, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగి మీ కెరీర్ దెబ్బతినవచ్చు. భారీ ఖర్చు: ఒకవేళ వినికిడి పూర్తిగా పోయి ఆపరేషన్ (Cochlear Implant) చేయించుకోవాల్సి వస్తే, ఒక్క చెవికి 7 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏం చేయకూడదు? (What Not To Do) నిరంతర శబ్దాలు: 24 గంటలూ బ్లూటూత్ హెడ్‌సెట్లు లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినకండి. దీనివల్ల హెయిర్ సెల్స్ అలసిపోయి (Fatigue) శాశ్వతంగా దెబ్బతింటాయి. నిర్లక్ష్యం: చిన్నపాటి వినికిడి లోపం ఉన్నా "ఏం కాదులే" అని వదిలేయకండి. స్క్రీనింగ్ చేయించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. సామాజిక భయం: కళ్ళద్దాలు పెట్టుకున్నట్లే, అవసరమైతే హియరింగ్ ఎయిడ్ (Hearing Aid) పెట్టుకోవడానికి వెనుకాడకండి. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో సమస్యను పెంచుకోవద్దు. దురలవాట్లు: ధూమపానం (Smoking) మరియు మద్యం అలవాటు వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి లోపలి కణాలు దెబ్బతింటాయి. చెవులను ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Ear Health) ఆరోగ్యకరమైన జీవనశైలి: డయాబెటిస్ (షుగర్), బీపీ మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవి పెరిగితే వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయి. వ్యాయామం: యోగా, ప్రాణాయామం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలయ్యి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు పరీక్షలు: చెవిలో బ్లాకేజ్ అనిపించినా, వినికిడి తగ్గినట్లు అనిపించినా వెంటనే 'ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ' లేదా 'ఎండోస్కోపీ' వంటి పరీక్షలు చేయించుకోవాలి. నీటి జాగ్రత్తలు: స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీరు వెళ్తే చెవిలోని గుబిలి (Wax) ఉబ్బిపోయి నొప్పి మరియు బ్లాకేజ్‌కి దారితీస్తుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: వయసు పెరగడం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మందులతో తగ్గించవచ్చా?  జవాబు: దీనిని 'ప్రెస్ బ్రాయకోసిస్' అంటారు. దీనికి మందులు లేదా ఆపరేషన్లు ఉండవు. ప్రివెన్షన్ (ముందస్తు జాగ్రత్త) మాత్రమే మార్గం. సమస్య ఎక్కువైతే హియరింగ్ ఎయిడ్ వాడాలి. ప్రశ్న: పిల్లల్లో చెవి నొప్పి, బ్లాకేజ్ ఎందుకు వస్తుంది?  జవాబు: పిల్లల్లో జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చెవిలోకి చేరి బ్లాకేజ్ ఏర్పడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే 'గ్లూ ఇయర్' (Glue Ear) గా మారి వినికిడి లోపం రావచ్చు. వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రశ్న: చెవిలో గుబిలి (Wax) ఉండటం తప్పా?  జవాబు: గుబిలి అనేది ఒక రక్షణ కవచం లాంటిది. కానీ అది ఎక్కువై ఇయర్ కెనాల్‌ను బ్లాక్ చేసినప్పుడు మాత్రమే సమస్య అవుతుంది. అప్పుడు డాక్టర్ ద్వారా క్లీన్ చేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా 👉 (TeluguOne Health YouTube Channel) ని సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.